Home » » Shyam Singha Roy Royal Event

Shyam Singha Roy Royal Event

ఒక మంచి సినిమా తీసిన త‌ర్వాత తెలియని ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. మ‌న‌సు నిండుగా ఉంటుంది అది `శ్యామ్ సింగ‌రాయ్ నాకు ఇచ్చిన ఫీలింగ్‌`..మ‌ళ్లీ చెప్తున్నా ఈ క్రిస్ట‌మ‌స్ మాత్రం మ‌న‌దే.. - న్యాచుర‌ల్ స్టార్ నాని



న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న‌ శ్యామ్ సింగ రాయ్ సినిమాని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు. ఈ సందర్భంగా మంగళ వారం నాడు వరంగల్‌లో ఏర్పాటు చేసిన శ్యామ్ సింగ‌రాయ్ రాయల్ ఈవెంట్లో...



కృతి శెట్టి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో అందరి పర్ఫామెన్స్, విజువల్స్ ఇలా ప్రతీ ఒక్కటి అద్భుతంగా ఉంటాయి. మీరు కొత్త అనుభూతికి లోనవుతారు. థియేటర్లోనే సినిమాను చూడండి. అందరూ మాస్కులు ధరించండి. సురక్షితంగా ఉండండి. నాని గారంటే నాకు, నా ఫ్యామిలీకి చాలా ఇష్టం. నా రెండో సినిమానే ఆయనతో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను. నిర్మాత వెంకట్ గారు ఎంతో స్వీట్ పర్సన్. రాహుల్‌ గారిది ఇదో రెండో సినిమా అని అనిపించలేదు. ఎంతో కాన్ఫిడెంట్‌గా కనిపించారు’ అని అన్నారు.


సాయి పల్లవి మాట్లాడుతూ.. ‘శ్యామ్ సింగ రాయ్ ఓ విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ రెండు ప్రపంచాలను చూపించారు. వాసు, శ్యామ్ సింగ రాయ్ రెండు ప్రపంచాలని అద్బుతంగా చూపించారు. కెమెరామెన్, క్యాస్టూమ్ డిజైనర్ పడ్డ కష్టాన్ని ప్రేక్షకులు థియేటర్లో చూడాల్సిందే. అన్ని సినిమాలను థియేటర్లోనే చూడండి. శ్యామ్ సింగ రాయ్ సినిమా నాని ఫ్యాన్స్‌కు విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. ఇది వరకు ఎన్నడూ చూడని పాత్రలో కనిపిస్తారు. ఎంత ఖర్చు అయినా పర్లేదు.. సినిమాను థియేటర్లోనే విడుదల చేయాలని నిర్మాత గారు అనుకున్నారు’ అని అన్నారు.


మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ.. ‘ఇక్కడ ఏది పెట్టినా సక్సెస్ అవుతుంది. ఇక్కడ ఏ సినిమా తీసినా హిట్ అవుతుంది. నాని కూడా ఇంతకు ముందు కూడా ఇక్కడ సినిమాను తీశాడు. మా ఇంట్లో భోజనం కూడా చేశాడు. సాయి పల్లవి కూడా మా ఇంట్లో భోజనం చేసింది. ఏ సినిమా అయినా ఇక్కడి నుంచే మొదలుపెట్టండి. హైద్రాబాద్ కన్నా వరంగల్ ఎంతో మంచిది. సినీ పరిశ్రమకు నా వంతు సాయం చేస్తాను’ అని అన్నారు.


దిల్ రాజ్ మాట్లాడుతూ.. ‘సిరివెన్నెల శాస్త్రిగారు ఎక్కడున్నా మనల్ని చూస్తుంటారు. మీ పాటలను మేం ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే  ఉంటాం. నిర్మాత వెంకట్ గారు ఒక హిట్ సినిమా తీయాలని అనేవారు. ఆయనకు నాని దొరికారు. దర్శక నిర్మాతలు కొత్తవారైనా కూడా నాని ఈ సినిమాను భుజ స్కంధాల మీద మోశారు. మామూలుగా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి నాచురల్ స్టార్‌గా ఎదిగారు. సినిమా సినిమాకు ఎదిగి ఇండస్ట్రీలో ఒక స్టార్‌గా ఎదిగారు. ఇంకా ఇలానే కంటిన్యూ అవ్వాలి. నీ నమ్మకమే ఈ సినిమా. అది అందరికీ తెలుసు. 24న అది నిజమవ్వాలి. టీజర్ రోజున ఆ విషయాన్ని నాని కూడా చెప్పాడు. మా ఫిదా హీరోయిన్ సాయి పల్లవి. ఆమె ఏ సినిమాలో కనిపించినా కూడా అద్భుతంగా నటిస్తారు. మళ్లీ సాయి పల్లవి మ్యాజిక్ చేస్తారు. ఇక బేబమ్మ కూడా మొదటి సినిమాతో మంచి హిట్ కొట్టింది. మళ్లీ ఈ సినిమాతో వస్తోంది. దయాకరన్న వల్లే ఈ ఈవెంట్‌ను ఇక్కడ ప్లాన్ చేశాం. ఆయనే అన్నీ ఏర్పాట్లు చూసుకుంటారు. ఎంసీఏ షూటింగ్, ఈవెంట్‌ను ఇక్కడే  చేశాం. అదే సెంటిమెంట్ ఫాలో అవ్వాలని ఈ రోజు ఈవెంట్‌ను ఇక్కడ చేయాలని హీరో, నిర్మాతలు అడిగారు. మాస్కులు ధరించి థియేటర్లకు వెళ్లండి’ అని అన్నారు.


నిర్మాత వెంకట్ బోయనపల్లి మాట్లాడుతూ.. ‘ఈవెంట్‌కు వచ్చిన వారందరికీ థ్యాంక్స్. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల కాబోతోంది. అందరూ తప్పక చూడండి. మా నాని గారు, సాయి పల్లవి గారిని, కృతి శెట్టి గారిని ఆశీర్వదించండి’ అని అన్నారు.


నాని మాట్లాడుతూ.. ‘కళ్లు ఇష్టం.. వరంగల్లు ఇష్టం.. మీరంటే ఇంకా ఇష్టం. ఇక్కడికి వస్తున్నామని చెప్పడంతో మంత్రి దయాకర్ గారు అంతా చూసుకున్నారు. ఇండస్ట్రీలో హీరోలంతా కూడా సుమ డేట్ల గురించి ఎదురుచూస్తుంటారు. అదే మీరు.. అదే నేను.. అదే పల్లవి.. అంతకు మించిన రిజల్ట్ ఈ 24న చూడబోతోన్నారు. ఎంసీఏ బ్లాక్ బస్టర్ కదా? అని ఇక్కడకు  రాలేదు. ఇక్కడ ఏదో ఒక పాజిటివ్ ఉంది.. మళ్లీ అప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. ఒక మంచి సినిమా చేశాక మనసులో ఓ గర్వం ఉంటుంది. మాకు ఇంచు కూడా భయం లేదు. శ్యామ్ సింగ రాయ్ సినిమాను చూసి ఎంతో సంతృప్తిగా ఫీలవుతారు.. క్రిస్మస్ మాత్రం మనదే అని ఎంతో గర్వంగా చెబుతున్నాను. రాహుల్ చేసిన మొదటి సినిమాను నేను చూడలేదు. ఆ సినిమా చూసి నేను డిసైడ్ చేయకూదని అనుకున్నాను. కానీ  ఈ రోజు  నా సినిమాను చూశాను. టాలీవుడ్  టాప్ డైరెక్టర్ అయ్యే సత్తా ఉంది. నిర్మాత వెంకట్ గారు మమ్మల్ని సొంత పిల్లల్లా చూసుకున్నారు. ఆయనతో ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని ఉంది. ఇది నాకు సొంత బ్యానర్‌లా ఉంది. ఇలా శ్యామ్ సింగ రాయ్ సినిమాతో మా ప్రయాణం మొదలవ్వడం ఆనందంగా ఉంది. కెమెరామెన్ సాను, ఎడిటర్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్ ఇలా అందరికీ మళ్లీ అవార్డులు వస్తాయని నమ్మకం ఉంది. అందరూ కష్టపడ్డారు కాబట్టే ఇంత మంచి సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. సాయి పల్లవి నుంచి మీరు ఎంత డ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారో అందరికీ తెలుసు. మైండ్ బ్లోయింగ్ డ్యాన్స్ పర్ఫామెన్స్ సాంగ్ ఒకటి ఉంది. రెండు మూడు రోజుల్లో ఆ పాటను విడుదల చేస్తాం. అందులో నేను నటించాల్సిన అవసరం రాలేదు. సాయి పల్లవిని చూసి అలా ఆశ్చర్యపోయాను. ఆమె పాత్రతో అందరూ ప్రేమలో పడిపోతారు. కృతి శెట్టి చేసింది ఒక్క సినిమానే. ఈ పాత్రను అర్థం చేసుకుంటుందా? లేదా? అని అనుకున్నాను. కానీ ప్రతీ రోజూ సెట్‌లో ఆమె తన పాత్ర కోసం కేర్ తీసుకునేది. భవిష్యత్తులో ఆమె ఇంకా ఉన్నత స్థానానికి చేరుకుంటుంది. ఆమె పాత్ర ఎంతో బాగుంటుంది. అరేయ్ నాన్న నేను నీ ఒక్కడికే ఫ్యాన్ అని సిరివెన్నెల అనేవారు. ఆయనకు ఈ సినిమాలోని కొన్ని సీన్లు చూపించాం. పాటలు రాయమని అన్నాం. చూడటానికి రెండు కళ్లు చాలడం లేదురా.. నాకు ఎప్పుడెప్పుడు సినిమా చూడాలని ఉందిరా అని అనేవారు. ఆయనకు ఆ సినిమాను అప్పుడే చూపించాల్సింది. కానీ ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆశీర్వాదం మాతోనే ఉంటుంది. ఆయన చివరి పాట శ్యామ్ సింగ రాయ్ కోసం రాయడంతో ఈ సినిమా మరింత ప్రత్యేకంగా మారింది. ఈ డిసెంబర్ 24న టాప్ లేచిపోవాల్సిందే. రెండేళ్ల తరువాత థియేటర్లోకి వస్తున్నా.. మీరు మిస్ అయ్యారని తెలుసు. నేను కూడా మిస్ అయ్యాను. కానీ ఈ సారి మాత్రం మిస్ అయ్యే చాన్సే లేదు’ అని అన్నారు.


Share this article :