Latest Post

Acclaimed Director Trivikram Srinivas Visits Usha Parinayam Sets, Wishes Team Well

 ఉషాప‌రిణ‌యం సెట్‌ను సంద‌ర్శించి టీమ్‌కు ఆల్‌ద‌బెస్ట్ చెప్పిన స్టార్ రైట‌ర్ అండ్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్

ఉషా ప‌రిణ‌యం షూటింగ్ పూర్తి



తెలుగు సినీ రంగంలో ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన కె.విజ‌య్‌భాస్క‌ర్ మ‌ళ్లీ ఓ స‌రికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రానికి శ్రీ‌కారం చుట్టాడు. నువ్వేకావాలి, మ‌న్మ‌థుడు, మ‌ల్లీశ్వ‌రి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ఆయ‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఉషా ప‌రిణ‌యం  బ్యూటిఫుల్ టైటిల్‌తో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

ఈ చిత్రానికి ల‌వ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉప‌శీర్షిక‌. విజ‌య్‌భాస్క‌ర్ క్రాఫ్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపైకె.విజ‌య్‌భాస్క‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ చిత్రంలో విజ‌య్‌భాస్క‌ర్ త‌న‌యుడు  శ్రీ‌క‌మ‌ల్ హీరోగా న‌టిస్తుండ‌గా,   తాన్వీ ఆకాంక్ష అనే అచ్చ‌తెలుగ‌మ్మాయి ఈ చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం కాబోతుంది. గ‌త కొన్ని రోజులుగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఐటెమ్‌సాంగ్‌ను హీరో శ్రీ‌క‌మ‌ల్‌, ప్ర‌ముఖ క‌థానాయిక సీర‌త్‌క‌పూర్‌పై చిత్రీక‌రిస్తున్నారు. ఘ‌ల్లు.. ఘ‌ల్లు అనే ఈ సాంగ్‌కు విజ‌య్ పొల్లంకి కొరియోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఆర్‌.ఆర్‌. ధ్రువ‌న్ సంగీతం అందించారు. అయితే ఈ సాంగ్ చివ‌రి రోజు, చిత్రీక‌ర‌ణ‌కు చివ‌రి రోజు  శుక్ర‌వారం ఈ చిత్రం షూటింగ్ జ‌రుగుతున్న సెట్‌కు స్టార్ రైట‌ర్ అండ్ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ విచ్చేసి టీమ్‌కు ఆల్ ద‌బెస్ట్ చెప్పారు.  త్రివిక్ర‌మ్‌, విజ‌య్‌భాస్క‌ర్ క‌ల‌యిక‌లో ఎన్ని సూప‌ర్‌హిట్ సినిమాలు వ‌చ్చాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సూప‌ర్‌హిట్ కాంబినేష‌న్ చాలా రోజుల త‌రువాత క‌ల‌వ‌డం కూడా ఒక శుభ‌సూచ‌కం అని చెప్పాలి. ఈ ఐట‌మ్ సాంగ్ చిత్రీక‌ర‌ణ‌తో షూటింగ్ పూర్త‌యిన‌ట్లుగా మేక‌ర్స్ ఈ సంద‌ర్భంగా తెలియ‌జేశారు. యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం త‌ప్ప‌కుండా అన్ని వ‌ర్గాల వారిని అల‌రిస్తుంద‌నే న‌మ్మ‌కం వుంది* అనే నమ్మ‌కం వుంద‌ని చిత్ర‌మేకర్స్ తెలియ‌జేశారు.

 శ్రీ‌క‌మ‌ల్, తాన్వి ఆకాంక్ష‌, సూర్య‌, ర‌వి, శివ‌తేజ‌, అలీ,  వెన్నెల‌కిషోర్‌, శివాజీ రాజా, ఆమ‌ని, సుధ‌, ఆనంద్ చ‌క్ర‌పాణి, ర‌జిత‌, బాల‌క్రిష్ణ‌, సూర్య, మ‌ధుమ‌ణి ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకి సంగీతం : ఆర్ ఆర్ ధ్రువ‌న్‌, డీఓపీ: స‌తీష్ ముత్యాల‌, ఎడిటింగ్‌: ఎమ్ ఆర్ వ‌ర్మ‌, ద‌ర్శ‌క‌త్వం-నిర్మాత :కె.విజ‌య్‌భాస్క‌ర్

Jhanvi Narang Receives The Prestigious Times Power 2024 Award

Jhanvi Narang Receives The Prestigious Times Power 2024 Award



Jhanvi Narang plays a pivotal role in all business activities of her family. Following the footsteps of her grandfather Narayan Das Narang and father Suniel Narang, Jhanvi Narang entered the entertainment industry at a very young age, driving the creation and execution of films.


Jhanvi Narang is the mastermind behind many innovations in Asian Cinemas. Besides expanding their multiplex chain business, they have also become very active in the production and exhibition business. The budding entrepreneur has won many laurels for her achievements.


Freshly, Jhanvi Narang added another feather to her cap. She has been awarded the Prestigious TIMES POWER WOMEN 2024 Award. Her achievements at this very young age are a testament to the determination she put in to take forward the Family Legacy.


Jhanvi’s responsibilities encompass various tasks, from assembling creative teams to overseeing the production process and ensuring the final product aligns with the intended vision.


Currently, Sekhar Kammula’s Kubera starring Dhanush and Nagarjuna made under Sree Venkateswara Cinemas LLP is in the production phase. 

‘Anaganaga Oka Kathala’ from ‘Sabari’ launched by Oscar winner Chandrabose

 వరలక్ష్మీ శరత్ కుమార్‌ 'శబరి'లో 'అనగనగా ఒక కథలా...' పాట విడుదల చేసిన ఆస్కార్ విన్నర్ చంద్రబోస్



విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా 'శబరి'. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. మహర్షి కూండ్ల చిత్ర సమర్పకులు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల అవుతోంది. ఆల్రెడీ విడుదల చేసిన 'నా చెయ్యి పట్టుకోవే...' పాటకు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. ఇప్పుడు 'అనగనగా ఒక కథలా...' పాటను ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ విడుదల చేశారు.


'అనగనగా ఒక కథలా...' పాటకు సుచిత్రా చంద్రబోస్ నృత్య రీతులు సమకూర్చారు. తన సతీమణి కొరియోగ్రఫీ చేసిన పాటను చంద్రబోస్ తన చేతుల మీదుగా విడుదల చేయడం ఇదే తొలిసారి.


పాటను విడుదల చేసిన తర్వాత చంద్రబోస్ మాట్లాడుతూ... ''ఇప్పుడే నేను 'శబరి' సినిమాలోని 'అనగనగా ఒక కథలా...' పాటను విడుదల చేశా. గోపీసుందర్ గారి సంగీతంలో రెహమాన్ గారు రాశారు. ఈ పాట చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఈ సాంగ్ విడుదల కంటే ముందు నేను విన్నాను. నా భార్య సుచిత్ర కొరియోగ్రఫీ చేయడం కోసం ఇంటికి సాంగ్ తీసుకు వచ్చింది. సాంగ్ విని సాహిత్యం చదువుతానని తీసుకున్నా. చదువుతుంటే నాకు చాలా చాలా సంతోషం కలిగింది. ఈ పాట ఎవరు రాశారు? కథ ఏమిటి? అని ఫోన్ చేసి మాట్లాడాను. చాలా మంచి బాణీకి అంతే అందమైన భావాలతో కూడిన సాహిత్యం రాశారు. నా చేతుల మీదుగా విడుదల చేయించారని మంచిగా చెప్పడం కాదు... పాట విడుదలకు ముందే విని ఎంతో నచ్చే నిర్మాతను, గేయ రచయితను అభినందించా. ఈ పాట తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది. చిత్ర గారు ఈ పాటకు తన గాత్రంతో జీవం పోశారు. తల్లి ప్రేమలోని మాధుర్యాన్ని ప్రతి పదంలో చూపించారు. తల్లి కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించాలి. నిర్మాత మహేంద్రనాథ్ గారితో పాటు చిత్ర బృందం అందరికీ పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా'' అని చెప్పారు.


సుచిత్రా చంద్రబోస్ మాట్లాడుతూ... ''నేను కొరియోగ్రఫీ అందించిన పాటను మా ఆయన ఇదే తొలిసారి. చాలా సంతోషంగా ఉంది. 'శబరి' సినిమాలో చక్కటి సందర్భంలో వచ్చే గీతమిది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మహేంద్రనాథ్ గారికి థాంక్స్'' అని‌ చెప్పారు.


'అనగనగా ఒక కథలా...' పాట విడుదలైన సందర్భంగా నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ ''తల్లి ప్రేమ నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో మా 'శబరి' ప్రత్యేకంగా నిలుస్తుంది. కన్న బిడ్డను కాపాడుకోవడం కోసం ఓ తల్లి ఎంత దూరం వెళుతుందనేది చెప్పే చిత్రమిది. బరువైన భావోద్వేగాలతో కూడిన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుంది. వరలక్ష్మి గారి నటన ఈ సినిమాకు హైలైట్ అవుతుంది. తల్లీ కూతుళ్లు సరదాగా విహారయాత్రకు వెళ్లే పాట 'నా చెయ్యి పట్టుకోవే'కు అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడీ 'అనగనగా ఓ కథలా...' విడుదల చేశాం. రెండు పాటలకు రెహమాన్ గారు అద్భుతమైన సాహిత్యం అందించారు. చిత్ర గారు మా సినిమాలో ఈ 'అనగనగా ఒక కథలా...' పాట పాడటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. సుచిత్రా చంద్రబోస్ గారు ఎంతో సీనియర్. నంది అవార్డ్స్ విన్నర్. నేను కొత్త నిర్మాత అయినా సరే... ఎంతో అంకిత భావంతో సాంగ్ కొరియోగ్రఫీ చేశారు. ఆవిడ డెడికేషన్ చూసి ఆశ్చర్యపోయా. గోపీసుందర్ గారు పాటలే కాదు, నేపథ్య సంగీతం కూడా సూపర్బ్ చేశారు. మే 3న ప్రేక్షకులకు థియేటర్లలో 'శబరి' థ్రిల్లింగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది'' అని చెప్పారు.


'శబరి' చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. ఆయన స్వరపరిచిన బాణీకి 'అనగనగా ఒక కథలా...' అంటూ రెహమాన్ సాహిత్యం అందించగా... లెజెండరీ సింగర్ కెఎస్ చిత్ర ఆలపించారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాటను విడుదల చేశారు. 


బిడ్డ మీద తల్లి ప్రేమ ఎప్పటికీ కరగదని చెప్పే గీతం 'అనగనగా ఒక కథలా'. తల్లికి బిడ్డే ప్రపంచం అని చెప్పే గీతమిది. చిన్నారి పిలుపునకు బదులు తల్లి, చిన్నారి అడుగులకు గొడుగు తల్లి, చిన్నారి కలలకు రంగులు తల్లి అంటూ కన్నపేగుతో అమ్మకు ఉండే బంధాన్ని రెహమాన్ అద్భుతంగా రాయగా... చిత్ర గాత్రం ఆ పాటలో భావం ప్రేక్షకులకు చేరువ అయ్యేలా అంతే గొప్పగా పాడారు.


''అనగనగా ఒక కథలా

ఓ చందమామా

కడవరకు కరగదులే

ఈ అమ్మ ప్రేమ


పిలుపులు నీవైతే

బదులును నేనౌతూ

ఎదురుగ ఉంటాలే కదలక


అడుగులు నీవైతే

గొడుగును నేనౌతూ

చకచక వస్తాలే వదలక..అనగనగా


తడబడుతూనే నిలబడుతుంటే

కళ్లకు ఆనందమే

గడపను దాటి కదిలితే నువ్వు

గుండెకు ఆరాటమే


నువ్వేకదా ప్రపంచం

నువ్వంటే నా సంతోషం''అంటూ సాగిందీ గీతం. శబరి మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో విడుదలైంది.


నటీనటులు:

వరలక్ష్మీ శరత్ కుమార్, గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, రషిక బాలి (Bombay), వైవా రాఘవ, ప్రభు, భద్రం, కృష్ణతేజ, బిందు పగిడిమర్రి, ఆశ్రిత వేముగంటి, హర్షిని కోడూరు, అర్చన అనంత్, ప్రమోదిని బేబీ నివేక్ష, బేబీ కృతిక తదితరులు ఈ చిత్రంలో తారాగణం.


సాంకేతిక బృందం:

ఈ చిత్రానికి రచనా సహకారం: సన్నీ నాగబాబు, పాటలు: రెహమాన్, మిట్టపల్లి సురేందర్, మేకప్: చిత్తూరు శ్రీను, కాస్ట్యూమ్స్: అయ్యప్ప, కాస్ట్యూమ్ డిజైనర్: మానస, స్టిల్స్: ఈశ్వర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: లక్ష్మీపతి కంటిపూడి, కో- డైరెక్టర్: వంశీ, ఫైట్స్: నందు - నూర్, కొరియోగ్రాఫర్స్: సుచిత్ర చంద్రబోస్ - రాజ్ కృష్ణ, ఆర్ట్ డైరెక్టర్: ఆశిష్ తేజ పూలాల, ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ, నాని చమిడి శెట్టి , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల, సంగీతం: గోపి సుందర్, సమర్పణ: మహర్షి కూండ్ల, ప్రొడ్యూసర్: మహేంద్ర నాథ్ కూండ్ల, కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: అనిల్ కాట్జ్.

Adah Sharma Terrifies In The Trailer Of C.D (Criminal Or Devil)

 ‘C.D’ ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ



అదా శర్మ ప్రస్తుతం పాన్ ఇండియన్ నటిగా ఫుల్ ఫేమస్ అయ్యారు. వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో అదా శర్మ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ఆడియెన్స్‌ ముందుకు వచ్చి అందరినీ మెప్పిస్తున్నారు. హారర్, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని రకాల కాన్సెప్ట్‌లతో అదా శర్మ ప్రయోగాలు చేస్తున్నారు. ఇక చాలా గ్యాప్ తరువాత అదా శర్మ తెలుగులో ఓ స్ట్రెయిట్ సినిమాను చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు  ప్రేక్షకుల ముందుకు అదా శర్మ ‘C.D క్రిమినల్ ఆర్ డెవిల్’ అనే సినిమాతో రాబోతున్నారు. ది కేర‌ళ స్టోరీ మూవీతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న అదా శర్మ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తుండటం విశేషం. 


C.D (క్రిమినల్ ఆర్ డెవిల్) అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు కృష్ణ అన్నం దర్శకత్వం వహిస్తున్నారు. SSCM ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ మూవీకి గిరిధర్ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. RR ధృవన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. మే 10న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.


‘చీకటి, వెలుతురు మధ్య కనిపించని శత్రువు ఎవరో ఉన్నారు..  ఎవరు చేస్తున్నారు ఇదంతా?.. నా చుట్టూ ఏదో జరుగుతోంది.. నాతో పాటు ఇంట్లో ఉంటోంది దెయ్యమా?.. మరణంతో పాటు యుద్దం తప్పదా?.. నన్ను చంపడానికి వచ్చింది ఎవరు క్రిమినల్? ఆర్ డెవిల్?’ అంటూ హీరో విశ్వంత్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ సాగుతుంది. ఇక ఈ ట్రైలర్‌లో అదా శర్మ యాక్షన్ సీక్వెన్స్, భయపెట్టేలా చూసే చూపులతో ప్రేక్షకులు కచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారు. ఇక ఈ ట్రైలర్‌ను చూస్తుంటే విజువల్స్, ఆర్ఆర్ అన్నీ కూడా టాప్ నాచ్‌లో ఉన్నాయనిపిస్తోంది.


ఈ మూవీలో రీసెంట్ సెన్సేషన్ అదా శర్మ కీలక పాత్ర పోషిస్తుండగా.. విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఏ.ముద్దు కృష్ణ డైలాగ్స్ అందించగా.. సతీష్ ముత్యాల సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. సత్య గిడుతూరి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవలే చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాను మే 10న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.


నటీనటులు

అదా శర్మ, విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా 


టెక్నీషియన్స్

బ్యానర్ : SSCM ప్రొడక్షన్స్

డైరెక్టర్ : కృష్ణ అన్నం

స్టోరీ డైలాగ్స్ :  ఏ ముద్దు కృష్ణ

DOP : సతీష్ ముత్యాల

మ్యూజిక్ : RR ధృవన్

ఎడిటర్ : సత్య గిడుతూర్ 

యాక్షన్స్ : రామ కృష్ణ

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : గిరిధర్

PRO : సాయి సతీష్



Ramam Raghavam Teaser Launched

  "రామం రాఘవం" టీజర్ విడుదల  !!!



స్కేట్ పెన్సిల్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పోలవరపు నిర్మాణంలో ధనరాజ్ కొరణాని దర్శకత్వం వహించిన ద్విభాషా చిత్రం "రామం రాఘవం". సముద్రఖని ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకుడు బాలా, పాండిరాజ్, సముద్రఖని, నటులు బాబీ సింహా, తంబి రామయ్య, హాస్య నటుడు సూరి, నటుడు దీపక్, నటుడు హరీష్. తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా .. 


దర్శకుడు బాలా మాట్లాడుతూ.. రామం రాఘవం టీజర్ బాగుంది. ధనరాజ్ దర్శకుడిగా ప్రేక్షకులను మెప్పిస్తాడు. ముఖ్యంగా సముద్రఖనిని మెచ్చుకోవాలి,  ఇలాగే అతను చాలా మందికి సహాయం చేసి.. ప్రోత్సహించాలి, రామం రాఘవం పెద్ద విజయం సాధించి అందరికి మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.


నిర్మాత, పృథ్వి పోలవరపు మాట్లాడుతూ... సముద్రకని అన్న సహాయం లేకుండా నేను ఈ సినిమా చేయలేను. ఈ సినిమా తీయడంలో ఖని  అన్న చాలా ముఖ్యమైన వ్యక్తి. తండ్రీ కొడుకుల అనుబందాల గురించి చెప్పే ఈ సినిమా బాగా వచ్చింది, జనాలకు నచ్చుతుందని పేర్కొన్నారు. 


నటి మోక్ష మాట్లాడుతూ.. తమిళంలో ఇది నా మొదటి సినిమా. తమిళ సినిమాలను ఇష్టపడే తమిళ అభిమానులు తప్పకుండా నన్ను ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను. తమిళ గడ్దలో తొలి అడుగు వేయడం ఆనందంగా ఉందని చెప్పారు.  



నటుడు బాబీ సింహా మాట్లాడుతూ..  "రామం రాఘవం" దర్శకుడు ధనరాజ్ నా స్నేహితుడు. కష్టపడి పనిచేయడం అతని గొప్పతనం. తండ్రీ కొడుకుల అనుబంధం గురించి ఓ కథ చెప్పాడు. అద్భుతంగా ఉంది. తండ్రి క్యారెక్టర్ ఎవరని అడిగాను ఖని  బ్రదర్ అని అన్నారు. ఇకపై ఈ చిత్రం అతనిది, అతను ఈ చిత్రాన్నిపూర్తిగా క్యారీ చేసుకుంటాడు అని చెప్పా. అలాగే ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.  ధనరాజ్లో  ఉన్న దర్శకుడిని చూసి చాలా ఆశ్చర్యపోయా. 


నటుడు తంబి రామయ్య మాట్లాడుతూ.. టీజర్ చాలా అద్భుతంగా ఉంది. ధనరాజ్ లో గొప్ప దర్శకుడు ఉన్నాడు. అతను తప్పకుండా విజయం సాధిస్తాడు. ఇంకా రెండు, మూడు భాషల్లో కూడా తెరకెక్కిస్తే బాగుటుంది. ఎందుకంటే టీజర్లోనే ఆ బలం కనిపిస్తోందని చెప్పారు.

 

నటుడు సూరి మాట్లాడుతూ.. "వెన్నిలా కబడ్డీ కులు" చింతంలో నేను నటించిన  పాత్రలో  తెలుగులో ధనరాజ్ నటించాడు. తమిళం కన్నా తెలుగులో ఆ కామెడీ చాలా పెద్ద హిట్ అయ్యింది. ఒక హాస్యనటుడు దర్శకుడిగా మారడం చాలా ఆనందంగా ఉంది. తండ్రీకొడుకుల బంధం ఉన్న సినిమాలు ఫ్లాప్ అయిన చరిత్ర లేదు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని పేర్కొన్నారు.  


దర్శకుడు ధనరాజ్ మాట్లాడుతూ..  నా తల్లిదండ్రులకు ధన్యవాదాలు. రచయిత శివప్రసాద్ కథ ఇది. ఈ కథ గురించి ఖని అన్నకి  చెప్పాను. కథను నువ్వే డైరెక్ట్ చేయాలి అని చెప్పాడు. నేను నటించిన చిత్రాలకు పనిచేసిన దర్శకుల నుండి నేను నేర్చుకున్న విషయాల ఆధారంగా నేను దర్శకత్వం వహించాను. ఇప్పటి వరకు 100 చిత్రాల్లో నటించా. ఆ సినిమా దర్శకులు అందరూ నా గురువులే. వారు నేర్పిన పాఠాలతో ఈరోజు దర్శకుడిగా మారా. సముద్రఖని అన్న లేకుంటే ఈ సినిమా  పూర్తయ్యేది కాదు, నేను దర్శకుడిని అయ్యే వాడిని కాను. అందరూ వాళ్ళ నాన్నతో కలిసి ఈ సినిమా చూడాలని చెప్పారు. 


సముద్రఖని మాట్లాడుతూ...  సంతోషకరమైన సమయం ఇది. నేను తండ్రిగా దాదాపు 10కి పైగా సినిమాల్లో నటించా. ఒక్కొక్కటి విభిన్న కథతో. అలాంటి మరో కొత్త కథ ఇది.

ధనరాజీకి తల్లిదండ్రులు లేరు. స్వతహాగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నాడు. మంచి కథ ఇది.. అందుకు తగ్గ దర్శకుడు ఉండాలి అని అనుకున్నా. ధనరాజ్ పై నాకు పెద్ద నమ్మకం ఉంది. అందుకే, అతన్నే దర్శకత్వం చేయమని చెప్పా.  దర్శకుడిగా అతను పెద్ద విజయాన్ని అందుకుంటాడు. ప్రతి తండ్రీ కొడుకుల మధ్య ఉండే బంధాన్ని చాటే చిత్రం ఇది. నిర్మాతను నేనెప్పుడూ కలవలేదు. చిత్రీకరణ సమయంలో మొదటిసారి చూశాను. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పారు. 

Prasanna Vadanam Prerelease Event Held Grandly

‘ప్రసన్న వదనం’ సినిమా చాలా బావుంది. మే3న థియేటర్‌కు వెళ్లి సినిమా చూడండి. సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుంది: ట్రైలర్ లాంచ్ & ప్రీరిలీజ్ ఈవెంట్ లో స్టార్ డైరెక్టర్ సుకుమార్



యంగ్ ట్యాలెంటెడ్ సుహాస్ హీరోగా రూపొందిన యూనిక్ సస్పెన్స్ థ్రిల్లర్’ ప్రసన్న వదనం'. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వై కె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల ఈ సినిమా   టీజర్, సాంగ్స్ కి  ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మే3న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్, ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. దర్శకులు బుచ్చిబాబు, కార్తిక్ దండు, శ్రీనివాస్ అవసరాల, రైటర్ ప్రసన్న ఈ వేడుకలో పాల్గొన్నారు.    


ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ..‘‘సుహాస్‌.. అంటే నాకు, బన్నీకి చాలా ఇష్టం. ‘పుష్ప’లోని హీరో ఫ్రెండ్‌ క్యారెక్టర్ కేశవగా ముందు సుహాస్ ని అనుకున్నాం. కానీ, అప్పటికే సుహాస్ హీరోగా చేయడంతో ఆ రోల్‌కి ఎంపిక చేయడం బాగోదనిపించింది. నాని నటన నాకు బాగా ఇష్టం. సుహాస్‌.. ఫ్యూచర్‌ నానిలా అనిపిస్తున్నాడు. నాని సహజ నటుడు కాబట్టి సుహాస్‌ని మట్టి నటుడు అనాలేమో. అంత ఆర్గానిక్ గా వుంది. తన నటన చూస్తున్నాను. ఆయా పాత్రల్లో ఇమిడిపోతాడు. ఇందులో రాశీసింగ్‌, పాయల్‌ రాధాకృష్ణ చక్కగా నటించారు. విజయ్ బుల్గానిన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. మా అర్జున్ కి సినిమా ఇచ్చిన నిర్మాతలు ధన్యవాదాలు. నేను ‘జగడం’ సినిమా రూపొందిస్తున్న సమయంలో అర్జున్‌ కలిశాడు. ‘మీ ‘ఆర్య’ చిత్రం నాకు బాగా నచ్చింది సర్‌. మీ వద్ద పని చేయాలనుకుంటున్నా’ అని అన్నాడు. టీమ్‌లో జాయిన్‌ చేసుకున్నా. అర్జున్ చాలా అమాయకుడు. కానీ, బోలెడు లాజిక్‌ ఉన్నవాడు. అర్జున్‌, మరో అసిస్టెంట్‌ తోట శ్రీనుతో కలిసి 23 రోజుల్లో ‘100% లవ్‌’ స్టోరీ రాశా. అప్పటి నుంచి నా ప్రతి సినిమాకి వీరిద్దరు పనిచేశారు. వీళ్లతోపాటు ఒక్కో చిత్రానికి ఒక్కొక్కరు యాడ్‌ అవుతూ ఉండేవారు. అర్జున్ కి ఏదైనా సమస్య చెబితే పరిష్కారం సెకన్స్ లో చెబుతాడు. నిజానికి తను హాలీవుడ్ లో వుండివుంటే మరో స్థాయి సినిమా తీసేవాడు. అంత లాజిక్ వున్నవాడు. అర్జున్‌ బిజీగా ఉండడంతో నేను లాజిక్‌ ఉన్న సినిమాలను మానేశా. అంటే మీరు అర్ధం చేసుకోవచ్చు. ఆ లాజిక్ తోనే ప్రసన్న వదనం తీసాడు. తను చాలా నిజాయితీ పరుడు. ఈ సినిమాని చాలా నిజాయితీగా తీశాడు. తన ప్రేమ, నిజాయితీ చాలా ఇష్టం. ఈ సినిమా చూశాను. చాలా బావుంది. ఏ కరెక్షన్ చెప్పలేకపోయాను. అంత చక్కగా తీశాడు. థియేటర్‌కు వెళ్లి సినిమా చూడండి.. నా అర్జున్‌ని సపోర్ట్‌ చేయండి. సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుంది' అన్నారు.


హీరో సుహాస్ మాట్లాడుతూ.. 'ప్రసన్న వదనం' మే 3న విడుదలౌతోంది. కలర్ ఫోటో, రైటర్ పద్మ భూషణ్, అంబాజీ పేట.. ఈ సినిమాలన్నీ ప్రేక్షకులని అలరించాయి. ప్రసన్న వదనం కూడా ఖచ్చితంగా ఆడియన్స్ ని అలరిస్తుంది.  ప్రేక్షకులు థియేటర్స్ దాక వస్తే చాలు.. అక్కడ మేము చూసుకుంటాం. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది.  అర్జున్ చాలా కష్టపడి ఈ సినిమాని తెరకెక్కించారు. నిర్మాతలు చాలా పాషన్ తో సినిమాని నిర్మించారు. పాయల్, రాశి చక్కగా నటించారు. విజయ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. సుకుమార్ గారు ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా వుంది. సుకుమార్ గారికి వాళ్ళ టీం అంటే చాలా ఇష్టం. చాలా ప్రేమిస్తారు. మా సినిమాకి సపోర్ట్ చేయడానికి వచ్చిన సుకుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు' తెలిపారు.  


దర్శకుడు బుచ్చిబాబు సాన మాట్లాడుతూ.. మేమంతా దర్శకులిగా వచ్చాం అంటే కారణం సుకుమార్ గారు. ఆయన నుంచి ఇంకా చాలా మంది దర్శకులు వస్తారు. సుహాస్ ప్రతి సారి కొత్త కంటెంట్ తో వస్తారు. అర్జున్, సుకుమార్ గారి దగ్గర వర్క్ చేస్తునప్పటినుంచి తెలుసు. అర్జున్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. అర్జున్ అన్న చాలా కష్టపడ్డారు.  అర్జున్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు.ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.


దర్శకుడు కార్తిక్ దండు మాట్లాడుతూ.. సుకుమార్ గారి విరూపాక్ష కథ చెప్పినపుడు అర్జున్ కి చెప్పు ఇన్ పుట్స్ ఇస్తాడని అన్నారు. అర్జున్ కథ చెప్పిన తర్వాత చాలా విలువైన సలహాలు ఇచ్చారు. నా విజయంలో ఆయన వున్నారు. ఈ సినిమా కథ తెలుసు. తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది. కొత్త దర్శకులకు సుహాస్ బెస్ట్ ఆప్షన్ అవుతున్నారు. విజయ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్' చెప్పారు.


నటుడు, దర్శకుడు శ్రీనివాస అవసరాల మాట్లాడుతూ.. అర్జున్ తో కలసి ఓ షార్ట్ ఫిలిం చేశాను. అర్జున్ దర్శకుడు అవుతాడని చాలా ఎదురుచూశాను. ఇప్పుడు అర్జున్ గురించి మాట్లాడటం చాలా ఆనందంగా వుంది. సుకుమార్ గారు అంటే చాలా ఇష్టం. సుకుమార్  గారి దగ్గర పని చేయడం అదృష్టం. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. సుహాస్ గారు ప్రతి సినిమాకి ఎదుగుతున్నారు. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించి, మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్' తెలిపారు


రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా బావుంది. సుహాస్ గారు ప్రతి సినిమాకి ఎదుగుతున్నారు. ఈ ఇంకా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.  నిర్మాత మణిగారి ఈ సినిమా పెద్ద విజయం సాధించి పెట్టాలని కోరుకుంటున్నాను. అర్జున్ రూమ్ పక్కనే మా రూమ్ వుండేది. ఆయన సుకుమార్ గారి దగ్గర పని చేశావారని తెలిసి మా ఆనందాని హద్దులు లేవు. ఒకసారి ఆర్య 2 షూటింగ్ కి కూడా తీసుకెళ్ళారు. ఆ క్షణం మర్చిపోలేం. సుకుమార్ గారి అర్జున్ పై చాలా నమ్మకం. నాన్నకు ప్రేమతో సినిమాలో ఒక ఫైట్ ని షూట్ చేసే అవకాశం అర్జున్ కి ఇచ్చారని విన్నాను. ఆలాంటి అర్జున్ ఈ సినిమాని చాలా అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారని నమ్ముతున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి' అని కోరారు


చిత్ర దర్శకుడు అర్జున్ మాట్లాడుతూ.. సినిమాని అనుకున్నదాని కంటే చాలా గ్రాండ్ గా చేశాం. నిర్మాతలు చాలా అద్భుతంగా సపోర్ట్ చేశారు. సుహాస్ దర్శకుల నటుడు. ఈజీగా పాత్రలోకి వెళ్ళిపోతారు. దర్శకుడి మనసులో ఏముందో తనకి తెలిసిపోతుంది. శ్రీనివాస్ అవసరాల గారి ఓ షార్ట్ ఫిల్మ్ చేశాను. ఆ అనుభవం చాలా పనికొచ్చింది. బుచ్చి, కార్తిక్, ప్రసన్న ఈ వేడుకకు రావడం అనందంగా వుంది. విజయ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. డైరెక్షన్ టీం చాలా సపోర్ట్ చేసింది. రాశి, పాయల్ చక్కగా నటించారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సుకుమార్ గారి దగ్గర నుంచి నా జర్నీ మొదలైయింది. ఆయన దగ్గర ల్యాండ్ అవ్వడంతో మొదట నుంచి ఆయన స్థాయిలో ఆలోచించడం మొదలుపెడతాం. ఆయన ఇచ్చిన జ్ఞానం, చనువు మర్చిపోలేను. ఈ సినిమా చూసి ‘శెబాష్’ అన్నారు. అదొక్కటి చాలు నాకు. ఈ సినిమాని పంపిణీ చేస్తున్న మైత్రీ మూవీస్, హంబలే సంస్థలకు ధన్యవాదాలు. ఫేస్ బ్లైండ్ నెస్ కాన్సెప్ట్ తో వస్తున్నాం. చాలా అద్భుతంగా వచ్చింది. అందరం హ్యాపీగా వున్నాం.  ప్రేక్షకులు ఖహ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మే3న తప్పకుండా చూడండి' అన్నారు,      


హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ.. ప్రసన్న వదనం యూనిక్ కాన్సెప్ట్. కథ వినగానే వర్క్ అవుట్ అవుతుందనిపించింది. దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. ఇందులో నా పాత్ర కొత్తగా వుంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు అర్జున్ కి ధన్యవాదాలు. సుహాస్ గారు చాలా నేచురల్ యాక్టర్. ఆయనతో పని చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మే3న తప్పకుండా సినిమా చూడండి' అన్నారు


హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. సుహాస్ , అర్జున్, రాశి ఇలా మంచి టీంతో ఈ సినిమా చేశాం. ఈ సినిమాలో పని చేయడం చాలా ఆనందంగా వుంది. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది' అన్నారు.


నిర్మాత మణికంఠ మాట్లాడుతూ.. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. సినిమా వందశాతం బ్లాక్ బస్టర్. కలర్  ఫోటో తో నా జర్నీ మొదలైయింది. సుహాస్ కెరీర్ లో నా పేరు ఖచ్చితంగా ఓ పేజీ లో వుంటుంది. మా స్నేహం అలానే వుండాలని కోరుకుంటున్నాను. బుచ్చిబాబు, ప్రసన్న, అవసరాల శ్రీనివాస్, కార్తిక్ ఈ వేడుకకు రావడం ఆనందంగా వుంది. మొదట ఈ కథ అరవింద్ గారు విని చేద్దామనుకున్నారు. రవికాంత్, శ్రీనివాస్,  మై హోం రామ్ గారికి ధన్యవాదాలు. రాజేష్ గారు చాలా సపోర్ట్ చేశారు. మా డిస్ట్రిబ్యుటర్స్ మైత్రీ, హంబలే ఫిలిమ్స్ కి ధన్యవాదాలు. దర్శకుడు అర్జున్ అద్భుతంగా తీశాడు. మే3న సినిమా ఖచ్చితంగా చూడండి. సినిమా చాలా బావుటుంది' అన్నారు.


నిర్మాత ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. సుహాస్ గారితో జర్నీ చాలా బావుంది. రాశి, పాయల్ చక్కగా నటించారు. విజయ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు.టీం అందరూ చాలా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. మే3న సినిమా విదుదలౌతుంది. తప్పకుండా చూడండి' అన్నారు. చిత్ర యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుకు చాలా గ్రాండ్ గా జరిగింది.




 

Bullet Movie 50days Celebration

 విజయవంతంగా 50 రోజులు పూర్తిచేసుకున్న బుల్లెట్ చిత్రం



బుల్లెట్ చిత్రం కాదు.. మంచి సినిమా


శ్రీ బండి సదానంద్ & మెమరీ మేకర్స్ సోమిసెట్టి హరికృష్ణ సమర్పించు, తుమ్మూరు  కోట ఫిలిం సర్క్యూట్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం *బుల్లెట్*. ఎవ్వడికైనా దిగుద్ది ట్యాగ్ లైన్ తో దర్శకుడు చౌడప్ప రూపొందించారు. 
 హీరో రవి వర్మ, సంజనా సింగ్, ఆలోక్ జైన్ ,మనీషా దేవ్, జీవ ,విజయ రంగరాజు ,సంధ్య శ్రీ, నర్సింగ్ యాదవ్, జబర్దస్త్ అప్పారావు ప్రధాన పాత్రలు పోషించారు.  మార్చి 8న  విడుదలైన ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకొని సక్సెస్ ఫుల్ గా ఇంకా థియేటర్లో కొనసాగుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ చిత్ర 50 రోజుల వేడుకను నిర్వహించారు. 

ముఖ్య అతిథులుగా శోభారాణి, దర్శకులు వి సముద్ర హాజరయ్యారు. 

శోభారాణి గారు మాట్లాడుతూ.."చిన్న చిత్రాలు రెండు మూడు రోజులు కూడా ఆడని ఈ రోజుల్లో *బుల్లెట్* 50 రోజులు పూర్తి చేసుకొని ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవడం మామూలు విషయం కాదు. *బుల్లెట్* ఇప్పుడు చిన్న సినిమా కాదు మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. దర్శకుడు చౌడప్ప గారికి నా అభినందనలు తెలియజేస్తున్నా. ఆయన డైరెక్టర్ గా మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. టీమ్ అందరికీ కంగ్రాట్యులేషన్స్" అని చెప్పారు. 

దర్శకుడు వి సముద్ర మాట్లాడుతూ.."బుల్లెట్ చిత్రం 50 రోజుల వేడుక చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. గోపీచంద్ ప్రభాస్ లాగా ఈ చిత్రంలోని హీరో రవివర్మ కూడా చాలా హైట్ ఉన్నాడు. తను కూడా వాళ్ళ లాగా సక్సెస్ అవ్వాలని కోరుతూ అందరికీ ఆల్ ద బెస్ట్" అని అన్నారు. 

హీరో రవివర్మ మాట్లాడుతూ.."మా సినిమాని ఇంతలా సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. నేను నటించిన మొదటి చిత్రమే 50 రోజులు పూర్తి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది" అని చెప్పారు. 

దర్శకుడు చౌడప్ప మాట్లాడుతూ.."మంచి చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. మా చిత్రానికి ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి థాంక్స్" అని చెప్పారు.

నిర్మాత గోపాల్ గారు మాట్లాడుతూ.."ఈ సినిమా విజయం పై మొదటి నుంచి నమ్మకంగా ఉన్నాం. అనుకున్నట్టుగా విజయం సాధించడంతో పాటు 50 రోజులు వేడుక జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. దర్శకుడు చౌడప్ప పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఆయనకు నా అభినందనలు తెలియజేస్తున్నా" అని అన్నారు. 
చిత్ర యూనిట్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. 

 
నటీనటులు
హీరో రవి వర్మ, సంజనా సింగ్, ఆలోక్ జైన్ ,మనీషా దేవ్, జీవ ,విజయ రంగరాజు ,సంధ్య శ్రీ, నర్సింగ్ యాదవ్, జబర్దస్త్ అప్పారావు, సందీప్ రెడ్డి ,ఆనంద్ జాషువా,  వైజాగ్ ప్రసాద్ ,గిరిధర్, మల్లికార్జున రావు, జగన్ తదితరులు

 సాంకేతిక నిపుణులు
నిర్మాత :- ఎం సి రావు ,జి గోపాల్ ,ఎమ్.వి మల్లి ఖార్జునరావు ,కోసూరి సుబ్రహ్మణ్యం ,మని
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం :- చౌడప్ప
డైరెక్టన్ డిపార్ట్మెంట్ :- సుధీర్ రెడ్డి ,గురునాథం ,వెంకట్ ,శివ
మాటలు :- నివాస్
కెమెరా :- ఆనంద్ మురుకురి
సంగీతం :- సుభాష్ ఆనంద్
ఎడిటర్ :- నందమూరి హరి
బ్యాగ్రౌండ్ స్కోర్, ఆర్.ఆర్ :- చిన్న
ఆర్ట్స్ :- రామకృష్ణ
మేకప్ :- శివ
క్యాస్ట్యూమ్స్ :- నాగరాజు
ప్రొడక్షన్ మేనేజర్ :- బాబు
పి.ఆర్.ఓ :- హర్ష

Paradha First Look & Concept Video Unveiled

 సమంత, రాజ్ & డికె లాంచ్ చేసిన అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత, ప్రవీణ్ కాండ్రేగుల, ఆనంద మీడియా మూవీ 'పరదా' ఫస్ట్ లుక్ & కాన్సెప్ట్ వీడియో



రాజ్& డికె నిర్మించిన "సినిమా బండి"తో ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల తన రెండవ చిత్రంతో మరో ఆకర్షణీయమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతున్నారు.  శ్రీనివాసులు పివి,  శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ నిర్మాతలుగా ఆనంద మీడియా తన తొలి నిర్మాణంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి గ్రాండ్ ఎంట్రీని గుర్తించడానికి సిద్ధంగా ఉంది. సమంత, రాజ్ & డీకే సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేశారు.


మహిళా కథానాయకుల చుట్టూ కేంద్రీకృతమై కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో వెరీ ట్యాలెంటెడ్ అనుపమ పరమేశ్వరన్, వెర్సటైల్ దర్శనా రాజేంద్రన్, ప్రముఖ నటి సంగీత ప్రధాన పాత్రలు పోహిస్తున్నారు. ఆకట్టుకునే డ్రామాతో రూపొందుతున్న ఈచిత్రానికి "పరదా" అనే ఆసక్తికరమైన టైటిల్ లాక్ చేశారు.


పరదా అంటే కర్టెన్. పరదా లేకుండా అనుపమ కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అనుపమ సాంప్రదాయ దుస్తులలో, వోనితో ముఖాన్ని కప్పి ఉంచే మరికొందరు అమ్మాయిలతో పాటు నిలబడి కనిపిస్తుంది. అనుపమ తీక్షణంగా చూస్తోంది. ఆమె గత సినిమాలోలా కాకుండా డి-గ్లామ్ పాత్రలో కనిపించనుంది.


కాన్సెప్ట్ వీడియో విలేజ్ సెటప్‌లో దేవత విగ్రహాన్ని చూపుతుంది. 'యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా, యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రఫలాః క్రియా, మనుస్మృతిలోని ప్రసిద్ధ శ్లోకం వినబడుతుంది. దీని అర్ధం.. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో, అక్కడ దేవతలు పూజింపబడతారు.  స్త్రీలు ఎక్కడ అవమానించబడతారో, ఎంత శ్రేష్ఠమైనప్పటికీ ఆ చర్యలు ఫలించవు. శ్లోకం సినిమా ఇతివృత్తాన్ని వివరిస్తుంది.


ఎన్నో ప్రశంసలు పొందిన 'హృదయం', 'జయ జయ జయ జయ హే' చిత్రాలలో పాపులరైన తర్వాత దర్శన రాజేంద్రన్ పరదా చిత్రంతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది.  ఇది తెలుగు,  మలయాళంలోని ఆమె అభిమానులకు ఉత్సాహాన్ని ఇస్తోంది.  


ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కొన్ని గ్రామాలలోని అద్భుతమైన ప్రదేశాలలో షూటింగ్ జరుపుకుంది. మేలో హైదరాబాద్‌లో షెడ్యూల్ చేయబడిన చివరి దశ షూటింగ్ కోసం టీం ఉత్సాహంగా సిద్ధమౌతోంది.


ఈ చిత్రం గురించి దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల మాట్లాడుతూ, "పరదా"తో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే కాకుండా లోతుగా ప్రతిధ్వనింపజేసే ఆకట్టుకునే కథనాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాము.  ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను'' అన్నారు.


ఆనంద మీడియా బ్యానర్‌పై తెరకెక్కుతున్న "పరదా"  ఆకర్షణీయమైన కథాంశం, ప్రతిభావంతులైన తారాగణం, ఆకట్టుకునే పాటలతో ప్రేక్షకులను అలరించనుంది. “మా సినిమా కథ మాత్రమే కాదు, ఒక అనుభవం, ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకువెళ్లే ప్రయాణం” అంటూ నిర్మాత విజయ్ డొంకాడ “పరదా” సినిమాపై ఆనందం వ్యక్తం చేశారు.


గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మృదుల్ సుజిత్ సేన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ధర్మేంద్ర కాకరాల ఎడిటర్. ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా విడుదలకు సమీపంలో ఉన్నందున మరిన్ని ఎక్సయిటింగ్ అప్‌డేట్‌ల రాబోతున్నాయి.    


తారాగణం: అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత


సాంకేతిక విభాగం:

బ్యానర్: ఆనంద మీడియా

దర్శకత్వం: ప్రవీణ్ కాండ్రేగుల

నిర్మాతలు: విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువ

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రోహిత్ కొప్పు

సంగీతం: గోపీ సుందర్

సాహిత్యం: వనమాలి

రచయితలు: పూజిత శ్రీకాంతి, ప్రహాస్ బొప్పూడి

స్క్రిప్ట్ డాక్టర్: కృష్ణ ప్రత్యూష

డీవోపీ: మృదుల్ సుజిత్ సేన్

ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల

సౌండ్ డిజైన్: వరుణ్ వేణుగోపాల్

ఆర్ట్ డైరెక్టర్: శ్రీనివాస్ కళింగ

కాస్ట్యూమ్ డిజైనర్: పూజిత తాడికొండ

పీఆర్వో: వంశీ-శేఖర్

పబ్లిసిటీ డిజైన్స్: అనిల్ & భాను

Hammammo From Aa Okkati Adakku is out now

 అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, చిలకా ప్రొడక్షన్స్ 'ఆ ఒక్కటీ అడక్కు' నుండి ది బ్లిస్ఫుల్ మెలోడీ హమ్మమ్మో విడుదల



అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు' ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌కు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది.  చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మాణంలో, నూతన దర్శకుడు మల్లి అంకం దర్శకత్వం వహించిన చిత్రాన్ని చూడాలనే ఉత్సాహాన్ని ప్రతి ప్రమోషనల్ కంటెంట్ పెంచింది. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాత. అల్లరి నరేష్ సరసన ఫారియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది.


మ్యూజికల్ ప్రమోషన్‌లలో భాగంగా, యూనిట్ సెకండ్ సింగిల్ హమ్మమ్మోను విడుదల చేశారు, ఇది క్లాసికల్ బీట్‌లతో బ్లిస్ఫుల్ మెలోడీ. భాస్కరభట్ల అల్లరి నరేష్ భావాలను తెలియజేసే ఆకర్షణీయమైన సాహిత్యం అందించగా , యశస్వి కొండేపూడి తన చక్కని గానంతో ప్రత్యేక ఆకర్షణను తెచ్చారు. బ్యూటీఫుల్  కెమిస్ట్రీని పంచుకున్న అల్లరి నరేష్,  ఫరియా అబ్దుల్లా ఎలిగెంట్ మూవ్స్ ఆకట్టుకున్నారు


వెన్నెల కిషోర్, జామీ లీవర్, వైవా హర్ష,  అరియానా గ్లోరీ ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం.


ఈ చిత్రానికి అబ్బూరి రవి రచయిత. ఛాయాగ్రహణం సూర్య, గోపి సుందర్ సంగీతం సమకూరస్తున్నారు. ఈ చిత్రానికి చోటా కె ప్రసాద్ ఎడిటర్ కాగా, జెకె మూర్తి ఆర్ట్ డైరెక్టర్.


మేకర్స్ ఇటీవల ప్రకటించినట్లుగా, ఆ ఒక్కటి అడక్కు మే 3, 2024న గ్రాండ్ గా విడుదల కానుంది.


తారాగణం: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ తదితరులు


సాంకేతిక విభాగం:

దర్శకత్వం - మల్లి అంకం

నిర్మాత - రాజీవ్ చిలక

సహ నిర్మాత - భరత్ లక్ష్మీపతి

బ్యానర్ - చిలక ప్రొడక్షన్స్

రచయిత - అబ్బూరి రవి

ఎడిటర్ - చోటా కె ప్రసాద్

డీవోపీ - సూర్య

సంగీతం - గోపీ సుందర్

ఆర్ట్ డైరెక్టర్ - జె కె మూర్తి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - అక్షిత అక్కి

మార్కెటింగ్ మేనేజర్ - శ్రావణ్ కుప్పిలి

మార్కెటింగ్ ఏజెన్సీ - వాల్స్ అండ్ ట్రెండ్స్

పీఆర్వో - వంశీ-శేఖర్

పబ్లిసిటీ డిజైన్ - అనిల్ భాను

Mega Mother Konidela Anjana Devi Launched Gripping Teaser Of RK Sagar THE 100

 మెగా మదర్ కొణిదెల అంజనా దేవి లాంచ్ చేసిన ఆర్కే సాగర్, రాఘవ్ ఓంకార్ శశిధర్, క్రియా ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్  'ది100  గ్రిప్పింగ్ టీజర్‌



మొగలి రేకులు ఫేమ్ ఆర్‌కె సాగర్ అప్ కమింగ్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ 'ది 100'. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రియా ఫిల్మ్ కార్ప్, దమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకీ పూశడపు, జె తారక్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి విశేష స్పందన లభించింది. పోస్టర్‌లో ఆర్‌కె సాగర్‌ను విక్రాంత్ ఐపీఎస్‌గా పరిచయం చేశారు. ఈరోజు ఈ సినిమా టీజర్‌ను మెగా మదర్ శ్రీమతి కొణిదెల అంజనా దేవి లాంచ్ చేశారు.


ఐపీఎస్ అధికారి విక్రాంత్ చేసిన తప్పులపై మానవ హక్కుల కమిషన్ విచారించడంతో టీజర్ ప్రారంభమైంది. నగర శివార్లలో కొన్ని సామూహిక హత్యలు జరుగుతాయి. అందులో వారంతా  రౌడీ షీటర్లు. పోలీసుల విచారణ జరుగుతోంది. నేరస్థులను ఎదుర్కోవడంలో తనదైన స్టయిల్ కలిగి ఉన్న హీరో తన పద్దతి గురించి మీడియా లేదా ఇతరులు ఏమనుకుంటున్నారో పట్టించుకోరు. అతను ఉన్నతాధికారుల, మానవ హక్కుల కమిషన్‌కు కూడా భయపడడు.


తనున్న చోట నేరాలను నిర్మూలించడానికి ఎంతకైనా తెగించే నిజాయితీ గల ఐపీఎస్ అధికారి స్వభావాన్ని తెలియజేసేలా టీజర్ ఉంది. RK సాగర్ ఖాకీ దుస్తులలో ఫిట్‌గా కనిపించారు.  అతని ఫెరోషియస్  పెర్ఫార్మెన్స్ యుఎస్పీ. రాఘవ్ ఓంకార్ శశిధర్ క్యారెక్టర్‌ని అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. టీజర్‌ని బట్టి చూస్తే సినిమా గ్రిప్పింగ్ కథనంతో యాక్షన్‌లో ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.


ఆర్కే సాగర్ సరసన మిషా నారంగ్ నటిస్తున్న ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్యామ్ కె నాయుడు కెమెరామెన్ కాగా, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. అమర్ రెడ్డి కుడుముల ఎడిటర్. చిన్నా ప్రొడక్షన్‌ డిజైనర్‌. సుధీర్ వర్మ పేరిచర్ల డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమౌతోంది.  


తారాగణం: ఆర్కే సాగర్, మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ, గిరిధర్, ఆనంద్, లక్ష్మీ గోపాల్ స్వామి, కళ్యాణి నటరాజన్, బాల కృష్ణ, జయంత్, విష్ణు ప్రియ తదితరులు.


సాంకేతిక సిబ్బంది:

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాఘవ్ ఓంకార్ శశిధర్

నిర్మాతలు: రమేష్ కరుటూరి, వెంకీ పూషడపు, జె తారక్ రామ్

బ్యానర్లు: క్రియా ఫిల్మ్ కార్ప్ , ధమ్మ ప్రొడక్షన్స్

సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్

డీవోపీ: శ్యామ్ కె నాయుడు

ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల

ప్రొడక్షన్ డిజైన్: చిన్నా

డైలాగ్స్: సుధీర్ వర్మ పేరిచర్ల

పీఆర్వో: వంశీ-శేఖర్


Odela 2 Second Schedule Begins, Working Video Offers Goosebumps

 తమన్నా భాటియా, అశోక్ తేజ, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ హై బడ్జెట్ మల్టీ-లింగ్వల్ ఫిల్మ్ 'ఒదెల 2' రెండవ షెడ్యూల్ ప్రారంభం, గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న వర్కింగ్ వీడియో



మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఒదెల 2’. బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ సంపత్ నంది క్రియేటర్ గా, ఓదెల రైల్వే స్టేషన్ ఫేమ్ అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. మహా శివరాత్రి నాడు విడుదలైన 'భైరవి' నాగ సాధువుగా సూపర్ స్టార్ తమన్నా భాటియా ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమాపై హైప్, అంచనాలు ఆకాశాన్ని తాకాయి.


ఈ మల్టీ లాంగ్వేజ్  సూపర్ నేచురల్ విజువల్ వండర్ భారతదేశంలోని వివిధ అద్భుతమైన ప్రదేశాలలో తన మొదటి షూట్ షెడ్యూల్‌ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. మహాదేవ్ పరమశివుని దివ్య ఆశీస్సులతో ఆయన పవిత్ర నివాసం వారణాసిలో మార్చిలో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ప్రారంభ షెడ్యూల్‌లో వారణాసి, హైదరాబాద్, భూధాన్ పోచంపల్లి, పోతారం, టంగటూర్  ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు.


 రెండవ షూట్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాదు, చుట్టుపక్కల ప్రాంతాలలో జరుగుతోందని చిత్ర బృందం అనౌన్స్ చేసింది. ఈ షెడ్యూల్‌ 20-25 రోజుల పాటు జరుగుతుంది. సినిమాలోని ప్రధాన తారాగణం, కీలక సహాయ నటీనటులతో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోంది యూనిట్.


ఈ చిత్రంలో తమన్నా భాటియాతో కలిసి హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, ఇతర ప్రముఖ ప్రతిభావంతులతో సహా నటీనటుల నటిస్తున్నారు. కాంతార ఫేం అజనీష్ లోక్‌నాథ్ అద్భుతమైన స్కోర్‌తో తమన్నా పాత్రలోకి మారడాన్ని చూపించే వర్కింగ్ వీడియో గూస్‌బంప్‌లను అందిస్తుంది.


ఓదెల మల్లన్న ఆశీస్సులతో రెండవ షూట్ షెడ్యూల్ జరుగుతుండగా, గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించే "ఒదెల 2" మేకింగ్ గురించి రెగ్యులర్ అప్‌డేట్‌లు చూస్తుంటే సినిమా విజువల్ వండర్ గా ఉండబోతుందని అర్ధమౌతోంది.  


ప్రతి యుగంలో దేవుడు తన ప్రజలను రక్షించడానికి చెడును ఎలా గెలుస్తాడో చూపిస్తూ అనే కథాంశంతో  "ఓదెల" ఒక సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అవుతుందని హామీ ఇచ్చింది. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఉత్కంఠభరితమైన విజువల్స్, అద్భుతమైన సన్నివేశాలు, పవర్‌హౌస్ పెర్ఫార్మెన్స్ లతో  వుండబోతుంది.


ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సౌందర్‌రాజన్ మొదటి ఎడిషన్ ‘ఒడెలా రైల్వే స్టేషన్’ తర్వాత మాఓదెల  ఫ్రాంచైజీకి తిరిగి వచ్చారు. రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టర్.


 ఈ చిత్రం చుట్టూ ఉన్న అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


యూనివర్సల్ అప్పీల్ ఉన్న ఈ సినిమా జాతీయ స్థాయిలో విడుదల కానుంది.

తారాగణం: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి


సాంకేతిక సిబ్బంది:

నిర్మాత: డి మధు

క్రియేటెడ్ బై: సంపత్ నంది

బ్యానర్లు: మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్

దర్శకత్వం: అశోక్ తేజ

DOP: సౌందర్ రాజన్. ఎస్

సంగీతం: అజనీష్ లోక్‌నాథ్

ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్ నాయర్

పీఆర్వో: వంశీ-శేఖర్


Chandini Chowdary Leads 'Yevam': A Gripping Tale of Women's Empowerment

 పవర్‌ఫుల్‌ పోలీస్‌ఆఫీసర్‌గా చాందిని చౌదరి నటిస్తున్న యేవమ్‌ లుక్‌ విడుదల



కథానాయిక చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'యేవమ్‌'. వశిష్ట సింహా, జైభారత్‌, ఆషురెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రకాష్‌ దంతులూరి దర్శకుడు. నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు. శుక్రవారం ఈ చిత్రంలో చాందిని చౌదరి నటిస్తున్న పాత్రకు సంబంధించిన లుక్‌ను విడుదల చేశారు మేకర్స్‌. మహిళా సాధికారికతను చాటి చెప్పే విధంగా ఆమె పాత్ర చిత్రంలో కనిపించనుంది. దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ 'ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో కనిపించినట్లుగా చాందిని చౌదరి పాత్ర 'ఆడపిల్లని అయితే ఏంటంటా? ' అనే విధంగా, నేటి మహిళా సాధికారితను, ధైర్యాన్ని రిప్రంజెట్‌ చేసే విధంగా వుంటుంది. ఈ చిత్రంలో చాందిని చౌదరి నటన ఎంతో హైలైట్‌గా వుంటుంది. కొత్త కంటెంట్‌తో పాటు ఎంతో డిఫరెంట్‌ నేరేషన్‌తో ఈ సినిమా వుంటుంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది' అన్నారు. చాందిని చౌదరి, వశిష్ట సింహా, జైభారత్‌, ఆషురెడ్డి, గోపరాజు రమణ, దేవిప్రసాద్‌, కల్పిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌క్ష్మ ఎస్‌వీ విశ్వేశ్వర్‌, సంగీతం కీర్తన శేషు, నీలేష్‌ మందలపు అందిస్తున్నారు. సుజనా అడుసుమిల్లి ఎడిటర్‌గా, రాజు పెన్మెత్స ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

SKS Creations production number 3 Launched

 పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఎస్ కే ఎస్ క్రియేషన్స్ 3 కొత్త సినిమా



ఎస్ కే ఎస్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న కొత్త సినిమా ఇవాళ హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. హ్యూమన్ వాల్యూస్ ఉన్న ఎమోషనల్ లవ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని రాహుల్ శ్రీవాత్సవ్ ఐయ్యర్ ఎన్ నిర్మిస్తున్నారు. మురళీ అలకపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ఆంజనేయులు జక్క ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్ర ప్రారంభోత్సవ ముహూర్తపు సన్నివేశానికి దేవుడి పటాలపై సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు క్లాప్ నిచ్చారు. మరో సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత రాహుల్ శ్రీవాత్సవ్ ఎన్ మాట్లాడుతూ - మా ఎస్ కే ఎస్ క్రియేషన్స్ సంస్థను 2019లో ప్రారంభించాం. మా ప్రొడక్షన్ నుంచి వస్తున్న మూడో చిత్రమిది. మా మొదటి సినిమా సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. రెండవ చిత్రాన్ని ఫిబ్రవరిలో మొదలుపెట్టాం. ప్రస్తుతం ఆ సినిమా రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. ఇవాళ మూడో సినిమాకు శ్రీకారం చుట్టాం.  దర్శకుడు మురళి చెప్పిన కథ నచ్చి ఈ సినిమాను ప్రారంభించాం. ఇవాళ మా మూవీ పోస్టర్ కూడా రిలీజ్ చేశాం. 80 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఎక్కడో ఒక దగ్గర ఈ సినిమా స్టోరీ పాయింట్ గురించి విని ఉంటారు. ఇది ఏ సినిమాకూ కాపీ కాదు. ఫ్రెష్ లవ్ స్టోరీ. ఈ కథను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాం. మూడు పాత్రల మధ్య సాగే టీనేజ్ లవ్ స్టోరీ ఇది. ముక్కోణపు ప్రేమ కథ అనే కంటే ప్రేమ, జీవితంలోని భావోద్వేగాలు ఆకట్టుకునేలా ఉంటాయని చెప్పవచ్చు. ఆ ప్రేమ ఎలా విజయ తీరం చేరిందనేది ఆసక్తికరంగా మా దర్శకుడు తెరకెక్కించబోతున్నారు. నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలో వెల్లడిస్తాం. పేరున్న నటీనటులు నటిస్తారు. వారు ఎవరు అనేది ఇప్పటికి సీక్రెట్ గా ఉంచుతున్నాం. మే రెండో వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి జూన్ జూలైలో చిత్రీకరణ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. ఆగస్టు లేదా సెప్టెంబర్ లో సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం. మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆంజనేయులు జక్క మాట్లాడుతూ - రాహుల్, మురళీ నేను కలిసి ఒక మంచి ప్రాజెక్ట్ తో మీ ముందుకు వస్తున్నాం. కొత్త కథా కథనాలతో సాగే ఎమోషనల్ లవ్ స్టోరీ ఇది. పేరున్న నటీనటులు మా సినిమాలో నటించబోతున్నారు. సినిమా ప్రారంభించిన నాలుగు నెలల్లోనే రిలీజ్ తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

దర్శకుడు మురళీ అలకపల్లి మాట్లాడుతూ - నేను కూడా మన మీడియా కుటుంబంలోని వ్యక్తినే. ఇవాళ దర్శకుడిగా ఇక్కడ కూర్చుని మీతో మాట్లాడుతుండటం సంతోషంగా ఉంది. గ్రామీణ నేపథ్యంగా సాగే ప్రేమ కథా చిత్రమిది. ముగ్గురు పర్సన్స్ మధ్యన జరుగుతుంది. ప్రొడ్యూసర్స్ కు ఈ కథ చెప్పగానే సబ్జెక్ట్ కొత్తగా ఉంది అని సినిమా నిర్మించేందుకు ముందుకొచ్చారు. ఒక మంచి మూవీ తో త్వరలోనే మీ ముందుకు వస్తాం  అన్నారు.

టెక్నికల్ టీమ్

బ్యానర్ - ఎస్ కే ఎస్ క్రియేషన్స్

నిర్మాత - రాహుల్ శ్రీవాత్సవ ఐయ్యర్ ఎన్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఆంజనేయులు జక్క

రచన, దర్శకత్వం - మురళీ అలకపల్లి.

Pratani Ramakrishna Goud Movie Diksha Launched Grandly

 ప్రతాని రామకృష్ణగౌడ్‌ స్వీయ దర్శకత్వంలో

‘ధీక్ష’ ప్రారంభం



ఆర్‌.కె. ఫిలింస్‌, స్నిగ్ధ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై ప్రముఖ దర్శక, నిర్మాత, తెలంగాణ ఫిలిమ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ధీక్ష’. పినిశెట్టి అశోక్‌ కుమార్‌ సహ నిర్మాత కాగా, పూర్ణ వెంకటేష్‌ కో`ప్రొడ్యూసర్‌. కిరణ్‌కుమార్‌`భవ్యశ్రీ జంటగా నటిస్తున్న ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సిద్ధిపేట జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, బ్రహ్మంగారి ఉపాసకులు బ్రహ్మశ్రీ డా॥ యోగానందకృష్ణమాచార్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపుషాట్‌కు ఆర్‌.కె. గౌడ్‌ క్లాప్‌ను ఇవ్వగా, తూముకుంట నర్సారెడ్డి కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు, డా॥ యోగానందకృష్ణమాచార్య తొలిషాట్‌కు దర్శకత్వం వహించారు, జెవిఆర్‌ & గురురాజ్‌లు స్క్రిప్ట్‌ను అందించారు.


ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో బ్రహ్మశ్రీ డా॥ యోగానందకృష్ణమాచార్య మాట్లాడుతూ...

ఆర్కే గౌడ్‌ గారితో నాకు మంచి పరిచయం ఉంది. ఈరోజు చాలా మంచి రోజు ఈ సందర్భంగా ప్రారంభోత్సవం జరుపుకున్న ‘ధీక్ష’ చిత్రం ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది. ఈ చిత్రం రామకృష్ణగౌడ్‌ గారికి, నటీనటులు, టెక్నీషియన్‌లకు మంచి పేరు తీసుకు వస్తుంది అన్నారు.


ఆర్‌.కె.గౌడ్‌ మాట్లాడుతూ...

ఇటీవల దర్శకత్వం వహించడంలో నేను కొంత గ్యాప్‌ తీసుకున్నాను. మంచి కథ కుదరడంతో మళ్లీ ఈ చిత్రం ద్వారా దర్శక, నిర్మాతగా మీ ముందుకు వస్తున్నాను. మమ్మల్ని ఆశీర్వదించటానికి విచ్చేసిన నర్సారెడ్డి గారికి, యోగానందకృష్ణమాచార్యులు గారికి, ఇతర మిత్రులు, శ్రేయోభిలాషులకు నా ధన్యవాదాలు. ‘ధీక్ష’ మంచి కథాబలం ఉన్న సినిమా. అవార్డులు కూడా గెలుచుకునే అవకాశం ఉన్న కథ. మే 1వ తేదీ నుంచి షూటింగ్‌ జరుగుతుంది. హైదరాబాద్‌తో పాటు దుబాయ్‌లో కూడా ఒక షెడ్యూల్‌ ఉంటుంది. దీక్ష, పట్టుదలతో ఏపని చేసినా తప్పకుండా సక్సెస్‌ అవుతుంది. ఇది ప్రతి మనిషి విషయంలోనూ జరిగేదే. ఈ విషయాన్ని బేస్‌గా తీసుకుని ఈ సినిమా చేస్తున్నాం. ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుంది అంటారు. అలాగే ఒక ఆడదాని విజయం వెనకాల కూడా ఒక మగాడు ఉంటాడు.  పాటల రికార్డింగ్‌ కూడా పూర్తయ్యింది. ఈ సినిమా తర్వాత స్పోర్ట్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో మరో సినిమా చేయబోతున్నా. అందులో హీరో తేజ నెగెటివ్‌ రోల్‌ చేస్తున్నారు. సాంగ్స్‌ కూడా కంప్లీట్‌ అయ్యాయి. మంచి క్వాలిటీతో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా తీస్తాము. యూనిట్‌ అందరికీ మంచి పేరు తెచ్చే చిత్రమిది. ఇకపై మా ఆర్‌.కె. ఫిలింస్‌ బ్యానర్‌పై కంటిన్యూగా సినిమాలు చేయాలనే సంకల్పంతో ఉన్నాం అన్నారు.


తూముకుంట నర్సారెడ్డి మాట్లాడుతూ...

ఆర్‌.కె. గౌడ్‌ గారు రాజకీయాల్లో కూడా ఉన్నారు. మంచి ప్రజాసేవకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు కళామతల్లి సేవలో ఉండిపోయారు. ఆయన మళ్లీ అటు ప్రజా సేవలో కూడా పాలుపంచుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారు చిత్ర పరిశ్రమ అభివృద్ది కోసం చాలా తపన పడుతున్నారు. కాబట్టి రామకృష్ణగౌడ్‌ గారు ఆయన జత కలిస్తే పరిశ్రమకు మరింత మేలు జరుగుతుందని నా ఆశ. ఈరోజు ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ ‘ధీక్ష’ తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.


టి.ఎఫ్‌.సి.సి వైస్‌ ప్రెసిడెంట్‌ గురురాజ్‌ మాట్లాడుతూ...

ఇంతమంది శ్రేయోభిలాషుల మధ్య ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రం విజయం తధ్యం. ఇప్పటికే ఎంతోమంది నటులు, టెక్నీషియన్‌లను పరిశ్రమకు పరిచయం చేశాం. వారు ఇప్పడు మంచి పొజిషన్‌లో ఉన్నారు. ఈ సినిమా ద్వారా కూడా మరింత మంది టాలెంటెడ్‌ వ్యక్తులు పరిశ్రమకు పరిచయం అవుతారు. అందరి ఆశీర్వాదాలు కావాలి అన్నారు.


టి.ఎఫ్‌.సి.సి వైస్‌ ప్రెసిడెంట్‌ జె.వి.ఆర్‌ మాట్లాడుతూ...

మంచి నటీనటులు, టెక్నీషియన్స్‌తో ఆర్‌.కె. గౌడ్‌గారు చేస్తున్న ఈ ధీక్ష విజయవంతం కావాలి. సినిమాకు ప్రజల నుంచి రివార్డులతో పాటు, ప్రభుత్వాల నుంచి అవార్డులు కూడా రావాలి. ఇది మరిన్ని చిన్న సినిమాల నిర్మాణానికి మార్గదర్శి కావాలి అన్నారు.


హీరో, హీరోయిన్‌లు కిరణ్‌`భవ్యశ్రీలు మాట్లాడుతూ...

మంచి కంటెంట్‌ ఉన్న సినిమా ఇది. ఇంత మంచి సినిమాకు మమ్మల్ని సెలక్ట్‌ చేసుకున్న ఆర్‌.కె. గౌడ్‌ గారికి, ఇతర నిర్మాతలకు థ్యాంక్స్‌. నటనకు స్కోప్‌ ఉన్న పాత్రలు కావడం మా అదృష్టం. అందరికీ మంచి పేరు, పేరుతో పాటు అవార్డులు తెచ్చే సినిమా ధీక్ష అని కాన్ఫిడెంట్‌గా చెపుతున్నాం అన్నారు.


ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న జేవీఆర్‌, నిర్మాత వెంకటేశ్వర్లు, చిత్తజల్లు ప్రసాద్‌, రచయిత మేడ ప్రసాద్‌, నిర్మాత గిరి తదితరులు ప్రతాని రామకృష్ణగౌడ్‌ గారి దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రంతో మరోసారి టాలీవుడ్‌కు రికార్డుల పంట పండిరచాలని కోరుకున్నారు. ధీక్ష చిత్రానికి సంబంధించి టెక్నీషియన్స్‌, నటీనటుల వివరాలో అతి త్వరలో ప్రకటించనున్నారు.


Krishnamma on May 10 Through Mythri Movie Makers and Prime Show Entertainments

 మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ విడుదల చేస్తున్న సత్యదేవ్ ‘కృష్ణమ్మ’.. మే 10న గ్రాండ్ రిలీజ్



సత్యదేవ్.. హీరోగా, వెర్సటైల్ యాక్టర్‌గా తనకుంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. పక్కా కమర్షియల్‌ సినిమా అయినా, ఎక్స్ పెరిమెంటల్‌ మూవీ అయినా సత్యదేవ్ తనదైన యాక్టింగ్‌తో అలరిస్తుంటారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకున్నా, ఒక్కో మెట్టూ ఎక్కుతూ తానేంటో ప్రూవ్‌ చేసుకుంటున్నారు హీరో సత్యదేవ్‌. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా ‘కృష్ణమ్మ’. రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం మే 10న గ్రాండ్ రిలీజ్ అవుతుంది.


వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమాను విడుదల చేస్తున్నాయి.


‘కృష్ణమ్మ’ సినిమాలో సత్యదేవ్‌కి జోడీగా అతీరారాజ్ నటించారు.   లక్ష్మణ్‌, కృష్ణ, అర్చన, రఘుకుంచె, నందగోపాల్ కీలక పాత్రల్లో నటించారు.ఇప్పటికే విడుదలైన ‘కృష్ణమ్మ’ మూవీ టీజర్, టైటిల్ సాంగ్, ఏమవుతుందో మనలో.., దుర్గమ్మ అనే లిరికల్ సాంగ్స్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. సత్యదేవ్‌ని సరికొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రంగా ‘కృష్ణమ్మ’ నిలవనుంది. ఈ సినిమాకు కాల భైరవ సంగీతాన్ని, సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.


నటీనటులు:


సత్యదేవ్, అతీరా రాజ్, లక్ష్మణ్ మీసాల, రఘు కుంచె, నందగోపాల్, కృష్ణ, అర్చనా అయ్యర్  తదితరులు


సాంకేతిక వర్గం:


సమర్పణ -  కొరటాల శివ

బ్యానర్ - అరుణాచల క్రియేషన్స్

నిర్మాత - కృష్ణ కొమ్మలపాటి

రచన, దర్శకత్వం - వి.వి.గోపాలకృష్ణ

సంగీతం - కాల భైరవ

సినిమాటోగ్రఫీ - సన్నీ కూరపాటి

ఎడిటర్ - తమ్మిరాజు

ఆర్ట్ - రామ్ కుమార్

పాటలు - అనంత శ్రీరాం

ఫైట్స్ - పృథ్వీ శేఖర్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - రవి సూర్నెడ్డి

పి.ఆర్.ఒ - వంశీ కాకా

Samantha, Raj & DK To Unveil Title & Concept Video Of Ananda Media’s Film

 From The Director Of Cinema Bandi- Samantha, Raj & DK To Unveil Title & Concept Video Of Anupama Parameswaran, Darshana Rajendran, Sangitha, Praveen Kandregula, Ananda Media’s Film



Praveen Kandregula made his debut as a director with the Netflix original Cinema Bandi which won a lot of accolades. While the concept was so fresh and original, Praveen made it realistically and intriguingly. The director is making a feature film debut with a female-centric movie featuring Anupama Parameswaran who is enjoying the success of Tillu Square.


Vijay Donkada, Sreenivasulu P V and Sridhar Makkuva are producing the movie on Ananda Media, while Smt Bhagyalakshmi Posa is presenting it. The movie was announced officially today through this pre-look poster featuring Anupama Parameswaran in a traditional look with a nose ring. Samantha and Raj & DK will unveil the film’s title and concept video tomorrow at 4:56 PM.


Sensational composer Gopi Sundar who is a specialist in scoring melodious and youthful tunes will compose the music for the movie. The other details of the film are awaited.


Cast: Anupama Parameswaran, Darshana Rajendran, Sangitha


Technical Crew:

Story, Screenplay, Direction: Praveen Kandregula

Producers: Vijay Donkada, Sreenivasulu  PV and Sridhar Makkuva

Banner: Ananda Media

Presents: Smt Bhagyalakshmi Posa

Music: Gopi Sundar

PRO: Vamsi-Shekar

Kubera Crucial & Lengthy Shooting Schedule Begins In Mumbai

 ధనుష్, 'కింగ్' నాగార్జున, శేఖర్ కమ్ముల, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 'కుబేర' కీలక & లెన్తీ షూటింగ్ షెడ్యూల్ ముంబైలో ప్రారంభం



గత నెలలో ఫస్ట్‌లుక్‌ విడుదలైన తర్వాత 'కుబేర'పై ఎక్సయిట్మెంట్ రెట్టింపైంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ ఫస్ట్ లుక్‌లో ఊహించని అవతార్‌లో కనిపించారు. కింగ్ నాగార్జున అక్కినేని క్లాస్ అవతార్‌లో కనిపిస్తున్న బ్యాంకాక్ షెడ్యూల్ నుండి స్నీక్ పీక్ మరొక పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చింది. వర్కింగ్ స్టిల్స్‌లో నాగ్ లుక్ రివీల్ కానప్పటికీ, అతనిని స్టైలిష్ లుక్‌లో చూసి అభిమానులు ఫిదా అయ్యారు.


రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్‌లను అందించిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ప్రతిష్టాత్మకంగా 'కుబేర' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ధనుష్, నాగార్జునలను లీడ్ పాత్రలకు ఎంపిక చేయడం ఈ చిత్రానికి మొదటి విజయం. అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (ఏషియన్ గ్రూప్)  బ్యానర్‌పై శ్రీ నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్రంలో ధనుష్ సరసన రష్మిక మందన్న కథానాయిక.  సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.


సినిమా చుట్టూ ఉన్న బజ్‌ని దృష్టిలో ఉంచుకుని, శేఖర్ కమ్ముల అండ్ టీమ్ చాలా జాగ్రత్తతో రూపొందిస్తున్నారు. ఈ సినిమా తాజా షూటింగ్ షెడ్యూల్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. మాగ్నమ్ ఓపస్ కోసం ఈ మ్యాసీవ్ షెడ్యూల్ 12 రోజుల పాటు నగరంలోని వివిధ ప్రదేశాలలో షూట్ చేస్తున్నారు. ఇది కీలకమైన, లెన్తీ షెడ్యూల్. ఈ షెడ్యూల్ లో ధనుష్, రష్మిక మందన్న, ఇతరులతో కూడిన కొన్ని ముఖ్యమైన టాకీ పార్ట్స్, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు చిత్రీకరిస్తున్నారు.  విజువల్స్ చాలా అద్భుతమైన ఉండబోతున్నాయి. టీమ్ విడుదల చేసిన వర్కింగ్ స్టిల్‌లో ధనుష్ వాటర్ పైప్‌లైన్ పైన నిలబడి ఉన్నట్లు ప్రజెంట్ చేస్తోంది.


ఈ ఏడాది వస్తున్న పాన్ ఇండియా చిత్రాలలో హై బడ్జెట్‌తో రూపొందిన సినిమాల్లో కుబేర ఒకటి. ఇంతకుముందు సెన్సిబుల్, కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ చేసిన శేఖర్ కమ్ముల అన్ని కమర్షియల్ హంగులను సరైన నిష్పత్తిలో కలిగి ఉండే కొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరచబోతున్నారు.  ధనుష్, నాగార్జున అభిమానులు తమ అభిమాన స్టార్స్ ని కలిసి తెరపై చూడాలని క్యురియాసిటీతో ఉన్నారు. ధనుష్, నాగార్జున పాత్రలతో పాటు రష్మిక పాత్రకు కూడా మంచి ప్రాధాన్యత ఉంటుంది.


నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.  


తారాగణం: ధనుష్, నాగార్జున అక్కినేని, రష్మిక మందన, జిమ్ సర్భ్ తదితరులు


సాంకేతిక విభాగం:

దర్శకత్వం: శేఖర్ కమ్ముల

సమర్పణ: సోనాలి నారంగ్

బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్

నిర్మాతలు: సునీల్ నారంగ్,  పుస్కుర్ రామ్ మోహన్ రావు

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: నికేత్ బొమ్మి

సహ రచయిత: చైతన్య పింగళి

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్

Producer Rajiv Chilaka Interview About Okkati Adakku

'ఆ ఒక్కటీ అడక్కు' అందరూ కనెక్ట్ అయ్యే కథ. కామెడీ, డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్.. అన్నీ ఎలిమెంట్స్ అద్భుతంగా వుంటాయి. ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు: నిర్మాత రాజీవ్ చిలక



కామెడీ కింగ్ అల్లరి నరేష్  ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు' తో రాబోతున్నారు. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా  హీరోయిన్ గా నటిస్తున్నారు. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. మే 3న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానున్న నేపధ్యంలో నిర్మాత రాజీవ్ చిలక విలేకరులు సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.  


 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమాని నిర్మించడానికి మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి?

 -సినిమాలు నిర్మించాలనే దీర్గకాలిక ప్రణాళికతో పరిశ్రమలోకి వచ్చాను. మంచి కథ కోసం చూస్తున్నపుడు దర్శకుడు మల్లి ఈ కథ చెప్పారు. పెళ్లి అనేది అందరూ రిలేట్ చేసుకునే అంశం. ఈ కథలో కామెడీ, ఎంటర్ టైన్మెంట్, ఎమోషన్స్, ఫ్యామిలీ ఇలా అన్ని ఎలిమెంట్స్ వున్నాయి. ఈ జోనర్ సినిమా మా మొదటి సినిమాగా సెట్ అవుతుందని భావించాం.


యానిమేషన్ రంగంలో చాలా కాలంగా వున్నారు కదా.. సినిమా రంగంలోకి రావడానికి ఇంత కాలం ఎందుకు పట్టింది?

-యానిమేషన్ రంగం చాలా కష్టంతో కూడుకున్నది. ముందు కంపెనీని సుస్థిరం చేసే దిశగా పని చేశాం. మా దగ్గర దాదాపు ఎనిమిది వందల మంది ఉద్యోగులు పని చేస్తారు. వారందరికీ జీతాలు ఇవ్వడం మామూలు విషయం కాదు. అయితే సినిమాలు చేయాలని ఎప్పటినుంచో వుంది. దాదాపు ఆరు యానిమేషన్ చిత్రాలు చేశాం. కంపెనీ స్థిరపడిన తర్వాత సినిమాల్లోకి రావాలని భావించాం. ఈ క్రమంలో కొంత సమయం పట్టింది. ఇకపై వరుసగా సినిమాలని నిర్మిస్తాం.


చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌ గురించి ?

-నా పూర్తి పేరు రాజీవ్ చిలకలపూడి. 2018లో పేరుని రాజీవ్ చిలక అని కుదించాను. ఆ పేరు బాగా కలిసొచ్చింది. ఛోటా భీమ్ పెద్ద హిట్ అయ్యింది. బ్యానర్ కి ఏం పేరు పెట్టాలనే ప్రశ్న వచ్చినప్పుడు చాలా పేర్లు సూచనలుగా వచ్చాయి. అయితే చిలక పేరు పాజిటివ్ గా వుందని అదే పేరుతో చిలక ప్రొడక్షన్స్ ని ప్రారంభించడం జరిగింది.


ఈ కథ విన్నాకా మొదట నరేష్ గారినే అనుకున్నారా?

-ఫస్ట్ అల్లరి నరేష్ గారినే అనుకున్నాం. ఈ కథ విన్నాక మొదట మైండ్ లోకి వచ్చిన రాజేంద్రప్రసాద్ గారు. యంగ్ గా వుంటే ఆయన పర్ఫెక్ట్. ఇప్పుడైతే ఈ కథ నరేష్ గారికే యాప్ట్. నరేష్ గారికి ఈ కథ చాలా నచ్చింది. మేము కథ చెప్పినపుడు ఆయన రెండు సినిమాలతో బిజీగా వున్నారు. ఆయన కోసం వెయిట్ చేసి తీశాం.


మీ మొదటి సినిమాకే పెళ్లి సబ్జెక్ట్ ని ఎంచుకోవడానికి కారణం ?

-ఇది అందరూ రిలేట్ అయ్యే సబ్జెక్ట్. రిలేట్ చేసుకునే ప్రాబ్లం. పెళ్లి అనేది నేటి రోజుల్లో తన ఒక్కడికే సమస్య, తనకే పెళ్లి కావడం లేదనే ధోరణితో చాలా మంది మానసికంగా క్రుంగుబాటుకి గురౌతున్నారు. ఈ రోజుల్లో సెటిల్ అవ్వడం కంటే పెళ్లి అవ్వడం పెద్ద టాస్క్ గా మారింది. ఒకప్పుడు బంధవులు, చుట్టాలు చుట్టుపక్కల ఉంటూ వాళ్ళే పెళ్లి సంబధాలు చూసే వారు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఒకొక్కరూ ఒకొక్క రాష్ట్రంలో, దేశంలో వుంటున్నారు. పెళ్లి కోసం వెబ్ సైట్స్ పై ఆధారపడుతున్నారు. మ్యాట్రీమొనీ సైట్స్ ద్వారానే లక్షల్లో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. పైగా ఇందులో ఒకరిగురించి ఒకరికి తెలీయదు కూడా. జీవితానికి సంబధించిన పెద్ద నిర్ణయాన్ని ఇలా తీసుకుంటున్న పరిస్థితి వుంది. ఇది నేడు యువత ఎదుర్కొంటున్న సమస్య. అందరూ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్. ఈ కథ చాలా వినోదాత్మకంగా చెప్పాం. కామెడీ, డ్రామా, హ్యుమర్ , సాంగ్స్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ అద్భుతంగా వచ్చాయి.


'ఆ ఒక్కటీ అడక్కు' టైటిల్ గురించి ?

-కొన్ని టైటిల్స్ అనుకున్నాం కానీ సరిగ్గా సెట్ కాలేదు. అలాంటి సమయంలో నరేష్ గారే 'ఆ ఒక్కటీ అడక్కు' టైటిల్ సూచించారు. నిజానికి ఈ కథకు యాప్ట్ టైటిల్ ఇది. ఇందులో హీరోని అందరూ పెళ్లి ఎప్పుడని అడుగుతుంటారు. దీంతో ఇరిటేషన్ లో హీరో పలికే సహజమైన డైలాగ్ 'ఆ ఒక్కటీ అడక్కు'.  ఈ టైటిల్ పెట్టడం పెద్ద బాధ్యత. నరేష్ నాన్నగారి క్లాసిక్ సినిమా అది. నరేష్ గారికి ఇంకా భాద్యత వుంది. కథ, అవుట్ పుట్ అన్నీ చూసుకున్నాక సినిమా టైటిల్ డిసైడ్ చేయమని కోరాం. నరేష్ గారు సినిమా చూసి చాలా హ్యాపీగా ఫీలై టైటిల్ వాడుకోవచ్చని పర్మిషన్ ఇచ్చారు.

 

ఈ కథలో ట్విస్ట్ లు ఉన్నాయా ?

-ఇందులో కొన్ని ఆసక్తికరమైన ట్విస్ట్ లు వున్నాయి. స్క్రీన్ ప్లే కథలో లీనం చేస్తుంది. ఆద్యంతం ప్రేక్షకులని హోల్డ్ చేస్తుంది.


దర్శకుడిగా మల్లి అంకంను ఎంపిక చేయడానికి కారణం?

-తను చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. దాదాపు ఇరవై ఏళ్ళుగా పరిశ్రమలో వున్నారు. నాకు ముందు నుంచి పరిచయం వుంది. తను అనుకున్న కథని చాలా అద్భుతంగా తీశాడు.


హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి ?

-నరేష్ గారు హైట్ ఎక్కువ వుంటారు. నిజానికి ఆయన ఎత్తుకి చాలా మంది హీరోయిన్స్ సరిపోరు. ఆయన హైట్ ని మ్యాచ్ చేయడానికి ఫారియా అయితే బావుంటుందనిపించింది. అలాగే ఫారియా కామెడీ టైమింగ్ కూడా బావుటుంది. ఈ కథ నచ్చి ఫారియా ప్రాజెక్ట్ లోకి వచ్చారు. అలాగే జానీ లీవర్ గారి అమ్మాయి జెమి లివర్ ఇందులో కీలక పాత్రలో కనిపిస్తారు. దీంతో పాటు మురళి శర్మ, వెన్నెల కిషోర్, వైవా హర్ష వీరందరి పాత్రలు వినోదాత్మకంగా వుంటాయి.


గోపిసుందర్ మ్యూజిక్ గురించి ?

-మ్యూజిక్ కు చాలా ప్రాధాన్యత ఇస్తాం. అందుకే గోపి సుందర్ గారిని ఎంపిక చేశాం.  సాంగ్స్ చాలా బాగా ఇచ్చారు. నేపధ్య సంగీతంలో ఎమోషన్ అద్భుతంగా పండింది.


యానిమేషన్స్ లో కొత్త ప్రాజెక్ట్స్ ?

-ఛోటా భీమ్ ని రియల్ పిల్లలతో చేయబోతున్నాం. అలాగే డిస్నీలో ఒక యానిమేషన్ షో లాంచ్ కాబోతుంది. అది ఛోటా స్టార్ట్ అఫ్ గా చేస్తున్నాం. చాలా ఫన్ గా వుంటుంది. మే6న లాంచ్ కాబోతుంది.


నిర్మాతగా ఎలాంటి సినిమాలు చేయాలని వుంది ?

-మంచి ఫ్యామిలీ సినిమాలు తీయాలని వుంది. అలాగే ఫాంటసీ, హిస్టారికల్, కామెడీ జోనర్స్ చేయాలని వుంది.


ఆల్ ది బెస్ట్

-థాంక్స్


Sahya Movie First Look Launched by Hero Arjun

"సహ్య" మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్ హీరో అర్జున్ చేతులమీదుగా విడుదల !!!



సుధా క్రియేషన్స్ బ్యానర్ పై మౌనిక  రెడ్డి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం సహ్య. 

 జుకంటి, భాస్కర్ రెడ్డిగారి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాతో యాస రాకేష్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 


ఈ సినిమా ఫస్ట్ లుక్ ను హీరో అర్జున్ విడుదల చేశారు. ఈ సందర్బంగా అర్జున్ మాట్లాడుతూ... "కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న సహ్య సినిమా పోస్టర్, టైటిల్ అద్భుతంగా  ఉన్నాయి, మంచి కాన్సెప్ట్ తో వస్తోన్న ఫీమేల్ లీడ్ సినిమాలు బాగా సక్సెస్ అవుతున్నాయి, అదే విధంగా ఈ సహ్య సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్న అన్నారు. 


 సహ్యా సినిమా టీజర్, ట్రైలర్ ను త్వరలో విడుదల చేయబోతున్నట్లు చిత్ర దర్శకుడు యాస రాకేష్ రెడ్డి  తెలిపారు


ఈ సినిమాలో మెయిన్ లీడ్ లో నటించిన మౌనిక రెడ్డి భీమ్లా నాయక్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది, అలాగే బలగం, రాజాకర్ సినిమాల్లో మంచి ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటించిన సంజయ్ కృష్ణ సహ్య సినిమాలో మరొక  లీడ్ గా నటించారు. రవీందర్ రెడ్డి, సుమన్, భాను, నీలేష్, ప్రశాంత్ తదితరులు ఈ మూవీలో ముఖ్య పాత్రలలో  నటిస్తున్నారు. ఈ మూవీకి అరుణ్ కోలుగురి సినిమాటోగ్రఫీ,  రోహిత్ జిల్లా సంగీతం సమకూరుస్తున్నారు. 


 

Family Star" will be available for streaming from Tomorrow on Amazon Prime

 

రేపటి నుంచి అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వస్తున్న విజయ్ దేవరకొండ "ఫ్యామిలీ స్టార్"


విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "ఫ్యామిలీ స్టార్" డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయ్యింది. రేపటి నుంచి ఈ సినిమా అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ అర్థరాత్రి నుంచే ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది. 

ఈ నెల 5వ తేదీన రిలీజైన "ఫ్యామిలీ స్టార్" సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా సకుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండ, మృణాల్ పర్ ఫార్మెన్స్ కు మంచి పేరు వచ్చింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్, పరశురామ్ పెట్ల చూపించిన ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాకు ఆకర్షణగా నిలిచాయి. "ఫ్యామిలీ స్టార్" సినిమాను ఓటీటీలో చూసేందుకు ఫ్యామిలీ ఆడియెన్స్ వెయిట్ చేస్తున్నారు.

"ఫ్యామిలీ స్టార్" సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందించారు. "ఫ్యామిలీ స్టార్" చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరించారు.