Latest Post

Veeranjaneyulu Viharayathra Teaser Launched Grandly

 ‘వీరాంజనేయులు విహారయాత్ర’ గోల్డెన్ ఫిల్మ్. విజువల్ ట్రీట్ లా వుంటుంది. చాలా పెద్ద హిట్ అవుతుంది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో నవరసరాయ డా. నరేశ్ వికె



నవరసరాయ డా. నరేశ్ వికె, రాగ్‌ మయూర్‌, ప్రియా వడ్లమాని లీడ్ రోల్స్ నటిస్తున్న హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘వీరాంజనేయులు విహారయాత్ర’.అనురాగ్‌ పలుట్ల దర్శకత్వం వహించారు.  బాపినీడు.బి, సుధీర్‌ ఈదర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 14న ఈ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీం కాబోతోంది. ఈ నేపధ్యంలో మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. యాక్ట్రెస్ పవిత్ర లోకేష్ టీజర్ ని లాంచ్ చేశారు. డైరెక్టర్ సందీప్ రాజ్, వినోద్, ప్రవీణ్ కంద్రేగుల, హీరో తిరువీర్ పాల్గొన్న టీజర్  లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది


వీరాంజనేయులు అస్థికల చెంబుకు బ్రహ్మానందం చెప్పిన వాయిస్ ఓవర్ తో మొదలైన ట్రైలర్ హిలేరియస్ గా వుంది. కుటుంబమంతా కలిసి చూసే పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా డైరెక్టర్ అనురాగ్ ఈ చిత్రాన్ని మలిచారని టీజర్ చుస్తే అర్ధమౌతోంది. నరేశ్‌ కామెడీ టైమింగ్‌, పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రియా వడ్లమాని, రాగ్‌ మయూర్‌ పాత్రలు కూడా ఆసక్తికరంగా వున్నాయి. మ్యూజిక్, విజువల్స్ వున్నత స్థాయిలో వున్నాయి. మొత్తనికి టీజర్ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచాయి.


ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డా. నరేష్ వికె మాట్లాడుతూ.. కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు అనే మాటకు నిదర్శనం రామోజీరావు గారు. ఆయన కృషితో ఒక లెజెండ్ గా ఎదిగి తెలుగు సినిమాని ప్రపంచ సినిమా చరిత్రపుటలో పెట్టి నవ్వుతూ వెళ్ళిపోయారు. నా బండికి నాలుగు చక్రాలు. విజయ నిర్మల గారు, కృష్ణ గారు, జంధ్యాల గారు, రామోజీరావు గారు. రామోజీరావు గారిని చాలా మిస్ అవుతున్నా. ఉషాకిరణ్ మూవీస్ శ్రీవారికి ప్రేమ లేఖ తో హీరోగా స్టార్ట్ అవ్వడం నా అదృష్టం. అప్పటి నుంచి ఆ కుటుంబంలో ఒకరిగానే భావిస్తాను. శ్రీవారికి ప్రేమలేఖ సినిమాతో బాపినీడు గారితో పరిచయం. వీరాంజనేయులు విహారయాత్రకి ఆయన బ్యాక్ బోన్. ఎక్కడా లోటు లేకుండా అద్భుతంగా సినిమాని నిర్మించారు. అనురాగ్ చాలా ప్రతిభవున్న దర్శకుడు. స్క్రిప్ట్ విన్నాక.. జంద్యాల, త్రివిక్రమ్, వివేక్ ఆత్రేయ అలాంటి వినూత్నమైన ఒరవడి తనలో కనిపించింది. తనకి అన్ని క్రాఫ్ట్స్ పై మంచి కమాండ్ వుంది. ఇది విజువల్ ట్రీట్. శతమానం భవతి సినిమా ఎన్ఆర్ఐ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం కూడా అలానే అలరిస్తుంది. చాలా అద్భుతమైన ఎమోషన్ వున్న కథ ఇది. ఉషాకిరణ్ మూవీస్ లో శ్రీవారికి ప్రేమ లేఖ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ఈటీవీ విన్ లో ఇది అంత పెద్ద సక్సెస్ అవుతుంది. నితిన్,  సాయి కృష్ణ చాలా సపోర్ట్ చేశారు. ఇది నాకు గోల్డెన్ జూబ్లీ ఫిల్మ్. గోల్డెన్ ఫిల్మ్. రాగ్‌ మయూర్‌, ప్రియా వడ్లమాని అందరూ అద్భుతంగా నటించారు. ఆగస్ట్ 14న విడుదలయ్యే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది' అన్నారు


యాక్ట్రెస్ పవిత్ర లొకేషన్ మాట్లాడుతూ.. రామోజీరావు గారు గ్రేట్ విజనరీ. ఆయన సేవలు మరువలేనివి. గ్రేట్ విజన్ తో రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించారు. ఈటీవీతో నాకు ఎంతో అనుబంధం వుంది. ఈటీవీ విన్ ‘వీరాంజనేయులు విహారయాత్ర’ టీజర్ లాంచ్ చేయడం ఆనందంగా వుంది. నరేష్ గారు గ్రేటెస్ట్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా. ప్రతి పాత్రకు ఆయన చేసే హోం వర్క్ చాలా ఇంట్రస్టింగా వుంటుంది, టీజర్ చాలా ఎక్సయిటింగ్ వుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అన్నారు.


డైరెక్టర్ సందీప్ రాజ్.. ఈ సినిమా కోసం చాలా ఎక్సయిటెడ్ గా ఎదురుచూస్తున్నాను. నరేష్ గారికి చాల పెద్ద ఫ్యాన్ ని, రాగ్ మయూర్ సినిమా బండితో అందరినీ అలరించాడు. తనతో కలసి పని చేయాలని వుంది. ప్రియా ఈ కంటెంట్ తో అందరికీ తెలుసుస్తుందని భావిస్తున్నాను,  నితిన్, సాయి కృష్ణ కంటెంట్ ని నమ్మి చేస్తారు, ఈ సినిమాతో ఈటీవీ విన్ ఇంకా గట్టిగా ఫ్యామిలీస్ లోకి వెళుతుందని కోరుకుంటున్నాను' అన్నారు.


హీరో తిరువీర్ మాట్లాడుతూ...ఈ సినిమాలో చాలా మంది ఫ్రెండ్స్ పని చేశారు. ఈ కథ నాకు తెలుసు. చాలా మంచి కథ,  అనురాగ్ ఎప్పుడు డైరెక్టర్ అవుతాడా అనుకునేవాడిని, ఆగస్ట్ 14 తనకి స్వాతంత్రం( నవ్వుతూ). టీజర్ చాలా బావుంది. చాలా మంచి సినిమా. రిపీట్ గా చూసే సినిమా అవుతుంది' అన్నారు.


ETV విన్ - కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి మాట్లాడుతూ..  ఆగస్ట్ 14  ‘వీరాంజనేయులుకి స్వాతంత్రం రాబోతుంది. ఈ సినిమా ఫాదర్స్ అందరికీ  అంకితం చేస్తున్నాం, అనురాగ్ పెద్ద డైరెక్టర్ అవుతాడు. చాలా అద్భుతంగా తీశాడు. సినిమా యూనిట్ అందరికీ థాంక్స్. నరేష్ గారు అద్భుతంగా నటించారు. ఆయన ఈ ప్రాజెక్ట్ డైమెన్షన్స్ ని మార్చారు. అందరూ ఎంజాయ్ చేసేలా ఈ సినిమా వుంటుంది' అన్నారు,


దర్శకుడు అనురాగ్ పాలుట్ల మాట్లాడుతూ.. ‘వీరాంజనేయులు విహారయాత్ర' నాలుగు కాలాలు పాటు గుర్తుండే సినిమా అవుతుంది. ఇది పొగరుతో కాదు ప్రేమతో చెబుతున్నాను. చాలా ప్రేమతో ఈ సినిమా చేశాం. అందరూ చాలా గొప్పగా సపోర్ట్ చేశారు. అందరికీ థాంక్స్' అన్నారు  


యాక్టర్ రాగ్ మయూర్ మాట్లాడుతూ.. ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ విన్ యాజమాన్యం, బాపినీడు గారికి థాంక్ యూ. ఇలాంటి కథ తెలుగు ప్రేక్షకులు చూసివుండరు. ఫ్యామిలీ రోడ్ ట్రిప్ చాలా కొత్తగా వుంటుంది, ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు, నరేష్ గారు నా ఫేవరేట్ యాక్టర్. ఆయనతో పని చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. అందరికీ థాంక్ యూ' అన్నారు.


హీరోయిన్ ప్రియా వడ్లమాని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అతిధులందరికీ థాంక్స్. ఆగస్ట్ 14న సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ సపోర్ట్ చేయాలి'అని కోరారు. ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.

3rd Single Kya Lafda From Double ISMART Out On July 29th


ఉస్తాద్ రామ్ పోతినేని, కావ్యా థాపర్, పూరి జగన్నాధ్, సంజయ్ దత్, ఛార్మీ కౌర్, పూరీ కనెక్ట్స్ 'డబుల్ ఇస్మార్ట్' థర్డ్ సింగిల్ క్యా లఫ్డా జూలై 29న రిలీజ్  


ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల డెడ్లీ కాంబినేషన్‌లో మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్ మ్యూజిక్ ప్రమోషన్‌లు బ్లాక్‌బస్టర్ నోట్‌లో స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ సింగిల్ స్టెప్పా మార్ కి థంపింగ్ రెస్పాన్స్ వచ్చింది. సెకెండ్ సింగిల్ మార్ ముంత చోడ్ చింత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.


ఇప్పుడు మేకర్స్ థర్డ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. డబుల్ ఇస్మార్ట్ థర్డ్ సింగిల్ క్యా లఫ్డా జూలై 29న రిలీజ్ కానుంది. రామ్, కావ్యా థాపర్ రొమాంటిక్ కెమిస్ట్రీని వండర్ ఫుల్ గా ప్రజెంట్ చేసిన అనౌన్స్మెంట్స్ పోస్టర్ చాలా ఎట్రాక్టివ్ గా వుంది.  


పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమాలో సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు.  


ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చారు. సామ్ కె నాయుడు, జియాని గియానెలీ సినిమాటోగ్రఫీ అందించారు.


డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.


ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు.


నటీనటులు: రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్, అలీ, గెటప్ శ్రీను తదితరులు.


సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్

నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్

బ్యానర్: పూరి కనెక్ట్స్

వరల్డ్ వైడ్ రిలీజ్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ (నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి)

సీఈఓ: విషు రెడ్డి

సంగీతం: మణి శర్మ

సినిమాటోగ్రఫీ: సామ్ కె నాయుడు, జియాని జియాన్నెలి

స్టంట్ డైరెక్టర్: కేచ, రియల్ సతీష్

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా


Vishwak Sen Mechanic Rocky Glimpse on July 28th

విశ్వక్ సేన్, రవితేజ ముళ్లపూడి, రామ్ తాళ్లూరి, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ మెకానిక్ రాకీ గ్లింప్స్ జూలై 28న లాంచ్



యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ 'మెకానిక్ రాకీ'తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి రైటింగ్, డైరెక్షన్ వహిస్తున్న ఈ చిత్రాన్ని SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కానుంది.


ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. జూలై 28న మెకానిక్ రాకీ గ్లింప్స్ ని లాంచ్ చేయనున్నారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో విశ్వక్ సేన్ లుక్ అదిరిపోయింది.


ట్రై యాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.  


హైబడ్జెట్‌తో భారీ కాన్వాస్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. మనోజ్ కటసాని డీవోపీ, అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్.


నటీనటులు: విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్


సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి

నిర్మాత: రామ్ తాళ్లూరి

ప్రొడక్షన్ బ్యానర్: SRT ఎంటర్‌టైన్‌మెంట్స్

సంగీతం: జేక్స్ బిజోయ్

డీవోపీ: మనోజ్ కటసాని

ప్రొడక్షన్ డిజైనర్: క్రాంతి ప్రియం

ఎడిటర్: అన్వర్ అలీ

ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సత్యం రాజేష్, విద్యాసాగర్ జె

 

Peka Medalu all set to Grand Release in USA on 26th July from Nirvana Movies Distribution

పేక మేడలు సినిమా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో జులై 26న నిర్వాణ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ నుంచి యూఎస్ఏ లో గ్రాండ్ రిలీజ్



క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్ ఎంపవర్మెంట్ ని బేస్ చేసుకున్న సినిమా ఇది. జులై 19న విడుదలై చిన్న సినిమా గా వచ్చి పెద్ద విజయం సాధించింది. ప్రతి ఒక్కరూ సినిమా చూసే విధంగా ప్రీమియర్స్ ని 50 రూపాయలకే ప్రత్యేక షోలు వేసి పేక మేడలు సినిమా వైపు చూసే లాగా చేశారు. ప్రీమియర్ షోస్ నుంచే బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న పేక మేడలు జులై 26 నుంచి నిర్వాణ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ తరఫున యూఎస్ఏ లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. 300 పెడితే గాని సినిమా చూడలేని ఈ రోజుల్లో విడుదలైన రోజు నుంచి 100 రూపాయలకే టికెట్ రేట్లు పెట్టి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేలాగా చేశారు. కలెక్షన్స్ కోసం కాకుండా మంచి సినిమాని ప్రేక్షకులు అందరూ చూడాలని తక్కువ రేటుకే టికెట్ రేట్లు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ ని బేస్ చేసుకున్న సినిమా కాబట్టి ఆడవారు అందరూ ఈ సినిమా చూసే విధంగా ఈ రేట్లు పెట్టినట్టుగా చెబుతున్నారు టీం.


ఈ సందర్భంగా నిర్మాత రాకేష్ వర్రే మాట్లాడుతూ : మొదటి రోజు నుంచి సినిమా ను ఆదరించి ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ₹100 టికెట్ రేట్ పెట్టడం వల్ల ఎక్కువ మంది ప్రేక్షకులు సినిమాని చూడగలిగారు. ఇప్పుడు మా సినిమాని నిర్వాణ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ వారు ఈనెల 26 నుంచి యూఎస్ఏ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ ఆదరించినట్టే యూఎస్ఏ లో ఉన్న తెలుగు ప్రేక్షకులు అందరూ ఈ సినిమాను చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.


నటీనటులు :

వినోద్ కిషన్, అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్


టెక్నీషియన్స్ :

నిర్మాణం : క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్

నిర్మాత: రాకేష్ వర్రే

రచయిత మరియు దర్శకుడు: నీలగిరి మామిళ్ల

డి ఓ పి: హరిచరణ్ కె.

ఎడిటర్: సృజన అడుసుమిల్లి, హంజా అలీ

సంగీత దర్శకుడు: స్మరణ్ సాయి

లైన్ ప్రొడ్యూసర్: అనూషా బోరా

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కేతన్ కుమార్

పి ఆర్ ఓ: మధు VR  

Shanmukha Movie Gearing up for Release in October

 అక్టోబర్‌లో విడుదలకు ముస్తాబవుతున్న ఆది సాయికుమార్‌  డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ ష‌ణుఖ్మ‌!



 నవ్యమైన కథకు, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేను జోడించి, ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసే  డివోషనల్‌ చిత్రాలకు అన్ని భాషల్లో మంచి ఆదరణ వుంటుంది. ఆ నమ్మకంతోనే  రూపొందుతున్న పాన్‌ ఇండియా డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ చిత్రం ష‌ణ్ముఖ. ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ క‌థానాయ‌కుడు. అవికాగోర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి ష‌ణ్ముగం సాప్ప‌ని ద‌ర్శ‌కుడు. శాస‌న‌స‌భ అనే పాన్ ఇండియా చిత్రంతో అంద‌రికి సుప‌రిచిత‌మైన సంస్థ సాప్‌బ్రో ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ త‌మ ద్వితీయ చిత్రంగా ఈ చిత్రాన్ని  నిర్మిస్తుంది. సాప్ప‌ని బ్ర‌దర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో  తుల‌సీరామ్ సాప్ప‌ని, ష‌ణ్ముగం సాప్ప‌ని, ర‌మేష్ యాద‌వ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మణానంతర పనులను జరుపుకుంటోంది. కాగా శుక్రవారం ఈ చిత్రానికి సంబంధించిన మరో పవర్‌ఫుల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఆది సాయికుమార్‌, అవికాగోర్‌ ఉత్కంఠగా నడిచివస్తున్న ఈ పోస్టర్‌లో అందరిలోనూ ఆసక్తిని పెంచుతుంది. ఈ చిత్రంలో పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా ఆది నటిస్తున్న విషయం తెలిసిందే.   ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మ‌ట్లాడుతూ 'ఇదొక డివోషనల్‌ థ్రిల్లర్‌. ప్రతి సన్నివేశంలోనూ ఓ పాజిటివ్‌ వైబ్‌, మ్యాజిక్‌ వుంటుంది.  ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని ఓ అద్భుత‌మైన పాయింట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం విజువ‌ల్ వండ‌ర్‌లా, అద్బుత‌మైన గ్రాఫిక్స్‌తో మెస్మరైజ్‌ చేసే విధంగా వుంటుంది  డివోషనల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రతి పాత్ర ఎంతో సహజంగా వుంటుంది.  అన్ని భాషల్లో ఒకేసారి అక్టోబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం.  కేజీఎఫ్‌, స‌లార్ చిత్రాల‌కు త‌న సంగీతంతో ప్రాణం పోసిన ర‌వి బ‌సూర్ ఈ చిత్రానికి స్ట‌నింగ్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. ప్ర‌స్తుతం అత్యున్న‌త సాంకేతిక నిపుణుల‌తో నిర్మాణనంత‌ర ప‌నులు మొద‌లుకానున్నాయి. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, గ్రాఫిక్స్ విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుని, ఓ వండ‌ర్‌ఫుల్ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుక‌రావ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాం. త‌ప్ప‌కుండా ఈ చిత్రం ఆది కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుంది అన్నారు.

Film Journalist Association Facilitates Aid from Mega Supreme Hero SaiDurga Tej to Actress Pavala Shyamala

ఫిల్మ్ జర్నలిస్ట్‌ అసోసియేషన్ ద్వారా నటి పావల శ్యామలకు మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ఆర్థిక సాయం



మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ తన గొప్ప మనసుని మరోసారి చాటుకున్నారు. ఈ సుప్రీమ్ హీరో తాజాగా ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్‌కు విరాళం అందించడమే కాకుండా.. ఆ సంస్థ ద్వారా దీనస్థితిలో ఉన్న నటి పావలా శ్యామలకు ఆర్థిక సాయాన్ని అందించారు. గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి పావలా శ్యామలకు ఆ ఆర్థిక సాయం అందేలా చేశారు. ఈ క్రమంలో ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ కలిసి ఇలా ఆమెకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు.


సాయి దుర్గ తేజ్ ఇచ్చిన మాటను గుర్తు పెట్టుకుని ఇలా ఆర్థిక సాయాన్ని అందించడంతో నటి పావలా శ్యామల ఎమోషనల్ అయ్యారు. తన ధీనస్థితి గురించి చెబుతూ కన్నీరు మున్నీరు అయ్యారు. ఇలాంటి పరిస్థితులో సాయి దుర్గ తేజ్ తనను గుర్తు పెట్టుకుని మరీ సాయం చేయడం గొప్ప విషయమని ఎమోషనల్ అయ్యారు. ఇక సాయి దుర్గ తేజ్‌తో వీడియో కాల్‌లో నటి పావలా శ్యామల మాట్లాడుతూ కన్నీరు పెట్టేసుకున్నారు.


అన్ని విధాల అండగా ఉంటామని సాయి దుర్గ తేజ్ భరోసానిచ్చారు. అందరూ సాయం చేస్తారని, తోడుగా ఉంటారని హామీ ఇచ్చారు. ‘యాక్సిడెంట్ జరిగినప్పుడు.. మీరు బాగుండాలని, ఏమీ కాకూడదని ఆ దేవుడ్ని ప్రార్థించానంటూ నటి పావల శ్యామల చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు. ఆమె ప్రేమకు, మాటలకు సాయి దుర్గ తేజ్ ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే చిరంజీవి గారు చేసిన ఆర్థిక సాయాన్ని కూడా నటి పావల శ్యామల గుర్తు చేసుకున్నారు.

 

Committee Kurrollu Movie Trailer Launched Grandly

 కమిటీ కుర్రోళ్ళు’ లాంటి మంచి చిత్రాన్ని ఆడియెన్స్ తప్పకుండా ఆదరిస్తారు.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సిద్దు జొన్నలగడ్డ  




నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఇది వరకు రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శుక్రవారం నాడు ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో..


సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ‘నన్ను పిలిచి ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగమయ్యేలా చేసిన నిహారిక గారికి థాంక్స్. ఇది చిన్న చిత్రం కాదని అర్థమైంది. అసలు చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది ఉండదు. ఓ సినిమాకు తక్కువ ఖర్చు పెడతాం.. ఎక్కువ ఖర్చు పెడతామంతే. ఇది చాలా పెద్ద బడ్జెట్‌తో తీసిన పెద్ద సినిమాలా కనిపిస్తోంది. విజువల్స్ బాగున్నాయి. ఇలా కొత్త వారితో ఇంత మంచిగా చిత్రాన్ని తీయడం అంటే మామూలు విషయం కాదు. యదు గారికి ఇది మొదటి సినిమాలా అనిపించడం లేదు. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. నిహారిక గారు మల్టీ టాలెంటెడ్. నటిస్తున్నారు.. నిర్మిస్తున్నారు.. షోలు చేస్తున్నారు. ఆమెకు ఈ చిత్రం పెద్ద హిట్ అయి భారీ లాభాల్ని తెచ్చి పెట్టాలి. ఇలాంటి మంచి చిత్రాలు వస్తే ఆడియెన్స్ తప్పకుండా ఆదరిస్తారు.. పెద్ద హిట్ చేస్తారు’ అని అన్నారు.


నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. ‘షూటింగ్ ఉన్నా కూడా పిలిచిన వెంటనే వచ్చిన సిద్దు గారికి థాంక్స్. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు లేకపోతే సినిమా ఇక్కడి వరకు వచ్చేది కాదు. టీం అంతా కలిసి కష్టపడి సినిమా చేశాం. మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరూ బెస్ట్ ఇచ్చారు. అందరికీ థాంక్స్. కమిటీ కుర్రోళ్ళు అంతా కూడా మూడేళ్లు సినిమా కోసం పని చేస్తూనే ఉన్నారు. అందరూ వారి వారి పాత్రలకు ప్రాణం పోశారు. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.


ద‌ర్శ‌కుడు య‌దు వంశీ మాట్లాడుతూ.. ‘మా ఈవెంట్‌కు వచ్చిన సిద్దు గారికి థాంక్స్. మా సినిమాలో నటించిన 11 మంది కూడా సిద్దు గారిలానే ఎంతో కష్టపడుతుంటారు. మా టెక్నికల్ టీం సపోర్ట్ వల్లే సినిమాను ఇంత బాగా తీయగలిగాను. సినిమా చూస్తే చాలా రీఫ్రెష్‌గా, నోస్టాల్జిక్‌గా అనిపిస్తుంది. నిహారిక గారు, ఫణి గారు లేకపోతే మూవీని ఇంత బాగా తీసేవాళ్లం కాదు. రమేష్ గారు మాకు ఎంతో అండగా నిలిచారు. మేం మంచి చిత్రాన్ని తీశాం. ఆగస్ట్ 9న మా సినిమా థియేటర్లోకి రానుంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.


నిర్మాత ఫణి అడపాక మాట్లాడుతూ.. ‘మా కమిటీ కుర్రోళ్లు టీంకు కంగ్రాట్స్. చాలా మంచి చిత్రాన్ని తీశాం. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్. మా ఈవెంట్‌కు వచ్చిన సిద్దు గారికి థాంక్స్. ఎమోషనల్ క్యారీ అయ్యేట్టుగా.. అనుకున్నది అనుకున్నట్టుగా యదు సినిమాను తీశారు. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. సినిమా కూడా అందరికీ నచ్చుతుంది. యదు గారు మంచి సినిమాను తీశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో మంచి యూత్ ఫుల్ సినిమాను తీశారు. ఇలాంటి సినిమాకు సిద్దు గారిలాంటి హీరో గెస్టుగా రావడం ఆనందంగా ఉంది. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. చూసి అందరూ సక్సెస్ చేయాలి’ అని అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ మాట్లాడుతూ.. ‘మా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన సిద్దు గారికి థాంక్స్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన సాంగ్స్ అందరికీ నచ్చాయి. ట్రైలర్ కూడా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. ఇంత మంచి సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి.. అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.


కెమెరామెన్ రాజు మాట్లాడుతూ.. ‘మా సినిమా ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌కు గెస్టుగా వచ్చిన సిద్దు గారికి థాంక్స్. యదు గారు మంచి కథను రాశారు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నా విజువల్స్‌ను మ్యూజిక్ డైరెక్టర్ మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.


Jarivaram Sarees Store Launched by Hyderabad Mayor Gadwal VijayaLakshmi

 జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 32 లో ఈ గురువారం హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారి చేతుల మీదుగా జరివరం శారీస్ స్టోర్ బ్రహ్మండంగా ప్రారంభమైంది.. మేయర్ తో పాటు స్వర్గీయ కృష్ణం రాజు గారి సతీమణి  శ్యామలా దేవి గారు, యువ నటుడు రక్షిత్ అట్లూరి  వచ్చి నిర్వాహకులకు అభినందలు తెలియజేశారు




అభిలాష రెడ్డి, గాయత్రి ( నటుడు కృష్ణుడు వైఫ్) ఇద్దరూ కలసి ఎంతో ప్యాషన్ తో పెట్టిన స్టోర్ ఈ జరివరం. ఇక్కడ అన్ని రకాల కలెక్షన్స్ తో పాటు కంచి పట్టు, ఆర్గంజా, బ్రైడల్  డిజైన్ తో కష్టమైజెషన్ కూడా ఉంటుంది..ఈ జరివరం వన్ స్టాప్ షాప్ లా ఉంటుంది అని తెలియజేశారు.. అంతే కాకుండా కంచి పట్టు మా జరివరం  ప్రత్యేకత. పెళ్లిళ్లకు స్టార్ట్ టూ ఎండ్ వరకూ మా దగ్గర షాపింగ్ చేసుకోవచ్చు అని చెప్పారు అభిలాష రెడ్డి గారు మరియు గాయత్రి గారు.



మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు మాట్లాడుతూ...ఇక్కడ కలెక్షన్స్ చూస్తే చాలా బాగున్నాయి.. లేడీస్ అందరూ ఈ స్టోర్ కి రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ తృతీయ జెవలరీస్ స్టాల్ లోపల  పెట్టడం జరిగింది..ఆ కలెక్షన్స్ కూడా బాగున్నాయి.. మ్యారేజ్ డ్రెస్ లే కాకుండా ఫాన్సీ డ్రెస్సులు కూడా బాగున్నాయి...ఇక్కడే వీవింగ్ చేసి కస్టమర్స్ టేస్ట్ కు తగ్గట్టుగా కష్ట మైజెషన్ చేసి వీళ్ళు ఇస్తున్నారు...వీళ్ళ కలెక్షన్స్ నాకు చాలా నచ్చాయి అని తెలియజేశారు...



శ్యామలా దేవి గారు మాట్లాడుతూ : జరివరం స్టోర్ కు నన్ను గెస్ట్ గా ఆహ్వానించడం హ్యాపీ గా ఉంది..ఇక్కడ కలెక్షన్స్ చాలా బాగున్నాయి..మరీ ముఖ్యం గా కంచి పట్టు చీరల వెరైటీ లు ఉన్నాయి..నాకు పర్సనల్ గా కంచి పట్టు అంటేనే ఇష్టం. ఇప్పుడు నేను వేసుకునేది కూడా కంచి పట్టునే..కృష్ణంరాజు గారు నాకు కొన్న ఫస్ట్ కంచి పట్టు చీర ఇది అని చెప్పారు. అంతే కాకుండా ప్రభాస్ పెళ్ళి బట్టలు కూడా ఈ జరివరం నుండే కొంటాము అని చెప్పారు..అలాగే ఎంతో ఫ్యాషన్ ఎక్కడ..ఎక్కడ నుండో మంచి కలెక్షన్స్ తెప్పించిన ఇంత అందంగా జరివరం స్టోర్ స్టార్ట్ చేసిన అభిలాష రెడ్డి గారికి, గాయిత్రి గారికి అభినందనలు తెలిపారు.


రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ : జరివరం స్టోర్ ఓపెనింగ్ కు రావడం చాలా హ్యాపీ గా ఉంది..ఇక్కడ చీరల కలెక్షన్స్ చాలా యూనిక్ గా ఉన్నాయి... వైవిద్యం కోరుకొనే మహిళలకు ఈ జరివరం కలెక్షన్స్ తప్పకుండా నచ్చుతాయి అని తెలియజేశారు...


నటుడు కృష్ణుడు మాట్లాడుతూ అభిలాష రెడ్డి గారు, మా వైఫ్ గాయత్రి కలసి ఈ స్టార్ స్టార్ట్ చేశారు...వాళ్ళు ఈ కలెక్షన్స్ కోసం చాలా కష్టపడ్డారు.. హైదరాబాద్ లో ఉండే అతివలకు బెస్ట్ కలెక్షన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశం తోనే వాళ్ళు ఈ జరివరం స్టార్ట్ చేసారు. అతిధులుగా వచ్చిన  మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారికి,  శ్యామలా దేవి గారికి, నటులు రక్షిత్ అట్లూరి గారికి..ఇంకా వాళ్ళను అభినందించడానికి వచ్చిన అందరికీ కృజ్ఞతలు తెలియజేశారు.



అభిలాష రెడ్డి  & గాయత్రి మాట్లాడుతూ: మా ఆహ్వానం మన్నించి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు...ఈ స్టోర్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ...కస్టమర్స్ కి ది బెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా నెలల నుండి హామ్ వర్క్ చేసి ఈ జరివరం స్టార్ట్ చేశాం. మా దగ్గర అల్ టైప్స్ ఆఫ్ శారీస్ తో పాటు కంచి పట్టు మా ప్రత్యేకత తీసుకున్నాము..వన్ స్టాప్ షాప్ లా ఈ జరివరం ఉంటుంది..మా జరివరం పేరు లో ఎంత నిజాయితీ ఉందో మా కలెక్షన్స్ లో కూడా అదే చూపించబోతున్నాం...మీరు ఒక్కసారి మా జరివరం కు వస్తే ఇది కరెక్ట్ అని మీరే చెబుతారు అని తెలియజేశారు..

Bellamkonda Sai Sreenivas completes a Decade in Telugu cinema

 హీరోగా దశాబ్దకాలం పూర్తి చేసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్



బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఇండస్ట్రీ లోకి ఒక స్టార్ కిడ్ గా అడుగుపెట్టిన మాట వాస్తవమే. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్ద కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కానీ కొంతకాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినా తన నటనతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీ లో నటుడిగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జర్నీ నిజంగా చాలా మందికి స్ఫూర్తిని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు.  


తండ్రి నిర్మాత కావడంతో చిన్నప్పటినుండి సినిమాలను, సినిమా షూటింగ్ లను.. దగ్గర నుండి చూసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. నటన మీద ఆసక్తితో లాస్ ఏంజిల్స్ లోని లీ స్ట్రాస్బెర్గ్ థియేటర్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్, ముంబైలోని బారీ జాన్ యాక్టింగ్ స్టూడియోలో శిక్షణ తీసుకున్నారు. ట్రైనింగ్ తర్వాత హీరోగా తన కెరియర్ ను ప్రారంభించారు. వియత్నాంలో మార్షల్ ఆర్ట్స్, స్టంట్స్ కూడా నేర్చుకోవడం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి బాగా ఉపయోగపడింది.


ఈ దశాబ్ద కాలంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. 2014లో సమంత హీరోయిన్ గా "అల్లుడు శీను" అనే సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. మొదటి సినిమా అయినప్పటికీ, కమర్షియల్ గా ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం, సీత, రాక్షసుడు, అల్లుడు అదుర్స్ వంటి సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. 


ఈ మధ్యనే చత్రపతి సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టారు. ఇప్పుడు శ్రీనివాస్ చేతుల్లో చాలానే ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. మొదటగా 14 రీల్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై టైసన్ నాయుడు తో, సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో, కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో కూడా మరో సినిమాని ఈ మధ్యనే అధికారికంగా ప్రకటించారు. మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ పై లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నారు. ఇవే కాకుండా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ప్రకటించనున్నారు.


ఇక సినిమాల పరంగా పక్కన పెడితే, ఈ పదేళ్లలో బెల్లంకొండ శ్రీనివాస్ ఒక్క వివాదంలో కూడా ఇరుక్కోకపోవడం విశేషం. వివాదాలకు దూరంగా ఉండటం ఆయన నైజం. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా శ్రీనివాస్ చాలా సాదాసీదాగా ఉంటారు. అదే ప్రేక్షకులను ఇంకా ఎక్కువగా ఆకట్టుకుంటుంది. సినీ పరిశ్రమలో ఆయన ప్రయాణం ఇంకా చాలా కాలం విజయవంతంగా కొనసాగాలని, ఎన్నో హిట్ సినిమాలు అందుకుంటూ కెరియర్ లో ముందుకు దూసుకువెళ్లాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Emaindho Manase from 'Average Student Nani' is out now

 'యావరేజ్ స్టూడెంట్ నాని' నుంచి రొమాంటిక్ మెలోడీ 'ఏమైందో మనసే' లిరికల్ వీడియో.. పీవీఆర్ ఐనాక్స్ ద్వారా ఆగస్ట్ 2న చిత్రం విడుదల

 


మెరిసే మెరిసే సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన పవన్ కుమార్ కొత్తూరి సక్సెస్ అందుకున్నారు. పవన్ కుమార్ తన రెండో సినిమా 'యావరేజ్ స్టూడెంట్ నాని'తో హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 2న విడుదల కాబోతోంది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్లోకి రానుంది. 


ఆల్రెడీ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. గతంలో విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్, మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ సింగిల్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ లోనే తన ఎక్స్ ప్రెషన్స్, పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు పవన్ కుమార్. ఈ రోజు సెకండ్ సింగిల్ ‘ఏమైందో మనసే’ అనే పాటను రిలీజ్ చేశారు.


పూర్తి రొమాంటిక్ మోడ్‌లో సాగే ఈ మెలోడీ పాటకు కార్తీక్ బి కొడకండ్ల మంచి బాణీని అందించారు. శక్తి శ్రీ గోపాలన్ గానం వినసొంపుగా ఉంది. కృష్ణవేణి మల్లవజ్జల సాహిత్యం ఆకట్టుకునేలా ఉంది. ఈ పాటలో పవన్, సాహిబా భాసిన్ స్టీమీ కెమిస్ట్రీ అదిరిపోయింది.


ఈ చిత్రానికి సజీష్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఉద్ధవ్ ఎస్ బి ఈ సినిమాకి ఎడిటర్.


నటీనటులు: పవన్ కుమార్ కొత్తూరి, స్నేహ మాల్వియ, సాహిబా భాసిన్, వివియా సంత్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, ఖలేజా గిరి, తదితరులు


సాంకేతిక సిబ్బంది:

ప్రొడక్షన్ హౌస్: శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్టైన్మెంట్స్ LLP

నిర్మాతలు: పవన్ కుమార్ కొత్తూరి, బిషాలి గోయెల్

రచయిత, దర్శకుడు: పవన్ కుమార్ కొత్తూరి

సంగీతం: కార్తీక్ బి కొడకండ్ల

DOP: సజీష్ రాజేంద్రన్

ఎడిటర్: ఉద్ధవ్ SB

పాటల కొరియోగ్రఫీ: రాజ్ పైడి మాస్టర్

ఫైట్స్: నందు

PRO: SR ప్రమోషన్స్ (సాయి సతీష్)

SR University Announces Honorary Doctorate to Tanikella Bharani

 తనికెళ్ల భరణికి గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించిన ఎస్‌.ఆర్‌ యూనివర్శిటి....



 సుప్రసిద్ధ కవి, మాటల రచయిత, రంగస్థల నటుడు, నటుడు దర్శకుడు శ్రీ తనికెళ్ల భరణి. దాదాపు 800 సినిమాల పైచిలుకు చిత్రాల్లో నటించి తెలుగు వారందరు మా భరణి అనుకునేంతగా పేరుగాంచిన సంగతి అందరికి తెలిసిందే. గురువారం వరంగల్‌ ఎస్‌ఆర్‌ యూనివర్సిటి వారు తనికెళ్ల భరణి గారికి గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించారు. 52 సినిమాలకు మాటలను అందించి రచయితగా అనేక విజయాలను అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ‘సముద్రం’ సినిమాకు ఉత్తమ విలన్‌గా, ‘నువ్వు నేను’ సినిమాలోని నటనకు ఉత్తమ క్యారెక్టర్‌ నటునిగా, ‘గ్రహణం’తో ఉత్తమ నటునిగా, ‘మిథునం’ సినిమాకు గాను ఉత్తమ రచయిత మరియు ఉత్తమ దర్శకునిగా అయిదు నంది అవార్డులను అందుకున్నారాయన.  ఎస్‌ఆర్‌ యూనివర్శిటి వారు ప్రకటించిన అవార్డును ఆగస్ట్‌ 3వ తారీకు శనివారం  వరంగల్‌లో జరిగే యూనివర్శిటి స్నాతకోత్సవ వేడుకలో ఆయనకు డాక్టరేట్‌ను ప్రధానం చేయనున్నారు. 40 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ విద్యా సంస్థ యూనివర్శిటిగా మారిన తర్వాత ఆస్కార్‌ అవార్డు గ్రహిత చంద్రబోస్‌ను గౌరవ డాక్టరేట్‌తో గతంలో సత్కరించింది.

Producer Mahendra Nath Kondla Interview About Viraaji

 ఒక మంచి చిత్రంగా 'విరాజి' ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది - నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల



మహా మూవీస్ మరియు ఎమ్ 3 మీడియా పతాకంపై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం "విరాజి". ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈరోజు జరిగిన ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ తెలిపారు నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల


- మా సంస్థలో నిర్మించిన రెండో చిత్రం విరాజి. వరలక్ష్మి శరత్ కుమార్ తో శబరి సినిమా చేశాం. ఇది పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేశాం. ఇప్పుడు వరుణ్ సందేశ్ హీరోగా విరాజి నిర్మించాం.  సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచి విరాజికి మంచి రెస్పాన్స్ వస్తోంది.


- వరుణ్ సందేశ్ లుక్ తో పాటు ట్రైలర్ కు ప్రేక్షకుల ఆదరణ దక్కుతోంది. మా స్నేహితుడు సుకుమార్ ద్వారా దర్శకుడు ఆద్యంత్ హర్ష పరిచయం అయ్యారు. ఆయన కథ చెప్పిన విధానం నన్ను ఆకట్టుకుంది. ప్రతి సీన్ ఆకట్టుకునేలా చెప్పాడు. చెప్పడమే కాదు సెట్ లో కూడా అంతే బాగా తెరకెక్కించాడు.


- వరుణ్ సందేశ్ గత సినిమా నింద మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అది మా విరాజి సినిమాకు అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తున్నాం. ముందు హీరో క్యారెక్టర్ కు ఇద్దరు ముగ్గురు ఆప్షన్స్ అనుకున్నాం. అయితే నాకు హీరోగా నటించి వెళ్లిపోయే వారు మాత్రమే కాకుండా నాకు సినిమా మొత్తం సపోర్ట్ చేసే హీరో కావాలని అనుకున్నాను.


- ఎందుకంటే నేను కొత్త నిర్మాతను. నాకు అలా సపోర్ట్ చేసే హీరో ఉంటేనే బాగుంటుందని అనిపించింది. వరుణ్ సందేశ్ యూఎస్ నేపథ్యం ఉన్ పర్సన్. అతని డైలాగ్ డెలివరీ విధానం విరాజికి కలిసొచ్చిందని చెప్పొచ్చు.


- మన సొసైటీలో ఉన్న ఒక అంశాన్ని తీసుకుని కమర్షియల్ ఎలిమెంట్స్ తో విరాజి సినిమాను నిర్మించాం. ఇందులో రఘు కారుమంచి, ప్రమోదినీ వంటి ఇతర ఆర్టిస్టులు ఉన్నారు. అయితే హీరో మెయిన్ క్రౌడ్ పుల్లర్ కాబట్టి అతని ఫొటోతోనే ప్రమోషన్స్ చేస్తున్నాం. వరుణ్ గెటప్ కూడా కొత్తగా ఉంటుంది. అలా ఎందుకు ఉంది అనేది థియేటర్ లో చూడాలి.


- ఈ నెల 2వ తేదీన మేము ఆగస్టు 2 రిలీజ్ అని అనౌన్స్ చేశాం. నెల రోజులు ప్రమోషన్స్ కు పెట్టుకున్నాం. ఇంతలో కొన్ని సినిమాలు ఆగస్టు 2న రిలీజ్ అని ప్రకటించాయి. ప్రతివారం సినిమాలు వస్తూనే ఉంటాయి. మన సినిమాలో కంటెంట్ ఉంటే తప్పకుండా ఆదరణ పొందుతుంది అని మేము బిలీవ్ చేస్తున్నాం. అందుకే మా డేట్ ను పోస్ట్ పోన్ చేయడం లేదు.


-  విరాజిలో మంచి కంటెంట్ ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుంటుందని అంటారనే నమ్మకం ఉంది. ఏ రేంజ్ సక్సెస్ అనేది ఇప్పుడే చెప్పలేం. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్లు నైజాంలో రిలీజ్ చేస్తున్నారు. వాళ్లు సినిమా చూసి బాగుందని చెప్పారు. డైరెక్టర్ ఎవరు అని అడిగారు. సెన్సార్ వాళ్ల నుంచి కూడా మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. 100 మినిట్స్ మూవీ. యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు. 100 థియేటర్స్ పైనే మా విరాజి సినిమా రిలీజ్ కు వస్తోంది.


-  మా సంస్థలో ప్రస్తుతం బిగ్ బాస్ అమర్ దీప్, నటి సురేఖవాణి కూతురు సుప్రిత జంటగా ఓ మంచి లవ్, యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీ చేస్తున్నాం. అది 50 పర్సెంట్ షూట్ కంప్లీట్ అయ్యింది. ఏడాది చివరలో రిలీజ్ అనుకుంటున్నాం. అన్నారు.


Tiragabadara Saami Powerful Title song Unveiled

రాజ్ తరుణ్, ఎ ఎస్ రవికుమార్ చౌదరి, సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ 'తిరగబడరసామీ' పవర్ ఫుల్ టైటిల్ సాంగ్ రిలీజ్  



యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ 'తిరగబడరసామీ'. మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూత్ ని ఆకట్టుకునే రోమాన్స్ తో పాటు ఫ్యామిలీని ఆకర్షించే సెంటిమెంట్, మాస్ ని అలరించే హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు.


ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు మంచి బజ్ క్రియేట్ చేసి సినిమాపై క్యురియాసిటీని పెంచాయి. తాజాగా 'తిరగబడరసామీ' టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. కంపోజర్ జెబి ఈ సాంగ్ ని పవర్ ఫుల్ గా ట్యూన్ చేశారు. సాయి చరణ్, లోకేశ్వర్ ఈదర, చైతు సత్సంగి వోకల్స్ ఎనర్జిటిక్ గా వున్నాయి. సుద్దాల అశోక్ తేజ చాలా పవర్ ఫుల్ లిరిక్స్ అందించారు. ఈ సాంగ్ లో తరుణ్ తరుణ్ మాస్ యాక్షన్ ప్యాక్డ్ అవతార్ లో కనిపించారు.  

 

సెన్సేషనల్ బ్యూటీ మన్నారా చోప్రా ఈ చిత్రంలో ఓ డిఫరెంట్ క్యారెక్టర్ తో పాటు ఒక స్పెషల్ సాంగ్ లో అలరించబోతుంది. మకరంద్ దేశ్‌పాండే, జాన్ విజయ్, రఘు బాబు, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి ఇతర కీలక పాత్రలు పోషించారు.


ఈ చిత్రానికి జవహర్ రెడ్డి కెమరామెన్ గా పని చేస్తున్నారు. బస్వా పైడిరెడ్డి ఎడిటర్, రవికుమార్ గుర్రం ఆర్ట్ డైరెక్టర్.


ఈ చిత్రం ఆగస్ట్ 2న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.  


తారాగణం: రాజ్ తరుణ్ , మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా, మకరంద్ దేశ్‌పాండే, రఘు బాబు, జాన్ విజయ్, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి


సాంకేతిక విభాగం :

రచన, దర్శకత్వం: ఎ ఎస్ రవికుమార్ చౌదరి

నిర్మాత: మల్కాపురం శివకుమార్

బ్యానర్: సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా

సంగీతం: జెబి &భోలే షావలి

డీవోపీ: జవహర్ రెడ్డి యం. ఎన్

ఎడిటర్: బస్వా పైడిరెడ్డి

ఆర్ట్:  రవికుమార్ గుర్రం

ఫైట్స్ - పృద్వీ, కార్తీక్

లిరిక్స్: సుద్దాల అశోక్ తేజ, శ్రీమణి

పీఆర్వో: వంశీ శేఖర్

Reppal Dappul Song Unleashed From Mr Bachchan

 మాస్ మహారాజా రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, హరీష్ శంకర్, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 'మిస్టర్ బచ్చన్' నుంచి హైలీ ఎనర్జిటిక్ మాస్ చార్ట్‌బస్టర్ రెప్పల్ డప్పుల్‌ సాంగ్ రిలీజ్  



మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'మిస్టర్ బచ్చన్' మ్యూజిక్ ప్రమోషన్లు ఫస్ట్  సింగిల్ సితార్‌కు అద్భుతమైన రెస్పాన్స్ తో చార్ట్ బస్టర్ నోట్‌లో ప్రారంభమయ్యాయి. ఈ రోజు, మేకర్స్ సెకండ్ సింగిల్ రెప్పల్ డప్పుల్‌ను విడుదల చేశారు, ఇది ఫస్ట్ సింగిల్‌కి చాలా డిఫరెంట్ గా వుంది.


రెప్పల్ డప్పుల్ హైలీ ఎనర్జిటిక్ బీట్‌లతో కూడిన కంప్లీట్ మాస్ నంబర్. మ్యూజిక్ కంపోజిషన్, ట్యూన్ లో ఈ మాస్ నంబర్‌ను మ్యాసీ బ్లాక్‌బస్టర్‌గా మార్చేలా కంపోజ్ చేశారు మిక్కీ జె మేయర్.  ఆర్కెస్ట్రేషన్ అద్భుతంగా వుంది. సింగర్స్ అనురాగ్ కులకర్ణి, మంగ్లీ తమ స్పెషల్ వోలక్స్ తో ఎక్స్ ట్రార్డినరీ గా పాడారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ ఈ ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్ నంబర్ బీట్‌లను పెర్ఫెక్ట్ గా మ్యాచ్ చేశాయి. ఇది ప్రతి మాస్ పార్టీ ప్లేలిస్ట్‌లో ఉండబోతోంది.


రవితేజ, భాగ్యశ్రీ బోర్సే డ్యాన్స్ ఫ్లోర్‌ ని ఆదరగొట్టారు. ఇన్ఫెక్షియస్ ఎనర్జీ తో, వైబ్రెంట్ స్పేస్ లో సెట్ చేయబడిన డ్యాన్స్ నంబర్ డైనమిక్ బీట్‌లతో అదిరిపోయింది. రవితేజ స్మార్ట్ గా కనిపించగా, భాగ్యశ్రీ బోర్సే తన మాస్ స్టెప్పులు, గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఈ మాస్ బ్లాక్ బస్టర్ కు భాను మాస్టర్ అమెజింగా కొరియోగ్రఫీ చేశారు.


పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. అయాంక బోస్ సినిమాటోగ్రాఫర్ కాగా, ప్రొడక్షన్ డిజైన్ బ్రహ్మ కడలి. ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్.


మిస్టర్ బచ్చన్ ఆగస్ట్ 15న విడుదల కానుంది.


 తారాగణం: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్


సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: హరీష్ శంకర్

నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్

సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల

బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

సమర్పణ: పనోరమా స్టూడియోస్ & T-సిరీస్

సంగీతం: మిక్కీ జె మేయర్

డీవోపీ: అయనంక బోస్

ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి

ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: ఫస్ట్ షో

మేకప్ చీఫ్: ఐ శ్రీనివాసరాజు

Operation Raavan Pre Release Event Held Grandly

 “ఆపరేషన్ రావణ్” సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది - ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ దర్శకుడు మారుతి



పలాస, నరకాసుర వంటి చిత్రాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న రక్షిత్ అట్లూరి నటిస్తున్న కొత్త సినిమా “ఆపరేషన్ రావణ్”. ఈ సినిమాలో రాధిక శరత్ కుమార్  కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు వెంకట సత్య తెలుగు మరియు తమిళ బాషల్లో రూపొందిస్తున్నారు. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. “ఆపరేషన్ రావణ్” సినిమా ఈ నెల 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్రముఖ దర్శకుడు మారుతి అతిథిగా హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో


లిరిసిస్ట్ ప్రణవం మాట్లాడుతూ - మా డైరెక్టర్ గారు ఈ ఫంక్షన్ లో ఏదైనా మాటల్లో కాకుండా పాటల్లో చెప్పమన్నారు. ఈ సినిమాలో నేను రాసిన పాటల్లో కొన్ని లైన్స్ మీ ముందు ప్రస్తావిస్తాను. మాటల్లో ఉన్న రీతి బ్రతుకు తీరు ఉంటుందా, చేసిది ఎవ్వరంట చేయించేది ఎవరంట..ఇలాంటి పదాలతో పాటలు రాశాను. కథలోని సారాన్నే నా పాటలు వ్యక్తీకరించాయి. “ఆపరేషన్ రావణ్” పాటల్లాగే సినిమా కూడా హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.


డైలాగ్ రైటర్ డార్లింగ్ స్వామి మాట్లాడుతూ - మనకు మంచి విషయాలు నేర్పించేవి పుస్తకాలు, స్నేహితులే. వెంకట సత్య గారు నాకు మంచి మిత్రులు. ఆయన సమాజంలో జరిగే విషయాలను కథగా మలచి సినిమా చేయాలనుకున్నారు. అలా “ఆపరేషన్ రావణ్” తెరకెక్కించారు. ఈ సినిమా చూడాలనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో తమ ప్రమోషన్ ద్వారా కలిగించారు. రక్షిత్ అట్లూరి మంచి నటుడు. ఈ సినిమాతో ఆయన నటుడిగా మరో మెట్టు ఎదిగాడని భావిస్తున్నాను. ఈ సినిమా విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నా. అన్నారు.


దర్శకుడు అనిల్ మాట్లాడుతూ - తండ్రి దర్శకత్వంలో కొడుకు హీరోగా నటించడం అనేది బాలీవుడ్ లో చూశాం. మన దగ్గర పూరి గారు మాత్రమే అలా చేశారు. మా వెంకట్ సత్య గారికి ఇదొక కొత్త అనుభవం అని చెప్పొచ్చు. “ఆపరేషన్ రావణ్”లో రక్షిత్ చాలా బాగా నటించాడు. నటుడిగా మరింత పరిణితి చూపించాడు. మన ఆలోచనలే మన శత్రువులు ఎలా అయ్యాయో థియేటర్ లో చూడాలనే ఆసక్తి కలుగుతోంది. ఎంటైర్ టీమ్ కు ఆల్ ది బెస్ట్. అన్నారు.


దర్శకుడు వెంకట సత్య మాట్లాడుతూ - మా “ఆపరేషన్ రావణ్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా దర్శకులు మారుతి గారు రావడం సంతోషంగా ఉంది.  నేను, మా రక్షిత్ మూవీ కెరీర్ లోకి రావడానికి మారుతి గారే కారణం. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం. ఈ సినిమా మేకింగ్ లో నాకు తోడుగా ఉన్న మా టీమ్ అందిరికీ థ్యాంక్స్. మీ ఆలోచనలే మీ శత్రువులు, సైకో థ్రిల్లర్ అనే ట్యాగ్ లైన్స్ తో ప్రమోషన్ చేస్తున్నాం గానీ మా సినిమాలో మంచి లవ్ స్టోరీ ఉంటుంది. ప్రేమ సెన్సిబిలిటీస్ ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపిస్తున్నాం. ప్రేమ ఇవ్వడం అనేది ఒకరకంగా ఉంటుంది. ప్రేమ అంతా నాకే కావాలని అనుకున్నప్పుడు మరో రకంగా ఉంటుంది. ఎంత డీప్ ప్రేమ, ఎంత వయలెంట్ గా మారింది అనేది ఈ సినిమాలో తెరకెక్కించాం. మన సినిమాల మనుగడ కష్టమవుతుంది అనే పరిస్థితులకు కారణాలు సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాయి. ఎవరైనా పెద్దవారు ఇండస్ట్రీలో పెద్దగా బాధ్యతలు తీసుకుని మనం థియేటర్స్ లో ఇంత రేట్స్ ఎందుకు పెడుతున్నాం, పాప్ కార్న్ రేట్స్ ఇంతలా పెంచితే సినిమాకు ప్రేక్షకులు వస్తారా లేదా థియేటర్స్ ఒకవారం మూసేసి మరో వారం ఓపెన్ చేస్తున్నారు..ఇలాంటి అంశాలను ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నా. అన్నారు.


హీరో తిరువీర్ మాట్లాడుతూ - పలాస సినిమాలో నేను రక్షిత్ కలిసి నటించాం. అప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ గానే కొనసాగుతున్నాం. మారుతి గారు పలాస టైమ్ లో మాకు సపోర్ట్ చేశారు. ఇప్పుడు కూడా వచ్చారు. ఆయనకు థ్యాంక్స్. “ఆపరేషన్ రావణ్” సినిమాలో నేను నటించాల్సింది. ఈ కథ విన్న తర్వాత నాకు గూస్ బంప్స్ వచ్చాయి. నా ఫేవరేట్ థ్రిల్లర్ మూవీస్ గుర్తొచ్చాయి. కథ చెప్పడమే కాదు అంతే బాగా తీశారు. నేను ట్రైలర్ చూసి షాక్ అయ్యాను. అనివార్య కారణాలతో ఈ మూవీలో నటించలేకపోయాను. మీ అందరికీ నచ్చే మూవీ “ఆపరేషన్ రావణ్” అవుతుంది. తప్పకుండా చూడండి. అన్నారు.


హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ - నేను ఇండస్ట్రీలోకి రావడానికి డైరెక్టర్ మారుతి గారే కారణం. ఆయన ఎప్పుడూ నాకు సపోర్ట్ గా ఉంటారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. “ఆపరేషన్ రావణ్” సినిమాను మా నాన్నగారు ఎంతో బాగా డైరెక్ట్ చేశారు. ఆయన ఫస్ట్ టైమ్ డైరెక్టర్ అని సినిమా చూశాక ఎవరూ అనుకోరు. అంత బాగుంటుంది. నా ఫ్రెండ్ తిరువీర్. మేము కలిసి పలాసలో చేశాం. పిలవగానే ఆయన మా ఫంక్షన్ కు వచ్చారు. థ్యాంక్స్. మా సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశారు. రాధిక గారి పర్ ఫార్మెన్స్ చూస్తే మీరు ఎంతో ఎమోషనల్ అవుతారు. మాస్క్ మ్యాన్ ఎవరో కనిపెట్టి మాకు చెబితే సిల్వర్ కాయిన్ ఇస్తామని చెప్పాం. సినిమాకు మంచి హైప్ ఏర్పడింది. తప్పకుండా థియేటర్స్ లో “ఆపరేషన్ రావణ్” చూడండి. థ్రిల్ ఫీలవుతారు. అన్నారు.


డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ - “ఆపరేషన్ రావణ్” సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారని వెంకట సత్య గారిని అడిగేవాడిని. ఆయన మంచి టైమ్ చూసుకుని చేయాలని అనుకుంటున్నామని అనేవారు. ఈ నెల 26న మంచి డేట్ కు రిలీజ్ కు వస్తున్నారు. నేను ఆరు నెలల కిందట ఈ సినిమా చూశాను. చాలా బాగుంది. వాళ్ల అబ్బాయిని హీరోగా పెట్టి వెంకట సత్య గారు థ్రిల్లర్ సినిమాను రూపొందించడం మామూలు విషయం కాదు. బాలీవుడ్ లో ఇలా కొందరు ఫాదర్ సన్ సక్సెస్ అయ్యారు. తెలుగులో ఇప్పుడు రక్షిత్, వెంకట సత్య గారు చేస్తున్నారు. లండన్ బాబులు అనే మూవీతో మెల్లిగా మొదలైన రక్షిత్ జర్నీ పలాసతో పీక్స్ కు వెళ్లింది. ఆ సినిమాలో తన నటనతో మెస్మరైజ్ చేశాడు రక్షిత్. అతనిలో పట్టుదల అంకితభావం ఉన్నాయి. మన పక్కింటి కుర్రాడిలా అనిపిస్తాడు. “ఆపరేషన్ రావణ్” సినిమాతో రక్షిత్ మరింత మంచి పేరు తెచ్చుకోవాలి. ఈ మాస్క్ మ్యాన్ ఎవరు అనే క్యూరియాసిటీ క్రియేట్ చేశారు వెంకట సత్య గారు. “ఆపరేషన్ రావణ్” టీమ్ అందిరకీ ఆల్ ది బెస్ట్. అన్నారు.


నటి శ్వేత మాట్లాడుతూ - “ఆపరేషన్ రావణ్” సినిమాలో నేను లక్ష్మీ అనే క్యారెక్టర్ చేశాను. ఇంతమంచి రోల్ నాకు ఇచ్చిన డైరెక్టర్ వెంకట సత్య గారికి థ్యాంక్స్. హీరో రక్షిత్ తో నాకు కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. సినిమా చాలా బాగుంటుంది. మీరంతా మూవీని ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.


నటి శ్వేతాంజలి మాట్లాడుతూ - “ఆపరేషన్ రావణ్” సినిమాలో ఒక మంచి రోల్ ఇచ్చారు దర్శకుడు వెంకట సత్య గారు. నా రోల్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. రక్షిత్ గారి లుక్ ట్రైలర్ లో చూస్తే చాలా ఇంప్రెసివ్ గా ఉంది. మా మూవీని థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.


డైలాగ్ రైటర్ లక్ష్మీ లోహిత్ పూజారి మాట్లాడుతూ - “ఆపరేషన్ రావణ్” సినిమాకు పనిచేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ వెంకట సత్య గారికి థ్యాంక్స్. మా రక్షిత్ గారు నిజంగా శ్రీరాముడు. తండ్రి మాట జవదాటరు. ఈ సినిమాలో ఆయన ఆనంద్ శ్రీరామ్ అనే క్యారెక్టర్ చేశారు. మన ఆలోచనలే మన శత్రువులు అనే కాన్సెప్ట్ తో వస్తున్న మా మూవీని చూడండి మీరంతా ఎంజాయ్ చేస్తారు. అన్నారు.


నటీనటులు: రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్, రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె, కెఎ పాల్ రాము, విద్యా సాగర్, టీవీ5 మూర్తి, కార్తీక్ తదితరులు


సాంకేతిక బృందం

సంగీతం: శరవణ వాసుదేవన్

డైలాగ్స్: లక్ష్మీ లోహిత్ పూజారి

ఎడిటర్: సత్య గిద్దుటూరి

ఆర్ట్: నాని.టి

ఫైట్స్: స్టంట్ జాషువా

కోరియోగ్రఫీ: జేడీ

ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీపాల్ చొళ్లేటి

పిఆర్ఓ: జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

నిర్మాత: ధ్యాన్ అట్లూరి

రచన-దర్శకత్వం: వెంకట సత్య


Heroine Hasini sudhir Interview About Purushothamudu

 "పురుషోత్తముడు"లో అమ్ములుగా ఆకట్టుకుంటా - హీరోయిన్ హాసినీ సుధీర్




రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "పురుషోత్తముడు". ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో హాసిని సుధీర్ హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. "ఆకతాయి", "హమ్ తుమ్" చిత్రాలతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ భీమన "పురుషోత్తముడు" సినిమాను రూపొందిస్తున్నారు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా వంటి స్టార్ కాస్టింగ్ తో రూపొందిన ఈ సినిమా ఈ నెల 26వ తేదీన ప్రపంచవ్యాప్తం గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో "పురుషోత్తముడు" చిత్ర  విశేషాలు తెలిపారు హీరోయిన్ హాసినీ సుధీర్.


- నేను మహారాష్ట్ర అమ్మాయిని. హీరోయిన్ కావాలనేది నా చిన్నప్పటి కల. ముంబైలో మోడలింగ్ చేశాను. తెలుగు సినిమాలు బాగా చూస్తూ పెరిగాను. అలా తెెలుగు నేర్చుకున్నాను. నాని నా ఫేవరేట్ యాక్టర్. డైరెక్టర్ రామ్ భీమన గారు పురుషోత్తముడు సినిమా ఆడిషన్ కు పిలిచారు. ఆడిషన్ తర్వాత నన్ను సెలెక్ట్ చేశారు. ఈ సినిమాలో సెలెక్ట్ అయ్యాక ఏడాది పాటు వర్క్ షాప్ లో పాల్గొన్నాను.


- పురుషోత్తముడు చిత్రంలో నేను అమ్ములు అనే క్యారెక్టర్ చేశాను. అంతా అమ్ము అని పిలుస్తారు. తనొక బబ్లీ గర్ల్. అందరితో పని చేయిస్తుంటుంది. హీరోతో కూడా పని చేయిస్తుంది. ఈ క్యారెక్టర్ లో నటించడాన్ని ఎంజాయ్ చేశాను. నాకు తెలుగు మాట్లాడటం వచ్చినా చదవడం రాదు. రాజమండ్రి షెడ్యూల్ కోసం వెళ్లి ఫస్ట్ డే షూట్ లో పాల్గొన్పప్పుడు ఇబ్బంది పడ్డాను. సినిమాలో అంతా సీనియర్స్ కాబట్టి సపోర్ట్ చేశారు.


- రాజ్ తరుణ్ తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. సెట్స్ లో తన సపోర్ట్ అందించేవారు. మా డైరెక్టర్ రామ్ భీమన గారికి థ్యాంక్స్ చెబుతున్నా. మా ప్రొడ్యూసర్స్ మమ్మల్ని అందరినీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లా చూసుకున్నారు.


- నా మొదటి చిత్రంలోనే చాలా మంది పెద్ద ఆర్టిస్టులతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ లాంటి స్టార్స్ కళ్లతోనే నటిస్తారు. నేనూ అలా నటించాలని అనుకునేదాన్ని.


- పురుషోత్తముడు సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. మీరంతా కుటుంబతో వెళ్లి చూడండి. ఈ సినిమాను ఒక ఆడియెన్ గా చూసినప్పుడు హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనే ఫీల్ కలిగింది.


- తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్స్ తక్కువ మంది ఉన్నారు. తెలుగమ్మాయిని కాకున్నా తెలుగు మాట్లాడుతున్నందువల్ల నన్ను ఇక్కడి అమ్మాయిలాగే చూస్తున్నారు. తెలుగు సినిమాల్లో హీరోయిన్స్ ను అందంగా చూపిస్తారు. అందుకే నాకు తెలుగు సినిమాలంటే ఇష్టం.


- లవ్ స్టోరీస్ తో పాటు యాక్షన్ మూవీస్ కూడా చేయాలని ఉంది. ప్రస్తుతం కొన్ని సినిమాల ఆఫర్స్ వస్తున్నాయి. మీ అందరి సపోర్ట్ నాకూ, మా పురుషోత్తముడు సినిమాకు అందిస్తారని కోరుకుంటున్నా

Vamsi Nandipati acquired the AP&TG theatrical rights of Kiran Abbavaram's KA

 హీరో కిరణ్ అబ్బవరం "క" సినిమా తెలుగు రైట్స్ ఫ్యాన్సీ రేట్ కు సొంతం చేసుకున్న సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి



యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా "క" తెలుగు స్టేట్స్ రైట్స్ సొంతం చేసుకున్నారు సక్సెస్ పుల్ ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి. ఆయన ఈ సినిమాను 12 కోట్ల రూపాయలకు ఎన్ఆర్ఐ బేసిస్ లో హక్కులు తీసుకున్నారు. ఈ సినిమా ఇతర భాషల థియేట్రికల్ నాన్ థియేట్రికల్ రైట్స్ డీల్ దాదాపు 18 కోట్ల రూపాయల దగ్గర క్లోజ్ అయ్యేలా ఉంది. దీంతో 30 కోట్ల రూపాయలపైనే "క" సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం విశేషం.


"క" సినిమా పట్ల ట్రేడ్ సర్కిల్స్ లో ఏర్పడిన క్రేజ్ కు ఈ డీల్ నెంబర్స్ నిదర్శనంగా నిలుస్తున్నాయి. కంటెంట్ ఈజ్ కింగ్ అనే విషయాన్ని ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేస్తోంది. "క" సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌"క" సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.



నటీనటులు - కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, తదితరులు


టెక్నికల్ టీమ్

ఎడిటర్ - శ్రీ వరప్రసాద్

డీవోపీస్ - విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి మాసం

మ్యూజిక్ - సామ్ సీఎస్

ప్రొడక్షన్ డిజైనర్ - సుధీర్ మాచర్ల

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - చవాన్

క్రియేటివ్ ప్రొడ్యూసర్ - రితికేష్ గోరక్

లైన్ ప్రొడ్యూసర్ - కేఎల్ మదన్

సీయీవో - రహస్య గోరక్ (కేఏ ప్రొడక్షన్స్)

కాస్ట్యూమ్స్ - అనూష పుంజ్ల

మేకప్ - కొవ్వాడ రామకృష్ణ

ఫైట్స్ - రియల్ సతీష్, రామ్ కృష్ణన్, ఉయ్యాల శంకర్

కొరియోగ్రఫీ - పొలాకి విజయ్

వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్ -ఎంఎస్ కుమార్

వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ - ఫణిరాజా కస్తూరి

కో ప్రొడ్యూసర్స్ - చింతా వినీషా రెడ్డి, చింతా రాజశేఖర్ రెడ్డి

ప్రొడ్యూసర్ - చింతా గోపాలకృష్ణ రెడ్డి

పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

రచన దర్శకత్వం - సుజీత్, సందీప్


Akash Puri Changed his Name to Akash Jagannadh

 ఆకాష్ జగన్నాథ్ గా పేరు మార్చుకున్న యంగ్ హీరో ఆకాష్ పూరి



డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడిగా పలు సూపర్ హిట్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు ఆకాష్ పూరి. హీరోగా మారి ఆంధ్రా పోరి, మెహబూబా, రొమాంటిక్, చోర్ బజార్ వంటి విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ యంగ్ హీరో తన పేరు మార్చుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.


ఇకపై తన పేరును ఆకాష్ జగన్నాథ్ గా పెట్టుకుంటున్నట్లు ఆయన పోస్ట్ చేశారు. కంటెంట్ ఉన్న మంచి కథలతో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్ చేసుకుంటున్నారు ఆకాష్ జగన్నాథ్. త్వరలోనే ఆ సినిమాల వివరాలను ఆయన వెల్లడించనున్నారు. ఈ మధ్య ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ అనే క్లోత్ బ్రాండింగ్ కు అంబాసిడర్ గా వ్యవహరించారు ఆకాష్ జగన్నాథ్.



Jewel Theif Audio Launched Grandly

 హీరో కృష్ణసాయి మూవీ ''జ్యువెల్ థీఫ్'' టీజర్, ఆడియో లాంచ్




తెలుగు తెర‌పైకి మ‌రో సస్పెన్స్ థ్రిల్ల‌ర్ రాబోతోంది. కృష్ణసాయి - మీనాక్షి జైస్వాల్ జంటగా నటిస్తున్న 'జ్యువెల్ థీఫ్' సినిమా టీజర్, ఆడియో లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై, పీఎస్ నారాయణ దర్శకత్వంలో, ప్రొడ్యూసర్ మల్లెల ప్రభాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృష్ణ సాయితో పాటు సీనియ‌ర్ న‌టీన‌టులు.. ప్రేమ, అజయ్, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతరెడ్డి తదితరులు న‌టించారు.


హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జ‌రిగిన 'జ్యువెల్ థీఫ్' సినిమా టీజర్, ఆడియో లాంచ్ వేడుక‌లో చీఫ్ గెస్టుగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డీఐజీ అనిల్ మింజ్, మరో చీఫ్ గెస్టు ఏపీ, తెలంగాణ ఇన్కమ్  టాక్స్ కమీషనర్ IRS ఆఫీసర్ జీవన్ లాల్ లవిదియ, మరో గెస్టు న‌టీ ఎస్త‌ర్ పాల్గొని చిత్ర టీజ‌ర్‌తో పాటు పాట‌ల‌ను విడుద‌ల చేశారు.


ఈ సంద‌ర్భంగా న‌టి ఎస్తార్ మాట్లాడుతూ... హీరో కృష్ణసాయి నిజ జీవితంలోనూ రియల్ హీరో. ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి వారు అరుదుగా ఉంటారు. నిజంగా గ్రేట్. టీజ‌ర్ చూస్తే.. 'జ్యువెల్ థీఫ్' మంచి కాన్సెప్టుతో తెర‌కెక్కిన‌ట్టు అర్థ‌మ‌వుతున్న‌ది. సినిమా పెద్ద‌ హిట్ అవుతుందని నమ్మకం క‌లుగుతుంది.


హీరో కృష్ణ సాయి మాట్లాడుతూ... నేను సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానిని. ఆయన స్ఫూర్తితో సినిమాల్లోకి వ‌చ్చాను. 'జ్యువెల్ థీఫ్'  ఓ సస్పెన్స్ థ్రిల్ల‌ర్. ఈ త‌రం ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చుతుంది. ఇక ఎంఎం శ్రీలేఖ అందించిన మ్యూజిక్ బాగుంది. ఒక‌ప్పుడు హీరోయిన్ ప్రేమ గారి సినిమాలు చూశాను. ఆమెతో క‌లిసి న‌టించాల‌న్న నా కల ఈ సినిమాతో నెరవేరింది.


30 ఇయర్స్ పృథ్వి మాట్లాడుతూ... నేను, అలాగే కృష్ణ సాయి సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులం. స‌మాజం కోసం కృష్ణ సాయి ఇంటర్నేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా కృష్ణ సాయి ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. మంచితనం, మానవత్వం కలబోసిన వ్యక్తి. గ‌తంలోనే కృష్ణ‌సాయి డ్రగ్స్ మీద అవగాహన వీడియోలు చేశారు. హీరోగా 'జ్యువెల్ థీఫ్' సినిమాలో యాక్షన్ పార్టులతో పాటు అద్భుతంగా నటించాడు.  నా రోల్ కూడా బాగుంది. సినిమా సూప‌ర్ హిట్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది.


డైరెక్టర్ పీఎస్ నారాయణ మాట్లాడుతూ... నా మీద నమ్మకంతో త‌న‌తో సినిమా చేయ‌మ‌ని కృష్ణసాయి వచ్చారు. ఆయనకు తగ్గ కథను పది రోజుల్లోనే పూర్తి చేశాను. సినిమా నటీనటులు, చిత్ర యూనిట్ అందరు బాగా చేశారు. ఇది చిన్న సినిమా కాదు, పేరున్న సీనియర్ నటీనటులు ఇందులో ఉన్నారు. అంద‌రిని ఆక‌ట్టుకునే సినిమా ఇది.


న‌టుడు మిమిక్రి శివారెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాకు పూర్తి స్థాయి క్యారెక్టర్ ఇచ్చారు. దర్శకుడు మా అందరితో ఎంతో ఫ్రెండ్లీగా ఉండి సినిమా అద్భుతంగా పూర్తి చేశారు. శ్రీలేఖ అందించిన పాటలు బాగున్నాయి. కృష్ణసాయి గారికి అద్భుతమైన టాలెంట్ ఉంది.


ఈ హీరోయిన్ మీనాక్షి జైస్వాల్ మాట్లాడుతూ... ఈ సినిమాలో నాది ఛాలెంజింగ్‌ రోల్. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు కృత‌జ్ఞ‌త‌లు.


న‌టి ప్రేమ మాట్లాడుతూ... నాకు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ అంద‌రిని ఆకట్టుకుంటుంద‌న్న న‌మ్మ‌కం ఉంది.


నటుడు ఆనంద చక్రపాణి మాట్లాడుతూ... నాకు ఇప్పటివరకు చేయని అద్భుతమైన క్యారెక్ట‌ర్‌ను దర్శకుడు ఇచ్చారు.  సినిమాపై అంచ‌నాలు పెరిగిపోవ‌డం ఖాయం. అలాంటి స‌బ్జెక్టు ఇది.


జీవన్ లాల్ మాట్లాడుతూ... చక్కని సబ్జెక్టు. కంప్రమైస్ కాకుండా క్వాలిటీతో సినిమాను పూర్తి చేయడం అభినందనీయం. సినిమా కళను బతికిస్తున్న నిర్మాతలకు చేతులెత్తి మొక్కాలి. ఎంతో ఫ్యాషన్‌తో తీసిన ఈ చిత్ర యూనిట్‌కు విషెస్ తెలియజేస్తున్నాను.


టీజ‌ర్, ఆడియో వేడుక‌లో న‌టీన‌టుల‌తో పాటు, సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, సినిమా హైలైట్స్, చిత్రీకరణ అనుభవాలు తెలిపారు. త్వ‌ర‌లోనే సినిమాను థియేట‌ర్‌ల‌లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు తెలిపారు.  


నటీనటులు:

హీరో కృష్ణసాయి, హీరోయిన్ మీనాక్షి జైస్వాల్, ప్రేమ, అజయ్, సీనియర్ కన్నడ హీరోలు శ్రీధర్, వినోద్ కుమార్, నటీమణులు రాగిణి, హీరోయిన్ నేహా దేశపాండే , ఆనంద చక్రపాణి, జెన్నీ, మేక రామ కృష్ణ, వైజాగ్ జగదీశ్వరి, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, అప్పాజి, కాట్రగడ్డ సుధాకర్, జంగారెడ్డి, వెంకట రమణారెడ్డి, శ్రావణి, శ్వేత రెడ్డి తదితరులు.


కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం:

పీఎస్ నారాయణ


డీవోపీ: అడుసుమిల్లి విజయ్ కుమార్

ఎడిటర్ : జేపీ

ఫైట్ మాస్టర్: రమణ

డాన్స్: స్వర్ణ, యాని

లిరిక్ : కామేశ్వర్, పీఎస్ నారాయణ

మ్యూజిక్: ఎంఎం శ్రీలేఖ,  

ఆడియో: ఆదిత్య మ్యూజిక్

ఆర్ట్ డైరెక్టర్ కె.మురళీధర్,

పీఆర్వో: కడలి రాంబాబు, దయ్యాల అశోక్

Yevam Streaming on OTT platform Aha Video

 ఆహాలో చాందిని చౌదరి 'యేవమ్‌' రిలీజ్‌.. నేటి నుంచి స్ట్రీమింగ్



చాందిని చౌద‌రి, వ‌శిష్ట సింహా, భరత్‌రాజ్‌,ఆషు రెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం యేవ‌మ్‌. ప్రకాష్‌ దంతులూరి . దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు. జూన్‌ 14న థియేటర్లలో విడుదలై ఉత్కంఠభరితమైన కథాంశంతో రూపొందిన నవ్యమైన చిత్రంగా అభినందనలు అందుకున్న ఈ చిత్రం ఈ నెల 25 నుంచి అనగా నేటి నుంచిఆహా ఓటీటీలో   స్ట్రీమింగ్‌కు సిద్దమైంది. ఈ చిత్రంలో చాందిని చౌదరి పవర్‌ఫుల్‌ పోలీస్‌ఆఫీసర్‌గా కనిపిస్తారు. కొత్తదనంతో కూడిన ఈ చిత్రంలో మహిళల గొప్పదనం, మహిళా సాధికారిత అంశాన్ని ఈ చిత్రంలో దర్శకుడు డీల్‌ చేశాడు. మహిళలు కేవలం ఇంటికే పరిమితం కారు. వారు ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలరు అనేది ఈ చిత్రంలో చూపించారు. మిస్టరీగా వున్న ఓ కేసును ఓ మహిళా పోలీసు అధికారి ఎలా  పరిష్కరించారు అనేది ఈ చిత్ర కథాంశం. ప్రతి సన్నివేశం ఆడియన్స్‌ను అలరిస్తుంది. తప్పకుండా ఈ చిత్రాన్ని అందరూ ఆహా ఓటీటీలో వీక్షించాల్సిందిగా కోరుతున్నారు మేకర్స్‌.