Latest Post

Sri Kodi Rama Krishna Film Awards Event Held Grandly

 రంగరంగ వైభవంగా కోడిరామకృష్ణ పుట్టినరోజు వేడుకలు లో



లెజండరీ దర్శకులు  కోడిరామకృష్ణ గారు తను తీసిన సినిమాలలో సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ జరుపుకోవడం విశేషం. ప్రేక్షకులు మెచ్చే సినిమాలెన్నో తీసి శతాదిక చిత్ర దర్శకునిగా జయకేతనం ఎగురవేసిన తను జీవితంలో 10 నంది అవార్డులు, రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులు,2012 లో రఘుపతి వెంకయ్య నాయుడు  అవార్డులను స్వీకరించిన  కోడిరామకృష్ణ గారు 




లెజండరీ దర్శకులు కోడిరామకృష్ణ గారి జయంతిని పురస్కరించుకొని భారత్ ఆర్ట్స్ అకాడమీ, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ఎబిసి ఫౌండేషన్ & వాసవి ఫిల్మ్ అవార్డ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో కోడి రామకృష్ణ  ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమం సినీ అతిరధుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన  నిజామాబాద్ యం.యల్.ఎ బీగాల గణేష్ గుప్త, నటుడు సుమన్, గజల్ శ్రీనివాస్, సీనియర్ నటి దివ్యవాణి, నటుడు నిర్మాత, అశోక్ కుమార్, నిర్మాత వాకాడ అప్పారావు, చికోటి ప్రవీణ్ గారు , బి. ప్రవీణ్ కుమార్ లతో చాలామంది సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సేవారంగం, నాటక రంగం, సినిమా రంగం ఇలా వివిధ రంగాలలో ప్రతిభను చూపిన సుమారు 30మందికి ఈ కార్యక్రమంలో కోడి రామకృష్ణ అవార్డులను ఇస్తూ అందరికీ న్యాయం చేయడం జరిగింది.

హీరో సుమన్ గారికి కోడిరామకృష్ణ జీవన సౌఫల్య  పురస్కారం అవార్డుతో పాటు లెజండరీ అవార్డు ను బహుకరించడం జరిగింది. ఈ అవార్డ్స్ కార్యక్రమం అనంతరం 


 

హీరో సుమన్ మాట్లాడుతూ.. నాకు లైఫ్ ఇచ్చింది కోడి రామకృష్ణ గారే ఈ రోజు తనపేరుతో జీవన సౌఫల్య  పురస్కారం అవార్డును అందుకోవడం సువర్ణ అవకాశంగా  భావిస్తున్నాను అని అన్నారు 



నిజామాబాద్ యం.యల్.ఎ బీగాల గణేష్ గుప్త మాట్లాడుతూ.. మనిషి బతికున్నప్పుడు అందరూ దగ్గరుంటారు అయితే అయన లేకున్నా ఆయనతో ఏవిధమైన సహాయ సహకారాలు అందుకోక పోయినా ఆయన తీపి గుర్తులు  ప్రేక్షకులకు తెలియ జేయాలనీ అతని పేరు మీద కోడిరామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ చేయడం  రామ సత్యనారాయణ గ్రేట్ అని అన్నారు 



నటుడు నిర్మాత, అశోక్ కుమార్ మాట్లాడుతూ.. నేను చెవిలో పువ్వు సినిమా కు నిర్మాతగా వున్నపుడు కోడిరామకృష్ణ గారిని కలవడం జరిగింది. అప్పుడు తను నాకు భారత్ బంద్ సినిమాలో మంచి వేషం ఇస్తాను చెయ్యమని చెప్పాడు. నేను చేయలేను నాకు భయం అన్నా వినకుండా నాతో చేయించడంతో నేను నటుడుగా  పరిచయమవ్వడం జరిగింది. మహా దర్శకులైన కోడిరామకృష్ణ గారు ఎందరో ఆర్టిస్టులను తీర్చి దిద్దారు. యం. యస్. రెడ్డి, అంకుశం సినిమాలో రామిరెడ్డి, క్యాస్టూమ్ కృష్ణ  వీరంతా నటులు కాదు వీరంతా వేరే ప్రొఫెషన్స్ లో ఉన్నా కూడా వారిని నటులుగా బిజీ చేసిన వ్యక్తి కోడిరామకృష్ణ గారు . అటువంటి మహానుభావుడి వల్లే నేను భారత్ బంద్ తరువాత నటుడుగా బిజీ అవ్వడం జరిగింది. అంటే ఒక మనిషి లైఫ్ ను కెరియర్ ను ఎలా టర్న్ చెయ్యచ్చో తెలిసిన వ్యక్తి కోడిరామకృష్ణ గారు. ఆయన్ను ఇంకా గుర్తించుకొని మా రామ సత్యనారాయణ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించి నందుకు ఆయనకు మరొక్కసారి అభినందనలు తెలుపుతున్నాను. మనిషి ఉన్నా లేకున్నా స్నేహం చిరకాలం ఉంటుంది అని గుర్తు చేసిన వ్యక్తి రామ సత్యనారాయణ గారు అని అన్నారు.



సీనియర్ నటి దివ్యవాణి మాట్లాడుతూ.. కోడిరామకృష్ణ గారు ఎంతమందికి ఎన్ని సహాయాలు చేశాడు.సూపర్ హిట్ సినిమాలు ఇచ్చాడో మనందరికీ  తెలుసు. ఒక శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి ఐదు సినిమాలు సూపర్ హిట్ లు, యం. యస్. రాజు గారికి నాలుగు సూపర్ హిట్ సినిమాలు  ఇచ్చారు .ఇంతమందికి ఇన్ని హిట్స్ ఇచ్చినరు. చిన్న నాటి మిత్రుడిగా రామ సత్యనారాయణ ఈ కార్యక్రమం చేయడం చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను అని చెప్పారు.



నటుడు నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. కోడిరామకృష్ణ గారికి నేనంటే ఎంతో ఇష్టం. తనకు సినిమా అంటే ఎంత ప్రేమో.. నాటకాలు, నాటికలు అన్నా అంతే ప్రేముండేది. ఈ రోజు తన పేరుతో ఈ అవార్డ్స్ ఫంక్షన్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.ఈ అవార్డ్స్ అన్ని రంగాలలో ఉత్తమ ప్రతిభ  చూపిన వారికి   అందజేయడం జరిగింది అన్నారు.



 తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, కొత్త వెంకటేశ్వర్ రావు, బి. రమణారావు లు నిర్వహించిన కోడిరామకృష్ణ అవార్డ్స్ కార్యక్రమానికి వచ్చిన అనేకమంది  పాల్గొని కోడిరామకృష్ణ స్మృతులను గుర్తుకు చేసుకున్నారు

Ariaana, Viviana''s friendship song likely to become a major chartbuster

 Ariaana, Viviana''s friendship song likely to become a major chartbuster




Vishnu Manchu's cute little daughters Ariaana and Viviana Manchu have made their singing debut in Tollywood. Their latest single on friendship 'Idhi Sneham' is making netizens swoon on the internet. This heartfelt and heart-warming song from the upcoming movie titled 'Ginna' is fast catching up with music lovers on the social media. 


The film features Vishnu Manchu, Paayal Rajput and Sunny Leone in the lead. Produced by Vishnu Manchu, the film is being helmed by Suryaah. Cinematographer Chota K Naidu is rendering the camera work for the film while Anup Rubens's soulful music has sky-rocket expectations. 


The soulful single 'Idhi Sneham' has become an instant hit on social media. The track composed by Anup Rubens and the heartwarming lyrics rendered by Bhaskar Bhatla is what make the song stand apart. With Ariaana and Viviana Manchu making their acting and singing debut, Manchu family has successfully launched their generation into Tollywood.


Vijay Antony starrer Doshi First Look revealed

 Infiniti Film Ventures Presents

Filmmaker CS Amudhan directorial

Vijay Antony starrer Doshi First Look revealed 



The makers of Vijay Antony starrer "Doshi" have revealed the First look, which looks intense and promising. While the first look generated a strong impact and good expectations for this movie, the new look elevates the graph. 


Director CS Amudhan says, “Doshi” is a crime drama that focuses on a crime that has never occurred in the history of mankind.


Doshi is directed by CS Amudhan and is produced by Kamal Bohra, G. Dhananjayan, B. Pradeep & Pankaj Bohra of Infiniti Film Ventures. It features Vijay Antony as the lead character and Mahima Nambiar, Nandita Swetha & Ramya Nambeesan as the female lead roles. Besides, Stand-up comedian Jagan, Nizhalgal Ravi, John Mahendran, Kalai rani, Mahesh (Family man), OAK Sundar, Meesha Goshal, and Ameya are appearing in prominent characters. "Tamizh Padam" fame Kannan is composing music, Gopi Amarnath is handling cinematography & Suresh is taking care of editing.  'Doshi' is far different from the 'Tamizh Padam' series by CS Amudhan & team. While the famous franchise of spoof-based flicks boasted of unlimited humour, 'Ratham' will be a hard-hitting crime drama. 


The film is now in post-production stage and official announcement on the film’s single release, audio, trailer, and worldwide theatrical release will be out soon

O Tene Palukulu Video Song From Nandamuri KalyanRam Bimbisara Movie Launched

 నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ‘బింబిసార’ చిత్రం నుంచి ‘తేనె పలుకుల.. ’ వీడియో సాంగ్ రిలీజ్




‘‘ఓ తేనె పలుకుల అమ్మాయి.. నీ తీగ నడుములో సన్నాయి లాగిందే’’ అని అందమైన రాజకుమారి పాత్రలో ఉన్న క్యాథరిన్ ట్రెసాను చూసి  రాజు పాత్రలోని నందమూరి కళ్యాణ్ కొంటెగా పాడుతుంటే.. దానికి బదులుగా ఆమె ‘‘ఓ కోర మీసపు అబ్బాయి నీ ఓర చూపుల లల్లాయి.. బాగుందోయ్’’ అంటూ అతనిలో చిలిపిదనాన్ని మరింతగా రెచ్చగొడుతుంది. 


మరి వీరిద్దరూ మధ్య ప్రేమ ఏంటి? ఎలాంటిదో తెలుసుకోవాలంటే ‘బింబిసార‌’ సినిమా చూడాల్సిందేనని అంటున్నారు మేకర్స్. 


కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన చిత్రాల్లోనటిస్తూ తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న ...నందమూరి కథానాయకుడు కళ్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘బింబిసార’.  నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై హ‌రికృష్ణ‌.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ ట్యాగ్ లైన్. వ‌శిష్ఠ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఆగస్ట్ 5న ఈ చిత్రం గ్రాండ్ లెవల్లో రిలీజ్ అవుతోంది. 


బింబిసార చిత్రంలో కళ్యాణ్ రామ్ మగధ సామ్రాజ్యాధినేత బింబిసారుడిగా కనిపిస్తున్నారు. ఆయ‌న పాత్ర‌లోని వాడి, వేడిలో.. శ‌త్రు భ‌యంక‌రుడిగా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌ళ్యాణ్ రామ్ ఎలా మెప్పించార‌నే విష‌యాన్ని ట్రైల‌ర్‌తో సింపుల్‌గా ట‌చ్ చేశారు. ఆయ‌న లుక్ డిఫ‌రెంట్ ఆద్యంతం ఆస‌క్తిని పెంచుతోంది. రీసెంట్‌గా రిలీజైన ట్రైల‌ర్, పాట‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. శ‌నివారం ఈ సినిమాను ‘ఓ తేనె పలుకుల అమ్మాయి..’ అనే వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. వ‌రికుప్ప‌ల యాద‌గిరి ఈ పాట‌ను రాయ‌టంతో పాటు పాట‌కు అద్భుత‌మైన ట్యూన్‌ను కంపోజ్ చేశారు. హైమంత్ మ‌హ్మ‌ద్‌, స‌త్య యామిని ఈ పాట‌ను పాడారు. 


ఛోటా కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి చిరంత‌న్ భ‌ట్ మ్యూజిక్‌. ప్ర‌ముఖ సీనియ‌ర్‌ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి నేప‌థ్య సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి పాట‌లు:  సిరి వెన్నెల సీతారామ‌శాస్త్రి, రామ‌జోగ‌య్య శాస్త్రి, డాన్స్‌:  శోభి, ర‌ఘు, ఫైట్స్‌:  వెంక‌ట్‌, రామ‌కృష్ణ‌, వి.ఎఫ్‌.ఎక్స్‌:  అనిల్ ప‌డూరి, ఆర్ట్‌:  కిర‌ణ్ కుమార్ మ‌న్నె, ఎడిట‌ర్‌:  త‌మ్మిరాజు, మ్యూజిక్‌:  చిరంత‌న్ భ‌ట్‌, నేప‌థ్య సంగీతం:  ఎం.ఎం.కీర‌వాణి, సినిమాటోగ్ర‌ఫీ:  ఛోటా కె.నాయుడు, ప్రొడ్యూస‌ర్‌: హ‌రికృష్ణ.కె, ద‌ర్శ‌క‌త్వం: వ‌శిష్ఠ్‌.

Director Vamsi Paidipally Congratulated Colour Photo Team for Achieving National Award

 సెలెబ్రేషన్స్ తెలుగు సినిమా.. ఎంతో గర్వంగా ఉంది.. ‘కలర్ ఫోటో’కు జాతీయ అవార్డు రావడంపై డైరెక్టర్ వంశీ పైడపల్లి



68వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో భాగంగా కలర్ ఫోటో సినిమాకు ఉత్తమ జాతీయ చిత్రంగా ఎంపికైంది. కలర్ ఫోటో సినిమా ఆహాలో నేరుగా స్ట్రీమింగ్ అయిందన్న సంగతి తెలిసిందే. ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికవ్వడంతో ఆహా టీం, కలర్ ఫోటో యూనిట్ మీడియా ముందుకు వచ్చింది. జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీం అంతా కూడా పాల్గొంది.


వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ‘కలర్ ఫోటో సినిమాకు అవార్డు రావడం ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ఇది కలర్ ఫోటోకు మాత్రమే కాదు.. ఇది సెలెబ్రేషన్స్ తెలుగు సినిమా. అవార్డును ప్రకటించిన తరువాత వచ్చిన కాల్స్, మీ ఎమోషన్స్ అన్నీ కూడా చూస్తున్నాను. ఇలాంటి గుర్తింపు వస్తుంటే.. దీని కోసం ఎంతైనా కష్టపడొచ్చని అనిపిస్తుంది. తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన చిత్రాల్లో కలర్ ఫోటో 68వ సినిమాగా నిలిచింది. ఇది అందరికీ గర్వకారణం. విజ్ఞాన్ భవన్‌లో అవార్డు అందుకునే సమయంలో కలిగే ఫీలింగ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నేషనల్ అవార్డు అనేది మన ఇంటి గోడ మీదుంటే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేం. రూంలో కెమెరాలు పెట్టుకుని చిన్న చిన్న స్కిట్లు చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చారు. సుహాస్, సందీప్, సాయి రాజేష్, కాళ భైరవ వంటి వారు ముందుకు వచ్చారు. నిజాయితీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్యాషన్, కమిట్మెంట్, హార్డ్ వర్క్‌‌తోనే టీం అంతా కలిసి పని చేయడంతోనే ఈ గుర్తింపు వచ్చింది. క్లైమాక్స్‌లో చాందినీ నటనను చూసి నా కంట్లో నీళ్లు తిరిగాయి. అప్పుడే ఈ సినిమా స్థాయి అర్థమైంది. పదేళ్లు అయినా కూడా ఈ సినిమా టీవీల్లో వస్తే సందీప్‌కు అందరూ మెసెజ్‌లు చేస్తారు. మంచి కంటెంట్ ఇచ్చేందుకు అందరూ ప్రయత్నిస్తారు. సందీప్, సాయి రాజేష్ నెక్ట్స్ సినిమాల గురించి నేను ఎదురుచూస్తున్నాను. అల వైకుంఠపురములో సినిమాకు గానూ తమన్‌కు అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఆహా, కలర్ ఫోటో టీంకు కంగ్రాట్స్’ అని అన్నారు.  


దర్శకుడు సందీప్ రాజ్ మాట్లాడుతూ.. ‘లాక్డౌన్ తరువాత ఆహాలో ఈ చిత్రం విడుదలైంది. రెండేళ్లు అవుతోందని అనుకున్నాం. ఎక్కడికీ వెళ్లినా ఆ సినిమాతో మమ్మల్ని గుర్తిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఈ అవార్డు రావడంతో ఎంతో సంతోషంగా అనిపిస్తోంది. థియేటర్‌లో వచ్చే కలెక్షన్లతో ఓ వ్యాల్యూ వస్తుంది.. కానీ మాది ఓటీటీలో వచ్చింది. నిజంగానే మాకు అంత రీచ్ వచ్చిందా? అనే అనుమానం ఉంది. కానీ నిజంగానే మంచి సినిమా తీశామని మాకు ఇప్పుడు అర్థమైంది. నిజాయితీతో సినిమా తీస్తే అందరూ సినిమాను ప్రేమిస్తారని అర్థమైంది. ఆటోవాలా నుంచి ఢిల్లీలో కూర్చున్న జ్యూరీ వాళ్లకు కూడా నచ్చుతుందని అర్థమైంది. మమ్మల్ని ఎంకరేజ్ చేసిన అందరికీ థ్యాంక్స్. ఈ అవార్డు రావడంతో మా మీద ఇంకా బాధ్యత పెరిగింది. ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తామ’ ని అన్నారు.


కార్తీక్ మాట్లాడుతూ.. ‘కలర్ ఫోటోకు అవార్డు వచ్చిందన్న విషయం తెలియడంతో మా అందరి ఫోన్లు మోగుతూనే ఉన్నాయి. మాకున్న ఈవెంట్, మీటింగ్‌లను క్యాన్సిల్ చేసుకుని ఈ ప్రెస్ మీట్ నిర్వహించాం. మా ఆనందాన్ని అందరితో పంచుకుందామని అనుకున్నాం. వంశీ పైడిపల్లితో మాకున్న అనుబంధంతో ఇక్కడకు వచ్చారు. ఆహా వంద శాతం తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తామని మాటిచ్చాం. కలర్ ఫోటో సినిమా కంటే అచ్చమైన తెలుగు సినిమా ఉండదేమో. చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అని మేం చూడం. కంటెంట్ బాగుంటే దాన్ని వీలైనంతగా ప్రమోట్ చేస్తాం. ఆహాలో కలర్ ఫోటో వ్యూస్ పరంగా ఇప్పటికీ టాప్ 3లో ఉంది. అవార్డు ప్రకటించిన తరువాత మళ్లీ ఈ లెక్కలు పెరుగుతున్నాయి’ అని అన్నారు.


వాసు మాట్లాడుతూ.. ‘తెలుగు సినిమా విజయాన్ని సెలెబ్రేట్ చేసుకునేందుకు మనమంతా ఇక్కడకు వచ్చాం. కాస్ట్ అండ్ క్రూ గురించి చెప్పేముందు ఆహా ప్రయాణం గురించి చెబుతాను. కొత్త టాలెంట్‌ను పట్టుకుని గొప్ప సినిమాలు తీయాలని అరవింద్ గారు ఆహాను ప్రారంభించారు. సాయి రాజేష్, బెన్నీ గారితో కలిసి సందీప్ రాజ్ ఓ కొత్త జర్నీ ప్రారంభించారు. ఎంతో నిజాయితీతో ఈ కథను రాశారు. విధి అన్నింటిని కలుపుతుందని అంటారు కదా. అలానే కలర్ ఫోటో, ఆహా కలిశాయి. నిర్మాతలైన సాయి రాజేష్, బెన్నీ.. దర్శకుడు సందీప్ రాజ్‌కు థ్యాంక్స్. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్’ అని అన్నారు.


హీరో సుహాస్ మాట్లాడుతూ.. ‘ముందు మా నిర్మాతలు సాయి రాజేష్, బెన్నీ అన్నలకు థ్యాంక్స్ చెప్పాలి. వాళ్లు నమ్మి నన్ను హీరోగా పెట్టుకోవడం వల్లే ఇదంతా జరిగింది. సాయి రాజేష్ అన్న స్టోరీ ఇచ్చి హీరోగా చేయ్ అన్నప్పుడు నాకు భయం వేసింది. మొత్తానికి చేశాం. చాలా హ్యాపీగా ఉంది. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్’ అని అన్నారు.


చాందినీ చౌదరి మాట్లాడుతూ.. ‘కలర్ ఫోటో సినిమా మేం చేస్తున్నప్పుడు మంచి కథ చెబుతున్నాం, మంచి కథలో భాగం అవుతున్నామనే ఐడియాతో ముందుకు వెళ్లాం. దానికి ఈ రోజు జాతీయస్థాయిలో గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. కలర్ ఫోటో సినిమాకు, ఆ అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు రుణపడి ఉంటాను. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. నాకు మాటలు రావడం లేదు. ఇలాంటి గుర్తింపు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. నా జీవితంలో ఈ సినిమా, ఈ కథ ఎంతో ముఖ్యమైనవి. ఈ సినిమా ఇంత మంచి గుర్తింపు ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్’ అని అన్నారు.


నటి దివ్య మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో నేను పద్దు అనే చిన్న పాత్రను పోషించాను. సినిమా అనేది చాలా పెద్దది. టీం అంతా కలిసి కష్టపడి పని చేస్తేనే ఇలాంటి గుర్తింపు వస్తుంది. అందులో ఒక డిపార్ట్మెంట్ అయిన యాక్టింగ్‌లో నాది ఒక పార్ట్. ఈ అవార్డు రావడంతో నాకు ఎంతో సంతోషంగా, ఆనందంగా అనిపిస్తుంది. టీం అంతా కలిసి కష్టపడితే ఇలాంటి అవార్డులు వస్తాయని చెప్పడానికి కలర్ ఫోటో ఒక ఉదాహరణ. ప్రతీ సినిమాకు అందరూ కష్టపడి చేస్తారు. అయితే ఈ సినిమాకు అందరూ ఎంతో ఇష్టపడుతూ కష్టపడ్డారు’ అని అన్నారు.


కమెడియన్ హర్ష మాట్లాడుతూ.. ‘మొదటి రోజు నుంచే ఈ సినిమా కోసం అందరూ ఎంతో నిజాయితీగా పని చేశారు. అవార్డులు అనేవి చేసిన పనికి గుర్తింపులాంటివి. ఈ చిత్రాన్ని నిర్మించినందుకు నిర్మాతలకు థ్యాంక్స్. సందీప్ ఇంకా ఏం చేస్తారో చూడాలి. మీడియా కూడా ఈ సినిమాను ప్రోత్సహించింది. ఆహా వల్ల ఈ సినిమా ప్రేక్షకుల దగ్గరకు నేరుగా వెళ్లింది’ అని అన్నారు.


దర్శక నిర్మాత సాయి రాజేష్ మాట్లాడుతూ.. ‘జాతీయ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ప్రశాంతంగా జరిగిందని అంతా అనుకుంటారు. కానీ దాని వెనకాల ముగ్గురున్నారు. నా మొదటి చిత్రం ఏడాదిన్నర, రెండేళ్లు తీశాను. రెండో సినిమా ఐదేళ్లు తీశాను. మూడో సినిమా 38 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. ఆరు నెలల్లో విడుదల చేశాను. దీనికి కారణం ముగ్గురు వ్యక్తులు. అరవింద్, బన్నీ వాసు, ఎస్‌కేఎన్ వల్లే ఈ సినిమా ఎంతో సులభంగా పూర్తయింది. ఒక్క రోజు కూడా డబ్బు వల్ల ఆలస్యం కాలేదు. సినిమా అయిపోయిన వెంటనే ఓటీటీకి ఇవ్వాల్సి వచ్చింది. ఒక వేళ నేను ఈ సినిమాను థియేటర్లో రిలీజ్ చేసి ఉంటే ఈ రేంజ్ రీచ్ వచ్చేది కాదు. ఈ రేంజ్ సక్సెస్ వచ్చేది కాదు. చిన్న సినిమాను థియేటర్‌లో పుష్ చేయడం అంత సులభం కాదు. విపరీతంగా సినిమాకు పబ్లిసిటీ చేసి ఈ రేంజ్ తీసుకొచ్చింది ఆహా టీం. ఈ సినిమాకు ఫస్ట్ ఆడియెన్ వంశీ పైడిపల్లి. ఫస్ట్ కట్ చేశాక నేను భయపడ్డాను. ఇది కచ్చితంగా ఆహా వాళ్లకు చూపించకూడదని అనుకున్నాను.  దాచి పెట్టి ఎన్నో రిపేర్లు చేశాను. ఆ తరువాత ఒక రోజు వంశీ పైడిపల్లి గారికి చూపించాను. ఆ రోజు వంశీ గారు, రామ్ గారు ఇచ్చిన హగ్‌తో హిట్ కొట్టేశామని అనిపించింది. నాకు ఇంత హెల్ప్ చేసి, ఇంత రీచ్ ఇస్తున్న అరవింద్, బన్నీ వాసు, ఎస్‌కేఎన్, ఆహా టీంకు థ్యాంక్స్. ఒక చిన్న సినిమాకు నేషనల్ అవార్డ్ రావడంతో పెద్దవాళ్లంతా కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు’ అని అన్నారు.


నిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. ‘కలర్ ఫోటో సినిమాను అభినందించడానికి వచ్చిన నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన వంశీ పైడిపల్లి గారికి థ్యాంక్స్. సాయి రాజేష్ గారు నాకు రెండు దశాబ్దాలుగా ప్రాణ స్నేహితుడు. సందీప్ రాజ్ దశాబ్దకాలం నుంచి స్నేహితుడు. వారిద్దరూ బెన్నీతో కలిసి చేసిన చిత్రం కలర్ ఫోటో. ఈ కలర్ ఫోటో సినిమా తెలుగు ఓటీటీ రంగానికి ఓ కలర్ తీసుకొచ్చింది. ఓటీటీ అంటే రీచ్ ఉంటుందా? అనే అనుమానాలు ఉండేవి. కలర్ ఫోటో అనేది ఫస్ట్ తెలుగు ఓటీటీ బ్లాక్ బస్టర్. నిర్మాతల అంచనాలు మారిపోయాయి. ప్రేక్షకులు ఆదరించడంతో అందరికీ ఊతమిచ్చినట్టు అనిపించింది. ఇది ఎంతో నిజాయితీతో తీసిన చిత్రం. వీరంతా ఇప్పుడు చిన్న వ్యక్తులు కాదు. ఈ అవార్డుతో వారంతా గొప్ప వ్యక్తులు అయ్యారు. సందీప్, రాజేష్, ఆహా టీం ఇలా అందరికీ ఉమ్మడి విజయం. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మరిన్ని మంచి చిత్రాలు రావాలని కోరుకుంటున్నాను. ఇంటింటికి వినోదాన్ని అందిస్తున్న ఆహా నుంచి మరిన్ని సినిమాలు రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

Hanu Raghavapudi Interview About Sitharamam

 సీతారామం లార్జన్ దెన్ లైఫ్ స్టొరీ. ప్రేక్షకులు ఖచ్చితంగా అద్భుతం అంటారు: హను రాఘవపూడి ఇంటర్వ్యూ 




స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడి గా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వంలో 'యుద్ధంతో రాసిన ప్రేమకథ'గా ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం 'సీతా రామం'. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన కీలక పాత్రలో కనిపిస్తున్నారు.  భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక విలువలతో తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 5న  ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో దర్శకుడు లో హను రాఘవపూడి మీడియాతో ముచ్చటించారు. ఆయన పంచుకున్న 'సీతా రామం' చిత్ర విశేషాలివి. 


మీరు ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళు పూర్తవుతుంది. ఈ ప్రయాణం ఎలా అనిపించింది ? పదేళ్ళలో కేవలం నాలుగు సినిమాలు మాత్రమే చేయడానికి కారణం ?

మొదటి సినిమా అందాల రాక్షసి చేసినప్పుడు ఇప్పుడున్నంత వనరులు లేవు. ఐతే నిర్మాత సాయిగారు ఇచ్చిన స్వేఛ్చ వలన చాలా సౌకర్యంగా పని చేశాను. ఆ సినిమాకి మొదట్లో సక్సెస్  అని రాలేదు. తర్వాత రోజుల్లో కల్ట్ స్టేటస్ వచ్చింది. తర్వాత కృష్ణగాడి వీర ప్రేమ గాధ చేశాను. అయితే ఈ గ్యాప్ లో కొంత కష్ట సమయం ఎదురైయింది. రానా గారితో అనుకున్న ఒక సినిమా బడ్జెట్ కారణాల వలన కుదరలేదు.  లై, పడి పడి లేచే మనసు ఏడాది గ్యాప్ లోనే వచ్చాయి. తర్వాత అందరిలానే కరోనా గ్యాప్ వచ్చింది. ఐతే నా జర్నీలో సక్సెస్ గురించి ఎప్పుడూ దిగులు లేదు. ఈ ప్రయాణంలో నిరాశ చెందలేదు. పని దొరుకుతుందా లేదా? అని ఎప్పుడూ అలోచించలేదు. క్రాఫ్ట్ తెలిసుంటే ఏ పరిశ్రమలోనైనా పని వుంటుందని నమ్ముతాను. 


జయాపజయాలకు సంబంధం లేకుండా మీ సినిమా వస్తుంటే ఒక అంచనా వుంటుంది కదా ? దీనికి కారణం ఏమిటని భావిస్తున్నారు ?

అంచనాలని క్రియేట్ చేయడం నా ఉద్దేశం కాదు. ఒక మనిషికి ఒకసారి గౌరవించామంటే ఆ గౌరవం ఎప్పుడూ వుంటుంది. తప్పు చేస్తే తప్ప అది బ్రేక్ అవ్వదు. ఒక సినిమా బాలేదని అనుకుంటే ఆ సినిమా వరకే అనుకుంటారు కానీ తర్వాత వచ్చిన సినిమాకు అది వర్తించదు. బహుశా అదే కారణం అనుకుంటాను.


సీతారామంపై మంచి అంచనాలు వున్నాయి. సినిమా ఈ అంచనాలని అధిగమిస్తుందా ? 

ఖచ్చితంగా అధిగమిస్తుంది. సీతారామం చాలా ప్రత్యేకమైన చిత్రం. సినిమా చూడటానికి మొదట కావలసింది క్యురీయాసిటీ. సీతారామం థియేటర్ లోనే చూడాలనే ఎక్సయిట్ మెంట్ , క్యురియాసిటీ ప్రతి ప్రమోషనల్ ఎలిమెంట్ లో కనిపిస్తుంది. థియేటర్ లోకి వచ్చిన తర్వాత  సీతారామం అద్భుతమని ప్రేక్షకులు ఖచ్చితంగా అంటారు. 


సీతారామం కథకు ప్రేరణ ఉందా ?

నాకు కోఠీ వెళ్లి పాత పుస్తకాలు కొనుక్కునే అలవాటు వుంది.  అలా కొనుక్కున్న పుస్తకంలో ఒక లెటర్ కనిపించింది. ఓపెన్ చేయని లెటర్ అది. అది ఓపెన్ చేస్తే పెద్ద మేటర్ ఏమీ లేదు. ఒక అబ్బాయి కి వాళ్ళ అమ్మ రాసిన ఉత్తరం అది. అతను కనీసం దాన్ని ఓపెన్ కూడా చేయలేదు. ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఒకవేళ అందులో చాలా ముఖ్యమైన విషయం వుండి ఓపెన్ చేయకపోతే జర్నీ ఎలా వుండేది? మనిషి జీవితాన్ని నిర్దేశించే విషయం కదా అనిపించింది. ఆ అలోచని కథగా రాశా. సీతారామం పూర్తిగా ఫిక్షన్.


తెలుగులో ఇంత మంది వుండగా దుల్కర్ సల్మాన్ ని తీసుకోవడానికి కారణం ? సౌత్ మార్కెట్ ని విస్తరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారా?

కథ రాసినప్పుడు మైండ్ లో నటులు ఎవరూ లేరు. ఒక డిమాండింగ్ ఫేస్ కావాలి. తెలుగులో  వున్నవాళ్ళంతా ఆ సమయంలో బిజీగా వున్నారు. నేను, స్వప్న గారు కలసి దుల్కర్ ని అనుకున్నాం. మార్కెట్ ని విస్తరించాలనే ఆలోచన మాత్రం లేదు. సీతారామం లార్జన్ దెన్ లైఫ్ స్టొరీ. 


సీతారామం పాటలు బావున్నాయి.. సంగీత దర్శకుడిగా విశాల్ చంద్ర శేఖర్ ని తీసుకోవడానికి కారణం ?

విశాల్ నాకు మంచి స్నేహితుడు. ఆతనితో పని చేయడం చాలా సౌకర్యంగా వుంటుంది. మా ఇద్దరికి మ్యూజిక్ పట్ల ఒకే అభిరుచి వుంది, ప్రతిది స్పూన్ ఫీడింగ్ చేయాల్సిన అవసరం వుండదు. ఇందులో మ్యూజిక్ అద్భుతంగా వుంటుంది. సీతారామం పాటలకు వృధ్యాప్యం రానేరాదు.  


పదేళ్ళ సినిమా ప్రయాణంలో దర్శకుడిగా ఏం నేర్చుకున్నారు ?

పదేళ్ళుగా నేర్చుకున్నది రేపటికి మారిపోవచ్చు. ప్రతి రోజు నేర్చుకోవాల్సిందే.


'సీతారామం' 1964 నేపధ్యంలోనే సినిమా నడుస్తుందా ?

ఇందులో రెండు టైం పీరియడ్స్ వున్నాయి. 1964 కథ టేకాఫ్ పిరియడ్. స్క్రీన్ ప్లే వర్తమానానికి గతానికి నడుస్తూ వుంటుంది.


రష్మిక మందన పాత్రకు ఎంత ప్రాధాన్యత వుంటుంది ? 

రష్మికది చాలా కీలకమైన పాత్ర. కథని మలుపు తిప్పే పాత్ర. ఆ పాత్ర జర్నీలో ఏం జరుగుతుందో అనేది ఒకరకంగా ఈ కథ. అదే కాదు.. ఇందులో పాత్రలన్నీ కథని ఎదో ఒక మలపుతిప్పుతాయి. సుమంత్, భూమిక, ప్రియదర్శి.. అన్నీ ముఖ్యమైన పాత్రలే. 


'యుద్ధంతో రాసిన ప్రేమ' కథ ఏమిటి ? 

బేసిగ్గా యుద్ధ నేపధ్యంలో జరిగే కథ అంటే యుద్ధం మనకి కనిపిస్తుంది. 'యుద్ధంతో రాసిన ప్రేమ' ఎందుకంటే ఇది ఫిజికల్ వార్ కాదు. ఈ యుద్ధం ఇన్ విజిబుల్. కథలోని ప్రతి పాత్రకు ఒక యుద్ధం వుంటుంది.  ఒక ఉదారణగా చెప్పాలంటే.. రాముడు.. రావణుడిని చంపడం అసలు యుద్ధమే కాదు. ఎందుకంటే రాముడి వీరత్వం ముందు ఎవరూ సరిపోరు. రాముడు విష్ణుమూర్తి అవతారం. రాముడు లాంటి లక్షణాలతో మరొకరు పుట్టలేదు. అందుకే రాముడు దేవుడయ్యాడు. అయితే రావణసంహారం చేయడానికి రాముడు చేసిన ప్రయాణంలో గొప్ప యుద్ధం.,సంఘర్షణ వుంది. అలాంటి సంఘర్షణ, యుద్ధం సీతారామంలో వుంటుంది.


టీజర్ లో సీతా పేరుతో వచ్చిన లెటర్ అడ్రస్ మారి వస్తుందా? 

టీజర్ లో చెప్పినట్లు రామ్ ఒక అనాధ. కాశ్మీర్ కొండల్లో పహారా కాస్తున్న ఒక సైనికుడు. రేడియోలో తన గురించి ఒక కార్యక్రమం ప్రసారం అవుంతుంది. తను అనాధ అని తెలిసిన తర్వాత చాలా మంది అతనికి  ఉత్తరాలు రాశారు. అలా వచ్చిన ఒక సర్ప్రైజ్ లెటర్ తన జీవితాన్ని మరో మలుపు తిప్పుతుంది. ఆ లెటర్ లో ఏముందో ఇప్పటికి సస్పెన్స్. ఆ లెటర్ ఓపెన్ అయిన తర్వాత ఎలాంటి మ్యాజిక్ జరుగబోతుందో అదే సీతారామం కథ.


లెటర్ కమ్యునికేషన్ చాలా సున్నితమైన అంశం కదా..  ఎలా డీల్ చేశారు ? 

ఉత్తరం అనేది చాలా ప్రత్యేకమైన ఎమోషన్. ప్రేమ కథకి కమ్యునికేషన్ ప్రధాన సమస్య. ఒకప్పుడు ప్రేమ కథలు చాలా హృద్యంగా ఉండటానికి కారణం.. ఇప్పుడంత కమ్యునికేషన్ లేకపోవడమేనని భావిస్తా. ఉత్తరంలో ఎమోషన్ వేరు. ఆ మ్యాజిక్ మిస్ అయిపోయాం. ఆ మ్యాజిక్ ని బాగానే డీల్ చేశానని అనుకుంటున్నా. 


వైజయంతి మూవీస్ లో పని చేయడం ఎలా అనిపించింది ? కథని ఒప్పించడానికి మీరు చేసిన ప్రయత్నం ఏమిటి? 

వైజయంతి మూవీస్ లో చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. కాగితం మీద వున్నది స్క్రీన్ మీదకి రావాలంటే విజన్ ఒక్కటే సరిపోదు. దీనిని బలంగా నమ్మే నిర్మాత వుండాలి. వైజయంతి మూవీస్, స్వప్న దత్ సినిమా పట్ల గొప్ప సంకల్పం వున్న నిర్మాతలు. 

కథ ఒప్పించడానికి ప్రయత్నించకూడదు. కథ బావుండాలి. కథ బావుంటే అన్నీ జరిగిపోతాయి. సినిమా అనేది నచ్చితేనే చేస్తారు. అందులో వైజయంతి మూవీస్ మరింత క్లారిటీ గా వుంటుంది.


సీతారామం షూటింగ్ ప్రాసస్ లో ఎలాంటి సవాల్ ఎదురయ్యాయి ? 

ప్రకృతి ప్రాధాన సవాల్. కాశ్మీర్ లాంటి ప్రదేశాల్లో మైనస్ డిగ్రీలలో షూట్ చేశాం. ఇది కొంచెం టఫ్ జాబ్. మిగతావి పెద్ద కష్టపడింది లేదు. 


మీ సినిమాల్లో మీ మనసుకు బాగా నచ్చిన సినిమాలు ఏవి ? 

సీతారామం, అందాల రాక్షసి. ఈ రెండు నా మనసు దగ్గరగా వున్న చిత్రాలు. 


మీ లైఫ్ లో ప్రేమ కథ ఉందా ? 

లేదండీ. మన జీవితంలో ఏది ఉండదో అదే కోరుకుంటాం. అందుకే లవ్ స్టోరీస్ చేస్తున్నా (నవ్వుతూ)  


మీ అభిమాన రచయిత ? 

చలం గారి పుస్తకాలు చాలా చదివాను. ఇప్పుడు రాస్తున్న వెంకట్ సిద్దా రెడ్డి లాంటి రచయితల పుస్తకాలు కూడా చదువుతుంటాను. 


కొత్తగా చేయబోతున్న సినిమాలు ? 

బాలీవుడ్ లో సన్నీ డియోల్, నవాజ్ తో ఒక యాక్షన్ ఫిల్మ్ చేయబోతున్నా. అలాగే అమోజన్ తో ఒక వెబ్ సిరిస్ ప్లాన్ వుంది.

Divyansha Kaushik Interview About Ramarao on Duty

'రామారావు ఆన్ డ్యూటీ' ప్రేక్షకులని థ్రిల్ చేస్తోంది: దివ్యాంశ కౌశిక్‌ ఇంటర్వ్యూ



మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ 'రామారావు ఆన్ డ్యూటీ'. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జూలై 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ విడుదలకు సిద్ధమవుతోన్న నేపధ్యంలో చిత్ర హీరోయిన్స్ లో ఒకరైన దివ్యాంశ కౌశిక్‌ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్ర విశేషాలివి.


 


మజిలీ తర్వాత చాలా గ్యాప్ రావడానికి కారణం ?


కోవిడ్ తో అందరికీ కామన్ గా గ్యాప్ వచ్చింది. దీంతో పాటు తెలుగు, డ్యాన్స్ క్లాసులు తీసుకున్నాను. అలాగే నన్ను నేను మలచుకోవడానికి వర్క్ అవుట్ చేశాను. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత ఇన్స్టా లో కొన్ని  ట్రెడిషినల్ ఫోటోలు పోస్ట్ చేశాను. దర్శకుడు శరత్ గారికి ఆ ఫోటోలు నచ్చి 'రామారావు ఆన్ డ్యూటీ' గురించి చెప్పారు.


 


శరత్ గారు కథ చెప్పినపుడు మిమ్మల్ని ఆకట్టుకున్న అంశం ఏమిటి?


మొదట నేను రవితేజ గారికి పెద్ద ఫ్యాన్ ని. ఆయనతో ఎప్పటినుండో పని చేయాలని వుంది. రవితేజ గారితో స్క్రీన్ పంచుకోవడం గౌరవంగా భావిస్తున్నా. శరత్ గారు కథ చెప్పినపుడు నా పాత్ర చాలా నచ్చింది. ఇందులో నందిని అనే పాత్రలో కనిపిస్తా. ఒక భార్యగా, తల్లిగా హోమ్లీగా కనిపిస్తా. నా పాత్రలో చాలా పరిణితి వుంటుంది. నాకు చాలా కొత్తగా వుంటుంది. శరత్ గారు చాలా క్లారిటీ వున్న దర్శకుడు. 95లో జరిగే ఈ కథ చాలా బలంగా వుంటుంది. ప్రేక్షకులు కోరుకునే అన్నీ ఎలిమెంట్స్ తో 'రామారావు ఆన్ డ్యూటీ' థ్రిల్ చేస్తోంది.


 


రవితేజ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?


రవితేజ గారిని కలవడం నాకు ఒక ఫ్యాన్ మూమెంట్. ఆయన్ని మొదట కలసినపుడు చాలా నెర్వస్ గా ఫీలయ్యా. హలో సర్.. హౌ ఆర్ యు.. అనేలోగా.. ఒక్కసారిగా'' హే కూర్చో..ముంబాయా ఢిల్లీనా ? '' అని హిందీలో ఎంతో హుషారుగా అడిగారు. నా భయం ఒక్కసారిగా పోయింది. ఒక్కసారిగా రిలాక్స్ చేసేశారు. ఆయనతో పని చేయడం గొప్ప అనుభవం. ఆయలో గ్రేట్ ఎనర్జీ వుంది. ఆయన సెట్స్ లో వుంటే అందరికీ ఆ ఎనర్జీ వస్తుంది. ఒత్తిడి లేకుండా సరదాగా గడపడం ఆయన్ని చూసి నేర్చుకున్నా. ఈ సినిమా కోసం స్పెయిన్ లో షూట్ చేశాం. జర్మనీ, పాకిస్తాన్ నుండి వచ్చిన వారు రవితేజ గారితో ఫోటోలు తీసుకున్నారు. ప్రపంచం నలుమూల ఆయన్ని ఇష్టపడే వారు వున్నారు. ఆయనలో ఆ పవర్ వుంది.


 


ఈ పాత్ర కోసం హోం వర్క్ చేశారా ?


నెలన్నర పాటు యాక్టింగ్ వర్క్ షాప్ లో పాల్గొన్నా. దర్శకుడు శరత్ గారు పాత్రకి సంబంధించిన ప్రతి అంశాన్ని వివరంగా చెప్పేవారు. ప్రతి సీన్ గురించి ముందే చర్చించుకునేవాళ్ళం. ఒక నటిగా వైవిధ్యమైన పాత్రలు చేయాలనీ వుంటుంది. 'రామారావు ఆన్ డ్యూటీ'లో అలాంటి బలమైన పాత్ర దక్కింది.


 


ట్రైలర్ లో రవితేజ గారు చాలా ఫిరోషియస్ గా కనిపిస్తున్నారు.. మీరు ఎంత ఫిరోషియస్ గా వుంటారు ?


ఇందులో హోమ్లీ గర్ల్, హౌస్ వైఫ్ గా కనిపిస్తా. ఒక భార్యగా రామారావుకి మోరల్ సపోర్ట్, గైడ్ గా ఉంటా.  


 


మజిలీలో బబ్లీ గర్ల్ గా ఇందులో ఒక వైఫ్ పాత్రలో కనిపిస్తున్నారు కదా.. మీకు ఎలాంటి పాత్రలు చేయడం సౌకర్యంగా వుంటుంది?


బబ్లీ గర్ల్ గా నటించడం సువులుగానే వుంటుంది. కానీ నందిని లాంటి పాత్ర చేయడం నటిగా నాకు తృప్తిని ఇస్తుంది. నందిని పాత్రని చాలా ఎంజాయ్ చేశాను. పెర్ఫార్మ్ చేయడానికి ఎక్కువ స్కోప్ వున్న పాత్రది.  


 


డబ్బింగ్ మీరే చెప్పారా ?


లేదండీ. ఈ చిత్రానికి చెప్పలేదు. ఇప్పుడు చేస్తున్న మరో చిత్రానికి నేనే డబ్బింగ్ చెఫ్తున్నా. తెలుగు మాట్లాడితే అర్ధం అవుతుంది. ప్రస్తుతం నేర్చుకుంటున్నా. భవిష్యత్ లో నేనే డబ్బింగ్ చెప్పడానికి ప్రయత్నిస్తా.


 


రజిషా విజయన్ గురించి ?


రజిషా విజయన్ మంచి నటి. ఈ చిత్రంలో ఆమె పాత్ర కూడా ఆసక్తికరంగా వుంటుంది. రవితేజ గారికి నాకు తనకి ఒక సీన్ వుంటుంది. చాలా ఇంటరెస్టింగ్ గా వుంటుంది. తనతో కలసి ప్రమోషన్స్ లో కూడా పాల్గొన్నా. మేము స్నేహితులయ్యాం.


 


నాగచైనత్య, రవితేజ గారితో వర్క్ చేశారు కదా.. వారిలో ఎలాంటి డిఫరెన్స్ గమనించారు ?


ఇద్దరు భిన్నమైన వ్యక్తులు. రవితేజ గారు చాలా ఎనర్జీటిక్ గా వుంటారు. నాగచైతన్య కామ్ గా వుంటారు. అయితే ఇద్దరిలో ఒక కామన్ క్యాలిటీ వుంది. సెట్స్ లో సరదా  ఫ్రాంక్స్ చేస్తుంటారు(నవ్వుతూ)


 


 'రామారావు ఆన్ డ్యూటీ' టీంతో ఎలాంటి అనుబంధం వుంది ?


మూడేళ్ళ తర్వాత  'రామారావు ఆన్ డ్యూటీ' లాంటి పెద్ద సినిమా సెట్స్ లోకి వచ్చాను. టీం అంతా చాలా ప్రోత్సాహన్ని ఇచ్చారు. దర్శకుడు శరత్ గారు నటన విషయంలో చాలా స్వేఛ్చని ఇచ్చారు. ఏదైనా సీన్ బాగా చేస్తే మానిటర్ లో చూపించి 'చాలా బాగా చేశావ్' అని మెచ్చుకునే వారు. ఒక వండర్ ఫుల్ ఫిల్మ్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం.


 


ఒక దర్శకుడు కథ చెప్పినపుడు ఎలాంటి ఎలిమెంట్స్ చూస్తారు ?


మొదట దర్శకుడి విజన్ ని చూస్తాను. దర్శకుడి విజన్ ని నమ్ముతాను. లక్కీగా ఇప్పటివరకూ మంచి విజన్, క్లారిటీ వున్న దర్శకులతో పని చేశాను.


 


'రామారావు ఆన్ డ్యూటీ' నిర్మాతల గురించి ?


ఎస్ఎల్వీసి, రవితేజ టీం వర్క్స్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మించారు. సినిమాల పట్ల ప్యాషన్ వున్న నిర్మాతలు. సినిమాకు కావాల్సిన ప్రతిది ఎక్కడా రాజీపడకుండా గొప్ప క్యాలిటీతో 'రామారావు ఆన్ డ్యూటీ'ని తెరకెక్కించారు.


 


ఏ హీరోలతో పని చేయాలనీ కోరుకుంటున్నారు ?


మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, .. అందరి హీరోలతో పని చేయాలని వుంది(నవ్వుతూ)


 


తెలుగు చిత్ర పరిశ్రమకి బాలీవుడ్ కి ఎలాంటి తేడాలు గమనించారు ?


రెండు పరిశ్రమల్లోనూ సినిమా కోసం చాలా నిబద్దతతో పని చేస్తారు. అయితే తెలుగులో ప్రేక్షకుల పంచిన ప్రేమ మాత్రం చాలా ప్రత్యేకం. మజిలీలో పాత్రని ఎంతగానో ఇష్టపడ్డారు. ఇక్కడ ప్రేక్షకుల ప్రేమని మర్చిపోలేను.


 


చాలా సన్నబడ్డారు కదా మీ డైట్ సీక్రెట్ ఏమిటి ?


మజిలీలో కొంచెం బబ్లీగా కనిపించా. తర్వాత కొంచెం సన్నబడాలని స్పెషల్ గా డ్యాన్స్ క్లాసులు తీసుకొన్నా. డైట్ ప్లాన్ అంటూ ఏమీ లేదు. ఏది తినాలనిపించేది చక్కగా తినేస్తా.


 


ఎలాంటి సినిమాలు చేయాలనీ వుంది ?


అన్ని రకాల పాత్రలని చేయగలనే నమ్మకం వుంది. ఏదైనా బయోపిక్ చేసే సామర్ధ్యం వుందని నమ్ముతున్నా.  


 


కొత్తగా చేస్తున్న ప్రాజెక్ట్స్ ?


సుదీర్ వర్మ గారితో ఒక సినిమా, అలాగే మైఖేల్ అని మరో సినిమా చేస్తున్నా.


 


అల్ ది బెస్ట్


థాంక్స్

Bhimadevarapalli Branch Shooting Completed

ప్రతి ఒక్కరిని తమ గ్రామానికి తీసుకెళ్లే భీమదేవరపల్లి బ్రాంచి చిత్రం షూటింగ్ పూర్తి !!!



"భీమదేవరపల్లి బ్రాంచి " ఇది ఆర్గానిక్ గ్రామీణ  చిత్రం.రెండు గంటల పాటు ప్రేక్షకుడిని నవ్వించే  చిత్రమిది. ఒక మారుమూల గ్రామంలో జరిగిన  సంఘటన దేశవ్యాప్తంగా  సెన్సేషనల్ అయ్యింది. ఆ హాట్ టాపిక్  ఆధారంగా ఈ సినిమాను"Neorealism" జానర్లో నిర్మిస్తున్నారు.ఈ జానర్లో వస్తున్న మొదటి తెలుగు చిత్రం"భీమదేవరపల్లి బ్రాంచి" కావడం విశేషం. కథలోని నేటివిటీ పోకూడదని పూర్తిగా థియేటర్ & ఆర్గానిక్ నటీనటులనే ఎంపిక చేసుకుని, చాలా రియాలిటీగా నిర్మిస్తున్న కంటెంట్ ఓరియంటెడ్ స్పెషల్ మూవీ భీమదేవరపల్లి బ్రాంచి.. రెండు గంటలు పల్లె వాతావరణం కళ్ళ ముందు కదలాడుతుంది. ప్రతి ఒక్కరిని తమ గ్రామానికి తీసుకెళ్తుంది...

కరీంనగర్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో టాకీ పార్ట్& సాంగ్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ ప్రారంభమయ్యాయి.


 సుధాకర్ రెడ్డి,కీర్తి లత, అభి, రూప, అంజి బాబు,రాజవ్వ, శుభోదయం సుబ్బారావు, సి. ఎస్.ఆర్. వివ రెడ్డి,

 పద్మ, ప్రసన్న,మానుకోట ప్రసాద్,గడ్డం నవీన్, తాటి గీత మల్లికార్జున్, మహి, వల్లి సత్య ప్రకాష్, మహేష్ వంటి పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

AB CINEMASS & NIHAL PRODUCTIONS  నిర్మిస్తోన్న  ఈ చిత్రానికి "మీ శ్రేయోభిలాషి"చిత్రంతో రచయితగా ఎన్నో  అవార్డులు అందుకుని అనేక విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన  

రమేశ్ చెప్పాల ఈ సినిమాకు కథ ,మాటలు, దర్శకత్వం వహిస్తున్నారు.


రచన-దర్శకత్వం: రమేశ్ చెప్పాల. నిర్మాత : బత్తిని కీర్తిలత గౌడ్. సహ నిర్మాత: రాజా నరేందర్ చెట్లపెల్లి

 కెమెరా: చిట్టి బాబు. సంగీతం: చరణ్ అర్జున్, సాహిత్యం:సుద్దాల అశోక్ తేజ.ఎడిటర్: బొంతుల నాగేశ్వర్ రెడ్డి. పబ్లిసిటీ 

డిజైనర్: ధని ఏలే  ఆర్ట్: మోహన్. పిఆర్ఓ: శ్రీధర్ 

Tremendous Response for Die Hard Fan Motion Poster

 'డై హార్డ్ ఫ్యాన్  మోష‌న్ పోస్ట‌ర్ కి అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి అనూహ్య స్పంద‌న‌





ప్రియాంక శ‌ర్మ‌, శివ ఆల‌పాటి జంట‌గా, ష‌క‌ల‌క శంక‌ర్‌, రాజీవ్ క‌న‌కాల‌, నోయ‌ల్ ముఖ్య‌పాత్రల్లో శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై అభిరామ్ M  దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న‌ చిత్రం డై హార్డ్ ఫ్యాన్.  ఈ చిత్రం లో ప్రియాంక శర్మ హీరోయిన్ పాత్ర‌లో నటిస్తున్నారు. హీరోయిన్‌ కి డైహ‌ర్ట్ ఫ్యాన్ గా శివ ఆల‌పాటి న‌టిస్తున్నాడు. హీరోయిన్ కి , అభిమానికి మధ్య జరిగే సస్పెన్స్ కామెడీ డ్రామా ఈ సినిమా కథ. ఇందులో షకలక శంకర్ బేబమ్మ.. రాజీవ్ కనకాల కృష్ణ కాంత్ పాత్రలో చాలా బాగా న‌టించి మొప్పిచారు. ష‌క‌ల‌క శంక‌ర్ పాత్ర ఆద్యంతం న‌వ్విస్తుంది. సినిమా లో న‌టించే హీరోయిన్స్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ వుంటుందో అంద‌రికి తెలుసు. అలాంటి ఓ అభిమాని త‌ను అభిమానించే హీరొయిన్ ని క‌ల‌వాల‌నుకుంటాడు. అనుకొకుండా హీరోయిన్ క‌లిస్తే ఆ రాత్రి ఏం జ‌రిగింద‌నేది ఈ చిత్ర ముఖ్య క‌థాంశం. ఈ చిత్రం లో అన్ని పాత్ర‌లు కూడా హీరోయిన్ పాత్ర చుట్టూ తిరుగుతూ వుంటాయి. ద‌ర్శ‌కుడు అభిరామ్ M  ట్రెండ్ కి త‌గ్గ‌ట్టుగా ఈ చిత్రాన్ని చిత్రీక‌రించ‌డు. నిర్మాత‌లు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా చిత్రాన్ని నిర్మిచారు. క‌థ లో మ‌లుపులు ప్రేక్ష‌కుడ్ని థ్రిల్ చేస్తాయి. 

ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. సినిమా పూర్తిగా కామెడీ సస్పెన్స్ డ్రామాగా రాబోతుంది. మధు పొన్నాస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సయ్యద్ తేజుద్దీన్ మాటలు రాస్తున్నారు. ఈ చిత్రానికి సంభందిచిన కాన్సెప్ట్ మోష‌న్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్ కి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి అన్యూహ్య స్పంద‌న వ‌చ్చింది. ఈ చిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు. 


నటీనటులు: ప్రియాంక శర్మ, శివ ఆలపాటి, షకలక శంకర్, రాజీవ్ కనకాల, నొయ‌ల్  తదితరులు


టెక్నికల్ టీమ్:

దర్శకుడు: అభిరామ్ M

బ్యానర్: శ్రీహాన్ సినీ క్రియేషన్స్

నిర్మాత: చంద్రప్రియ సుబుధి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ కింతలి

మాటలు: సయ్యద్ తేజుద్దీన్

సంగీతం: మధు పొన్నాస్

సినిమాటోగ్రఫీ: జగదీష్ బొమ్మిశెట్టి

ఎడిట్ VFX - తిరు B

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: వెంకటేష్ తిరుమల శెట్టి 

PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Action King Arjun Mother Passed away

 యాక్షన్ కింగ్ అర్జున్‌కు మాతృ వియోగం




ప్రముఖ స్టార్ హీరో, యాక్షన్ కింగ్ అర్జున్ మాతృమూర్తి లక్ష్మీ దేవమ్మ నేడు పరమపదించారు. ఆమె వయసు 85 సంవత్సరాలు. మైసూర్‌లో స్కూల్ టీచర్‌గా పనిచేసిన ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఆమె పార్థీవ దేహం బెంగళూరు అపోలో హాస్పిటల్‌లో ఉంది.

Hit 2 Final Schedule and Post Production works Starts Soon

హిట్‌2 ఫైనల్‌ షెడ్యూల్‌, పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు త్వరలోనే!




రీసెంట్‌గా బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌ఫుల్‌ సినిమా మేజర్‌ (మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ బయోపిక్‌)తో ఆడియన్స్ ని మెప్పించిన అడివి శేష్‌ త్వరలోనే హిట్‌2తో సిద్ధమవుతున్నారు. జులై 29న విడుదల ఉంటుందని ఇంతకు ముందు ప్రకటించినా ఇప్పటిదాకా ప్రమోషన్సే మొదలు కాలేదు.
దీని గురించి అడివి శేష్‌ మాట్లాడుతూ ''మేజర్‌ రిలీజ్‌ కాగానే హిట్‌2 షూటింగ్‌లో పాల్గొనాలి. ఆఖరి షెడ్యూల్‌ని పూర్తి చేయాలి. కానీ మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన మేజర్‌ ని ప్రపంచంలోని నలుమూలలా ఉన్న ప్రజలకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో ఈ సినిమా కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించాను. శారీరకంగా, మానసికంగా అత్యంత సంతృప్తినిచ్చిన క్షణాలు ఆస్వాదించాను. ఆ విషయాలను నానికి, శైలేష్‌కి వివరించాను. ఫైనల్‌ షెడ్యూల్‌ని అతి త్వరలోనే పూర్తి చేస్తానని చెప్పాను. వాళ్లు నన్ను అర్థం చేసుకున్నారు. చివరి షెడ్యూల్‌ పూర్తి కాగానే పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు మొదలుపెడతాం. హిట్‌2 రిలీజ్‌ గురించి అతి త్వరలోనే గ్రాండ్‌గా అనౌన్స్ చేస్తాం'' అని అన్నారు.
సెకండ్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌, హిట్‌2లో అడివి శేష్‌ కృష్ణదేవ్‌ అనే కేరక్టర్‌ చేస్తున్నారు. అందరూ కృష్ణదేవ్‌ని కేడీ అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగే కథగా చూపిస్తారు.
సెకండ్‌ పార్ట్ ఆఫ్‌ హిట్‌ (హొమిసైడ్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌)ని ప్రముఖ స్టైలిస్ట్ ప్రశాంతి త్రిపిరనేని నిర్మిస్తున్నారు. నాని సమర్పిస్తున్నారు. వాల్‌పోస్టర్‌ సినిమా పతాకంపై రూపొందిస్తున్నారు. Dr. శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది.

Anupama Parameswaran unveils first look poster of 'the story of A BEAUTIFUL GIRL'

Anupama Parameswaran unveils first look poster of 'the story of... A BEAUTIFUL GIRL'



South diva Anupama Parameswaran unveiled the first look poster of the upcoming film 'the story of... A BEAUTIFUL GIRL' here in the city. Directed by Ravi Prakash Bodapati, the film features Nihal Kodhaty and Drishika Chander in the lead. Touted to be a light-hearted love story, ''The Story of a Beautiful Girl' is being bankrolled by Gen'nexT Movies which had produced Charmee Kaur starrer 'Mantra' a decade ago. The Gen'nexT banner has another film 'Butterfly' starring Anupama. It is going to hit the OTT platform soon. 


Speaking on the occasion, Anupama Parameswaran said, "I won't say much about the film ''Butterfly' because it is coming in 'Disney Hotstar' and audiences would anyway witness the story what it is at the comfort of their house very soon. The team at Gen'nexT Movies that I have worked with is very brilliant. I'm very close to this movie crew of ''The Story of a Beautiful Girl' as its shoot was happening in parallel  along with the shoot of Butterfly. The kind of determination that everybody has put into this film is so immense. None of us have had the separation in the work. Everyone worked in tandem to make the two projects see the light of day." 


Describing the two characters in the film Ravi and Charitra, protagonist Nihal says Charitra guides this directionless youngster Ravi into a new world. "And you can see the pigeons fly off in the backdrop -- it symbolically represents the two love birds who want to take flight despite fighting all odds in their lives. That's how much we went into the detailing, and that's how hard we worked for the film. Trust me, this film 'The Story of a Beautiful Girl' is going to be one of its kind," actor Nihal added thanking his parents and the co-actors who are part of his dream project. Sharing his perspective on taking a shot at acting career, Nihal said, "Someone asked me if you would not be an actor, who would you be? I said I'd be a struggling actor. I would do theatre, I thought I am a crack type and no one would be like me until I met Drishika, I changed my perspective," he added. 


Director Ravi Prakash Bodapati, who wrote the story and screenplay for the famed movie 'Mantra' and was also one of the producers of it, said he waited for a long time to make a comeback on the Telugu silver screen. "There is a long list to whom I should thank all these years. Becoming a star is not so easy. You could become a star if only everything comes your way. Audiences would really enjoy this film. We have so many films coming from Gen Next Movies, this is just a beginning," he added. 


Film producer Prasad Tiruvalluri, who worked in the IT industry earlier, said the film is currently in the post-production stage. "Pushyami Dowleswarapu, Anil, Kranthi Juvvala have jointly made this film. The film starring Charmee Kaur, Mantra(2007)  earned cult status. Ravi Prakash Bodapati who penned the 'Mantra' story-screenplay and who also Produced it has now come up with another interesting tale 'The Story of a Beautiful Girl'. Although everyone is relatively new to the industry, the effort that went into the film was astounding. I am confident that the story would impress audiences," Prasad added.

Adirindey Full video Song From Macherla Niyojakavargam Dropped

 Adirindey Full video Song From Nithiin, Krithi Shetty, Sreshth Movies’ Macherla Niyojakavargam Dropped



Versatile star Nithiin starrer much-awaited mass action entertainer Macherla Niyojakavargam will be gracing the theatres on August 12th. Meanwhile, the team is promoting the movie aggressively. Mahati Swara Sagar provided chartbuster album and first two songs were superhits. The third song Adirindey has been dropped just a while ago.


The song by music director Mahati Swara Sagar has a fusion of western touch to this foot-tapping mellifluous number. The singing is superb and the music is easy to the ears. The lyrics are catchy. The protagonist requests his love interest to give him one chance. Nithiin and Krithi Shetty appeared cool in fashionable attires in the song sung delightfully by Sanjith Hegde. Lyrics for the song are by Krishna Kanth. This is going to be another chartbuster song in the album.


Krithi Shetty and Catherine Tresa are the heroines in the movie, where actress Anjali will be seen sizzling in a special number Ra Ra Reddy. Produced by Sudhakar Reddy and Nikitha Reddy on Sreshth Movies banner and presented by Rajkumar Akella, the team is helmed by MS Raja Shekhar Reddy.


Macherla Dhamki will be out on 26th and theatrical trailer of the movie will be released on 29th of this month.


Prasad Murella is the camera man, while Mamidala Thirupathi has provided dialogues and Sahi Suresh is the art director. Kotagiri Venkateswara Rao is the editor.


Cast: Nithiin, Krithi Shetty, Catherine Tresa, Samuthirakani, Anjali (special song) and others


Technical Crew:

Written & Directed by: MS Raja Shekhar Reddy

Producers: Sudhakar Reddy, Nikitha Reddy

Banner: Sreshth Movies 

Presents Rajkumar Akella

Music: Mahati Swara Sagar

DOP: Prasad Murella

Editor: Kotagiri Venkateswara Rao

Line Producer: G Hari

Dialogues: Mamidala Thirupathi

Art Director: Sahi Suresh

Fights: Venkat

PRO: Vamsi-Shekar

Tremendous Response for Anasuya's Darja

 అనసూయ ‘దర్జా’కు ట్రెమండస్ రెస్పాన్స్



సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘దర్జా’. జూలై 22న గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం.. ట్రెమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకుంది. భారీ వర్షాల కారణంగా కాస్త ఓపెనింగ్స్ తగ్గినప్పటికీ.. సినిమాకి వస్తున్న టాక్‌తో ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబడుతుందని నిర్మాతలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘మా పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో జూలై 22న విడుదలైన ‘దర్జా’ చిత్రం మొదటి ఆట నుండి పాజిటివ్ టాక్‌తో రన్ అవుతుంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. సినిమాలోని పాటలు, ఫైట్స్, సెంటిమెంట్.. చాలా బాగున్నాయంటూ పలువురు సినీ ప్రముఖులు మాకు ఫోన్ చేసి అభినందిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అలాగే చాలా మంది ఇది యాక్షన్ సినిమా అనుకుని వచ్చాము.. కానీ సినిమాలో అక్కాచెల్లెళ్ల అనుబంధం, అక్కాతమ్ముళ్ల అనుబంధాన్ని చాలా చక్కగా చూపించారని, ముఖ్యంగా సెంటిమెంట్ సీన్లు చాలా బాగున్నాయని ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందనకు మా టీమంతా చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్ అంశాలు ఉన్నాయి. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి ఈ సినిమాని మరింతగా సక్సెస్ చేయాలని కోరుతున్నాము. ఈ సందర్భంగా ఆదరించిన ప్రేక్షకులు, చిత్రంలో నటించిన నటీనటులు-సాంకేతిక నిపుణులకు, సహకరించిన వారందరికీ ధన్యవాదాలు..’’ అని తెలిపారు. కాగా, కామినేని శ్రీనివాస్ సమర్పణలో.. పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సలీమ్ మాలిక్ దర్శకత్వంలో శివశంకర్ పైడిపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌గా రవి పైడిపాటి వ్యవహరించారు.

Sensational Director Ram Gopal Varma released The first look of 'Aditya T20 Love Story'

Sensational Director Ram Gopal Varma released The first look of 'Aditya T20 Love Story'



"Aditya T20 Love Story'' is produced by Chinnababu Adapa under the banner of MJ Creations and presented by Baby Manvitha Charan Adapa with Sri Auditya as the hero and Ramya, Pavitra and Madhuri as the heroines. Chinni Charan Adapa is directing this film billed to be a love and action entertainer. Freshly, sensational director Ram Gopal Varma garu has released the first look poster of this movie.


Aditya T20 Love Story first look poster appears very fresh, wherein hero Sri Auditya looks stylish with shades on. All in all, the team has raised the expectations of everyone with this poster. The post production activities of this film have also been completed. The makers said that the release date of the film will be announced soon.


Chinnababu Adapa is the cameraman, Chinni Charan Adapa is the music director and MR Varma is the editor for this film, co-produced by Prabhu Thalluri. Lyrics for this movie are written by Velpula Venketesh, while background score is by Abhishek Rufus. VFX and graphics are made by Akhil (ASD). Vinay is the mixing engineer, whereas flycam is by Suman Chakravarthy, and Siva is the art director. Devaraj Nune and Anji are in charge of the stunts. Charan Nendru is working as the make-up man for this film.


Alongside Sri Auditya, Ramya, Pavitra, Madhuri, the movie also stars Vijaya Rangaraju, Datthu, Rajanala, Apparao, and Mary Bhavana in important roles.


Technical Crew:

Banner : MJ Creations

Presenter : Baby Manvitha Charan Adapa

Producer: Chinnababu Adapa

Co-producer : Prabhu Thalluri

Director : Chinni Charan Adapa

Cameraman : Chinnababu Adapa

Editor : MR Varma

Music : Chinni Charan Adapa

Background Score : Abhishek Rufus

Direction Department : Manjuprasad

ViFX, Graphics: Akhil (ASD)

Mixing Engineer : Vinay

Lyrics : Velpula Venketesh

Makeup: Charan Nendru

PRO : Sai Satish, Parvataneni Rambabu 

Actress Rajisha Vijayan Interview About Ramarao On Duty

 'రామారావు ఆన్ డ్యూటీ' అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది, ఆలోచింపచేస్తుంది: రజిషా విజయన్ ఇంటర్వ్యూ



మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలోశరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ 'రామారావు ఆన్ డ్యూటీ'. రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జూలై 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ విడుదలకు సిద్ధమవుతోన్న నేపధ్యంలో చిత్ర హీరోయిన్స్ లో ఒకరైన రజిషా విజయన్ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్ర విశేషాలివి.


రామారావు ఆన్ డ్యూటీ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?

దర్శకుడు శరత్ గారు నేను తమిళ్ లో చేసిన 'కర్ణన్' సినిమా చూసి నాకు కాల్ చేసి 'రామారావు ఆన్ డ్యూటీ' ప్రాజెక్ట్ గురించి చెప్పారు. రామారావు ఆన్ డ్యూటీ లో మాళిని అనే పాత్రలో కనిపిస్తా. శరత్ గారు అద్భుతమైన కథ చెప్పారు. నా పాత్ర చాలా బలంగా వుంటుంది. ఒక భాషలో పరిచయమౌతున్నపుడు బలమైన కథ, పాత్ర కావాలని ఎదురుచూశాను. నేను ఎదురుచుసిన పాత్ర ఈ సినిమాతో దక్కింది. మాళిని పాత్ర చాలా అందంగా బలంగా వుంటుంది. ఇంతమంచి సినిమాతో తెలుగులో పరిచయం కావడం ఆనందంగా వుంది.


రవితేజ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?

నేనునార్త్ ఇండియాలో పెరిగాను. రవితేజ గారి సినిమాలు హిందీ డబ్బింగ్ లో చూసేదాన్ని. నా స్నేహితులందరికీ రవితేజ గారు తెలుసు. ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నాం కానీ ఆ రోజుల్లోనే రవితేజ గారికి ఆ రీచ్ వుంది. రవితేజ గారితో పని చేయడం గొప్ప అనుభవం. రవితేజ  గ్రేట్ మాస్ హీరో, సూపర్ స్టార్. ఆయన సెట్స్ కి వస్తే ఒక మెరుపులా వుంటుంది. మొత్తం ఎనర్జీతో నిండిపోతుంది. సెట్స్ లో అందరినీ సమానంగా చూస్తారు.  


దర్శకుడు శరత్ గారితో పని చేయడం గురించి ?

శరత్ గారు చాల ఫెర్ఫెక్షనిస్ట్. ఆయన చాలా క్లారిటీ గా వుంటారు. రామారావు ఆన్ డ్యూటీ మాస్ ఫిల్మ్, చాలా ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్, యాక్షన్, డ్యాన్స్ వున్నాయి. అదే సమయంలో బలమైన కథ వుంది. వినోదం పంచుతూనే ఆలోచన రేకెత్తించే సినిమా ఇది. ఇన్ని ఎలిమెంట్స్ వున్న సినిమా తీయాలంటే దర్శకుడిలో చాలా క్లారిటీ ఉండాలి. అంత చక్కని క్లారిటీ వున్న దర్శకుడు శరత్. మంచి సాంకేతిక విలువలతో చాలా మంచి క్యాలిటీతో ఈ సినిమాని రూపొందించారు.


డబ్బింగ్ మీరే చెప్పారా ?

తెలుగు నేర్చుకుంటాం. త్వరలోనే తప్పకుండా డబ్బింగ్ చెబుతా. తెలుగులో చాలా సినిమాలు చేయాలనీ వుంది. తెలుగు డబ్బింగ్ గా వచ్చిన నా ఇతర భాషల చిత్రాలని కూడా  అభిమానించారు. ఇక్కడ ప్రేక్షకుల అభిమానం మర్చిపోలేను.


మీరు తమిళ్ మలయాళం చిత్ర పరిశ్రమలలో కూడా పని చేశారు కదా ? తెలుగులో ఎలాంటి డిఫరెన్స్ గమనించారు ?

పరిశ్రమలో వేరైనా అందరూ తీసేది సినిమానే. టెక్నిక్ ఒక్కటే. నటన కూడా ఒకటే. మిగతా పరిశ్రమలతో పోలిస్తే  తెలుగులో సినిమాల ఎక్కవ బడ్జెట్ వుంటుంది. పెద్ద కాన్యాస్ లో సినిమాకు తెరకెక్కుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలని కలుపుకుంటే ఇక్కడ థియేటర్స్, ఆడియన్స్ ఎక్కువ.      


మలయాళం నుండి చాలా చిత్రాలు, కంటెంట్ రీమేక్ అవుతాయి కదా.. కారణం ఏమిటాని భావిస్తున్నారు?

మలయాళంలో స్టార్ కాస్ట్, డైరెక్టర్, నిర్మాత కంటే స్క్రిప్ట్ చాలా ప్రధానం. బౌండ్ స్క్రిప్ట్ లేనిదే షూటింగ్ స్టార్ట్ కాదు. రచయితల మొదట బలమైన స్క్రిప్ట్ ని రాయడానికి ప్రయత్నిస్తారు. బహుశా అదో కారణం కావచ్చు.


ఓటీటీల ప్రభావం థియేటర్ పై వుంటుందని భావిస్తున్నారా?

సినిమా అనేది అల్టీమేట్ గా థియేటర్ ఎక్స్ పిరియన్స్. మమ్ముటి గారు ఒక సినిమా షూటింగ్  చేస్తున్నపుడు ఎలా వస్తుందో కనీసం మోనిటర్ కూడా చూడలేదు. కారణం అడిగితే.. ''నేను యాక్ట్ చేస్తుంది మానిటర్ కోసం కాదు .. బిగ్ స్క్రీన్ పై ఎలా వుంటుందో అనేది చూస్తాను''అని చెప్పారు. థియేటర్ ఇచ్చే అనుభవం వేరు. 'రామారావు ఆన్ డ్యూటీ' లాంటి భారీ చిత్రాన్ని అందరూ థియేటర్ లోనే చూడాలి. ఈ చిత్రం అన్ని ఎలిమెంట్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది, ఆలోచింపజేస్తుంది.


కొత్తగా చేస్తున్న సినిమాలు ?

మలయంకున్జు పాటు మరో నాలుగు మలయాళం సినిమాలు విడుదల కానున్నాయి. మరో రెండు సినిమాల షూటింగ్ మొదలుపెట్టాలి.


ఆల్ ది బెస్ట్

థాంక్స్

The Russo Brothers On Their Love For India, Dhanush, And The Gray Man!

 The Russo Brothers On Their Love For India, Dhanush, And The Gray Man!




The Dynamic Director-duo, Anthony And Joe Russo, Along With Dhanush, Met With The Indian Press And Spoke About The Gray Man At A Press Conference In Mumbai Earlier Today


Mumbai, 21 July, 2022- Legendary Filmmakers Anthony And Joe Russo, Are In India To Promote Their Highly Anticipated Action Spectacle On Netflix- The Gray Man, Starring Ryan Gosling, Chris Evans, Ana De Armas With Dhanush, Who Is Also Accompanying The Russo Brothers On Their India Tour. While Talking About The Making Of The Film At The Press Conference That Was Held With The Russo Brothers And Dhanush In Mumbai Earlier Today , They Spoke In Detail About Bringing To Life This Magnum Opus.


The Russo Brothers Shared, “being Here In India Has Let Us See First-hand How Much Entertainment Is Thriving Here. We Are Extremely Thrilled To Have Brought The Gray Man To Life With Netflix And For People All Over The World To Enjoy The Film And See Dhanush In Action. He Is A Consummate Professional We Deeply Admire And Respect, And We Truly Hope For More Opportunities To Work Together Again.”


Talking About His Experience While Working On The Gray Man, Dhanush Said, "The Russo Brothers Taught Me Patience Among Many Other Things And I Had A Wonderful Learning Experience On The Sets Of Gray Man. It Was An Unbelievable Experience And I Enjoyed Every Moment Of It. It’s Been Always My Intention To Explore And Learn More, Looking Forward To Many Such Experiences”



Stream The Gray Man Only On Netflix  On July 22.

And Gear Up For More Action, Drama And Another Blockbuster - The Gray Man 2!


About The Gray Man


Directors: Anthony Russo, Joe Russo

Writers: Joe Russo, Christopher Markus, Stephen Mcfeely

Producers: Joe Roth, Jeffrey Kirschenbaum, Anthony Russo, Joe Russo, Mike Larocca, Chris Castaldi

Executive Producers: Patrick Newall, Christopher Markus, Stephen Mcfeely, Jake Aust, Angela Russo-otstot, Geoff Haley, Zack Roth, And Palak Patel

Based On The Book Series: The Gray Man By Mark Greaney

Cast: Ryan Gosling, Chris Evans, Ana De Armas, Jessica Henwick, Wagner Moura, Dhanush, Billy Bob Thornton, Alfre Woodard, Regé-jean Page, Julia Butters, Eme Ikwuakor, Scott Haze

Positive Talk for Meelo Okkadu

 'మీలో ఒకడు' చిత్రానికి పాజిటివ్ టాక్ !



టాలీవుడ్‌లో మ‌రో సినిమా హిట్ కొట్టింది. శ్రీమ‌తి చిన్ని కుప్పిలి సమర్పణలో శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్‌పై లయన్ కుప్పిలి శ్రీనివాస్ హీరోగా నటిస్తూ, నిర్మించిన‌ చిత్రం ''మీలో ఒకడు''. సీనియ‌ర్ న‌టుడు సుమ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. తాజాగా ఈ సినిమా (శుక్ర‌వారం) విడుద‌లై థియేట‌ర్‌ల‌లో సంద‌డి చేస్తోంది. ఫ‌స్ట్ డే ఈ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. హైదరాబాద్ మూసాపేట్ లక్ష్మీకళా థియేటర్ వద్ద ప్రేక్షకులు ప్రశంసల జల్లు కురిపించడంతో, చిత్రయూనిట్ టీం బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. రిలీజ్ అయిన అన్ని సెంటర్ ల నుంచి పాజిటివ్ సొంతం చేసుకోవ‌డంతో సినిమాను ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు  కుప్పిలి శ్రీనివాస్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. 


యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన 'మీలో ఒకడు' ఒక మంచి మెసెజ్ ఇచ్చిందంటూ సినిమాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. సెన్సార్ స‌భ్యులతో ప్ర‌శంస‌లు అందుకుని U/A స‌ర్టిఫికెట్ సొంతం చేసుకుంది ఈ సినిమా. కుప్పిలి శ్రీనివాస్ స‌ర‌స‌న హ్రితిక సింగ్, సాధన పవన్ న‌టించిన ఈ మూవీలో 

సీనియ‌ర్ న‌టులు సుమ‌న్‌తోపాటు, కృష్ణ భ‌గ‌వాన్, స‌మీర్, అశోక్ కుమార్, బ‌స్టాప్ కోటేశ్వ‌ర‌రావు, గ‌బ్బ‌ర్ సింగ్ బ్యాచ్ ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఇప్ప‌టికే రిలీజైన ఈ సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్, సాంగ్స్ కు మంచి స్పంద‌న వ‌చ్చింది.

Darja Movie Review

 మాస్ ని అలరించే అనసూయ ' దర్జా '





యాంకరింగ్ తో బుల్లి తెరపై యూత్ ని అలరించిన యాంకర్ అనసూయ ఇప్పుడు దర్జా గా వెండితెర మీద అలరించడానికి రెడీ అయింది. ఇందులో కమెడియన్ కం హీరో సునీల్ ఓ ముఖ్యమైన పాత్ర పోషించారు. సునీల్ తో పాటు ఈ చిత్ర కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌  నిర్మాత రవి పైడిపాటి ఓ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రానికి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సమర్పణ. పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రంగా తెరకెక్కింది. ఈ చిత్రానికి సలీమ్ మాలిక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మించారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా రవి పైడిపాటి వ్యవహరించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి లేడీ ఓరియెంటెడ్ పాత్రకు అనసూయ ఏమాత్రం న్యాయం చేసిందో చూద్దాం పదండి.


కథ: బందరు కనకం అలియాస్ కనక మహాలక్ష్మి (అనసూయ) అంటే బందరు చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు హడల్. పోలీస్ యంత్రాంగాన్ని సైతం తన రౌడీయిజంతో శాసిస్తు తన గుప్పెట్లో పెట్టుకుని దందా సాగిస్తుంటుంది. ఈ క్రమంలో గణేశ్ (అరుణ్ వర్మ) తను ప్రేమించిన అమ్మాయి పుష్ప(శిరీష) చేతిలో మోసపోయి ఉరేసుకుని చనిపోతాడు. తన అన్న చావుకి కారణం అయిన పుష్పని... గణేశ్ తమ్ముడు రంగ (షమ్ము) చంపాలని చూస్తుండగా... కొత్తగా వచ్చిన బందరు ACP శివ శంకర్ పైడిపాటి(సునీల్) అడ్డుకుని.. ఆ కేసు విచారణ చేపడతాడు. మరి గణేష్ చనిపోవడానికి కారణం పుష్ప మోసం చేయటం వల్లనేనా? బందరు కనకం ఆగడాలను ACP ఎలా ఆట కట్టించాడు? అసలు ACP శివశంకర్ ఎవరు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..!!!



కథ... కథనం విశ్లేషణ: లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ వుంది. ఎప్పుడూ యూత్ ను ఆకట్టుకునే పాత్రల్లో నటించిన యాంకర్ అనసూయ దర్జాలో ఓ పవర్ ఫుల్ విలన్ పాత్ర పోషించింది. ఈ పాత్రను హైలైట్ చేయటం కోసం దర్శకుడు ఎంచుకున్న స్టోరీ... దాని చుట్టూ రాసుకున్న స్క్రీన్ ప్లే ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. అనసూయ పాత్ర ఆది నుంచి చివరి దాకా ఎంతో క్రూరంగా సాగి ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీని పెంచుతుంది. అలాగే సునీల్ ఏసీపీ పాత్రలో వచ్చే ట్విస్ట్ లు ఆడియెన్స్ ని బాగా ఎంగేజ్ చేస్తాయి. ఓ వైపు బందర్ కనకం ఆగడాలను చూపిస్తూనే... మరో వైపు గణేష్, పుష్పాల స్వఛ్చమైన ప్రేమను... అలానే రంగ, తీన్ మార్ గీతల చిలిపి ప్రేమను, ఆమని, తన పిల్లల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్... శకలకశంకర్, థర్టీ ఇయర్స్ పృథ్వీల కామెడి అన్నీ మాస్ ను బాగ ఎంటర్టైన్ చేస్తాయి. చివర్లో వచ్చే మాస్ బీట్ సాంగ్ ఆడియెన్స్ ని అలరిస్తుంది.


అనసూయ పుష్పా తరవాత మంచి రౌద్రం వున్న పాత్రలో నటించి మెప్పించారు. విలనిజం తాలూకు పాత్రలో వచ్చే డైలాగ్స్ చాలా బాగా చెప్పింది. ACP శివశంకర్ పాత్రలో మాస్ ని మెప్పించేలా యాక్షన్ సీన్స్ తో మెప్పించాడు. ఈ చిత్రం కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి పైడిపాటి డెబ్యూ అయినా... పోలీస్ పాత్రలో ఒదిగిపోయాడు. శమ్ము, అరుణ్ వర్మ అన్నదమ్ముల పాత్రల్లో లీనమై నటించారు. అలానే శిరీష, అక్సాఖాన్ అక్కా చెల్లెళ్ళుగా నటించి ఆకట్టుకున్నారు. చివర్లో ఆక్సాఖాన్ చేసిన మాస్ బీట్ సాంగ్ యూత్ ని ఉర్రూతలూగిస్తుంది. షకలక శంకర్, పృథ్వీ, పాల్ రాము బాగ నవ్వించారు. మహేష్ సిద్ధాంతిగా తన పాత్రకి న్యాయం చేశాడు. విలన్ గా బళ్ళారి పాత్రలో సమీర్ బాగా క్రూరంగా నటించి మెప్పించాడు. సర్కార్ పాత్రలో ఎన్. రామ్ బాగా క్రూరత్వం చూపించి మెప్పించారు.


దర్శకుడు సలీమ్ మాలిక్ రాసుకున్న కథ.. కథనాలు బాగున్నాయి. డెబ్యూ మూవీ ఆయినా బాగానే హ్యాండిల్ చేశాడు. డైలాగ్స్ బాగున్నాయి. సంగీతం పర్వాలేదు. చివర్లో వచ్చే మాస్ సాంగ్ ఆడియెన్స్ కి మాంచి కిక్ ఇస్తుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా వుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్ సీన్స్ మాస్ ను బాగ ఆకట్టు కుంటాయి. నిర్మాతలు ఖర్చుకి వెనుకాడకుండా సినిమాని క్వాలిటీగా నిర్మించారు. గో అండ్ వాచ్ ఇట్..!!!


రేటింగ్: 3.25

ZEE5's 'Maa Neella Tank’ streams to a thumping response

 ZEE5's 'Maa Neella Tank’ streams to a thumping response



This Sushanth-Priya Anand starrer clocks 50 million streaming minutes


Hyderabad, 21st July 2022: ZEE5 has been relentlessly dishing out a wide variety of content in various formats in Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, Marathi, Gujarathi, Bengali and other languages. ZEE5 has made a name for itself nationwide as a prominent streaming platform since its inception. The streaming giant has been streaming 'Roudram Ranam Rudhiram' to a blockbuster response. On the web series front, ZEE5 has been spectacular. After presenting the comedy-drama 'Oka Chinna Family Story' from Pink Elephant Pictures, 'Loser 2' from Annapurna Studios stable, 'Gaalivaana' from BBC Studios and NorthStar Entertainment, it most recently came out with 'Recce'.


On July 15, the streaming giant started premiering 'Maa Neella Tank’. Starring Sushanth and Priya Anand in the lead, the 8-episode series has been loved by the audience. The viewers are showering their immense love on the feel-good village dramedy set in Buchivolu. Directed by Lakshmi Sowjanya, the series has been drawing a positive response all over.


'Maa Neella Tank' is trending at Top 3 on ZEE5 India. Though the series started with average reviews from the media fraternity, the viewers have given a superlative verdict. The nature of the series is such that each episode can be watched at leisure without bothering about losing track of the plot. The light humour and healthy banter are making the viewers revisit the series from where they had left. For those who are not into binge-watching, 'Maa Neella Tank' is the perfect outing.


Cast:


Sushanth as Vamsi

Priya Anand as Surekha

Sudarshan as Gopal

Divi as Ramya

Prem Sagar as Kodandam

Nirosha as Chamundi

Ramaraj as Narasimham

Annapurnamma as Boonemma

Appaji Ambarisha as Ramana

Bindu Chandramouli as Bhargavi

Sandeep Varanasi as Subbu

Lavanya Reddy as Revathi