Home » » Kantara Success Tour in Telugu States

Kantara Success Tour in Telugu States

 అక్టోబర్ 29న కాంతార (తెలుగు) సక్సెస్ టూర్, స్వయంగా పాల్గోననున్న చిత్ర హీరో రిషబ్ శెట్టి



సెప్టెంబర్ 30 న కన్నడలో రిలీజైన కాంతార చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రం తెలుగులో అక్టోబర్ 15 న రిలీజై ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని తెలుగులో మెగా నిర్మాత అల్లు అరవింద్ "గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్" ద్వారా రిలీజ్ చేసారు. ఈ చిత్రం విజయవంతగా ఆడుతున్న తరుణంలో ప్రేక్షకులను నేరుగా కలిసేందుకు ఈ చిత్ర యూనిట్ సక్సెస్ టూర్ ను నిర్వహించనుంది. అక్టోబర్ 29న (శనివారం) తిరుపతి,వైజాగ్ లోని "కంతార" చిత్రం ప్రదర్శించబడుతున్న థియేటర్స్ ను సందర్శంచి,ప్రేక్షకులను కలవనున్నారు.ఈ సక్సెస్ టూర్ లో చిత్ర దర్శకుడు,హీరో అయినటువంటి రిషబ్ శెట్టి పాల్గొనున్నారు.



ఇదివరకే మెగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ...

సినిమాకి లాంగ్వేజ్ బారియర్ లేదు సినిమాకి ఎమోషన్ బారియర్ ఒకటే ఉంటుంది అని కాంతార చిత్రం ప్రూవ్ చేసింది. ఇది మట్టిలోంచి పుట్టిన కథ ఇది ఎక్కడో కొరియన్, హాలీవుడ్ సినిమాలను నుంచి కాపీ కొట్టింది కాదు. ఈ సినిమాలో  విష్ణు తత్త్వం, రౌద్ర రూపం చూసాక ఇది సింహాచలం కి దగ్గరగా ఉన్న కథ అనిపించింది.  


ఈ సినిమాను కన్నడలో చూసి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి  అర్జెంటుగా మీరొక సినిమా చూడండి అంటూ బన్ని వాసు నాతో చెప్పాడు. ఏంటి బన్ని వాసు ఇంత ఎగ్జైట్మెంట్ చెబుతున్నాడు అనుకున్నాను.  సినిమా చూసినప్పుడు నాకు ఎమోషన్ అర్ధమైంది.ఈ ఎమోషన్ కి కనెక్ట్ అయ్యి దీనిని తెలుగులో డిస్ట్రిబ్యూషన్ చేస్తే బాగుంటుంది అనిపించి ఒక అవకాశంగా తీసుకుని దీనిని తెలుగులో రిలీజ్ చేసాం. అని చెప్పారు.


Share this article :