Latest Post

Em Chesthunnav in Etv win -Perfect Summer Entertainer

 ఈటివి విన్ మరో బ్లాక్ బస్టర్ ‘ఏం చేస్తున్నావ్ ’ - పర్ఫెక్ట్ సమ్మర్ ఎంటర్టైనర్




ఈ మధ్య ఓటిటిలో రిలీజ్ అయిన సినిమాలలో గనుక కంటెంట్ ఉంటె ప్రేక్షకుల నుండి చాలా మంచి ఆదరణ పొందుతున్నాయి. కాని అలాంటి కంటెంట్ ఉన్న సినిమాలే చాలా అరుదుగా వస్తున్నాయి. అలాంటి అరుదైన సినిమాలలో ‘ఏం చేస్తున్నావ్’ ఒకటి. చాలా సైలెంట్ గా ఈటివి విన్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ పొందింది. ఇటీవలే స్టార్ట్ చేసినా కూడా మంచి మంచి హిట్స్ ను వారి ఖాతాలో వేసుకుంది ఈటివి విన్. ఇంతక ముందు 90s, వలరి, తులసి వనం లాంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈటీవి విన్ ఇప్పుడు ఈ ‘ఏం చేస్తున్నావ్ ’ తో మరో హిట్ అందుకుంది. 


నవీన్ కురువ, కిరణ్ కురువ నిర్మాతలుగా ‘ఏం చేస్తున్నావ్ ’ ఎన్ వి ఆర్ ప్రొడక్షన్స్, సిద్స్ క్రియేటివ్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమాకి రచన దర్శకత్వం భారత్ మిత్ర అందించారు. ఎన్నో సక్సెస్ఫుల్ లవ్ స్టోరీస్ కి మ్యూజిక్ అందించిన గోపి సుందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇచ్చారు. 


ఈ ‘ఏం చేస్తున్నావ్’ సినిమాకు ప్రేక్షకుల నుండి విశేష ఆధరణ వచ్చింది. హీరో రాజ్ పెర్ఫార్మన్స్ కి మంచి ప్రసంశలు వచ్చాయి. యూత్ కి నచ్చే ఎన్నో ఎలెమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. కొన్ని డైలాగ్స్ ని చాలా మంది స్టూడెంట్స్ అండ్ చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం చూస్తున్న యూత్ అందరూ రిలేట్ అయ్యేలా, కామెడీ కూడా బాగా వర్క్ అవుట్ చేస్తూ తీసారు. 


ఈటీవి విన్ మార్కెటింగ్ హెడ్ నితిన్ మాట్లాడుతూ: ఈ వేసవిలో పెద్దగా సినిమాలు ఏమి లేవు. భయత చేసే పోల్యుటెడ్ మార్కెటింగ్ ఏం చెయ్యకపోయినా ఈ సినిమాకి ఆర్గానిక్ గా చాలా మంచి సక్సెస్ వచ్చింది. కచ్చితంగా ఫ్యామిలీ మొత్తం చూడాలిసిన సినిమా ఇది, మీరు ఈ సినిమా చూస్తున్నంత సేపు అస్సలు రీగ్రేట్ అవ్వరు. ఈటీవి విన్ లో ప్రేక్షకులు రీగ్రేట్ అయ్యే కంటెంట్ అస్సలు రాదు అని చెప్పారు


ఈటీవి విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ మాట్లాడుతూ: ఈ సినిమాలో చాలా వాటికి మనం రిలేట్ అవుతాము, రోజు మనం చూసే మన పక్కింటి వాళ్ళు, చుట్టాలు అందరు ఈ సినిమాలో కనిపిస్తారు. భరత్ చాలా బాగా రాశారు, డైరెక్ట్ చేసారు. ప్రేక్షకులు రిలేట్ అయ్యే కంటెంట్ ఈరోజుల్లో చాలా తగ్గిపోయింది. ఈ సినిమాలో ఈటీవి విన్ లో చాలా మంచి సక్సెస్ అయ్యింది. 


డైరెక్టర్ భారత్ మిత్ర మాట్లాడుతూ: మా ప్రొడ్యూసర్ నవీన్ వల్లనే ఈ సినిమా చేశాను, తను ఒక చిన్న ఊరులో బట్టలు కొట్టు పెట్టుకుని ఏడు సంవత్సరాలు దాచుకున్న డబ్బులతో ఈ సినిమా చేశారు. తరవాత బజ్జేట్ పెరిగింది, అప్పుడు హేమంత్ టీంలోకి వచ్చారు.అందరికి చాలా బాగా రీచ్ అయింది సినిమా, మీమర్స్ ద్వారా సినిమా ప్రేక్షకులలోకి వెళ్ళింది. అందుకనే ఏలూరు శ్రీను గారు సలహా మేరకు మీమర్స్ అందరితోనే మా సక్సెస్ జరుపుకుందాం అని మీతోనే ఈ మీటింగ్ పెట్టుకున్నాం అని థాంక్స్ చెప్పారు. 


తారాగణం:

విజయ్ రాజ్ కుమార్

నేహ పతన్

అమితా రంగనాథ్

ఆమని

రాజీవ్ కనకాలా

ఇతరులు..



టెక్నీషియన్స్

రచన్ దర్శకత్వం: భరత్ మిత్ర

నిర్మాతలు: నవీన్ కురువ, కిరణ్ కురువ


బ్యానర్: యెన్విఆర్ ప్రొడక్షన్స్, సిద్స్ క్రియేటివ్ వరల్డ్

మ్యూజిక్ డైరెక్టర్: గోపి సుందర్

సినిమాటోగ్రఫీ: ప్రేమ్ అడివి

ఎడిటర్: హరి శంకర్ టియెన్

Bejawada lo Balakumari From Speed 220 is Trending in Social Media

 సోషల్ మీడియాను ఊపేస్తున్న స్పీడ్220 చిత్రం స్పెషల్ సాంగ్

 


విజయలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఫణి కొండమూరి సమర్పణలో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ స్పీడ్220. ఈ చిత్రానికి హర్ష బెజగం కథ-కథనం-దర్శకత్వం అందించారు. హేమంత్, గణేష్ ఇద్దరు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రీతి సుందర్, జాహ్నవి శర్మ కథానాయకులుగా నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి తాజాగా ఓ స్పెషల్ సాంగ్ విడుదల అయింది. ప్రముఖ డాన్సర్ స్నేహ గుప్తా నర్తించిన బెజవాడలో బాలా కుమారి పాట ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది.


బెజవాడలో బాలాకుమారి, మిర్యాలగూడలో మీనా కుమారి అంటూ హిట్టు హిట్టు సూపర్ హిట్టు, నా ఫిగర్ కి ఒక్క లైక్ కొట్టు అనే మాస్ బీట్ గాయని గీతామాధురి ఆలపించారు. తన అధ్బుతమైన గాత్రనికి యంగ్ టాలెంటెడ్ డాన్సర్ స్నేహ గుప్తా తోడై డాన్స్ ను ఇరకొట్టింది. సంతోష్ కుమార్ బి రాసిన ఈ పాట కచ్చితంగా ఓ ట్రెండ్ సెట్ చేస్తుంది అని పాట వింటుంటే తెలుస్తోంది. దింతో స్పీడ్ 220 సినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. 


ఇక చిత్రం టైటిల్ లోనే స్పీడ్ ఉంది కాబట్టి, చిత్రాన్ని కూడా ప్రేక్షకులకు స్పీడ్ గా అందించేందుకు షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా హర్ష బెజగం ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. అదేవిధంగా ప్రొడక్షన్ విషయంలో ఎక్కడా తగ్గకుండా చిత్ర నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా సినిమాను గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. అతి త్వరలోనే ఈ చిత్రం అన్ని పనులు ముగించుకుని ప్రేక్షకుల ముందుకు రానుంది.


చిత్రం: స్పీడ్220

నిర్మాత: కె ఫణి, ఎమ్ సూర్యనారాయణ, ఎమ్ దుర్గ రావ్

హీరోలు: హేమంత్, గణేష్

హీరోయిన్స్: ప్రీతీ సుందర్, జాహ్నవి శర్మ

డ్యాన్సర్: స్నేహ గుప్తా

కొరియోగ్రాఫర్ : అషేర్ మామిడి

మ్యూజిక్ డైరెక్టర్: శేఖర్ మోపూరి

సింగర్ : గీతమాధురి

డీఓపీ : క్రాంతి కుమార్ కొణిదెన

పీఆర్ఓ : హరీష్, దినేష్

కథ-స్క్రీన్ ప్లే- డైరెక్షన్ : హర్ష బెజగం

Rachit Shiva's Production No. 3 launched under the direction of Palik Srinu

 రచిత్ శివ పతాకంపై పాలిక్ శ్రీను దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.3 చిత్రం ప్రారంభం



 ఐ.ఐ.టి.కృష్ణమూర్తి ఫేం యువ హీరో పృథ్వీ  హీరోగా రూపాలి, అంబిక హీరోయిన్లుగా...రచిత్ శివ, ఆర్.ఆర్.క్రియేషన్స్  అండ్ పాలిక్ స్టుడియోస్ పతాకాలపై తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నెం.3 చిత్రం బుధవారం లాంచనంగా పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని దుర్గం రాజేష్, రావుల రమేష్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం పాలిక్ శ్రీను. సంగీతం జాన్ భూషన్ అందించగా సురేష్ గంగుల పాటల రచయిత. వెంకట్, నిశాంత్ నిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నిషాంత్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ హీరో, హీరోయిన్లపై క్లాప్ కొట్టి... టీమ్ ను అభినందించారు.

ఈ సందర్భంగా సీనియర్ నటి ఆమని మాట్లాడుతూ... ఈ చిత్రంలో నేను ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నా. లవ్ అండ్ సెంటిమెంట్ ఎమోషనల్ కామెడీ మూవీ. ఇది గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కుతున్న చిత్రం. ఇందులో అజయ్ ఘోష్ సరసన నేను నటిస్తున్నా. నిర్మాతలు ఈ చిత్రాన్ని ఎంతో ప్యాషన్ తో తీస్తున్నారు. దర్శకుడు పాలిక్ చెప్పిన కథ నాకు బాగా నచ్చి ఈ చిత్రం చేస్తున్నా అన్నారు.


హీరోయిన్ అంబిక, రూపాలి మాట్లాడుతూ... ఈ చిత్రంలో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఇది మాకు తొలి తెలుగు సినిమా. దర్శకుడు, నిర్మాతలు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి... ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు. స్క్రిప్ట్ నచ్చి ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నారు. ఇంతకు ముందు హిందీ, మరాఠి చిత్రాల్లో నటించిన అనుభవం ఉంది. ఇది లవ్, రొమాంటిక్, సెంటిమెంట్, కామెడీతో ప్రధానంగా తెరకెక్కుతోంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాతలు, దర్శకునికి ధన్యవాదాలు అన్నారు.


హీరో పృథ్వీ మాట్లాడుతూ... మా డైరెక్టర్ పాలిక్ ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇలాంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాని తీయడానికి ముందుకు వచ్చిన నిర్మాతలకి ధన్యవాదాలు. త్వరలోనే సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు వస్తాం అన్నారు.


నిర్మాత దుర్గం రాజేష్ మాట్లాడుతూ... ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున్న నిర్మించడానికి రావుల రమేష్, టి.ఎస్.రాజులతో కలిసి ముందుకు వచ్చాం. దర్శకుడు పాలిక్ తో కలిసి ప్రొడక్షన్ నెం.3 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రేక్షకులు అలరించేలా ఈ చిత్రాన్ని యువ నటీనటులతో తెరకెక్కిస్తున్నాం. హీరో పృథ్వీని తెలంగాణ నుంచి, హీరోయిన్లను బాలీవుడ్ నుంచి, మళయాలం నుంచి అనిరుధ్ ని విలన్ గా... ఇలా అన్ని ప్రాంతాల నుంచి అందరి ఆర్టిస్టులను తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం అన్నారు. నిర్మాత, దర్శకుడు భరద్వాజ కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. ఆయనకు ధన్యవాదాలు అన్నారు.


నిర్మాత రావుల రమేష్ మాట్లాడుతూ... ఇటీవలే కాలకేయ ప్రభాకర్ తో కలిసి రౌద్రరూపాయ నమ: చిత్రాన్ని విడుదల చేశాం. ఆ చిత్రానికి మంచి పేరు వచ్చింది. థియేటర్లు సరిగా దొరకలేదు. కేవలం 70 థియేటర్లలో మాత్రమే విడుదల చేయగలిగాం. ఈ చిత్రానికైనా ఎక్కువ థియేటర్లు లభిస్తాయని ఆశిస్తున్నా అన్నారు.


సంగీత దర్శకుడు మాట్లాడుతూ... ఇందులో ఐదు పాటలు కంప్లీట్ అయ్యాయి. దర్శకుడు పాలిక్ ఎంతో ఎంకరేజ్ చేశారు. ఈ చిత్రానికి సంగీతం అందించడం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు. 


దర్శకుడు పాలిక్ మాట్లాడుతూ... ఇది నాకు ఇది మూడో చిత్రం. నాకు కొరియోగ్రాఫర్ గా మంచి పేరుంది. ఇటీవల రిలీజ్ అయిన రౌద్రరూపాయ నమ: చిత్రానికి మంచి పేరు వచ్చింది. మంచి రేటింగ్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేశారు. నాకు ఎప్పటి నుంచో స్వాతిముత్యం లాంటి ఓ మంచి కుటుంబకథా చిత్రం తీయాలని ఉంది. నా మిత్రుడు ఎస్.ఆర్.పి. ఇచ్చిన కథ నచ్చి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వివిధ పాత్రలకోసం నటీనటులను తీసుకున్నాం. తెలుగులోని ప్రధాన తారాగణం అంతా కూడా ఇందులో నటిస్తున్నారు. పాటలు కూడా చాలా బాగా వచ్చాయి. ఇందులో ఆమని, ఝాన్సీ లు చాలా వెయిటేజ్ ఉన్న పాత్రలు చేస్తున్నారు. వచ్చే నెల 25 నుంచి చ సెట్స్ మీదకు వెళుతుంది. మంచిర్యాలలో ఓ పాటను తీస్తున్నాం. ఐదు షెడ్యూల్స్ లో సినిమాని పూర్తి చేసి... దిపావళికి సినిమాని విడుదల చేస్తున్నాం అన్నారు.


నటీనటులు: పృథ్వీ, రూపాలి, అంబిక, ఆమని, ఝాన్సీ, అజయ్ ఘోష్, జీవా, షకలక శంకర్, సుమన్, ఆర్.ఎస్.నంద, సుమన్ శెట్టి, సూర్య, చిత్రం శీను, అనిరుధ్, రఘు, సింగ్ సిద్ధూ తదితరులు నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు: 


నిర్మాతలు: దుర్గం రాజేష్, రావుల రమేష్, టి.ఎస్.రాజు

కథ-డైలాగ్స్-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: పాలిక్ శ్రీను

సంభాషణలు: తోటపల్లి సాయినాథ్

సంగీతం: జాన్ భూషన్

పాటలు: సురేష్ గంగుల

సినిమాటోగ్రఫీ: వెంకట్, నిశాంత్

కొరియోగ్రఫీ: పాలిక్, మహి

ఎటిటర్: నిశాంత్

కో-డైరెక్టర్: రంగనాయకులు

ప్రొడక్షన్ మేనేజర్: సూర్య

పి.ఆర్.ఓ.: చందు రమేష్

Abhishek Agarwal Arts & I am Buddha Production’s The Delhi Files To Start This Year, Release Next Year

 అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ & ఐ యామ్‌ బుద్ధ ప్రొడక్షన్స్ 'ది ఢిల్లీ ఫైల్స్' ఈ ఏడాది ప్రారంభం- వచ్చే ఏడాది విడుదల



విజయవంతమైన చిత్రం 'ది కాశ్మీర్ ఫైల్స్' తో బాలీవుడ్‌లోకి ప్రవేశించిన టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రితో కలిసి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ 'ది ఢిల్లీ ఫైల్స్' కోసం జతకట్టనుంది.


తాజాగా దర్శకుడు, నిర్మాత ఒక అప్‌డేట్‌తో ముందుకు వచ్చారు.  ది ఢిల్లీ ఫైల్స్ ఈ సంవత్సరం సెట్స్‌పైకి వెళ్తుందని, వచ్చే ఏడాది విడుదలౌతుందని వివేక్ అగ్నిహోత్రి ధృవీకరించారు.


'షెడ్యూల్ ప్రకారం #TheDelhiFiles ఈ సంవత్సరం ప్రారంభమౌతుంది. వచ్చే ఏడాది విడుదల. బిగ్ స్టార్లు లేరు. బిగ్ కంటెంట్ మాత్రమే” అని వివేక్ అగ్నిహోత్రి పేర్కొన్నారు. దర్శకుడి స్టేట్మెంట్ పై అభిషేక్ అగర్వాల్ కూడా చిత్రం టైటిల్‌ను ట్యాగ్ చేయడం ద్వారా కన్ఫర్మ్ చేశారు  


తేజ్‌ నారాయణ్‌ అగర్వాల్‌ సమర్పణలో అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌, ఐ యామ్‌ బుద్ధ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి అభిషేక్ అగర్వాల్, అర్చన అగర్వాల్, వివేక్ రంజన్ అగ్నిహోత్రి పల్లవి జోషి నిర్మాతలు.  


ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.


Varalaxmi Sarathkumar Interview About Sabari

 లైఫే రిస్క్... 'శబరి'లో మదర్ రోల్ రిస్క్ కాదు, అందరికీ నచ్చే సీట్ ఎడ్జ్ సైకలాజికల్ థ్రిల్లర్ ఇది - వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంటర్వ్యూ




శబరి'లో సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేశా... డిఫరెంట్ యాక్షన్, నేచురల్ ఫైట్ సీక్వెన్సులు ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తాయి - వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంటర్వ్యూ

వెర్సటైల్ యాక్టర్ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'శబరి' మే 3న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానున్న సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగు మీడియాతో ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు...

'శబరి' ప్రయాణం ఎలా, ఎప్పుడు మొదలైంది?

'క్రాక్'కు సంతకం చేయడానికి ముందు 'శబరి' కథ విన్నా. నాకు బాగా నచ్చింది. కథపై నమ్మకంతో ఈ సినిమా చేస్తానని చెప్పాను. అయితే, షూటింగ్ చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేశా. టిపికల్ రెగ్యులర్ నెగిటివ్ షేడ్ రోల్ కాకుండా కొత్త పాత్ర చేశా. ఆర్టిస్టుగా నేను ఈ పాత్ర చేయగలనని దర్శక నిర్మాతలు నమ్మారు. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి వాళ్లు ముందుకు వచ్చారు. అందుకు వాళ్లను మెచ్చుకోవాలి. ఖర్చు విషయంలో నిర్మాత రాజీ పడకుండా సినిమా తీశారు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. అందరికీ నచ్చుతుంది. 


దర్శక నిర్మాతలు కొత్తవాళ్లు... ఈ సినిమా చేయడం రిస్క్ అనిపించలేదా?

లైఫే రిస్క్ అండీ. హిట్టూ ఫ్లాపులను ఎవరూ జడ్జ్ చేయలేరు. 'హనుమాన్' చిన్న సినిమా అనుకున్నారు. పెద్ద హిట్ అయ్యింది. 'నాంది', 'కోట బొమ్మాళీ పీఎస్' సినిమాలు అంత మంచి విజయాలు సాధిస్తాయని ఊహించలేదు. మేం ఒక డిఫరెంట్ సినిమా చేశాం. ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. 

కొత్త నిర్మాతలు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కొన్ని భయాలు ఉంటాయి. నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మీకు ఎలాంటి నమ్మకాన్ని కలిగించారు?

'శబరి' ప్రెస్‌మీట్‌ చూస్తే అందరూ నిర్మాత గురించి మాట్లాడారు. ఎందుకంటే... ఆయన జెన్యూన్ పర్సన్. ఎవరినీ చీట్ చేసే మెంటాలిటీ లేదు. అడగక ముందు పేమెంట్ వస్తుంది. బడ్జెట్ దాటినా మధ్యలో వదలకుండా సినిమా పూర్తి చేశారు.

గణేష్ వెంకట్రామన్ సినిమాలో మీకు అపోజిట్ క్యారెక్టర్ చేశారా? మీ మధ్య యాక్షన్ సీన్లు ఉన్నాయా?

సినిమాలో చూడండి. స్క్రీన్ ప్లే డ్రివెన్ సినిమా 'శబరి'. ప్రేక్షకులకు కొత్త థ్రిల్ ఇస్తుంది. డిఫరెంట్ యాక్షన్ ఉంటుంది. నేచురల్ ఫైట్ సీక్వెన్సులు ఉంటాయి. 


యాంగ్రీ విమన్ రోల్స్, హీరోతో ప్యారలల్ రోల్స్ చేస్తున్నారు. ఈ సమయంలో తల్లి పాత్ర అంటే ఎలా ఫీలయ్యారు?

నా తొలి సినిమా 'పొడా పొడి'లో మదర్ రోల్ చేశా. 'పందెం కోడి 2'లో చేశా. నేను ఓ యాక్టర్. నచ్చిన క్యారెక్టర్ వచ్చినప్పుడు చేస్తాను. ఇమేజ్ వంటివి పట్టించుకోను. సినిమాలో ప్రేక్షకులకు ఏం చూపిస్తే అది యాక్సెప్ట్ చేస్తారు. కంటెంట్ బావుంటే ప్రేక్షకులు సినిమా చూస్తారు. 


'శబరి' సినిమాలో మీ రోల్ ఏమిటి? ఛాలెంజింగ్ అనిపించిన మూమెంట్?

యాంగ్రీ యంగ్ లేడీ కాదు. ఓ సాధారణ అమ్మాయి. భర్తతో సమస్యల కారణంగా, అతని నుంచి వేరుపడి కుమార్తెను ఒంటరిగా పెంచుతుంది. ఆమెకు ఏమైంది? అనేది కథ. సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేసే అవకాశం లభించింది. లౌడ్ మూమెంట్స్ ఉండవు. కుమార్తెను కాపాడుకునేటప్పుడు తల్లికి వచ్చే కోపం వేరు, సాధారణంగా వచ్చే కోపం వేరు. డిఫరెంట్ యాంగర్ చూపించే అవకాశం వచ్చింది. మదర్ అండ్ డాటర్ కనెక్షన్ మూవీలో హైలైట్ అవుతుంది. కూతుర్ని కాపాడుకోవడం కోసం తల్లి ఏం చేసిందనేది కథ. 


మెయిన్ లీడ్ చేసేటప్పుడు ప్రెజర్ ఏమైనా ఉంటుందా?

హిట్టూ ఫ్లాపులు నా చేతుల్లో లేవు. ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారు. వాళ్లకు మంచి సినిమాలు ఇవ్వాలనే ప్రెజర్ ఉంది. ప్రేక్షకులు నచ్చే విధమైన నటన ఇవ్వాలనే ప్రెజర్ ఉంది. థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకుడు ఆమె పెర్ఫార్మన్స్ బాలేదని అనుకోకూడదు.

నిర్మాతకు మరో సినిమా చేస్తానని మాటిచ్చారట!

చేస్తాను. మంచి కథతో వస్తే తప్పకుండా చేస్తా.

మీ సినిమాల గురించి కాబోయే భర్త నికోలయ్ ఏం చెబుతారు?

బాలేదంటే బాలేదని చెబుతారు. బావుందంటే బావుందని చెబుతారు. ఆయనకు బాలేదని చెప్పే అవకాశం లేదు (నవ్వులు). ఇప్పటి వరకు బావుందని చెప్పారు. 

పెళ్లి ఎప్పుడు?

ఈ ఏడాది ఉంటుంది. 

నెక్స్ట్ సినిమాలు?

'కూర్మ నాయకి' సినిమా విడుదలకు సిద్ధమైంది. తమిళంలో ధనుష్ గారి సినిమాతో పాటు మరో సినిమా చేస్తున్నా. కన్నడలో సుదీప్ గారి 'మ్యాక్స్' చేశా. మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. కన్ఫర్మ్ అయ్యాక ఆ వివరాలు చెబుతా.

Soulful Melody Kanulenduko From Harom Hara Released

 సుధీర్ బాబు, మాళవిక శర్మ, జ్ఞానసాగర్ ద్వారక, సుమంత్ జి నాయుడు, ఎస్‌ఎస్‌సి 'హరోం హర' నుంచి సోల్ ఫుల్ మెలోడీ కనులెందుకో విడుదల



సుధీర్ బాబు మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'హరోం హర' మ్యూజిక్ ప్రమోషన్స్ పవర్ ఫుల్ టైటిల్ సాంగ్‌తో ప్రారంభమయ్యాయి. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సెకెండ్ సింగిల్‌ని ఈ రోజు విడుదల చేశారు. .


చైతన్ భరద్వాజ్ స్వరపరిచి కనులెందుకో సోల్ ఫుల్ మెలోడీని నిఖితా శ్రీవల్లి,  చైతన్ భరద్వాజ్ అద్భుతంగా అలపించారు. కీబోర్డ్ నోట్స్‌తో పాటు అకౌస్టిక్ గిటార్, బాస్, ఎలక్ట్రిక్ మాండొలిన్ ఇంపాక్ట్ ని పెంచుతుంది. వెంగీ ఈ పాటకు ఆకట్టుకునే సాహిత్యాన్ని అందించాడు.


సుధీర్ బాబుని బయట కలవడం గురించి మాళవిక హింట్ ఇవ్వడం పాట ప్రారంభమవుతుంది. ఇద్దరూ కలిసి కొంత క్యాలిటీ టైం  గడపడానికి వేర్వేరు ప్రదేశాలకు వెళ్లడంతో వారి ప్రేమ ప్రయాణం ప్రారంభమవుతుంది. పాటలో వారి కెమిస్ట్రీ ప్లజెంట్ గా వుంది. విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. కనులెందుకో మంచి కంపోజిషన్ తో ఇన్స్టంట్ హిట్ గా నిలిచింది.


ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా విడుదల తేదీని త్వరలో అనౌన్స్ చేస్తారు మేకర్స్.


చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 నాటి నేపథ్యంలో సాగే హరోం హర కథలో సుధీర్ బాబు కుప్పం యాసలో డైలాగులు చెప్పనున్నారు. సునీల్ కీలక పాత్రలో నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ది రివోల్ట్ అనేది ట్యాగ్‌లైన్.


అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.


తారాగణం: సుధీర్ బాబు, మాళవిక శర్మ, సునీల్


సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం - జ్ఞానసాగర్ ద్వారక

నిర్మాత - సుమంత్ జి నాయుడు

సంగీతం - చైతన్ భరద్వాజ్

డీవోపీ - అరవింద్ విశ్వనాథన్

ఎడిటర్ - రవితేజ గిరిజాల

బ్యానర్ - శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్

పీఆర్వో - వంశీ శేఖర్


"Pushpa 2: The Rule Title Song on May 1st

 మే 1న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుష్ప‌-2 ది రూల్‌ టైటిల్‌ సాంగ్‌ విడుదల



ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప‌-2 ది రూల్. పుష్ప ది రైజ్‌తో ప్ర‌పంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ న‌ట‌న‌కు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అంద‌రూ ఫిదా అయిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇక ప్ర‌స్తుతం నిర్మాణంలో వున్న సీక్వెల్ పుష్ప‌-2 ది రూల్ గురించి ఎటువంటి అప్‌డేట్ అయినా స‌న్పేష‌న్‌. ఇటీవల  ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ చిత్రం టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. ఆ టీజర్‌కు వచ్చిన స్పందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీజర్‌ విడుదలైనప్పటి నుండి నాన్‌స్టాప్‌గా 138 గంటల పాటు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ వన్‌లో వుండి కొత్త రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా పుష్ప -2  ది రూల్‌ కొత్త అప్‌డేట్‌ వచ్చేసింది. యువ సంగీత కెరటం దేవి శ్రీప్రసాద్‌ సంగీత సారథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం పాటల్లోంచి మొదటి లిరికల్‌ వీడియో సాంగ్‌ను మే 1న ఉదయం 11:07 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది చిత్రబృందం. దీనికి సంబంధించిన 20 సెకండ్ల ప్రోమోను బుధవారం విడుదల చేశారు మేకర్స్‌... పుష్ప పుష్ప పుష్ప పుష్పరాజ్‌ అంటూ కొనసాగే ఈ టైటిల్‌ సాంగ్‌ ఎంతో పవర్‌ఫుల్‌గా వుండబోతుందని ఈ ప్రొమో చూస్తే తెలుస్తుంది.  ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా జీనియస్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్.. ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. 2021 బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పుష్ప. అల్లు అర్జున్ కెరీర్ లోనే అతిపెద్ద విజయంగా నిలవడంతోపాటు.. తనకు జాతీయస్థాయి అవార్డు తెచ్చి పెట్టిన చిత్రంగా పుష్ప నిలిచింది. దీంతో దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న పుష్ప-2  ద రూల్ చిత్రం పై భారీ అంచనాలు పెరిగాయి.

 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే.

నటీనటులు:

అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు


టెక్నికల్ టీం: కథ-కథనం-దర్శకత్వం: సుకుమార్.బి

నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్

సినిమాటోగ్రఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: S. రామకృష్ణ - మోనిక నిగొత్రే

లిరిసిస్ట్: చంద్రబోస్

సీఈఓ: చెర్రీ

బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్

పీఆర్ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు


First Single 'Kallara' from 'Satyabhama' releasing Tomorrow

 'క్వీన్ ఆఫ్ మాసెస్' కాజల్ అగర్వాల్ "సత్యభామ" సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'కళ్లారా..' రేపు రిలీజ్



'క్వీన్ ఆఫ్ మాసెస్' కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న “సత్యభామ” సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ బిగిన్ అయ్యాయి. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'కళ్లారా..'ను రేపు రిలీజ్ చేయబోతున్నారు. రేపు మధ్యాహ్నం 3.06 నిమిషాలకు ఈ పాటను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 'కళ్లారా..' పాటను క్వీన్ ఆఫ్ మెలొడీ శ్రేయా ఘోషల్ పాడారు. ఈ పాట కాజల్, నవీన్ చంద్ర లవ్ మేకింగ్ సాంగ్ గా ఉండబోతోంది. “సత్యభామ” సినిమాలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తోంది. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు.


“సత్యభామ” చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. “సత్యభామ” సినిమా మే 17వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది.



 నటీనటులు - కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర, తదితరులు


టెక్నికల్ టీమ్


బ్యానర్: అవురమ్ ఆర్ట్స్

స్క్రీన్ ప్లే, మూవీ ప్రెజెంటర్ : శశి కిరణ్ తిక్క

నిర్మాతలు : బాబీ తిక్క,  శ్రీనివాసరావు తక్కలపెల్లి

కో ప్రొడ్యూసర్ - బాలాజీ

సినిమాటోగ్రఫీ - జి విష్ణు

సీఈవో - కుమార్ శ్రీరామనేని

సంగీతం: శ్రీ చరణ్ పాకాల

పీఆర్ఓ: జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

దర్శకత్వం: సుమన్ చిక్కాల


"LOVE ME - If You Dare" releasing worldwide in theatres on May 25th

 మే 25న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతోన్న ఆశిష్, వైష్ణవి చైతన్య, దిల్‌రాజు ప్రొడక్షన్స్ న్యూ ఏజ్ లవ్ స్టోరీ ‘లవ్ మీ- ఇఫ్ యు డేర్’



టాలెంటెడ్ యాక్టర్స్ ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రపంచ వ్యాప్తంగా మే 25న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో మేకర్స్ సినిమా మే 25న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటిస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు.


రానున్న వేసవిలో వెన్నులో వణుకు పుట్టించేలా ఓ ఆత్మ ప్రేమకథతో బ్లాక్ బస్టర్ సాధిస్తామని దర్శక, నిర్మాతలు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచుతున్నారు.


ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి స్టార్ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించగా, అవినాష్ కొల్ల ఆర్ట్, ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు.

Unveiling the Raw and Riveting "Padamati Kondallo" By Sai Durga Tej

 సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్  చేతుల మీదగా ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్ విడుదల:



సుప్రీమ్‌ హీరో సాయి దుర్గ తేజ్‌ ‘ఎక్స్‌’ వేదికగా ‘పడమటి కొండల్లో’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. శ్రీదేవి క్రియేషన్స్ బ్యానర్ పై విన్విత ఎంటర్టైన్మెంట్స్ సమర్పణ ద్వారా జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా ఈ ‘పడమటి కొండల్లో’ చిత్ర నిర్మాణం జరిగింది. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన నరేష్ పెంట, సంగీతాన్ని కూడా అందించారు.


అనురోప్ కటారి హీరో గా నటిస్తున్న ఈ ‘పడమటి కొండల్లో’ పోస్టర్ లో తన లుక్, గెట‌ప్‌ చాలా గంభీరంగా ఉన్నాయి, హీరో రౌద్ర రస హావభావాలతో రక్తం అంటిన కత్తి పట్టుకుని నడుస్తున్న పోస్ అది, పెద్ద విద్వంసం జరిగిన ప్రదేశంలో, సినిమాలో ఫైట్ సీన్ లో లుక్ లా ఉంది.  ద‌ర్శ‌కుడు చిత్ర విశేషాల‌ను తెలియ‌జేస్తూ "పడమటి కొండల్లో" సినిమాతో సరి కొత్త ఎక్స్పీరియన్స్ ని ప్రేక్షకులు పొందుతారని, ఈ చిత్రానికి ఒక మార్క్ ఉంటుంది అని,  యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా కొన‌సాగే ఈ చిత్రంలో వుండే ప్రేమ‌క‌థ ఎంతో ఆస‌క్తిక‌రంగా వుంటుంద‌ని, సినిమా మొత్తం ఒక డిఫ‌రెంట్ అండ్ విజువ‌ల్ ఫీస్ట్‌లా వుండేలా ప్ర‌దేశంలో చిత్రీక‌ర‌ణ జ‌రుపుతామ‌ని,

 భవిష్యత్తులో మరిన్ని అప్డేట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తామని తెలిపారు.

తారాగణం:

అనురుప్ప్ కటారి

యశస్వి శ్రీనివాస్

శ్రావ్య రెడ్డి

మురళీ కృష్ణం రాజు

లతీష్ జవ్వాది

మురళీ రాజు

స్కయ్

జగదీష్ రెడ్డి

ఆర్.రాము

శివాని నీలకంఠం

భాను

ప్రసాద్

రాంబాబు

లక్కీ


సాంకేతిక నిపుణులు:

దర్శకుడు/సంగీతం: నరేష్ పెంట

నిర్మాత: జయకృష్ణ దురుగడ్డ

సినిమాటోగ్రఫీ: కన్నన్ మునిసామి

ఎడిట‌ర్: బ‌ల్లా స‌త్య నారాయ‌ణ

స్టంట్స్: శ్రీను

సాహిత్యం: సాహిత్య సాగర్

డైలాగ్స్: ఆర్.రాము


కళ: శ్రీను

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: లతీష్ జవ్వాది

కో-డైరెక్టర్: హర్ష.కె

పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు

Telugu Film Industry Gears Up for Grand Director's Day Celebrations at LB Stadium, Hyderabad on May 4

మే  4న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలుగు చిత్ర పరిశ్రమ సమక్షంలో ఘనంగా డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్

 


దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి అయిన మే 4వ తేదీని డైరెక్టర్స్ డే ఈవెంట్ ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. మే 4న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో డైరెక్టర్స్ డే ఈవెంట్ ను గ్రాండ్ గా జరపనున్నారు. ఈ ఈవెంట్ వివరాలను సోమవారం సాయంత్రం నిర్వహించిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యులు వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ అసోసియేషన్ వెబ్ సైట్, డైరెక్టర్స్ డే ఈవెంట్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుల సంఘం సంక్షేమ నిధికి రెబెల్ స్టార్ ప్రభాస్ 35 లక్షల రూపాయల విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో



తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ - మే 4న దర్శకరత్న దాసరి నారాయణరావు గారి జయంతి సందర్భంగా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరెక్టర్స్ డేను ఘనంగా నిర్వహించబోతున్నాం. మదర్స్ డే, ఫాదర్స్ డే ఉన్నట్లే డైరెక్టర్స్ డే కూడా అంతే పేరు తెచ్చుకోవాలి. తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్ కు మొత్తం దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమల్లో మంచి పేరుంది. ఇప్పటిదాకా మనం డైరెక్టర్స్ డేను ఇండోర్ లో చిన్నగా చేసుకున్నాం. ఈసారి ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. హరీశ్ శంకర్, మారుతి, అనిల్ రావిపూడి వంటి దర్శకులు బిజీగా ఉన్నా మన అసోసియేషన్ కార్యక్రమంలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అసోసియేషన్ మన కుటుంబం అని ప్రతి ఒక్కరు భావించడం వల్లే ఈ ఈవెంట్ కోసం అందరం కష్టపడుతున్నాం. డైరెక్టర్స్ డే వేడుకల్లో చిత్ర పరిశ్రమ నుంచి ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.


తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సాయి రాజేశ్ మాట్లాడుతూ - డైరెక్టర్స్ డేను ఇప్పటిదాకా మామూలుగా నిర్వహిస్తూ వచ్చాం కానీ ఈసారి డైరెక్టర్స్ అసోసియేషన్ కు కొత్త కమిటీ వచ్చాక చాలా గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేశాం. మే 4న ఎల్బీ స్టేడియంలో డైరెక్టర్స్ డే ఈవెంట్ ఘనంగా నిర్వహించబోతున్నాం. మన స్టార్స్, దర్శకుల సంఘం కుటుంబ సభ్యులతో పాటు వేలాది మంది ప్రేక్షకుల సమక్షంలో ఈ ఈవెంట్ చేస్తున్నాం. ఇందుకు మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాం. అన్నారు.


దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ - మన  డైరెక్టర్స్ అసోసియేషన్ లో గతంలోకి ఇప్పటికి తేడా కనిపిస్తోంది. నాలుగు గోడల మధ్యలో మనం ఇన్నాళ్లూ డైరెక్టర్స్ డే జరుపుకున్నాం. ఇప్పుడు ఘనంగా ఎల్బీ స్డేడియంలో చేసుకోబోతున్నాం. ఈ వేడుకలతో మన దర్శకుల సంఘం గొప్పదనాన్ని దేశమంతా చాటి చెప్పాలి. అన్నారు.


దర్శకుడు రాంప్రసాద్ మాట్లాడుతూ - డైరెక్టర్స్ డే నిర్వహణ అనేది మన అసోసియేషన్ తరపున ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి దర్శకుల సంఘం సత్తా చాటేలా డైరెక్టర్స్ డే వేడుకలు ఉండబోతున్నాయి. 24 విభాగాల నుంచి అందరం ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. ఈ వేడుకల్ని విజయంవంతం చేయబోతున్నాం. అన్నారు.


దర్శకుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ - దర్శకుల సంఘంలో ప్రతి కమిటీ ఈ సభ్యుల సంక్షేమం కోసం అసోసియేషన్ అభివృద్ధి కోసం పాటుపడుతూ వస్తోంది. ఈసారి ఉన్న కమిటీ మరింతగా దాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈసారి డైరెక్టర్స్ డే ఈవెంట్ ను ఘనంగా నిర్వహిస్తున్న ఈ కమిటీ సభ్యులందరికీ హ్యాట్సాఫ్ చెబుతున్నా. అన్నారు.



డైరెక్టర్ సముద్ర మాట్లాడుతూ - తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ తరుపున డైరెక్టర్స్ డే వేడుకల్ని ఈసారి ఘనంగా నిర్వహించబోతున్న మన అసోసియేషన్ కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేస్తున్నా. ఈ వేడుకలతో మన అసోసియేషన్ గురించి ప్రపంచవ్యాప్తంగా తెలియాలి. అన్నారు.



దర్శకుడు అనుదీప్ కేవి మాట్లాడుతూ - మే 4న జరిగే డైరెక్టర్స్ డే వేడుకల్ని మన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ తరుపున డైరెక్టర్స్ డే ఘనంగా నిర్వహిస్తున్నాం. మన దర్శకులు రకరకాల స్కిట్స్, డ్యాన్సెస్ తో మిమ్మల్ని అలరిస్తారు. మీరంతా ఈ కార్యక్రమానికి వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. అన్నారు.



తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వశిష్ట మాట్లాడుతూ - ఈసారి డైరెక్టర్స్ డే ఈవెంట్ గ్రాండ్ గా ఉంటుంది. ఈ కార్యక్రమంలో ముగ్గురు డెబ్యూ డైరెక్టర్స్ కు ఒక్కొక్కరికి లక్ష రూపాలయ చొప్పున ప్రోత్సాహకం అందిస్తాం. కొత్త దర్శకులకు ఎంకరేజింగ్ గా ఉండేలా ఈ ప్రైజ్ మనీ ఇస్తున్నాం. డైరెక్టర్స్ డేను మీరంతా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.



దర్శకుడు ఎన్ శంకర్ మాట్లాడుతూ - మన దర్శకుల సంఘానికి ఉన్న ఖ్యాతి మరే ఇండస్ట్రీకి లేదు. అత్యధిక సినిమాలను రూపొందించిన దర్శకుడిగా మన దర్శకరత్న దాసరి గారు గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించారు. ఆయన జయంతి అయిన మే 4న మనం డైరెక్టర్స్ డే జరుపుకుంటున్నాం. ఈసారి వేడుకల్ని ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉంది. చిత్ర పరిశ్రమలో అవసరంలో ఉన్న ఎంతోమందికి ఈ డైరెక్టర్స్ అసోసియేషన్ అండగా నిలబడుతుందని ఆశిస్తున్నా. అన్నారు.



దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడుతూ - మన ఆలోచనల్ని లక్షలాది మందికి చేరువేసే దర్శకులలో ఒకరిగా ఉన్నందుకు గర్వపడుతుంటాను. డైరెక్టర్స్ డే ఈవెంట్ కల్చరల్ కమిటీలో ఉన్నాను. మన స్టార్ హీరోలను చాలా మందిని పర్సనల్ గా వెళ్లి కలిశారు మన సంఘ సభ్యులు. వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. మెగాస్టార్ చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, ప్రభాస్ గారు, శ్రీకాంత్ గారు, విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని, కళ్యాణ్ రామ్, నాని, సాయి ధరమ్ తేజ్, అల్లరి నరేష్..ఇలా హీరోలంతా వస్తున్నారు. మిగతా స్టార్స్ ను కూడా కలుస్తాం. మనకు బ్లాక్ బస్టర్స్ తీయడం కొత్త కాదు, మే4న జరగబోయే ఈవెంట్ ను కూడా బ్లాక్ బస్టర్ చేద్దాం. అన్నారు.


దర్శకుడు మారుతి మాట్లాడుతూ - డైరెక్టర్స్ డే ఈవెంట్ ను ఈసారి ఘనంగా నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉంది. నేను ఈ ప్రెస్ మీట్ కు వస్తున్న టైమ్ లో ప్రభాస్ గారు కాల్ చేసి 35 లక్షల రూపాయలు తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కు విరాళంగా ఇమ్మని చెప్పారు. ఆయనకు మనందరి తరుపున కృతజ్ఞతలు చెబుతున్నా. మన అసోసియేషన్ ఇంకా బలంగా ముందుకు వెళ్తుందనే నమ్మకం కలుగుతోంది. అన్నారు.


రచయిత, దర్శకుడు వి.విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ - నాకూ మీ అందరితో కలిసి ఆ వేదిక మీద కూర్చోవాలని ఉంది. నేను దర్శకుడిగా హిట్ సినిమా చేసిన తర్వాత కూర్చుంటాను. మీ అందరిలో ఎంతో ప్రతిభ ఉంది. డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. ఆ ఘనతను మీరంతా తీసుకురావాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. అన్నారు.


ఈ కార్యక్రమంలో తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ వెబ్ సైట్ ను విజయేంద్రప్రసాద్, హరీశ్ శంకర్ లాంఛ్ చేయగా, డైరెక్టర్స్ డే లోగోను దర్శకుడు రేలంగి నరసింహారావు ఆవిష్కరించారు.



Rebel Star Prabhas Generously Donates Rs 35 Lakh to Telugu Film Directors Association Welfare Fund

 తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ సంక్షేమ నిధికి రూ.35 లక్షల విరాళం అందించిన రెబెల్ స్టార్ ప్రభాస్




చిత్ర పరిశ్రమలో ఏ మంచి కార్యక్రమం జరిగినా అందులో తానూ భాగమవుతుంటారు రెబెల్ స్టార్ ప్రభాస్. అందరి కంటే ముందుగా స్పందిస్తూ తన వంతు ఆర్థిక సహాయం అందిస్తుంటారు ప్రభాస్. మే 4న హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్న తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కు ప్రభాస్ 35 లక్షల రూపాయల విరాళం అందించారు. దర్శకుల సంఘం సంక్షేమ నిధి కోసం ఈ డబ్బును వెచ్చించనున్నారు.


నిన్న తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ నిర్వహించిన డైరెక్టర్స్ డే ఈవెంట్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు మారుతి ఈ విషయాన్ని సంఘ సభ్యులకు తెలియజేశారు. 35 లక్షల రూపాయల విరాళం అందించిన ప్రభాస్ కు డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యులు చప్పట్లతో తమ కృతజ్ఞతలు తెలిపారు. అందరి సపోర్ట్ తో  డైరెక్టర్స్ అసోసియేషన్ మరింత స్ట్రాంగ్ అసోసియేషన్ కావాలని డైరెక్టర్ మారుతి ఈ సందర్భంగా కోరారు. ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో రాజా సాబ్ సినిమా తెరకెక్కుతోంది.


Emotional Thriller 'Aarambam' Set for Grand Theatrical Release on May 10


మే 10న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న ఎమోషనల్ థ్రిల్లర్ "ఆరంభం"



మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా "ఆరంభం". ఈ సినిమాను ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అభిషేక్ వీటీ నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహిస్తున్నారు. ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన "ఆరంభం" చిత్ర రిలీజ్ డేట్ ను ఇవాళ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను మే 10న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

అనౌన్స్ మెంట్ నుంచి "ఆరంభం" సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ తో పాటు హీరో శ్రీ విష్ణు చేతుల మీదుగా రిలీజ్ చేసిన అనగా అనగా లిరికల్ సాంగ్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. వైవిధ్యమైన కథా కథనాలతో ఓ డిఫరెంట్ మూవీ చూసిన ఎక్సీపిరియన్స్ ను "ఆరంభం" ప్రేక్షకులకు ఇవ్వబోతోంది. ఈ చిత్ర విజయం సినిమా యూనిట్ నమ్మకంతో ఉన్నారు.


నటీనటులు - మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్, లక్ష్మణ్ మీసాల, బోడెపల్లి అభిషేక్, సురభి ప్రభావతి తదితరులు

టెక్నికల్ టీమ్
ఎడిటర్ - ఆదిత్య తివారీ, ప్రీతమ్ గాయత్రి
సినిమాటోగ్రఫీ - దేవ్ దీప్ గాంధీ కుందు
మ్యూజిక్ - సింజిత్ యెర్రమిల్లి
డైలాగ్స్ - సందీప్ అంగిడి
సౌండ్ - మాణిక ప్రభు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వినయ్ రెడ్డి మామిడి
సీఈవో - ఉజ్వల్ బీఎం
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
బ్యానర్ - ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్
ప్రొడ్యూసర్ - అభిషేక్ వీటీ
దర్శకత్వం - అజయ్ నాగ్ వీ

#SK30 Launched Grandly Today

సందీప్ కిషన్, త్రినాధ రావు నక్కిన, ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, రాజేష్ దండా #SK30 గ్రాండ్ గా లాంచ్



'ఊరు పేరు భైరవకోన' విజయాన్ని ఆస్వాదిస్తున్న హీరో సందీప్ కిషన్ తన ల్యాండ్‌మార్క్ 30వ చిత్రం #SK30 కోసం ధమాకా దర్శకుడు త్రినాధ రావు నక్కినతో చేతులు కలిపారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ,  హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి వరుస హిట్‌లను అందించిన ప్రొడక్షన్ హౌస్ వారి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్‌లను పూర్తి చేయబోతోంది. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాజేష్ దండా నిర్మిస్తుండగా, బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు.


ఈ రోజు, #SK30 గ్రాండ్‌గా ప్రారంభమైయింది. ముహూర్తం వేడుకకు విజయ్ కనకమేడల కెమెరా స్విచాన్ చేయగా, దిల్ రాజు క్లాప్‌ కొట్టారు. అనిల్ సుంకర తొలి షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించారు.


త్రినాధరావు నక్కిన విజయవంతమైన ప్రయాణంలో భాగమైన రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ #SK30కి కథ, స్క్రీన్‌ప్లే  డైలాగ్ రైటర్‌గా పని చేస్తున్నారు. ఈ కొత్త సినిమా త్రినాథరావు నక్కిన, ప్రసన్నల మార్క్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది.


యంగ్, టాలెంటెడ్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా, నిజార్ షఫీ డీవోపీగా పని చేస్తున్నారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్.


సందీప్ కిషన్ క్యారెక్టరైజేషన్ గత చిత్రాల కంటే డిఫరెంట్ గా ఉంటుంది. రావు రమేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.


తారాగణం: సందీప్ కిషన్, రావు రమేష్


సాంకేతిక విభాగం:

దర్శకత్వం: త్రినాధరావు నక్కిన

బ్యానర్లు: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్

నిర్మాత: రాజేష్ దండా

కథ, స్క్రీన్ ప్లే, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ

సహ నిర్మాత: బాలాజీ గుత్తా

సంగీతం: లియోన్ జేమ్స్

డీవోపీ: నిజార్ షఫీ

ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి

పీఆర్వో: వంశీ-శేఖర్

డిజిటల్: హ్యాష్‌ట్యాగ్ మీడియా 

#Thalaivar171 Titled Coolie Title Reveal Teaser is out now

 సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్, సన్ పిక్చర్స్ #Thalaivar171 టైటిల్ కూలీ, పవర్ ప్యాక్డ్ టైటిల్ టీజర్ విడుదల


జైలర్ మ్యాసీవ్ సక్సెస్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ తన 'LCU' తో వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న సంచలన దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో చేతులు కలిపారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రం #Thalaivar171 పవర్ ప్యాక్డ్ టీజర్ ద్వారా టైటిల్ రివీల్ చేశారు

ఈ చిత్రానికి 'కూలీ' అని పేరు పెట్టారు, టీజర్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను స్టైలిష్, యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో ప్రజెంట్ చేసింది. అతను గోల్డ్ స్మగ్లర్ల డెన్ లోకి ప్రవేశిస్తాడు. బంగారు గడియారాలతో చేసిన గొలుసుతో వారిని తుక్కుగా కొడతాడు. ఆ తర్వాత స్మగ్లింగ్‌ ముఠా బాస్‌ని ఫోన్‌ లో వార్నింగ్ ఇస్తాడు.  .


సూపర్‌స్టార్‌కి ఇది లోకేష్ కనగరాజ్ మార్క్ ఇంట్రడక్షన్. కూలీ పూర్తి యాక్షన్‌తో నిండిపోతుందని, రజనీకాంత్ తన వింటేజ్ అవతార్‌లో కనిపిస్తారని టీజర్ హామీ ఇచ్చింది. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వుంది.


2025లో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


A Brand New Poster From Jai Hanuman From The PVCU Unveiled, Experience It In IMAX 3D

 హనుమాన్ జయంతి సందర్భంగా విజనరీ ప్రశాంత్ వర్మ ఎపిక్ అడ్వెంచర్ 'జై హనుమాన్' నుంచి బ్రాండ్ న్యూ పోస్టర్ విడుదల- ఎక్స్పీరియన్స్ ఇన్ IMAX 3D



పాన్ ఇండియా సంచలనం 'హను-మాన్' తర్వాత విజనరీ ప్రశాంత్ వర్మ దేశవ్యాప్తంగా సుపరిచితమయ్యారు. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుండి మరో ఎపిక్ అడ్వెంచర్‌ను మన ముందుకు తీసుకువస్తున్నారు. 'జై హనుమాన్' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం హను-మాన్‌కి సీక్వెల్. ఇది ప్రీక్వెల్ ముగింపులో అనౌన్స్ చేశారు. స్క్రిప్ట్ ఇప్పటికే లాక్  చేశారు. సినిమా పెద్ద కాన్వాస్‌పై రూపొందనుంది. ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం, సాంకేతిక నిపుణులు భాగం కానున్నారు.


అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం రోజున సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించిన దర్శకుడు హనుమాన్ జయంతి సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో లార్డ్ హనుమాన్ కొండపై చేతిలో గదతో నిలబడి ఉన్నారు. హనుమ ను సమీపించే డ్రాగన్ అగ్నిని పీల్చుకుంటుంది. డ్రాగన్‌లను తొలిసారిగా ఇండియన్ స్క్రీన్‌పైకి తీసుకొస్తున్నారు ప్రశాంత్ వర్మ. టాప్-ఎండ్ VFX , ఇతర సాంకేతికతలతో మనం ఎలాంటి అనుభవాన్ని పొందబోతున్నామో  పోస్టర్ హింట్స్ ఇస్తోంది.


జై హనుమాన్ సినిమా IMAX 3D లో విడుదల కానుంది. ఈ మాగ్నమ్ ఓపస్ ఇతర వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.


ఈరోజు, టీమ్ హను-మాన్100 రోజుల ఈవెంట్‌ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటుంది.

Hanu-Man 100Days Celebrations

 'హనుమాన్' వంద రోజులు ఆడటం అదృష్టంగా భావిస్తున్నాను. జై హనుమాన్ తెలుగు ప్రేక్షకులు గర్వపడేలా వుంటుంది: హను-మాన్ హిస్టారిక్ 100 డేస్ సెలబ్రేషన్స్ లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ



హనుమాన్ వంద రోజుల పండగ జరుపుకోవడం ఆనందంగా వుంది. ఇది ప్రేక్షకులు మాకు ఇచ్చిన గిఫ్ట్: హీరో తేజ సజ్జా  


క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ 'హను-మాన్' 25 కేంద్రాలలో 100 రోజుల రన్ పూర్తి చేసుకుంది. మంచి సెంటర్లలో ఈ హిస్టారికల్ మైల్ స్టోన్ ని చేరుకుంది. 92 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో హను-మాన్ ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ ఫాంటసీ అడ్వెంచర్ ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మార్కును వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 5 మిలియన్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. రీజనబుల్ టిక్కెట్ ధరలు ఉన్నప్పటికీ, హను-మాన్ అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ చిత్రం పాన్ ఇండియాగా విడుదలైంది. ఇది హిందీతో సహా అన్ని భాషలలో కమర్షియల్ హిట్‌గా నిలిచింది. హనుమాన్ విజయవంతంగా వందరోజుల పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ గ్రాండ్ గా సెలబ్రేషన్ నిర్వహించింది.


హనుమాన్ హిస్టారిక్ 100 డేస్ సెలబ్రేషన్స్ లో దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హనుమన్ యాభై రోజుల వేడుక జరిగిన సమయంలో నిర్మాత నిరంజన్ గారు మనం వంద రోజుల వేడుక కూడా చేయగలుగుతామని అన్నారు. కానీ నేను నమ్మలేదు. కాకపొతే మీరంతా దాన్ని నిజం చేశారు. ఇంద్ర, సమరసింహా రెడ్డి, నువ్వునాకు నచ్చావ్, ఖుషి, పోకిరి నాకు బాగా గుర్తున్న వంద రోజుల వేడుకలు జరుపుకున్న సినిమాలు. నేను డైరెక్టర్ అయిన తర్వాత సినిమా అంటే ఒక వీకెండ్ అయిపోయింది. అలాంటి ఈ జనరేషన్ లో వందవ రోజు కూడా థియేటర్స్ కి వచ్చి సినిమా చుస్తున్నారంటే చాలా అదృష్టంగా ఫీలౌతున్నాను. హనుమాన్ థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా అని మొదటి నుంచి చెప్పాం. దాన్ని నిలబెట్టుకున్నందుకు ఆనందంగా వుంది. ఈ వంద రోజుల్లో ప్రతి రోజు సినిమా తొలి రోజుకు వచ్చిన స్పందనే లభిస్తోంది. ఇంత అదృష్టాన్ని కల్పించిన హనుమంతుల వారికి, రాములవారికి రుణపడి వుంటాను. తేజ, నిరంజన్ గారు, వరు, సముద్రఖని గారు టీం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. పీవీసియు కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇది చాలా కాలంగా కన్న కల. రానున్న ఇరవై ఏళ్ళు దీనిపై స్పెండ్ చేయబోతున్నాను. ఈ యూనివర్స్ లో మీరు చేసే పాత్రలు మళ్ళీ రాబోతున్నాయి. సముద్రఖని గారు విభీషుడిగా కనిపించబోతున్నారు. తేజ హను- మాన్ గా కొనసాగుతారు. కొన్ని సర్ ప్రైజ్ పాత్రలు కూడా రాబోతున్నాయి. పీవీసియు లో అన్ని పరిశ్రమల నుంచి చాలా పెద్ద స్టార్స్ కనిపించబోతున్నారు. పీవీసియు నుంచి వచ్చే సినిమాలు మీ అందరి అంచనాలు అందుకొని మిమ్మల్ని ఆనందపరుస్తాయి. తెలుగు ఆడియన్స్ గర్వపడేలా చేస్తామని నమ్మకంగా చెబుతున్నాను.  జైహనుమాన్ ని బిగ్గెస్ట్ ఫిల్మ్ గా రూపొందిస్తున్నాం. గొప్ప ఎమోషన్స్ కనెక్ట్ వీఎఫ్ఎక్స్ అన్నీ వుంటాయి. మీరు ఇలానే సపోర్ట్ చేసి ఆ సినిమాని వంద రోజులు ఆడేలా చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. జైశ్రీరామ్.. జై హనుమాన్' అన్నారు.  



హీరో తేజా సజ్జా మాట్లాడుతూ.. సత్యం థియేటర్లో వంద రోజులు ఆడిన సినిమాలు చూశాను. అలాంటి ప్లేస్ లో హనుమాన్ వంద రోజుల పండగ జరుపుకోవడం ఆనందంగా వుంది. 'ఈ జనరేష్ లో వంద రోజులు వున్నది నీకే' ఒకరు మెసేజ్ చేశారు. నిజానికి ఇది నా వంద రోజులు కాదు మీ అందరి వంద రోజులు. ఇది ప్రేక్షకులు మాకు ఇచ్చిన గిఫ్ట్. సముద్రఖని గారు మా సినిమాలోకి వచ్చి సినిమా స్థాయిని పెంచారు. నిర్మాత నిరంజన్ గారు చాలా గట్స్ వున్న ప్రొడ్యూసర్. గట్స్ వున్న వాళ్ళకే హిట్స్. అలాంటి గట్స్ వున్న నిరంజన్ గారికి హనుమాన్ మొదటి సినిమా కావడం చాలా ఆనందంగా వుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిరంజన్ గారిలోని ధైర్యాన్ని ఈ తరం స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్రేక్షకులకు పాదాభివందనాలు. ఈ విజయానికి కారణం ప్రేక్షకులే. ఈ సినిమాకి సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు' తెలిపారు.


సముద్రఖని మాట్లాడుతూ.. ఈ వేడుకని చూస్తుంటే చాలా ఎమోషనల్ గా వుంది. ఏదైనా మంచి పని చేయాలంటే దేవుని బ్లెస్సింగ్స్ వుండాలి. ఆ దీవెనలే మా అందరినీ ఒక్క చోటికి చేర్చింది. విభీషునిడి పాత్ర చేయాలంటే మామూలు విషయం కాదు. శ్రీరాముని అనుగ్రహం వుండాలి. నాలో ఆ పాత్రని చూశారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇంతనమ్మకం పెట్టుకున్న ప్రశాంత్ కి ధన్యవాదాలు. తమ్ముడు తేజ చాలా కష్టపడ్డాడు.  అందరం ఇష్టపడి కష్టపడ్డాం.  మా నిర్మాతలకు ధన్యవాదలు.టీం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.  ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు లేకపోతే ఈ విజయం లేదు.' అన్నారు.  


నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. వంద రోజుల వేడుక నా కాలేజ్ డేస్ లో చూసేవాడిని. నేను నిర్మించిన సినిమా ఇప్పుడు వందరోజుల మైలు రాయిని అందుకోవడం చాలా ఆనందంగా వుంది. ఈ విజయానికి కారణం ప్రేక్షకులు. వారు సినిమాని ఆదరించిన తీరు అద్భుతం. వందరోజుల వేడుక చూస్తుంటే ఇదెక్కడి రెస్పాన్స్ రా మావ అన్నట్టుగా వుంది. ఈ సమ్మర్ లో త్రీడి వెర్షన్ లో వస్తున్నాము. దానికి కూడా ఇదే రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నాము. మా హీరో తేజ సజ్జా గారు మూడేళ్ళ పాటు చాలా సపోర్ట్ చేశారు. అమృత, వరలక్ష్మీగారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అద్భుతమైన పాత్రని పోషించిన సముద్రఖని గారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. దర్శకుడు ప్రశాంత్ మేము ఈ మూడేళ్ళగా నమ్మినది సాధించాం. మా అప్ కమింగ్ ప్రాజెక్ట్స్  కు ఇదే రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం' అన్నారు.


శ్రీమతి చైతన్య మాట్లాడుతూ.. హనుమాన్ జయంతి నాడు హనుమాన్ వందరోజుల పండగ జరుపుకోవడం చాలా అనందంగా గర్వంగా వుంది.  ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఇలానే వుండాలని కోరుకుంటున్నాను. నిరంజన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. చాలా వత్తిళ్ళు ఎదురుకొన్నారు. ధైర్యంగా నిలబడ్డారు. ఆయన్ని చూస్తుంటే గర్వంగా వుంది. నిరంజన్ పెట్టుకున్న నమ్మకాన్ని దర్శకుడు ప్రశాంత్ పెంచారు. రాముడికి హనుమంతుడిలా ఎప్పుడూ తోడుగా వున్నారు. వుంటారు. మా సూపర్ హీరో తేజ సజ్జా ఇప్పుడు సూపర్ యోధ. తన నుంచి ఇలాంటి అద్భుతమైన కంటెంట్ మరింతగా వస్తుందని ఆశిస్తున్నాను. మా టీం అంతా చాలా కష్టపడింది. ఈ సినిమాకి పని చేసిన అందరికీ   పేరుపేరునా ధన్యవావాదాలు. ఇంత అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు' తెలిపారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.


Dead Pool -wolverine Trailer Launched

 మెస్మరైజ్ విజువల్స్ తో  మార్వెల్ స్టూడియోస్ 'డెడ్‌పూల్ & వోల్వారిన్' ట్రైలర్ విడుదల !!!




మార్వెల్ ప్రేక్ష‌కుల‌కు గుడ్ న్యూస్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మ‌రో సూప‌ర్ హీరో మూవీ రాబోతుంది. ఇప్ప‌టికే మార్వెల్ యూనివర్స్ నుంచి వ‌చ్చిన డెడ్‌పూబ్లా సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా ఈ సిరీస్ నుంచి మ‌రో సినిమా రాబోతుంది. మార్వెల్ స్టూడియోస్ నుంచి వ‌స్తున్న తాజా చిత్రం ‘డెడ్‌పూల్ & వోల్వారిన్’ .


ఈ సినిమాలో ర్యాన్ రేనాల్డ్స్, హ్యూగ్ జాక్‌మాన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా.. షాన్ లెవీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మార్వెల్ స్టూడియోస్, 21 ల్యాప్స్ ఎంట‌ర్‌టైన‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా జూలై 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన లభించింది. తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేసింది.



ఫుల్ యాక్ష‌న్ అడ్వెంచర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. డెడ్‌పూల్‌గా ర్యాన్ రేనాల్డ్స్ మ‌రోసారి ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి సిద్ద‌మ‌యిన‌ట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఎమ్మా కొరిన్, మోరెనా బక్కరిన్, రాబ్ డెలానీ, లెస్లీ ఉగ్గమ్స్, కరణ్ సోని, మాథ్యూ మక్‌ఫాడియన్ త‌దిత‌రులు ముఖ్యపాత్ర‌లు పోషిస్తున్నారు.


జులై 26న డెడ్‌పూల్ & వోల్వారిన్ ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.


Telugu Trailer : 




Queen of Masses Kajal Aggarwal's "Satyabhama" grand theatrical release on May 17th

 మే 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న 'క్వీన్ ఆఫ్ మాసెస్' కాజల్ అగర్వాల్ "సత్యభామ"




క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న “సత్యభామ” సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. మే 17న ఈ సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ఇవాళ ప్రకటించారు. “సత్యభామ” సినిమాలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తోంది. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు.


“సత్యభామ” సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ కోసం డిజైన్ చేసిన వీడియో క్రియేటివ్ గా ఉంది. క్రైమ్ సీన్ నుంచి రికవరీ చేసిన గన్ విడి పార్ట్స్ లోడ్ చేసి కాజల్ షూట్ చేయగా..అది క్యాలెండర్ లో మే 17 డేట్ ను టార్గెట్ చేస్తూ దూసుకెళ్తుంది. మే 17న “సత్యభామ” సినిమా రిలీజ్ ను ఇలా ఇన్నోవేటివ్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన కంటెంట్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే క్రియేట్ అయిన బజ్ తో “సత్యభామ” సినిమా సూపర్ హిట్ అవుతుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి.



నటీనటులు - కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర, తదితరులు


టెక్నికల్ టీమ్


బ్యానర్: అవురమ్ ఆర్ట్స్

స్క్రీన్ ప్లే, మూవీ ప్రెజెంటర్ : శశి కిరణ్ తిక్క

నిర్మాతలు : బాబీ తిక్క,  శ్రీనివాసరావు తక్కలపెల్లి

కో ప్రొడ్యూసర్ - బాలాజీ

సినిమాటోగ్రఫీ - బి విష్ణు

సీఈవో - కుమార్ శ్రీరామనేని

సంగీతం: శ్రీ చరణ్ పాకాల

పీఆర్ఓ: జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

దర్శకత్వం: సుమన్ చిక్కాల


Natural Star Nani Launched Hilarious Trailer of Aa Okkati Adakku

'ఆ ఒక్కటీ అడక్కు' ట్రైలర్ ని చాలా ఎంజాయ్ చేశాను. కంటెంట్ అందరూ రిలేట్ అయ్యేలా ప్రామెసింగ్ గా వుంది. తప్పకుండా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని  



'ఆ ఒక్కటీ అడక్కు'తో ఈ సమ్మర్ లో ఖచ్చితంగా ప్రేక్షకులని నవ్వించడంతో పాటు మంచి కంటెంట్ చెప్తాను: హీరో అల్లరి నరేష్  



నేచురల్ స్టార్ నాని లాంచ్ చేసిన అల్లరి నరేష్, మల్లి అంకం, రాజీవ్ చిలక, చిలక ప్రొడక్షన్స్ ఆ ఒక్కటీ అడక్కు హిలేరియస్ ట్రైలర్‌


కామెడీ కింగ్ అల్లరి నరేష్  ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు' తో రాబోతున్నారు.  మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టీజర్‌కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశారు


హీరో అన్ మేరిడ్ అని తెలియజేసేలా హిలేరియస్ ఎపిసోడ్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. హీరోకి క్యాస్ట్ ఫీలింగ్ లేకపోయినా 49 సార్లు వివిధ అమ్మాయిలచే రిజెక్ట్ అవుతాడు. మ్యారేజ్ బ్యూరోలు కూడా తనకి తగిన జోడి వెతకడంలో విఫలమౌతాయి. అతను ఫరియా అబ్దుల్లాతో ప్రేమలో పడతాడు. అయితే, రిలేషన్ ని నెక్స్ట్ లెవల్  తీసుకెళ్లడానికి వారికి సమస్య ఉంది.


ఈ తరం యువతకు పెళ్లి పెద్ద సమస్య కావడంతో మల్లి అంకెం ఈ అంశాన్ని ఎంచుకుని వినోదాత్మకంగా చెప్పారు. కామెడీ సీక్వెన్స్‌లలో అల్లరి నరేష్ ఎప్పటిలాగే అదరగొట్టారు. అతని కామిక్ టైమింగ్ ఆకట్టుకున్నారు. ఫరియా అబ్దుల్లాకు కీలక పాత్ర లభించింది. ఆమె పాత్రలో చక్కగా అలరించారు. వెన్నెల కిషోర్,  వైవా హర్షల ప్రజెంస్ తగిన వినోదాన్ని అందిస్తుంది.


సూర్య కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది, గోపీ సుందర్ తన స్కోర్‌తో ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌కు సరైన మూడ్‌ని సెట్ చేశాడు. ఈ చిత్రానికి అబ్బూరి రవి డైలాగ్స్ అందిస్తున్నారు. చోటా కె ప్రసాద్ ఎడిటర్ కాగా, జె కె మూర్తి ఆర్ట్ డైరెక్టర్.


టాలీవుడ్ బిగ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రం ఏపీ, తెలంగాణ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. మే 3న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.


ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. ఈ వేడుకకు రావడం చాలా సంతోషంగా వుంది. నరేష్ ఇలాంటి వేడుకలకు రమ్మని సాధారణంగా నన్ను అడగరు. అడిగారంటేనే ఈ సినిమా తన మనసుకు ఎంత దగ్గరైయిందో అర్ధమౌతుంది.  'ఆ ఒక్కటీ అడక్కు'.. నరేష్ నాన్న గారు డైరెక్ట్ చేసిన టైటిల్ వాడటం వలన స్పెషల్ కనెక్షన్ వుందని అనుకుంటున్నాను. నరేష్ అద్భుతమైన నటుడు. తను బ్యాక్ టు బ్యాక్ కామెడీ సినిమాలు చేస్తుంటే వాటికి కొంచెం బ్రేక్ ఇవ్వమని నేనే కోరాను. కానీ ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ బ్రేక్ లో తన కామెడీ మిస్ అయ్యానని అనిపించింది. ఇందులో పెళ్లి కంటెంట్ అందరూ రిలేట్ అయ్యేలా వుంది. అందరూ హాయిగా ఎంజాయ్ చేసే సినిమా అని ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతున్నాను. ట్రైలర్ ని చాలా ఎంజాయ్ చేశాను. మే 3న నరేష్ తో కలసి సినిమాని ఎంజాయ్ చేయడానికి ఎదురుచూస్తున్నాను. 'ఆ ఒక్కటీ అడక్కు'తనని మరో మెట్టు ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను. ఫారియా అందమైన చిరునవ్వు గల నటి. దర్శకుడు మల్లి గారికి ఆల్ ది బెస్ట్. చాలా మంచి టీంతో కలసి ఈ సినిమా చేస్తున్నారు. కంటెంట్ ప్రామెసింగ్ అండ్ ఫ్రష్ గా వుంది. ఈవీవీ గారి ఆశీర్వాదం కూడా టీం అందరికీ వుంటుంది. తప్పకుండా సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను' అన్నారు


హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. నాని మా ఫ్యామిలీ మెంబర్ లానే వుంటారు. తను ఈ వేడుకకు రావడం చాలా అనందంగా వుంది.'ఆ ఒక్కటీ అడక్కు' టీం ఎఫర్ట్. రవి గారి మాటలు మల్లి గారి డైరెక్షన్, సూర్య గారి కెమరా వర్క్, చోటా గారి ఎడిటింగ్, నిర్మాత రాజీవ్ గారు.. అందరం కలసి కష్టపడి ఇష్టపడి అద్భుతంగా చేసిన సినిమా ఇది. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ కామెడీ మూవీతో వస్తున్నాను. ఖచ్చితంగా  ఈ సమ్మర్ లో మిమ్మ్మల్ని బాగా నవ్విస్తాను. ఇందులో నవ్విస్తూ మంచి కంటెంట్ కూడా చెప్తాను. తప్పకుండా ఈ సినిమా మే3న చూడండి' అని కోరారు.


హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. 'ఆ ఒక్కటీ అడక్కు' బ్యూటీఫుల్ స్టొరీ, కాన్సెప్ట్. ఈ సినిమాలో నా పాత్ర పేరు సిద్ది. మీరంతా చిట్టి చిట్టి అని పిలుస్తారు. సిద్ది అని పిలిచినా బావుటుంది.( నవ్వుతూ). నిర్మాత రాజీవ్ గారికి ధన్యవాదాలు. దర్శకుడు మల్లి గారు, టీం అందరి సపోర్ట్ కి ధన్యవాదాలు. అందరూ ఇష్టపడే సినిమా ఇది. తప్పకుండా మీ అందరినీ అలరిస్తుంది. నాని గారు సపోర్ట్ చేయడానికి రావడం చాలా స్ఫూర్తిని ఇచ్చింది' అన్నారు.  


నిర్మాత రాజీవ్ చిలక మాట్లాడుతూ.. నాని గారికి ధన్యవాదాలు. ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. దర్శకుడు మల్లి చాలా చక్కగా తెరకెక్కించారు. తొలి సినిమా నిర్మాతలమైన మాతో సినిమా చేసినందుకు అల్లరి నరేష్ గారికి ధన్యవాదాలు. నరేష్ గారితో వర్క్ చేయడం మంచి అనుభవం. ఫారియాకు మిగతా చిత్ర యూనిట్ సభ్యులందరికీ ధన్యవాదాలు' తెలిపారు.


రచయిత అబ్బూరి రవి మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా సందడిగా గోలగా గా ఉంటుంది. వినోదంతో పాటు చివర్లో అందరికీ ఉపయోగపడే మాట వుంటుంది. అందరికోసం తీసిన సినిమా ఇది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది' అన్నారు.


తారాగణం: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ  తదితరులు


సాంకేతిక విభాగం:

దర్శకుడు- మల్లి అంకం

నిర్మాత - రాజీవ్ చిలక

సహ నిర్మాత - భరత్ లక్ష్మీపతి

బ్యానర్ - చిలక ప్రొడక్షన్స్

విడుదల - ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ LLP

రచయిత - అబ్బూరి రవి

ఎడిటర్ - ఛోటా కె ప్రసాద్

డీవోపీ  - సూర్య

సంగీతం  - గోపీ సుందర్

ఆర్ట్ డైరెక్టర్ - జె కె మూర్తి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - అక్షిత అక్కి

మార్కెటింగ్ మేనేజర్ - శ్రావణ్ కుప్పిలి

మార్కెటింగ్ ఏజెన్సీ - వాల్స్ అండ్ ట్రెండ్స్  

పీఆర్వో - వంశీ శేఖర్

పబ్లిసిటీ డిజైన్ - అనిల్ భాను