Home » » Thiram songs Dedicated to Spb

Thiram songs Dedicated to Spb

 


*మా "తీరం" చిత్రంలోని పాటలు   ఎస్.పి. బాలు గారికి అంకితం- దర్శక-నిర్మాత అనిల్ ఇనమడుగు!!* 


గాన గంధర్వుడు స్వర్గీయ శ్రీ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా..  "తీరం" చిత్రంలోని పాటలన్ని ఆయనకు అంకితం చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు..  తీరం చిత్రంలోని  ఆయన పాడిన చివరి పాట "అసలేంటీ ప్రేమా" పాటతోబాటు, చిత్రంలోని మిగిలిన 8 పాటలను కూడా ఎస్.పి. బాలూ గారికి అంకితం చేశారు. ఆయన సృతికి అంకితం చేసిన ఈ పాటలను ఏ ఆడియో కంపెనీకీ అమ్మకుండా, శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానులకోసం పూర్తి ఉచితంగా "ఫ్రీ టు ఎయిర్" గా విడుదల చేశారు. ఈ సందర్బంగా జూన్ 4న హైదరాబాద్ జూబ్లీహిల్స్ సినెటేరియా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో "తీరం" సినిమా హీరో శ్రావణ్ వైజిటి, మరో హీరో మరియు దర్శకులు అనిల్ ఇనమడుగు, హీరోయిన్ క్రిష్టెన్ రవళి, సినెటేరియా అధినేత వెంకట్ బులెమోని, సినెటేరియా నిర్మాత శ్రీలత, సునిల్, అజయ్, ప్రభు ఆకాశ్ తదితరులు పాల్గొన్నారు.


అకి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు, అపర్ణ, క్రిష్టెన్ రవళి నాయికా నాయకులుగా నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో  మ్యూజికల్ లవ్ స్టోరీగా అనిల్ ఇనమడుగు స్వీయ దర్శకత్వంలో   "తీరం" సినిమాని నిర్మించారు. ఈ చిత్రాన్ని  సినెటేరియా మీడియా వర్క్స్ సంస్థ ద్వారా థియేటర్, డిజిటల్, శాటిలైట్ మరియు ఓవర్సీస్ మార్కెట్లలో సినిమా థియేటర్లు ఓపెన్ అయిన తరువాత విడుదల చేయనున్నారు.


 *ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ..* "తీరం 'సినిమాలోని బాలు గారు పాడిన ఏంటీ ప్రేమ'  పాట విన్నాను.. బ్యూటిఫుల్ గా ఉంది. సాహిత్యం పరంగా వేటూరి గారిని, కెమెరా పనితనం పరంగా బాలూమహేంద్ర గారిని, గాత్రం పరంగా బాలూలోని నవయవ్వన మధురస్వరం" మనల్ని మైమరపించేలా ఉంది అని ఆయన తెలిపారు.


 *ప్రముఖ పాటల రచయిత శ్రీ సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ..* "75 సంవత్సరాల బాలూలోని యువస్వరాన్ని ఆవిశ్కరించింది ఈ తీరం లోని పాట" అన్నారు.. 


 *ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ..* "తీరం సినిమాలో సంగీతం, సాహిత్యం బాలూ గాత్రంలో అమృతమై కురిసిందనీ, ఆ అమృతాన్ని ప్రతిఒక్కరూ ఆస్వాదించాలని" కోరుకుంటూ యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు. 


 *సంగీత దర్శకులు శ్రీ రఘురాం మాట్లాడుతూ...* "బాలూ గారి స్మృథ్యర్థం ఈ చిత్రంలోని పాటలను" ఆయనకు అంకితం ఇవ్వడం చాలా గొప్ప నిర్ణయమనీ, ఆ మధురమైన పాట ప్రేక్షకులు హృదయాలలో నిలిచి ఉంటుందని" తెలిపారు.


 *చిత్ర దర్శకుడు, నిర్మాత అనిల్ ఇనమడుగు మాట్లాడుతూ...* "ప్రముఖ గాయకులు స్వర్గీయ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు, తను అనారోగ్యానికి గురికావడానికి మూడు రోజులముందు చెన్నై లోని కోదందపాణి సినీ స్టూడియోలో మా చిత్రం కోసం "ఏంటీ ప్రేమా" అనే పాట పాడారు. ఆ తరువాత మూడురోజులకే ఆయన కొవిడ్ బారినపడి హాస్పిటల్ లో జాయిన్ అయ్యి, ఆతరువాత మనకు అందనంత దూరం వెళ్ళిపోయారు. పాట పాడుతున్నప్పుడు, సంగీతం.. సాహిత్యం ఒకదానికొకటి పోటీ పడ్డాయి అన్నట్లు గా తీర్చి దిద్దారనీ, పాట ఖచ్చితంగా హిట్ అవుతుందని నన్ను అభినందించారు బాలు గారు.  ఆయన మా సినిమా కోసం పాడిన ఈ "ఏంటీ ప్రేమ" పాటతోబాటు, సినిమాలో ఉన్న మిగిలి 8 పాటలను కూడా ఏ ఆడియో కంపెనీకీ అమ్మకుండా, స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం గారి దివ్యసృతికి అంకితం ఇస్తున్నాము. అన్ని టెలివిజన్, రేడియో, డిజిటల్ మాధ్యమాలలో ఈ పాటను ఉచితంగా వినేలా "ఫ్రీ టు ఎయిర్" విధానంలో ఈరోజు విడుదల చేస్తున్నామని తెలిపారు.


 *హీరో ప్రశాంత్ వైజిటి మాట్లాడుతూ..* "తీరం సినిమా చాలా బాగా వచ్చింది. సినిమాలోని పాటలు యువతరాన్ని బాగా ఆకట్టుకునెలా ఉంటాయి. ఇంట్రెస్టింగ్ గా సాగే ఎమోషనల్ లవ్ ప్రేక్షకులను భావోద్వేగానికి  గురిచెయ్యడం ఖాయమనీ, ఈ సినిమా ఖచ్చితంగా యూత్, ప్రేక్షకులను మెప్పించి ఘనవిజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నాం.. అన్నారు. 


 *హీరోయిన్ క్రిష్టెన్ రవళి మాట్లాడుతూ..* " స్వర్గీయ మహా గాయకుడు స్వర్గీయ శ్రీ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారు మా తీరంలో  ఆలపించిన 'ఏంటీ ప్రేమ' పాటలో నటించే అవకాశం రావడం నిజంగా నా అదృస్టం. ఈ సినిమాలో నా పాత్ర పూర్తి స్థాయిలో భావోద్వేగంతో కూడుకుని.. చిలిపిగా ఉంటూనే నటనకు ఆస్కారమున్న పాత్ర చేశాను.. ఇంత మంచి క్యారెక్టర్ డిజైన్ చేసిన అనిల్ గారికి నా స్పెషల్ థాంక్స్.. అన్నారు. 


 *సినెటేరియా అధినేత వెంకట్ బులెమోని మాట్లాడుతూ..* " ఈ "తీరం" సినిమాను చూశాను.. అత్యద్భుతంగా వచ్చింది. ప్రతి సీను విజువల్ గా అదిరిపోయింది. ఈ మధ్యకాలంలో నాకు బాగా నచ్చిన సినిమా ఇది.. అందుకే మా  సినెటేరియా మీడియా వర్క్స్ ద్వారా  లాక్ డౌన్ అయిపోగానే తీరం సినిమాను అత్యధిక థియేటర్స్ లలో గ్రాండ్ గా విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. 

  

 చిత్ర సంగీత దర్శకుడు ప్రశాంత్ బి.జె మాట్లాడుతూ... స్వరీయ ఎస్.పి. బాలు గారితో పనిచేయడం నా పూర్వజన్మ సుకృతం. ఏంటీ ప్రేమ పాట రికార్డింగ్ సందర్భంగా శ్రీ ఎస్.పి. బాలూ గారు ఇచ్చిన సలహాలు, సూచనలు నా జీవితానికి మంచి మార్గాన్ని సూచించాయి.. అది ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేను.. అన్నారు.


 *అకి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై నిర్మించిన "తీరం" చిత్రానికి రచన మరియు దర్శకత్వం: అనిల్ ఇనమడుగు, సినెమాటోగ్రాఫర్ మరియు ఎడిటింగ్: శ్రావణ్ జి. కుమార్, సంగీతం ప్రశాంత్ బి.జె. పిఆరోఓ; జిల్లా సురేష్.*


Share this article :