Latest Post

Vrushabha Movie Trailer & Lyrical song Unveiled

 గ్రాండ్ గా  'వృష‌భ' ట్రైల‌ర్ & లిరికల్ సాంగ్ లాంచ్ !!



   వీకే మూవీస్ & శ్రీ జె పి ప్రొడక్షన్స్ ప‌తాకాలపై జీవ‌న్ రెడ్డి, అలేఖ్య జంట‌గా ఉమా శంక‌ర్ రెడ్డి  నిర్మాత‌గా, మల్లికా రెడ్డి కో-ప్రొడ్యూసర్ గా, అశ్విన్ కామ‌రాజ్ కొప్పాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం వృష‌భ‌. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్, లిరికల్ సాంగ్ లాంచ్ కార్య‌క్ర‌మం ఈ రోజు దివంగత నటుడు జయప్రకాష్ రెడ్డిగారి జయంతి సందర్భంగా  ప్ర‌సాద్ ల్యాబ్స్ లో ఘ‌నంగా జ‌రిగింది.


ఈ కార్య‌క్ర‌మానికి అతిథిగా విచ్చేసిన సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు వి.స‌ముద్ర మాట్లాడుతూ...`ట్రైల‌ర్ తో పాటు ఒక పాట విన్నాం చాలా బాగున్నాయి. హీరో, హీరోయిన్స్ చాలా నేచ‌ర‌ల్ గా ఉన్నారు. ద‌ర్శ‌కుడుకి ఈ చిత్రం మంచి పేరు తేవాల‌ని కోరుకుంటూ నిర్మాత‌కు శుభాకాంక్ష‌లు ` అన్నారు.


 ద‌ర్శ‌కుడు రేలంగి న‌ర‌సింహారావు మాట్లాడుతూ...`ట్రైల‌ర్ చూడ‌గానే ఇది డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్ అనిపించింది. విన్న పాట కూడా చాలా బావుంది. సంగీతం, సాహిత్యం, సినిమాటోగ్ర‌ఫీ ఆక‌ట్టుకునే విధంగా ఉన్నాయి.  జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి గారి కూతురు నిర్మాత‌గా చేయ‌డం సంతోషం. ఈ చిత్రం ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు నా శుభాకాంక్ష‌లు` అన్నారు.


 సీనియ‌ర్ నిర్మాత దామోదర్ ప్ర‌సాద్  మాట్లాడుతూ...`` ట్రైల‌ర్, విన్న పాట , టైటిల్ చాలా బావున్నాయి. క‌ళ ప‌ట్ల అభిమానంతో ఈ టీమ్ సినిమా చేసిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. టీమ్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు`` అన్నారు.

 ల‌యన్ సాయి వెంక‌ట్ మాట్లాడుతూ...`జ‌య ప్ర‌కాష్ రెడ్డి గారి కూతురు ఈ సినిమాతో కో ప్రొడ్యూస‌ర్ గా ప‌రిచ‌యం అవుతున్నారు. ట్రైల‌ర్, మ్యూజిక్ బాగుంది. గోమాత మీద సినిమా తీయ‌డం ఇదే ప్ర‌థమం. ఈ సినిమా స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నా` అన్నారు.


 న‌టుడు అజ‌య్ ఘోష్  మాట్లాడుతూ...`జేపీ గారి కుమార్తె మ‌ల్లికా రెడ్డి గారి కోసం ఈ ప్రోగ్రామ్ కి వ‌చ్చాను. మ‌ట్టి వాస‌న‌తో కూడిన క‌థ ఇది. ట్రైల‌ర్... నేచ‌ర‌ల్ గా చాలా  బావుంది. ఇలాంటి క‌థ‌లతో సినిమాలు మ‌రెన్నో చేయాల‌ని కోరుకుంటూ  ఈ టీమ్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు` అన్నారు.


 న‌టుడు శివారెడ్డి మాట్లాడుతూ..`ట్రైల‌ర్ చాలా అద్భుతంగా ఉంది. హీరో, హీరోయిన్స్ చాలా నేచ‌ర‌ల్ గా క‌నిపించారు. మ్యూజిక్, సినిమాటోగ్ర‌ఫీ సూప‌ర్బ్ గా ఉంది. ద‌ర్శ‌కుడు టాలెంట్ ఏంటో ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌యింది` అన్నారు.

 విశ్వ కార్తికేయ మాట్లాడుతూ..`వృష‌భ‌ ట్రైల‌ర్ చాలా కొత్త‌గా అనిపించింది. చాలా నేచ‌ర‌ల్ గా సినిమా చేశారు. యూనిట్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు`` అన్నారు.


శ‌బ‌రి నిర్మాత‌ మ‌హేంద్ర మాట్లాడుతూ..`నిర్మాత‌లు ఒక ప్యాష‌న్ తో ఈ సినిమా చేశారు. ట్రైల‌ర్ , సాంగ్ చాలా బావుంది` అన్నారు.

 చిత్ర నిర్మాత  ఉమా శంకర్ రెడ్డి మాట్లాడుతూ..`నాలుగేళ్ల పాటు ఈ స్టోరి రాసుకున్నాం. ఎన్నో రాత్రులు ఈ సినిమా కోసం శ్ర‌మించాం. 85 శాతం సినిమా పూర్త‌యంది. ద‌ర్శ‌కుడు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమా చేశారు. టీమ్ అంతా ఎంతో స‌పోర్ట్ చేశారు. సినిమా కోసం ఎందాకైనా వెళ్తే వ్య‌క్తి మా హీరో. అలాగే మా హీరోయిన్ కూడా ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. మ్యూజిక్ డైర‌క్ట‌ర్ ఎమ్ ఎల్ రాజా అద్భ‌త‌మైన సంగీతాన్ని స‌మ‌కూర్చారు. త్వ‌ర‌లో సినిమాకు సంబంధించిన మిగ‌తా వివ‌రాలు వెల్ల‌డిస్తాం` అన్నారు.


 మ్యూజిక్ డైర‌క్ట‌ర్ ఎమ్ ఎల్ రాజా మాట్లాడుతూ...`నాకు ఈ చిత్రాన్ని ఇచ్చి మంచి పాట‌లు చేయ‌డానికి  స‌పోర్ట్ చేసిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు` అన్నారు.


కో-ప్రొడ్యూస‌ర్ మ‌ల్లిక రెడ్డి  మాట్లాడుతూ...``మా నాన్న‌గారి బ‌ర్త్ డే రోజు మా సినిమాకు సంబంధించిన పాట‌, ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌డం సంతోషం. ఈ సినిమాలో నన్ను భాగ‌స్వామిగా చేసిన ఉమా శంక‌ర్ రెడ్డి గారికి ధ‌న్య‌వాదాలు . ఒక మంచి సినిమాలో పార్ట్ కావ‌డం సంతోషంగా ఉంద‌న్నారు.


 ద‌ర్శ‌కుడు అశ్విన్ కామ‌రాజ్ కొప్పాల  మాట్లాడుతూ...`` మా ప్రొడ్యూస‌ర్ ఉమా శంక‌ర్ గారు ఒక మంచి క‌థ రాసుకొని న‌న్ను అప్రోచ్ అయ్యారు. ఈ కాన్సెప్ట్ మీద చాలా హార్డ్ వ‌ర్క్ చేసాం. టీమ్ అంతా ఎంతో బాగా స‌హ‌క‌రించారు. హీరో జీవ‌న్ రెడ్డి గారు సినిమా కోసం ప్రాణం పెట్టారు. హీరోయిన్ కూడా ఎంతో శ్ర‌మించారు. సంగీతం, సినిమాటోగ్ర‌ఫీ బాగా కుదిరింది. ఎమ్ ఎల్ రాజా నాకు మంచి మిత్రుడు. అద్భుత‌మైన పాట‌లిచ్చారు. త్వ‌ర‌లో మిగ‌తా పాట‌లు రిలీజ్ చేస్తాం`` అన్నారు.


హీరోయిన్ అలేఖ్య మాట్లాడుతూ...`మా సినిమా ట్రైల‌ర్, ఈ రోజు విడుద‌లైన పాట‌ను ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని కోరుకుంటున్నా` అన్నారు.


 

 ముర‌ళీ కృష్ణ రెడ్డి, గ‌డ్డం నవీన్, రాజ‌మౌళి, స‌ద‌, ఫైమా, భాస్క‌ర్, ముర‌ళి, జ‌నార్థ‌న్, కృష్ణ చైత‌న్య‌, రాజేశ్వ‌రి త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి డిఓపిః యుఎస్ విజయ్‌, సంగీతంః ఎమ్ ఎల్ రాజా, ఎడిట‌ర్ః మ‌హేంద్ర నాథ్, స్టంట్స్ః జాషువా;  కొరియోగ్రాఫ‌ర్ః కె.అనీష్ బాబు, సాగ‌ర్, రాజా ఎమ్ ఎల్;  పాట‌లుః రామాంజ‌నేయులు, ఎమ్ ఎల్ రాజా;  కో-ప్రొడ్యూస‌ర్ఃశ్రీ మ‌ల్లికా రెడ్డి;  స్టోరి-డైలాగ్స్-ప్రొడ్యూస‌ర్ః ఉమా శంక‌ర్ రెడ్డి.సి;  స్క్రీన్ ప్లే-డైర‌క్ష‌న్ః అశ్విన్ కామ‌రాజ్ కొప్పాల‌.

Preminchoddu Censor Completed

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ప్రేమించొద్దు’  సెన్సార్ పూర్తి.. జూన్ 7న విడుదలకు స‌న్నాహాలు

శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో సినిమా రూపొందుతోంది. బ‌స్తీ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ ప్రేమ కథాంశమిది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.  పాన్ ఇండియా చిత్రంగా 5  భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని  జూన్ 7న  విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా.. 


చిత్ర దర్శక నిర్మాత శిరిన్ శ్రీరామ్ మాట్లాడుతూ ‘‘యువతలో చాలా మంది నిజమైన ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియకుండా తప్పటడుగులు వేస్తున్నారు. ఇది వారి జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందనే కోణం లో  ‘ప్రేమించొద్దు’ అనే శీర్షిక తో ఈ సినిమాను తెరకెక్కించాం. ఇది పాన్ ఇండియాలో రిలీజ్ అవుతోన్న వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రం. అందరికీ కనెక్ట్ అయ్యే కథాంశంతో వస్తోన్న సినిమా కావటంతో సినిమాను  జూన్ 7న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం. అలాగే తెలుగు లో విడుదల చేసిన తర్వాత, త్వరలో త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌టానికి కూడా ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. 

నటీనటులు:

అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస, యశ్వంత్ పెండ్యాల, సంతోషి తాళ్ల, సోనాలి గర్జె, లహరి జులురి, శ్రద్ధా సాయి, వల్లీ శ్రీగాయత్రి, లక్ష్మీకాంత్ దేవ్ తదితరులు


సాంకేతిక వర్గం: 

రచన, ఎడిటింగ్, నిర్మాత, దర్శత్వం - శిరిన్ శ్రీరామ్, మ్యూజిక్ ప్రోగ్రామింగ్ - జునైద్ కుమార్, బ్యాగ్రౌండ్ స్కోర్ - కమ్రాన్, సాంగ్స్ కంపోజింగ్ - చైతన్య స్రవంతి, సినిమాటోగ్రఫీ అండ్ కలర్ - హర్ష కొడాలి, స్క్రీన్ ప్లే - షిరిన్ శ్రీరామ్, రాహుల్ రాజ్ వనం, అసోసియేట్ డైరెక్టర్ - సోనాలి గర్జె, పబ్లిసిటీ డిజైన్ - అజయ్(ఏజే ఆర్ట్స్), వి.ఎఫ్.ఎక్స్- వి.అంబికా విజయ్, లొకేషన్ సౌండ్ - మహేష్ పాశం, డబ్బింగ్ ఇంజనీర్ - అనూప్ చౌదరి, సూపర్‌వైజింగ్ ప్రొడ్యూస‌ర్‌:  నిఖిలేష్ తొగ‌రి, పి.ఆర్.ఒ - చంద్ర వట్టికూటి, మోహన్ తుమ్మల.


Arya 20years Event Held in Grand Scale

‘ఆర్య’ సినిమా నా జీవితాన్ని మార్చేసిన క్షణం.. నా జీవితాన్ని మార్చేసిన సినిమా - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్



 ఘనంగా జరిగిన ‘ఆర్య’ 20 ఏళ్ల వేడుక.. సుకుమార్, దిల్‌రాజు, దేవిశ్రీ, రత్నవేలు సహా పాల్గొన్న ఎంటర్ టీమ్


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘ఆర్య’. సుకుమార్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 2004 మే 7న ఈ మూవీ రిలీజైంది. ఈ బ్లాక్ బస్టర్ సినిమా విడుదలై 20 ఏళ్లు అయ్యింది. ఈ స్పెషల్ మూమెంట్స్‌ను ఇప్పుడు చిత్ర యూనిట్ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్, నిర్మాత దిల్ రాజు, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, శివ బాలాజీ, సుబ్బరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...


శివ బాలాజీ మాట్లాడుతూ ‘‘ఆర్య’ సినిమాలో ప్రతి సన్నివేశం నాకు ఒక మరచిపోలేని మెమొరీ. మూవీ ఓపెనింగ్ రోజున అన్నపూర్ణ స్టూడియో దగ్గర అల్లు రామలింగయ్య కూర్చుని అందరినీ గమనిస్తూ ఉండటాన్ని నేను మరచిపోలేను. తర్వాత చిరంజీవిగారి క్లాప్‌తో సినిమా ప్రారంభమైంది. దర్శకుడు సుకుమార్ సహా అందరితో మంచి రిలేషన్ ఏర్పడింది. లైఫ్ లో నా మొదటి సక్సెస్ ఆర్య సినిమాతోనే వచ్చింది. తర్వాత అలాంటి సక్సెస్ మళ్లీ చూడలేదు. దిల్ రాజుగారు గురువుగారిలా నడిపించారు. సుకుమార్‌గారితో పని చేసిన ప్రతి క్షణాన్ని మరచిపోలేను. మంచి స్నేహితుడిగా భావిస్తుంటాను. దేవిశ్రీ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. రత్నవేలుగారు మమ్మల్ని చాలా బాగా చూపించారు. బన్ని అప్పుడు ఎలా ఉన్నాడో, ఇప్పుడు అలాగే ఉన్నాడు.. దేశమే కాదు.. పక్కనున్న దేశాలు కూడా నీ గురించి మాట్లాడుకుంటున్నాయి. 20 ఏళ్ల ఆర్య సెలబ్రేషన్స్ లో పాల్గొనటం చాలా హ్యాపీగా ఉంది. పుష్ప 2కి కంగ్రాట్స్’’ అన్నారు.


నటుడు సుబ్బరాజ్ మాట్లాడుతూ ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆర్య సినిమాలో అవకాశం వచ్చింది. 7 రోజులు నటించాలని చెప్పి పిలిపించారు. 37 రోజులు యాక్ట్ చేయించారు. ఇండస్ట్రీ ఎలా ఉంటుందో, షూటింగ్స్ ఎంత గ్రాండియర్‌గా ఉంటాయో చెప్పిన సినిమా. 37 ఏళ్లు కాదు..67 ఏళ్లు నాకు గుర్తుండిపోయే సినిమాను ఆర్యతో నాకు ఇచ్చారు. అల్లు అర్జున్‌కి హ్యాట్సాఫ్. సుకుమార్, దిల్ రాజుగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను.


సినిమాటోగ్రాఫర్ రత్నవేలు మాట్లాడుతూ ‘‘ఆర్య’ మా అందరికీ ఓ మరచిపోలేని సినిమా. అప్పుడు ఎలాంటి ప్యాసన్ తో అయితే సినిమా చేశామో, ఇప్పటికీ అదే ప్యాషన్‌తో సినిమా చేస్తున్నాం.ఆర్య సినిమాను అందరూ ఎంజాయ్ చేశాం.. ఇంత మంచి సినిమా చేసిన దిల్ రాజుగారికి ధన్యవాదాలు’’ అన్నారు.


రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ‘‘మనతో పాటు జనం కూడా సెలబ్రేట్ చేసుకునే సినిమాలు తక్కువగా ఉంటాయి. అలాంటి సినిమాల్లో ఆర్య ఒకటి. అలాంటి సినిమాను మాకు అందించిన దిల్‌రాజుగారికి మనస్ఫూర్తిగా థాంక్స్. ఎందుకంటే ఆర్య సినిమా మాత్రమే కాదు.. మా అందరికీ మరచిపోలేని జ్ఞాపకం. వన్ సైడ్ లవ్‌ కాన్సెప్ట్ ఏ ముహూర్తాన సుకుమార్ గారు పరిచయం చేశారో తెలియదు, కానీ ప్రపంచమంతా మమ్మల్ని ప్రేమించింది. బన్ని మీద నాకు ఫ్రెండ్లీ లవ్ ఉంటుంది. మా ఫ్యామిలీస్‌తో ఉన్న ప్రేమ, అభిమానం కూడా దానికి కారణం కావచ్చు. మేం ఏం చేసినా ప్రతి దాన్ని కడిగిన ముత్యంలా చూపించారు. ఇప్పటికీ సినిమా చూసినా ఇప్పుడే షూట్ చేసినట్లు ఉంటుంది. బన్ని ఆర్యతో ట్రెండ్ క్రియేట్ చేశారు. ప్రతి సినిమాకు తనను తాను అప్‌గ్రేడ్ చేసుకుంటూ, కొత్త విషయాలను నేర్చుకుంటున్నారు. ఈ సినిమాలో పని చేసిన మా నటీనటులకు, టెక్నీషియన్స్‌కు థాంక్స్’’ అన్నారు.


నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘‘ఆర్య సినిమాతో ప్రారంభమైన అందరూ ఈ రోజు టాప్ పోజిషన్ లో ఉన్నారు. ఓ సినిమాతో ఇలాంటి మ్యాజిక్ జరగటం తెలుగులోనే కాదు, ఇండియన్ సినిమాలోనే తొలిసారి. టైటిల్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా జ్ఞాపకాలున్నాయి. దిల్ సినిమా జరుగుతుంది. అప్పుడే ఆర్య కథ చెప్పాడు సుకుమార్. అప్పుడే సినిమా చేస్తున్నామని నమ్మకంతో చెప్పేశాను. బన్ని మార్నింగ్ ఫస్ట్ హాఫ్ విన్నాడు.. సెకండాఫ్ మధ్యాహ్నం విన్నాడు. తర్వాత అరవింద్ గారు కొన్ని మార్పులు చేర్పులు చెప్పారు. సుక్కు ఏమో చెప్పిన కథనే మళ్లీ చెప్పటం నా వల్ల కాదు.. నేను వెళ్లిపోతాను అన్నాడు. తర్వాత చర్చలు ఆగిపోయాయి. తర్వాత సత్యనారాయణరెడ్డిగారి వల్ల చర్చలు మొదలయ్యాయి. బన్ని, అరవింద్ గారు ఆపీసుకి వచ్చి కథ విన్నారు. అప్పుడు తను ప్రతి సీన్ రాసుకుంటూ విన్నారు. కథ పూర్తయ్యాక, అరవింద్ గారు లేచి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అలా సినిమా మొదలైంది. తర్వాత నాకు, సుక్కుకి మధ్య ఫ్రెండ్లీ గొడవలు చాలానే జరిగాయి. ప్రతి ఒక మూమెంట్ యాడ్ అవుతూ ఆర్య సినిమా తయారైంది. బన్ని ఈ సినిమా కోసం మేకోవర్ అయ్యారు. సినిమాలో రన్నింగ్ ట్రాక్ సీన్ ఉంటుందిగా, దానికి సంబంధిచిన కటౌట్ ని మేం అన్నపూర్ణలో ఓపెనింగ్ రోజు పెట్టాం. దాన్ని అల్లు రామలింగయ్యగారు అలా చూసుకుంటూ ఉండిపోయారు. ఆరోజు ఆయన ఏదో ఒకరోజు బన్ని ఇండస్ట్రీని ఏలుతారని అనుకుని ఉంటారు. అది ఈరోజు నిజమైంది. బన్ని ఈరోజు ఈస్థాయిలో ఉండటానికి తను పెట్టిన ఎఫర్ట్సే కారణం. బన్ని ఒక్కో మెట్టుని భయంతో, రెస్పాన్సిబిలిటీతో చేస్తూ వస్తున్నాడు. అందుకనే ఆల్ ఇండియా స్టార్ అయ్యాడు. బన్ని, సుక్కు కాంబినేషన్ లో చేసిన పుష్ప 1తో ఆల్ ఇండియా లెవల్లో సెన్సేషనల్ హిట్ కొట్టారు. ఇప్పుడు పుష్ప 2తో ప్రపంచమంతా వెయిట్ చేసేలా చేశారు. ఇద్దరికీ హ్యాట్సాఫ్. నిర్మాతగా 56 సినిమాలు చేశాను. అయితే ఆర్య సినిమాకు దొరికిన ఎంజాయ్ మెంట్ జర్నీ ఇంకెప్పుడూ దొరకలేదు. సినిమా ఆడుతున్నన్ని రోజులు ట్రిప్స్ తో ప్రేక్షకుల మధ్య ఎంజాయ్ చేశాం. ఆర్య సినిమా మా అందరి జీవితాలను టర్న్ చేసింది.. ఆ సినిమా ఇచ్చిన ఎనర్జీని కాపాడుకుంటూ ముందుకెళ్లాలి’’ అన్నారు.


స్టార్ డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ ‘‘ఆర్య స్క్రిప్ట్‌ని నేను, వేమ కలిసి రాశాం. ఇద్దరం ఎడిటర్ మోహన్ గారి దగ్గర రైటర్స్ గా వర్క్ చేస్తున్నాం. డైరెక్ట్ చేద్దామనే ఆలోచనతో మా ఫ్రెండ్ దగ్గర 10 వేలు అప్పు తీసుకుని బయటకు వచ్చేశాం. ఆర్య జర్నీ అలా స్టార్ట్ అయ్యింది. రాజుగారికి కథ చెప్పినప్పుడు దిల్ సినిమా హిట్ అయితే సినిమా చేద్దామని ఆయన అన్నారు. ఆయన రీమేక్ సినిమా చేద్దామని స్క్రిప్ట్ ఇచ్చినా నేను చేయనని అనేశాను. అప్పుడు ఆర్య సినిమా కథ స్టార్ట్ అయ్యింది. అలాంటి సమయంలో నా కథను నమ్మి, కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన వ్యక్తి దిల్ రాజుగారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను. రాజుగారు అంత ధైర్యం ఇచ్చి ఉండకపోతే ఈ మూవీ ఉండేది కాదు. ఆర్య సినిమా రూపొందటానికి రెండో కారణం బన్ని. తనే కథను వదలకుండా కూర్చుని సినిమా చేసుకున్నాడు. రీల్ లైఫ్, రియల్ లైఫ్ లో నేను ఇలా నిలబడి ఉన్నానంటే బన్నీనే కారణం. అప్పుడు దేవిశ్రీప్రసాద్ ఓ సెన్సేషన్. ఫస్టాఫ్ కథ వినగానే ఫీల్ మై లవ్ సాంగ్ ట్యూన్ ఇచ్చేశాడు.  నాకు ఐటెం సాంగ్ చేయటం ఇష్టం లేదు. కానీ దేవిశ్రీతో చేయాల్సి వచ్చింది. ఆ పాట హిట్ అయిన తర్వాత ప్రతీ సినిమాలో ఐటెం సాంగ్ పెడుతున్నాను. నాకు సంబంధించినంత వరకు నా మ్యూజిక్ అంటే దేవిశ్రీప్రసాదే. శివ బాలాజీ.. రోల్ ఒప్పుకున్నందుకు థాంక్స్. బన్నీతో తన కాంబినేషన్ చక్కగా కుదిరింది. సుబ్బరాజ్ అయితే అప్పుడు ఎలా ఉన్నాడో, ఇప్పుడు అలాగే ఉన్నాడు. రత్నవేలుగారి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. చిరంజీవిగారిని కలిసి కథ చెప్పినప్పుడు 20 నిమిషాలే చెప్పాలన్నారు. కానీ నేను కథ చెబుతుంటే, మూడు గంటలు విన్నారు. సినిమా కథ చాలా బావుందని అన్నారు. సినిమా తీస్తే హిట్ అని కూడా అన్నారు. శిరీష్, లక్ష్మణ్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. సినిమా జరిగి నిన్న, మొన్న అయినట్లు ఉంది. పేరు పేరునా అందరికీ థాంక్స్. ఈరోజు ఇక్కడి నిలబడి ఉన్నానంటే మీ ఆశీస్సులే కారణం’’ అన్నారు.


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘ఆర్య’ ఈ ఏడాదికి 20 ఏళ్లు అవుతుందని రాజుగారు అన్నారు. అప్పుడు కచ్చితంగా సెలబ్రేట్ చేస్తామని నేను అన్నాను. ఆర్య సినిమా గురించి చెప్పాలంటే.. నా జీవితంలో అతి పెద్ద మరచిపోలేని క్షణం.. అది నా జీవితాన్ని మార్చేసిన సినిమా అని చెబుతాను. గంగోత్రి సినిమా హిట్ అయ్యింది.. కానీ నాకు పర్సనల్ గా గుర్తింపు రాలేదు. నా మార్క్ నేను క్రియేట్ చేయలేకపోయాను. ఏడాది పాటు ఖాళీగా కూర్చున్నాను. రోజుకు మూడు కథలు వినేవాడిని. సినిమాలు చూస్తుండేవాడిని. ఎలాగైనా సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయాను. కథ వింటున్నాను కానీ, మ్యాజిక్ ఎక్కడా తగలటం లేదు. అప్పుడు హీరో తరుణ్ నాకు మంచి ఫ్రెండ్. తను నాకు ఫోన్ చేసి ఇలా రాజుగారు నాకోసం దిల్ సినిమా వేస్తున్నారు. నేను చూడటానికి వెళుతున్నాను. నువ్వు కూడా వస్తావా అన్నారు. నేను ఆల్ రెడీ సినిమాను రెండు సార్లు చూశాను. నాకు సినిమా నచ్చింది. అయినా వస్తానని ప్రసాద్ ల్యాబ్ కి వెళ్లాను. అక్కడ సుకుమార్ గారు నన్ను కలిశారు. కథ చెబుతానన్నారు..చెప్పారు. నాకు మైండ్ బ్లోయింగ్ గా కథ నచ్చింది. ఇడియట్ సినిమాలాంటి సినిమా చేయాలని కోరిక ఉండేది. సుకుమార్ గారు నాకు ఆర్య కథ చెబుతుంటే.. ఇదే నా ఇడియట్ సినిమా అనిపించింది. అందరం కొత్తవాళ్లం. చాలా స్ట్రగుల్స్ పడ్డాం. కథ చాలా బావుందని గట్టి నమ్మకముండేది. ఈ సందర్భంలో వినాయక్‌గారికి స్పెషల్ థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే.. సుకుమార్ గారు సిినిమా చేయగలరా లేరా అనే ఆలోచన ఉండేది. అప్పుడు వినాయక్ గారు మా ఇంటికి వచ్చి మీరు  నన్ను నమ్మి సినిమా తీయండి.. ఆ కుర్రాడు సినిమా బాగా తీయగలడు అన్నారు.  ఆ మాట మాకెంతో బలమిచ్చింది. ఒకవేళ ఏదైనా సీన్ మీకు బాగోలేదనిపిస్తే నేను వచ్చి తీసిపెడతా అన్నారు. ఆరోజు ఆయన అలా చెప్పటం గొప్ప. ఈ సందర్భంగా వినాయక్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను. వారం రోజుల పాటు ట్రయల్ షూట్ చేశాం. సుకుమార్ గారు అత్యద్భుతంగా సినిమాను తెరకెక్కించారు. ఇది సినిమా గ్రేట్ సెన్సేషన్ అవుతుందని అందరిలో నమ్మకం వచ్చేసింది. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఇచ్చారు. మా అందరిలో అప్పుడు దేవిశ్రీనే స్టార్.  ఆర్య సినిమా జర్నీ గురించి మాటల్లో చెప్పలేను. ఈ సినిమాకు పని చేసిన అందరూ డైరెక్టర్స్ అయ్యారు. అందరం ఈ సినిమాకు కలిశామని కాదు.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి టర్నింగ్ పాయింట్ ఇచ్చిన విషయం. తెలుగు సిినిమా ఇలా కాదు.. ఇలా కూడా ఉంటుందని చెప్పిన సినిమా ఆర్య. తొలి రోజున సినిమా 40 శాతం ఓపెనింగ్ మాత్రమే వచ్చింది. పది వారాల సినిమా అని టాక్ వచ్చింది. నేను, సుకుమార్ కాస్త డల్ అయ్యాం. తెలియని కోపం వచ్చేస్తుంది. ఈ స్టేజ్ లో పది వారాల టాక్ రావటం గొప్ప అని మా నాన్నగారు అంటే .. ఏంటి పది వారాలు.. 125 డేస్ మూవీ అది అని గట్టిగా అన్నాను. అది పిచ్చైనా అనుకోండి, ఇంకేమైనా అనుకోండి.. అలా అనేశాను. కానీ నిజంగానే చిరంజీవిగారి చేతుల మీదుగా 125 డేస్ షీల్డ్ తీసుకున్నాను. నా లైఫ్ జీరోతో స్టార్ట్ అయ్యింది. గంగోత్రి హిట్ అయినా నేను -100కి వెళ్లిపోయాను. అయితే ఆర్య సినిమాతో +100కి చేరిపోయాను. తర్వాత నా లైఫ్ లో ఎంత వచ్చినా అది అడిషన్ మాత్రమే. రాజుగారు ఈ సిినిమాకు డబ్బలు పెట్టి రిస్క్ చేసి మా అందరికీ లైఫ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు థాంక్స్ చెబుతున్నాను. రాజుగారు లేకపోతే ఆర్య సినిమా ఉండేది కాదు. నలబై ఏళ్ల తర్వాత కూడా నేను వెనక్కి తిరిగి చూసుకన్నప్పుడు నా లైఫ్ ను చేంజ్ చేసిన వ్యక్తి ఎవరంటే మరో ఆలోచన లేకుండా సుకుమార్ గారనే చెబుతాను. ఆయన వల్ల నా లైఫ్ మారిపోయింది. ట్రెయిన్ లాంటి వ్యక్తిని, ఎలా వెళ్లాలో తెలియదు.. ట్రాక్ లేదు.. అలాంటి సమయంలో ఆర్య లాంటి సినిమాతో నన్ను ట్రాక్ ఎక్కించిన వ్యక్తి సుకుమార్. ఆ సక్సెస్ లో దేవిశ్రీప్రసాద్ ఎంత కీలకమైన పాత్ర పోషించాడో చెప్పనక్కర్లేదు. ప్రతి పాటతో సినిమా నెక్ట్స్ లెవల్ కు దేవి తీసుకెళ్లిపోయాడు. ఇక రత్నవేలుగారు చెత్తలో కూడా కెమెరా పెట్టికూడా సీన్ ను అద్భుతంగా తీశారు. ఆర్ట్ అనేది డబ్బుకి సంబంధించింది కాదు.. అభిరుచికి సంబంధించిందని రత్నవేలుగారిని చూసి నేర్చుకున్నాను. అను మెహతా, బబ్లు, చిత్రంశ్రీను, సుబ్బరాజ్ సహా అందరికీ థాంక్స్. నేను ఈరోజు ఇలా నిల్చున్నానంటే కారణం ఆర్య సినిమానే. అక్కడ నుంచి మొదలైతే ఇప్పుడు పుష్ప వరకు వచ్చాం. ఎప్పుడో కానీ ఇలాంటి అవకాశం రాదు..ఆర్య చేసిన 20 ఏళ్లకు,  ఆ సినిమాకు పని చేసిన సుకుమార్ గారు వన్ ఆఫ్ ది మోస్ట్ వాంటెడ్ ఇండియన్ డైరెక్టర్ అయ్యారు. దిల్ రాజు గొప్ప  సినిమాలను తీస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ బ్యాక్ టు బ్యాక్ టు ఆల్బమ్స్ తో ఎంటైర్ ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. రత్నవేలుగారు ఇండియాలో బిగ్గెస్ట్ మూవీస్ చేస్తున్నారు. నేను కూడా మీ అందరి సపోర్ట్ తో మంచి సినిమాలు చేస్తున్నాను. ఈ స్థాయిలో మమ్మల్ని నిలబెట్టిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్’’ అన్నారు.

Director VN aditya, chandrabose, Rp patnaik Graced the 21st anniversary of suswara music academy at Dallas

 వీఎన్ ఆదిత్య, చంద్రబోస్, ఆర్పీ పట్నాయక్ అతిథులుగా డల్లాస్ లో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడెమీ 21వ వార్షిక సంబరాలు



అమెరికాలోని డల్లాస్ నగరంలో సుస్వర మ్యూజిక్ అకాడెమీని విజయవంతంగా నిర్వహిస్తున్నారు డాక్టర్ మీనాక్షి అనిపిండి. ఈ అకాడెమీ 21వ వార్షికోత్సవం ఆదివారం (మే 5న) ఘనంగా నిర్వహించారు. గ్రాండ్ సెంటర్ ఆడిటోరియంలో జరిగిన ఈ సంబరాల్లో డల్లాస్ నగరంలోని ప్రముఖులతో సహా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు అతిధులుగా పాల్గొన్నారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక చైర్మన్ శ్రీ ప్రసాద్ తోటకూర, డల్లాస్ లో ఇండో అమెరికన్ కౌన్సిల్ సభ్యులు శ్రీ గోపాల్ పోనంగి, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ కిషోర్ కంచర్ల, శ్రీమతి శారద సింగిరెడ్డి, శ్రీ ప్రకాష్ రావు అతిధులుగా హాజరయ్యారు. ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్, సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, డైరెక్ట‌ర్ వీఎన్ ఆదిత్య‌తో సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సంద‌డి చేశారు.


సుస్వర మ్యూజిక్ అకాడెమీ 21వ వార్షిక సంబరాల్లో మీనాక్షి అనిపిండి తన శిష్య బృందంతో 7 సిగ్మెంట్లలో దాదాపు 30కి పైగా సంప్రదాయ సంగీత కీర్తనలను ప్రదర్శన ఇచ్చారు. 10 గంటల పాటు నిర్విరామంగా సాగిన ఈ సాంస్కృతిక గాన ప్రదర్శన ప్రేక్షకులందరినీ అలరించింది.ఈ వేదికపై చంద్రబోస్ కు "సుస్వర సాహిత్య కళానిధి", ఆర్పీ పట్నాయక్ కు "సుస్వర నాద‌నిధి" అనే బిరుదులు అందించారు. కుమారి సంహిత అనిపిండి,  శ్రీమతి ప్రత్యూష ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.



Happy Birthday to Sensational Star Hero Vijay Deverakonda

 సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ కు జన్మదిన శుభాకాంక్షలు






ఒకప్పుడు తన సినిమాను రిలీజ్ చేసేందుకు సపోర్ట్ కోసం వెతుకుతూ ఇబ్బందులు పడిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ..ఇవాళ తన సినిమాలను గ్రాండ్ గా పాన్ ఇండియా రిలీజ్ కు తీసుకొస్తున్నాడు. తెలుగుతో పాటు భాషలకు అతీతంగా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ప్రేక్షకుల్ని మెప్పిస్తూ వారి అభిమానం పొందుతున్నాడు.విజయ్ సాగిస్తున్న ఈ జర్నీ యంగ్ టాలెంట్ ను ఇన్స్ పైర్ చేస్తోంది. ఇండస్ట్రీలోకి రావాలనుకున్న కొత్త వాళ్లు తమకూ విజయ్ దేవరకొండ లాంటి ఒక మంచి కెరీర్ ఉంటుందనే హోప్స్ పెట్టుకుంటున్నారు. తన సక్సెస్ తో చాలా మందికి రోల్ మోడల్ అయ్యాడు విజయ్. ఇవాళ విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఆయన జర్నీ చూస్తే..


ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చూస్తున్నవాళ్లకు విజయ్ దేవరకొండ ఎవరో తెలియదు. రిషి క్యారెక్టర్ లో ఎంతో సహజంగా, ఈజ్ తో నటిస్తున్న అతన్ని చూసి ప్రేక్షకులు ఇంప్రెస్ అయ్యారు. ఈ కొత్త అబ్బాయి బాగా పర్ ఫార్మ్ చేస్తున్నాడని అనుకున్నారు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా విజయ్ దేవరకొండ ప్రతిభ అందరికీ తెలిసింది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన ఈ సినిమా నేషనల్ అవార్డ్ పొందింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించిన మాస్టర్ పీస్ అర్జున్ రెడ్డి విజయ్ కెరీర్ కు ఒక బెంచ్ మార్క్ మూవీ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్ లో విజయ్ కాన్ఫిడెన్స్ చూసి ఇండస్ట్రీ సర్ ప్రైజ్ అయ్యింది. అర్జున్ రెడ్డి క్రియేట్ చేసిన సెన్సేషన్, ఆ సినిమాలో డాక్టర్ అర్జున్ గా విజయ్ పర్ ఫార్మెన్స్ చూసి బీ, సీ సెంటర్స్ ఆడియెన్స్ నుంచి సెలబ్రిటీల దాకా విజయ్ ఫ్యాన్స్ అయ్యారు. ఈ సినిమా మిస్ అయినందుకు స్టార్ హీరోలు, ఇలాంటి సినిమా తామెందుకు చేయలేదని డైరెక్టర్స్ ఫీలయ్యారు. విజయ్ ను అప్రిషియేట్ చేశారు.


టాక్సీవాలా విజయ్ కు మరో సూపర్ హిట్ ఇస్తే..గీత గోవిందం ఆయన కెరీర్ లో ఫస్ట్ హండ్రెడ్ క్రోర్ మూవీగా నిలిచింది. హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన గీత గోవిందం విజయ్ కెరీర్ లో మరో స్పెషల్ మూవీగా నిలిచింది. ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు విజయ్ దేవరకొండను సకుటుంబ ప్రేక్షకుల దగ్గరకు మరింతగా చేర్చాయి. సినిమా మీద ప్యాషన్, నటన మీద ప్రేమ, హీరోగా విజయ్ చూపించే డెడికేషన్ అందరినీ ఆకట్టుకుంటుంది. స్టార్ గా ఎదగడమే కాదు సొసైటీ పట్ల తన బాధ్యతను ఎప్పుడూ మర్చిపోలేదు విజయ్ దేవరకొండ. కరోనా టైమ్ లో దేవరకొండ ఫౌండేషన్ ద్వారా మిడిల్ క్లాస్ ఫండ్ ఏర్పాటు చేసి, పేద మధ్య తరగతి కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, ఇతర సహాయం అందించాడు. యువతకు ఉపాధి కోసం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేశాడు. దేవరశాంట పేరుతో ఏటా తన ఫ్యాన్స్ లో కొందరిని టూర్స్ పంపిస్తుంటాడు. తన పుట్టిన రోజున నగరంలోని వివిధ ప్రాంతాలలో ఐస్ క్రీం ట్రక్స్ ఏర్పాటు‌ చేయిస్తారు విజయ్. ఖుషి సినిమా టైమ్ లో ప్రేక్షకుల్లో వందమందిని సెలెక్ట్ చేసి వారి కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున కోటి రూపాయల సాయం అందించాడు. ఇలా మంచి మనసున్న స్టార్ హీరోగా విజయ్ దేవరకొండ పేరు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న వీడీ 12 సినిమా విశాఖలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సెట్ లోనే విజయ్ తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకోనున్నారు. క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లైనప్ చేసుకుంటున్న విజయ్ దేవరకొండకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.



'Bhaje Vaayu Vegam' Release Date Announced

ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న హీరో కార్తికేయ గుమ్మకొండ "భజే వాయు వేగం" సినిమా




ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మీద హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న "భజే వాయు వేగం" సినిమా రిలీజ్ డేట్ ను ఈరోజు అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ నెల 31న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించారు. "భజే వాయు వేగం" సినిమాకు ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.


ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా "భజే వాయు వేగం" సినిమా రూపొందింది. టీజర్, లిరికల్ సాంగ్ తో ఇప్పటికే ఆడియెన్స్ లో "భజే వాయు వేగం" సినిమా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. బిగ్ స్క్రీన్స్ మీద ఈ సినిమాను చూడాలనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో ఏర్పడుతోంది. రేపు ఉదయం 9.09 నిమిషాలకు "భజే వాయు వేగం" సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'సెట్ అయ్యిందే'ను రిలీజ్ చేస్తున్నారు.



నటీనటులు - కార్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు


టెక్నికల్ టీమ్-

మాటలు: మధు శ్రీనివాస్

ఆర్ట్: గాంధీ నడికుడికర్

ఎడిటర్: సత్య జి

సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్

మ్యూజిక్ (పాటలు) - రధన్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - కపిల్ కుమార్

పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్-శ్రీనివాస్)

కో ప్రొడ్యూసర్ - అజయ్ కుమార్ రాజు.పి

ప్రొడ్యూసర్: యూవీ కాన్సెప్ట్స్

దర్శకుడు: ప్రశాంత్ రెడ్డి చంద్రపు


Kajal Agarwal Launched Satya Second Single Nijama Pranama

 కాజల్ అగర్వాల్ చేతులమీదగా సత్య - ‘నిజమా ప్రాణమా సాంగ్ విడుదల’ - మే 10న గ్రాండ్ రిలీజ్



శివమ్ మీడియా నుండి రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సత్య సినిమా నుండి ‘నిజమా ప్రాణమా’ లిరికల్ వీడియోని నటి కాజల్ అగర్వాల్ లాంచ్ చేశారు. ఇప్పటికే సత్య టీజర్, ట్రైలర్, సాంగ్ కి ప్రేక్షకుల నుండి విశేష ఆధరణ లభించింది. అలాగే ఈ నిజమా ప్రాణమా కూడా అనూహ్య స్పందన వస్తుంది. 90s లో పుట్టిన వారందరికీ ఈ సాంగ్ నోస్టలాజిక్ ఫీలింగ్ లోకి తీసుకుని వెళ్తుంది, ప్రార్థన సందీప్ హమరేష్ పెర్ఫార్మన్స్ చాలా చక్కగా ఉన్నాయని నెటిజన్లు ప్రసంసలు కురిపిస్తున్నారు. 


రాంబాబు గోసాల అద్భుతమైన లిరిక్స్ ని అందించారు, సుందరమూర్తి కేఎస్ సంగీతం మనసుకు హత్తుకునేలా ఉంది. వాలి మోహన్ దాస్ డైరెక్ట్ చేసిన విధానం ఆ ఎమోషన్ ని క్యారీ చేసిన విధానం తన ప్రతిభని కనపరిచింది. 


నటి కాజల్ అగర్వాల్ ఈ ‘నిజమా ప్రాణమా’ లిరికల్ వీడియోని లాంచ్ చేసిన సందర్భంగా, నిర్మాత శివ మల్లాలతో తనకున్న అనుభవాన్ని పంచుకున్నారు. ‘శివ గారు నాకు ఎప్పటి నుండో తెలుసు, మా ఇద్దరికీ వృత్తి రీత్యా అద్భుతమైన అనుబంధం ఉంది. శివ గారి సత్య సినిమా, నా సినిమా సత్య భామ రెండు పేర్లు చాలా దగ్గరా ఉన్నాయ్’ అని సరదాగా అన్నారు. 


నిర్మాత శివ మల్లాల మాట్లాడుతూ: కాజల్ అగర్వాల్ నాకు తన లక్ష్మి కళ్యాణం సినిమా నుండి పరిచయం, తక్కువ టైమ్ లోనే కాజల్ చాలా క్లోజ్ అయ్యారు, "స్పెషల్ చబ్బీస్" సినిమా అప్పుడు నన్ను పర్సనల్ గా అక్షయ్ కుమార్ గారికి పరిచయం చేశారు, ఆ సినిమాకి నేను పిఆర్ఓ గా వ్యవహరించాను. మొదటి సారి నిర్మాతగా చేస్తున్న సినిమాకి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నందుకు కాజల్ కు థాంక్స్ చెప్పారు.


హమరేశ్, ప్రార్ధన సందీప్, ఆడుగాలం మురుగదాస్, సాయిశ్రీ, అక్షయ,  ఈ చిత్రానికి సంగీతం– సుందరమూర్తి కె.యస్, ఎడిటింగ్‌– ఆర్‌.సత్యనారాయణ,  కెమెరా– ఐ. మరుదనాయగం, మాటలు– విజయ్‌కుమార్‌ పాటలు– రాంబాబు గోసాల, పీఆర్‌వో–వి.ఆర్‌ మధు, మూర్తి మల్లాల, లైన్‌ ప్రొడ్యూసర్‌– పవన్‌ తాత,  నిర్మాత– శివమల్లాల, రచన–దర్శకత్వం– వాలీ మోహన్‌దాస్

Sci-fi thriller movie Darshini set to hit the screens on May 17

 అదిరిపోయే థ్రిల్లర్ మూవీ దర్శిని

మే 17 న థియేటర్లలో విడుదల 



వి 4 సినీ క్రియేషన్స్ పతాకం పై వికాస్ మరియు శాంతి హీరో హీరోయిన్ గా డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వం లో డాక్టర్ ఎల్ వి సూర్యం నిర్మించిన సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్ చిత్రం "దర్శిని". ఈ చిత్రానికి యూ/ ఏ సర్టిఫికెట్ వచ్చింది. మే 17న విడుదలకు సిద్ధంగా ఉంది. 


ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ ఎల్ వి సూర్యం మాట్లాడుతూ "మా 'దర్శిని' చిత్రానికి సెన్సార్ వారు యూ/ ఏ ఇచ్చి మా చిత్రాన్ని ప్రశంసించారు. సినిమా చాలా బాగుంది అని కొనియాడారు. మే 17న విడుదల కు సిద్ధంగా ఉన్నాము. మా చిత్రం విడుదలకు సపోర్ట్ చేసిన దామోదర్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు. మా దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు ఈ చిత్రానికి ప్రాణం పెట్టి పని చేసాడు. మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు. ముగ్గురు మిత్రులకి భవిష్యత్తు నీ చూపించే యంత్రం దొరికితే దానివల్ల వచ్చే పరిణామాలు మరియూ పర్యవసానాలే మా సినిమా దర్శిని. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి కామెడీ, ఎమోషన్, లవ్ అని అంశాలు మా చిత్రాల్లో ఉన్నాయి. ప్రతి తెలుగు ప్రేక్షకులకు మా చిత్రం బాగా నచ్చుతుంది" అని తెలిపారు.


దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు మాట్లాడుతూ "కె ఎల్ దామోదర్ ప్రసాద్ గారు మా గాడ్ ఫాథర్. మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. మా నిర్మాత, మా కో డైరెక్టర్, మా హీరో, హీరోయిన్ మేము అందరం ఇప్పుడు ఒక ఫామిలీ. అందరం సొంత సినిమా గా పని చేసాం. సినిమా చాలా బాగా వచ్చింది, సెన్సార్ వారు మా చిత్రానికి యూ/ ఏ సర్టిఫికెట్ ఇచ్చి సినిమా బాగుంది అని కొనియాడారు. మే 17 న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అవుతుంది" అని తెలిపారు.


హీరో వికాస్ మాట్లాడుతూ "మా చిత్రానికి పునాది మా దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు. ఈ జర్నీ లో చాలా కష్టాలు చూసాము కానీ సినిమా మీద ప్యాషన్ తో కష్టపడి పని చేసాము. సినిమా చాలా బాగా వచ్చింది, మే 17న విడుదల అవుతుంది" అని తెలిపారు.


బ్యానర్ : వి 4 సినీ క్రియేషన్స్


చిత్రం పేరు : దర్శిని


నటీనటులు : వికాస్, శాంతి, సత్య ప్రసాద్, తదితరులు


కెమెరా మాన్ : రవి మిల్కీ


ఎడిటర్ : ప్రవీణ్ జైరాజ్, చందు చలమల


సంగీతం : నిజాని అంజన్


బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : శివ ప్రసాద్


డి ఐ : బి 2 హెచ్ స్టూడియోస్


కలరిస్ట్ : వెంకట్


డబ్బింగ్ : సిద్ధూ పట్నాన, రాజు గరుడే


సౌండ్ ఇంజనీర్ : దామోదర్ రావు


వి ఎఫ్ ఎక్స్ : ప్రవీణ్ జైరాజ్


డిజైన్స్ : ఎమ్ కె ఎస్ మనోజ్


పి ఆర్ ఓ : పాల్ పవన్


డిజిటల్ మార్కెటింగ్ : ఎస్ 3 డిజిటల్ మీడియా వర్క్


లైన్ ప్రొడ్యూసర్ మరియు కో డైరెక్టర్ : కె  సంతోష్ కుమార్


దర్శకుడు : డాక్టర్ ప్రదీప్ అల్లు


ప్రొడ్యూసర్ : డాక్టర్ ఎల్ వి సూర్యం

Brahma Anandam Announced Regular Shoot Starts Soon

 Raja Goutham, Brahmanandam, Vennela Kishore, RVS Nikhil, Rahul Yadav Nakka, Swadharm Entertainments Brahma Anandam Announced, Regular Shoot Starts Soon, Theatrical Release On December 6th



Hasya Brahma Brahmanandam and his son Raja Goutham will be doing a film together. The real-time father and son will be seen as grandfather and grandson in a film to be directed by first-timer RVS Nikhil, and produced by Rahul Yadav Nakka under Swadharm Entertainments with Smt. Savithry and Sri Umesh Yadav presenting it.


The production has constantly been making new-age content-based movies with 100% success rate. All their previous attempts- Malli Rava, Agent Sai Srinivasa Athreya, and Masooda gave good results at the box office as well. The banner also announced a movie VIBE as their 5th Production, so Brahma Anandam their 4th have announced through a pleasant pre-look poster and also with a hilarious video.


The pre-look poster is an amalgamation of urban and rural cultures. The video shows a funny conversation between Brahmanandam and Vennela Kishore, about Goutham’s next. Vennela Kishore discloses to Brahmanandam that Goutham gave his nod to do a movie, and the duo requests the legendary comedian to give his acceptance to play the role of a grandfather. As the video suggests, Brahma Anandam is going to be a wholesome entertainer. This humorous video that is meant to brief the characters of Brahmi and Goutham has created enthusiasm for the movie.


Brahma, a self-centered yet sarcastic grandson, makes use of everyone around him. Anand Ram Murthy, a caring grandfather tries to be kind to everyone. Now this grandson and grandfather, who are poles apart in nature, have to embark on a journey together. What follows is a drama of fun, happiness, dead ends, and new beginnings.


Vennela Kishore will also be playing a crucial role in the movie where Priya Vadlamani and Aishwarya Holakkal will be seen as female leads.


The makers have also announced the technicians to be part of the movie. Sandilya Pisapati will helm the music department, while Mitesh Parvathaneni will take care of the cinematography. Prasanna will edit the movie.


The regular shoot of the movie begins soon. The makers have also announced to release Brahma Anandam on December 6, this year.


Cast: Raja Goutham, Brahmanandam, Vennela Kishore, Priya Vadlamani and Aishwarya Holakkal


Technical Crew:

Writer & Director: RVS Nikhil

Producer: Rahul Yadav Nakka

Banner: Swadharm Entertainments

Presents: Smt. Savithry and Sri Umesh Yadav

DOP: Mitesh Parvathaneni

Music director: Sandilya Pisapati

Editor: Prasanna

Art Director: Kranthi Priyam

Executive Producer: P Dayakar Rao

PRO: Vamsi Shekar

Publicity Designs: Mayabazar

Marketing: First Show

Prathinidhi 2 Release Trailer Unleashed

 Nara Rohith, Murthy Devagupthapu, Vanara Entertainments, Rana Arts’ Prathinidhi 2 Release Trailer Unleashed



Nara Rohith, Murthy Devagupthapu, Vanara Entertainments, Rana Arts’ Prathinidhi 2 Release Trailer Unleashed


Nara Rohith’s comeback film Prathinidhi 2 under the direction of journalist Murthy Devagupthapu has already generated a lot of buzz with its teaser and theatrical trailer. The movie is up for release in a couple of days on May 10th. Meanwhile, the makers unleashed the film’s release trailer.


The trailer begins on an astounding note with the protagonist being enquired about his attempt to murder the chief minister. The CM dies in a bomb blast and his son is recommended to take the responsibility. The rest shows all the drama of the ruling and opposition parties, after the demise of the chief minister.


The release trailer is much more intriguing and engaging than the theatrical trailer. It indeed discloses more about the film’s content. Nara Rohith looked dashing as a journalist who has another agenda. Murthy has done well to engage with his superb storytelling.


Siree Lella played the leading lady. Sachin Khedekar, Dinesh Tej, Raghu Babu, Jisshu Sengupta, Udaya Bhanu, Ajay Gosh, and Shree appeared in important roles.


The cinematography is by Nani Chamidishetty, the music is by Mahati Swara Sagar, and the editing is by Raviteja Girijala. Kiran Kumar Manne is the art director.


The release trailer has set the bar too high for the movie.


Cast: Nara Rohith, Siree Lella, Dinesh Tej, Sapthagiri, Jisshu Sengupta, Sachin Khedekar, Thanikella Bharani, Indraja, Udaya Bhanu, Ajay Gosh, Ajay, Praveen, Prudhvi Raj, Raghu Babu, Raghu Karumanchi


Technical Crew:

Director: Murthy Devagupthapu

Producers: KumarRaza Bathula, Anjaneyulu Sri Thota, Surendranath Bollineni

Banners: Vanara Entertainments, Rana Arts

Music: Mahati Swara Sagar

Editor: Raviteja Girijala

DOP: Nani Chamidisetty

Art: Kiran Kumar Manne

Stunts: Siva Raju & Prudhvi

Executive Producer: Karthik Puppala

Publicity Designs: Anil&Bhanu

PRO: Vamsi-Sekhar

Digital: Praveen & Housefull Digital

'Baahubali: Crown of Blood' Animation series to be stream on Disney plus Hotstar from the May 17th

 'బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్'తో బాహుబలి చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించడం చాలా ఆనందంగా వుంది: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి




బాహుబలి ఫ్రాంచైజీ హార్ట్‌ల్యాండ్‌లో ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ టీమ్‌’ను తిరిగి మన ముందుకు తీసుకువస్తున్న డిస్నీ+ హాట్‌స్టార్


గ్రాఫిక్ ఇండియా,  ఆర్కా మీడియావర్క్స్ ప్రొడక్షన్, S.S. రాజమౌళి, శరద్ దేవరాజన్ నుంచి ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ 17 మే, 2024 నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రత్యేకంగా ప్రసారం  



హైదరాబాద్, 7 మే, 2024: బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ టీమ్, డిస్నీ+ హాట్‌స్టార్ వారి అప్ కమింగ్ యానిమేటెడ్ సిరీస్, బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్  యునివర్స్ నిహైదరాబాద్‌లోని AMB సినిమాస్‌లో గ్రాండ్ గా ఆవిష్కరించింది. ఈ యానిమేటెడ్ సిరీస్, మాహిష్మతి అద్భుత రాజ్యాన్ని, సింహాసనాన్ని పెను ముప్పు నుండి రక్షించడానికి బాహుబలి, భల్లాలదేవ చేతులు కలిపిన సామ్రాజ్యాల ఘర్షణ యొక్క లెజెండరీ ప్రయాణంలో మిమ్మల్ని తిరిగి తీసుకువెళుతుంది. గ్రాఫిక్ ఇండియా, ఆర్కా మీడియావర్క్స్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, విజనరీ ఫిల్మ్ మేకర్ S.S. రాజమౌళి, శరద్ దేవరాజన్ & శోబు యార్లగడ్డ దీనిని నిర్మించారు. జీవన్ J. కాంగ్ & నవీన్ జాన్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ మే 17, 2024న డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.


ఈవెంట్‌కు హాజరైన డిస్నీ+ హాట్‌స్టార్ & హెచ్‌ఎస్‌ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్ హెడ్ - కంటెంట్ గౌరవ్ బెనర్జీ మాట్లాడుతూ.. డిస్నీ+ హాట్‌స్టార్‌లో  దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్‌తో అద్భుతమైన కథలను మీ ముందుకు తీసుకురావడానికి మేము కట్టుబడి ఉన్నాము. మేము యానిమేషన్ లో ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటున్నాము. దిగ్గజ చలనచిత్ర దర్శకుడు S.S. రాజమౌళితో, గ్రాఫిక్ ఇండియాతో మా దీర్ఘకాల భాగస్వామ్యం ఇందుకు ఉదాహరణ. ఇది మీరు బాహుబలి ఫ్రాంచైజీకి అభిమాని అయినా లేదా మొదటిసారి చూస్తున్నా కూడా ప్రతి ఒక్కరికీ అభిమాన సిరీస్ అవుతుంది. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’ అన్నారు


ఈ కార్యక్రమానికి హాజరైన బాహుబలి యూనివర్స్ క్రియేటర్, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ. "బాహుబలి ఫ్రాంచైజీకి నా మనసులో ప్రత్యేక స్థానం ఉంది. 'బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్'తో బాహుబలి చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించడం అద్భుతంగా అనిపిస్తుంది. బాహుబలి కోసం క్యారెక్టర్ ఆర్క్స్, ప్రీ స్టొరీ, పోస్ట్ స్టొరీ రాసినప్పుడు బాహుబలిలో యూనివర్స్ లో ప్రేక్షకులకు చెప్పడానికి ఇంకా కథ వుంది అనిపించింది. వెస్ట్రన్ కంట్రీస్ లో ఒక సినిమా విజయవంతమైతే ఆ బ్రాండ్ అనేక మీడియమ్స్ లో ముందుకు వెళ్తుంది. ఇక్కడ మాత్రం అలా జరగడం లేదు. సినిమా విజయవంతమైతే అక్కడితో అయిపోతుంది. అయితే మేము ఈ విజయాన్ని కొనసాగించాలని వీర్ ఫిలిమ్స్, సిరిస్ ఇలా చాలా విధాలుగా ప్రయత్నించాం. అయితే ఈ ప్రయాణంలో సరైన వ్యక్తులతో జతకట్టాలని అర్ధమైయింది. ఇలాంటి సమయంలో శరత్ వచ్చారు. యానిమేషన్ లో ఆయన విజన్ నాకు చాలా నచ్చింది. అలా వారితో అసోసియేట్ అయ్యాం. ఆయనతో చాలా కథా చర్చలు జరిగాయి. ఈ కథని ముందుకు తీసుకెళ్ళమని శరత్ కు చెప్పడం ముందు నాకు చాలా కష్టంగా అనిపించింది. నా ప్రమేయం లేకుండా బాహుబలి కథ చెప్పడమా ?! (నవ్వుతూ) అనిపించింది. బాహుబలి ప్రతి పాత్రలో సోల్ వుంటుంది. ఎమోషన్ వుంటుంది. ఆ ఎమోషన్ ప్రేక్షకులుని గొప్పగా హత్తుకుంటుంది. ఈ యానిమేషన్ సిరిస్ ని శరత్ కూడా ఆ సోల్ పట్టుకొని అద్భుతంగా రూపొందించడం ఆనందంగా వుంది. గ్రాఫిక్ ఇండియా, ఆర్కా మీడియావర్క్స్ మరియు డిస్నీ+ హాట్‌స్టార్‌లతో కలిసి పనిచేయడం ఒక అద్భుతమైన అనుభవం, ఎందుకంటే భారతదేశంలో యానిమేషన్‌ను రూపొందించడంలో వారి అభిరుచి, అంకితభావం నిజంగా స్ఫూర్తిదాయకం. మేము కలసి బాహుబలి యునివర్స్ ని విస్తరించడమే కాకుండా, దాని అద్భుతమైన యానిమేషన్, ఎమోషన్స్, సంక్లిష్టమైన పాత్రలతో ప్రేక్షకులను కట్టిపడేసేలా కథను రూపొందించాము. బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ డిస్నీ+ హాట్‌స్టార్ లో ప్రేక్షకులని అద్భుతంగా అలరించనుంది’ అన్నారు.


బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ కో -క్రియేటర్, రచయిత, మేకర్ శరద్ దేవరాజన్ మాట్లాడుతూ 'బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్'కి జీవం పోయడం గ్రాఫిక్ ఇండియాలో మనందరికీ సంతోషకరమైన ప్రయాణం. మేము మొదట ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినప్పుడు, బాహుబలి ఫ్రాంచైజీ వారసత్వానికి అనుగుణంగా యానిమేటెడ్ సిరీస్‌ను రూపొందించడం - మేము ఒక గొప్ప బాధ్యతను తీసుకుంటున్నామని మాకు తెలుసు. విజనరీ దర్శకుడు S.S. రాజమౌళితో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాం. అతని ప్రేరణ, మద్దతుతో, మాహిష్మతి వెనుక ఉన్న కథలను, రహస్యాలను వెలికితీస్తూ, సినిమా అభిమానులను బాహుబలి ప్రపంచంలోకి మరింతగా తీసుకువెళ్ళడానికి వీలు కల్పించే కథనాన్ని రూపొందించడానికి మేము నిబద్దతగా పనిచేస్తున్నాము. ఉత్కంఠభరితమైన యానిమేటెడ్ విజువల్స్, క్లిష్టమైన పాత్రలు పిల్లలనే కాకుండా పెద్దలకు అనుగుణమైన ఆకర్షణీయమైన కథనంతో, 'బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్' భారతీయ యానిమేషన్ ల్యాండ్‌స్కేప్‌లో గొప్ప మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము.


బాహుబలి వాయిస్ కు తన గాత్రాన్ని అందించిన వ్యక్తి, నటుడు శరద్ కేల్కర్ మాట్లాడుతూ, “నేను చాలా పాత్రలకు నా గాత్రాలు అందించాను కానీ బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ ఈ ఫ్రాంచైజీతో నా సుదీర్ఘ అనుబంధం కారణంగా నా మనసులో ప్రత్యేక స్థానం వుంది. అభిమానులని, ప్రేక్షకులను  బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ ఈ ఫ్రాంచైజీని మరో స్థాయికి తీసుకువెళుతుంది. ఈ పాత్రకు మళ్లీ జీవం పోయడం ఒక గొప్ప అనుభూతి, ఇంతకు ముందు ఎవరూ చూడని విధంగా  సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాను.  ఈ మేలో డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఈ సిరిస్ చూడడానికి ఎదురుచూస్తున్నాను’ అన్నారు


 మే 17, 2024 నుండి డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారమయ్యే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ తో బాహుబలి లెగసీలో కొత్త అధ్యాయానికి సాక్ష్యంగా నిలవడానికి సిద్ధంగా ఉండండి.

Sundeep Kishan Maayaone First Look Launched

 సందీప్ కిషన్, సివి కుమార్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ 'మాయవన్' నుంచి సందీప్ కిషన్ పవర్ ప్యాక్డ్ ఫస్ట్ లుక్ విడుదల  



హీరో సందీప్ కిషన్, క్రియేటివ్ డైరెక్టర్ సివి కుమార్ వారి కాంబినేషన్‌లో వచ్చిన సెన్సేషనల్ హిట్ ప్రాజెక్ట్‌జెడ్ తర్వాత సెకండ్ పార్ట్ కోసం మరోసారి చేతులు కలిపారు. 'మాయవన్' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సీక్వెల్ ను ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై  రాంబ్రహ్మం సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌ నేపధ్యంలో రూపొందే ఈ చిత్రాన్ని అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పిస్తోంది. కిషోర్ గరికిపాటి (జికె) ఎగ్జిక్యూటివ్ నిర్మాత.


ఈ రోజు సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ పవర్ ప్యాక్డ్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. సందీప్ కిషన్ ఒక పిడికిలిని బిగించి మరో చేతిలో సూపర్ పవర్ వెపన్ తో ఇంటెన్స్ గా చూస్తున్న ఫస్ట్ లుక్ మైండ్ బ్లోయింగ్ గా వుంది. ఈ ఎక్సయిటింగ్ ఫస్ట్ లుక్ సినిమాపై చాలా క్యూరియాసిటినీ పెంచింది.  


ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు, సాహో ఫేమ్ నీల్ నితిన్ ముఖేష్‌ను కీలక పాత్రలో నటిస్తున్నారు. సందీప్‌ కిషన్‌ సరసన ఆకాంక్ష రంజన్‌ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.  


టాప్-క్లాస్ ప్రొడక్షన్, టెక్నికల్ స్టాండర్డ్స్‌తో హై బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రం, సూపర్‌విలన్‌తో ఒక సామాన్యుడి ఘర్షణ కథగా వుండబోతుంది. ఈ చిత్రానికి కార్తీక్ తిల్లై & కవిన్ రాజ్ డీవోపీలు గా పని చేస్తుండగా, సెన్సేషనల్ కంపోజర్ సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.


తారాగణం:సందీప్ కిషన్, ఆకాంక్ష రంజన్ కపూర్,నీల్ నితిన్ ముఖేష్, కాథరిన్ డేవిసన్ , పృధ్వీ రాజ్, బబ్లూ పృథివీరాజ్,  మురళీ శర్మ, అనీష్ కురువిల్లా, మురళీధర్ గౌడ్, సత్య ప్రకాష్


టెక్నికల్ టీం:

రచన, దర్శకత్వం: సివి కుమార్

నిర్మాత: రామ బ్రహ్మం సుంకర

బ్యానర్: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్

ప్రెజెంట్స్: అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గరికిపాటి కిషోర్

డీవోపీ: కార్తీక్ తిల్లై & కవిన్ రాజ్.

సంగీత దర్శకుడు: సంతోష్ నారాయణన్

ఎడిటర్: రవి తేజ గిరిజాల

ఆర్ట్ డైరెక్టర్: ప్రేమ్ కరుంతలై.

డిజైనర్: అనంత్ కంచెర్ల (పద్మశ్రీ యాడ్స్)

పీఆర్వో: వంశీ శేఖర్

మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా


Prathinidhi 2 Censor Completed Release on May 10th

 నారా రోహిత్, మూర్తి దేవగుప్తపు, వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ 'ప్రతినిధి 2' సెన్సార్ పూర్తి- యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్-  మే 10న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్



హీరో నారా రోహిత్  'ప్రతినిధి 2'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వానరా ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట,  సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మించారు.


తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. మే 10న 'ప్రతినిధి 2' ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.    


ప్రతినిధి 2 మూవీ టీజర్, ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. గతంలో ఒక మాస్ పాటను విడుదల చేసారు, ఈ పాటలో రోహిత్ జీవితం గురించి జ్ఞానాన్ని ఇస్తున్నట్లు కనిపించారు. రెండవ పాట- జర్నలిస్ట్ గీతం,  కృష్ణకాంత్ ఆలోచింపజేసే సాహిత్యం ఇవ్వగా స్వరాగ్ కీర్తన్,  జయంత్ పాడిన పాట ఇన్స్టంట్ హిట్ అయ్యింది.


ప్రతినిధి 2 ప్రతినిధి సిరీస్ నుండి రెండవ ఫ్రాంచైజీ. ఈ సినిమాలో నారా రోహిత్ నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించనున్నాడు. సిరీ లెల్లా కథానాయికగా నటిస్తుండగా, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.


నాని చమిడిశెట్టి కెమరా మెన్. యువ సంగీత సంచలనం మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు. రవితేజ గిరిజాల ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.


తారాగణం: నారా రోహిత్, సిరీ లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ గోష్, అజయ్, ప్రవీణ్, పృధ్వీ రాజ్, రఘుబాబు, రఘు కారుమంచి


సాంకేతిక సిబ్బంది:

దర్శకత్వం: మూర్తి దేవగుప్తపు

నిర్మాతలు: కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని

బ్యానర్లు: వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్

సంగీతం: మహతి స్వర సాగర్

ఎడిటర్: రవితేజ గిరిజాల

డీవోపీ: నాని చమిడిశెట్టి

ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె

స్టంట్స్: శివరాజు & పృధ్వి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కార్తీక్ పుప్పాల

పబ్లిసిటీ డిజైన్స్: అనిల్ & భాను

పీఆర్వో: వంశీ-శేఖర్

డిజిటల్: ప్రవీణ్ & హౌస్‌ఫుల్ డిజిటల్

Producer SKN received the Dasari Film Award for 'Best Commercial Film of the Year' for "Baby"

 'బెస్ట్ కమర్షియల్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్'గా "బేబి" సినిమాకు దాసరి ఫిల్మ్ అవార్డ్ అందుకున్న సక్సెస్ ఫుల్ యంగ్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్




ప్రేక్షకుల టేస్ట్ కు నచ్చేలా వైవిధ్యమైన కథలతో సినిమాలు నిర్మిస్తూ సక్సెస్ ఫుల్ యంగ్ ప్రొడ్యూసర్ గా టాలీవుడ్ లో పేరు తెచ్చుకుంటున్నారు ఎస్ కేఎన్. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ హీరో హీరోయిన్లుగా సాయి రాజేశ్ దర్శకత్వంలో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఆయన నిర్మించిన "బేబి" సినిమా గతేడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు గానూ 'బెస్ట్ కమర్షియల్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్'గా దాసరి ఫిల్మ్ అవార్డ్ అందుకున్నారు ఎస్ కేఎన్. ఆయన గురువులా భావించే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేతుల మీదుగా ఈ అవార్డ్ అందుకోవడం విశేషం.


లాస్ట్ ఇయర్ చిన్న చిత్రంగా రిలీజై పెద్ద విజయం సాధించింది "బేబి". రా అండ్ రస్టిక్, యాక్షన్ మూవీస్ ట్రెండ్ నడుస్తున్న టాలీవుడ్ లో ప్రేమకథతో సక్సెస్ అందుకోవడం "బేబి" సినిమా ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు. తెలుగులో 100 కోట్ల రూపాయల గ్రాసర్ గా నిలిచిన బేబి...మొత్తం సౌత్ లో సూపర్ సక్సెస్ అందుకుంది. కల్ట్ బొమ్మగా బేబి ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది. బాలీవుడ్ లో బేబి రీమేక్ అవుతోంది.

Gorrela Song from "Committee Kurrollu is Unveiled

 జయప్రకాష్ నారాయణ చేతుల మీదుగా  ‘కమిటీ కుర్రోళ్ళు’ నుంచి ‘గొర్రెలా..’ అనే పాట విడుదల



ఓటు విలువను చెప్పే సెటైరికల్ సాంగ్.. ఆలోచించి ఓటు వేయాలంటూ పాటతో చెప్పిన చిత్ర యూనిట్



ఎన్నికల సమయం దగ్గర పడుతుంది.. రాజకీయ పార్టీలు ప్రజలను ప్రలోభ పెట్టటానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నింటినీ అన్వేషిస్తున్నాయి. ఓట్లను డబ్బులతో కొంటున్నారు.. మందు, చీరలిచ్చి ఓటర్లను తమ వైపు తిప్పుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ఇది తప్పు.. ఓట్లను కొనేసి తర్వాతే ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ.. గొర్రెల్లా కాకుండా మనిషిలా ఆలోచించి ఓటు వేయాలంటూ చెబుతున్నారు ‘కమిటీ కుర్రోళ్ళు’. అది కూడా మాటగా కాదండోయ్.. చక్కటి పాట రూపంలో. ‘గొర్రెలా..’ అంటూ సాగే ఈ పాటను అనుదీప్ దేవ్ సంగీత సారథ్యంలో నాగ్ అర్జున్ రెడ్డి రాశారు. అనుదీప్ దేవ్, వినాయక్, అఖిల్ చంద్ర, హర్షవర్ధన్ చావలి, ఆదిత్య భీమతాటి, సింధూజ శ్రీనివాసన్, మనీషా పండ్రాంకి, అర్జున్ విజయ్ పాడారు.


జయప్రకాష్ నారాయణ  ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాలోని ‘గొర్రెలా..’ అనే పాటను విడుదల చేశారు. నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. య‌దు వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుంచి మంగళవారం ‘గొర్రెలా...’ అనే సాంగ్‌ను జయప్రకాష్ నారాయణ చేతుల మీదుగా విడుదలైంది. ఈ సందర్భంగా...


జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ ‘‘‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో ‘గొర్రెలా..’ అనే పాట పెట్టి ఊర్రుతలూగించారు. అలాగే యువతను ఆలోచింపచేశారు. దేశ భవిష్యత్తును కాపాడాలంటే యువతలో సరైన ఆలోచన ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని రేసీగా, ఉత్సాహంగా, ఆలోచనాత్మకంగా చక్కటి పాటను చిత్రీకరించారు. నిర్మాత నిహారికగారిని, డైరెక్టర్ వంశీగారిని, పాట రాసిన నాగార్జున, మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్‌లను ఈ సందర్భంగా మనసారా అభినందిస్తున్నాను. భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటు వేయాలని యువత సహా అందరినీ కోరుతున్నాను. మీకు సేవ చేయటం కోసం డబ్బులిచ్చేవాడు మిమ్మల్ని బలి తీసుకుంటున్నాడు. యువతలో ఓటు వేయటంలో మార్పు రావాలి. నిరాశ వద్దు.. ఆత్మ విశ్వాసంతో ముందుకు కదలాలి. కులాన్ని, వర్గాన్ని పక్కకు పెట్టి, మన బతుకులు గురించి ఆలోచించాలని కోరుతున్నాను. మరోసారి ‘కమిటీ కుర్రోళ్ళు’ టీమ్‌ను అభినందిస్తున్నాను’’ అన్నారు.


Here's 'Gorrela' Song from "Committee Kurrollu"  



నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ ‘‘మా సినిమాలో పాటను విడుదల చేసినందుకు ముందుగా జయప్రకాష్ నారాయణగారికి థాంక్స్ చెబుతున్నాను. నిజానికి జయప్రకాష్ గారు మాట్లాడిన ఓ స్పీచు వినే మా డైరెక్టర్ వంశీగారు ఓ సినిమాను స్టార్ట్ చేశారని ఈ సందర్భంగా ఆయనకు తెలియజేస్తున్నాను. జయప్రకాష్ గారికి మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాం’’ అన్నారు.


‘కమిటీ కుర్రోళ్ళు’ ఆడియో టి సిరీస్ ద్వారా మార్కెట్ లో విడుదల .   


నటీనటులు :


సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, రాధ్య, తేజస్వి రావు, టీనా శ్రావ్య,విషిక, షణ్ముకి నాగుమంత్రి ..ముఖ్య పాత్రల్లో సాయి కుమార్ ,గోపరాజు రమణ,బలగం జయరాం,శ్రీ లక్ష్మి ,కంచెరపాలెం కిషోర్ ,కిట్టయ్య ,రమణ భార్గవ్,జబర్దస్త్ సత్తిపండు తదితరులు


సాంకతిక వర్గం :


సమర్పణ - నిహారిక కొణిదెల, బ్యానర్స్- పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్, నిర్మాతలు - పద్మజ కొణిదెల,జయలక్ష్మి అడపాక,  రచన, దర్శకత్వం - యదు వంశీ, సినిమాటోగ్రఫీ - రాజు ఎడురోలు, మ్యూజిక్ డైరెక్టర్ - అనుదీప్ దేవ్,  ప్రొడక్షన్ డిజైనర్ - ప్రణయ్ నైని, ఎడిటర్ - అన్వర్ అలీ, డైలాగ్స్ - వెంకట సుభాష్  చీర్ల, కొండల రావు అడ్డగళ్ల,  ఫైట్స్ - విజయ్, నృత్యం - జె.డి మాస్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - మన్యం రమేష్, సౌండ్ డిజైన‌ర్‌:  సాయి మ‌ణింద‌ర్ రెడ్డి, పోస్ట‌ర్స్‌:  శివ‌, ఈవెంట్ పార్ట్‌న‌ర్‌:  యు వి మీడియా, మార్కెటింగ్‌:  టికెట్ ఫ్యాక్ట‌రీ, ఆడియో - టి సిరీస్  పి.ఆర్.ఒ- బియాండ్ మీడియా (నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి).


Hero Kartikeya's "Bhaje Vaayu Vegam" first song 'Set Ayyindhe' promo released, full lyrical song on May 9th

 హీరో కార్తికేయ "భజే వాయు వేగం" మొదటి సాంగ్ 'సెట్ అయ్యిందే' ప్రోమో రిలీజ్,  ఈ నెల 9న ఫుల్ లిరికల్ సాంగ్ విడుదల



ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా వస్తున్న "భజే వాయు వేగం" సినిమా టీజర్ ఇటీవల రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి గారు విడుదల చేయగా అనూహ్య స్పందన లభించిన విషయం తెలిసిందే. ఆ ఊపుని కొనసాగిస్తూ చిత్రంలోని మొదటి పాట ‘సెట్ అయ్యిందే’ ఈ నెల 9వ తేదీన ఉదయం 9.09 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ రోజు ఈ పాట ప్రోమో రిలీజ్ చేశారు. రధన్ కంపోజ్ చేసిన ఈ మాస్ బీట్ సాంగ్ కు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ‘సెట్ అయ్యిందే లైఫ్ సెట్ అయ్యిందే నీ వల్లే నా లైఫ్ సెట్టయ్యిందే, సెట్ అయ్యిందే లైఫ్ సెట్ అయ్యిందే, నా లవ్ స్టోరి బ్లాక్ బస్టర్ హిట్టయ్యిందే..‘ అంటూ సాగిన ఈ 21 సెకన్ల ప్రోమో సాంగ్ ఇంప్రెస్ చేసింది. ఈ ప్రోమోలో కార్తికేయ చేసిన ఎనర్జిటిక్ డాన్స్ స్టెప్స్ హైలైట్ అవుతున్నాయి. ఫుల్ సాంగ్ లో కార్తికేయ, ఐశ్వర్య మీనన్ జంట వైరల్ అవ్వగలిగే ఓ హుక్ స్టెప్ తో ఆకట్టుకోనున్నారు.


"భజే వాయు వేగం" చిత్రంలో హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాకు ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.


సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ను, ట్రైలర్ ని త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు.


నటీనటులు - కార్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు


టెక్నికల్ టీమ్-

మాటలు: మధు శ్రీనివాస్

ఆర్ట్: గాంధీ నడికుడికర్

ఎడిటర్: సత్య జి

సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్

మ్యూజిక్ (పాటలు) - రధన్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - కపిల్ కుమార్

పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్-శ్రీనివాస్)

కో ప్రొడ్యూసర్ - అజయ్ కుమార్ రాజు.పి

ప్రొడ్యూసర్: యూవీ కాన్సెప్ట్స్

దర్శకుడు: ప్రశాంత్ రెడ్డి చంద్రపు

Nikhil Swayambhu 12 Days Epic Action Episode With 8 Cr Budget

 నిఖిల్, భరత్ కృష్ణమాచారి, పిక్సెల్ స్టూడియో పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'స్వయంభూ' కోసం 8 కోట్ల బడ్జెట్‌తో 12 రోజుల ఎపిక్ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్



కార్తికేయ 2తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న నిఖిల్ మరో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'స్వయంభూ'తో వస్తున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నిఖిల్ 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిఖిల్ లెజెండరీ వారియర్ పాత్రలో కనిపించనున్నారు.


నిఖిల్ తనపాత్ర కోసం ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్ , గుర్రపు స్వారీలో ఇంటెన్స్ ట్రైనింగ్  తీసుకున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక, నిర్మాణ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.


ప్రస్తుతం, టీమ్ ప్రముఖ తారాగణంతో ఎపిక్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తోంది. వియత్నామీస్ ఫైటర్స్‌తో సహా 700 మంది ఆర్టిస్టులపై 12 రోజుల పాటు చిత్రీకరించనున్న ఈ ఎపిసోడ్‌లో నిఖిల్ అద్భుతమైన స్టంట్స్ చేయనున్నారు. రెండు మ్యాసీవ్ సెట్లలో ప్రతిష్ఠాత్మకంగా వార్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ ఒక్క ఎపిసోడ్‌కి మేకర్స్ రూ.8 కోట్లు చేస్తున్నారు. ‘స్వయంభూ’లోని మెయిన్ హైలెట్స్ లో ఈ యాక్షన్ ఎపిసోడ్ ఒకటి. ఈ యాక్షన్ ఎపిసోడ్ బిగ్ స్క్రీన్ పై గొప్ప అనుభూతిని కలిగించనుంది.


వర్కింగ్ స్టిల్‌లో నిఖిల్ మజిల్డ్ ఫిజిక్ తో బీస్ట్ మోడ్ లో ఫైటింగ్ రింగ్‌లోకి దిగుతున్నట్లుగా కనిపించారు. ఈ పాత్ర కోసం పూర్తిగా మేకోవర్‌ అయిన నిఖిల్ ఒక లెజెండరీ యోధుడిగా కనిపిస్తారు. సెటప్, భారీ జనసమూహం ఫైట్ సీక్వెన్స్ గ్రాండియర్ ని సూచిస్తున్నాయి.


ఈ చిత్రంలో సంయుక్త, నభా నటేష్  హీరోయిన్స్ గా నటిస్తున్నారు. KGF,  సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించగా, M ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్.


తారాగణం: నిఖిల్, సంయుక్త, నభా నటేష్


సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: భరత్ కృష్ణమాచారి

నిర్మాతలు: భువన్, శ్రీకర్

బ్యానర్: పిక్సెల్ స్టూడియోస్

సమర్పణ: ఠాగూర్ మధు

సంగీతం: రవి బస్రూర్

ప్రొడక్షన్ డిజైనర్: ఎం ప్రభాహరన్

కో-డైరెక్టర్: విజయ్ కామిశెట్టి

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: ఫస్ట్ షో

Bharani K Dharan is Turning as Director with Sivangi

 ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్ 'సివంగి' చిత్రంతో దర్శకుడిగా పరిచయమౌతున్న ప్రముఖ సినిమాటోగ్రఫర్ భరణి కే ధరన్ 



ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్, జాన్ విజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం సివంగి.  40 సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన భరణి కే ధరన్ ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్ పై నరేష్ బాబు పి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 


ఫిమేల్ సెంట్రిక్ కథతో రూపొందుతున్న అన్ని కమర్షియల్ హంగులతో పాటు కుటుంబం విలువలకు ప్రాధాన్యతనిచ్చే అంశాలు కీలకంగా ఉండబోతున్నాయి. ఓ మహిళా తన జీవితం లో ఎదురైన అనూహ్యమైన పరిస్థితులకు ఎలా ఎదురు నిలిచింది అన్నది కథాంశం. డొమెస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు భరణి తెలియజేశారు. 


ఈ చిత్రానికి AH.కాసిఫ్ - ఎబినేజర్ పాల్ సంగీతం అందిస్తున్నారు. దర్శకత్వంలో పాటు డీవోపీగా పని చేస్తునంరు భరణి కె ధరన్. సంజిత్ Mhd ఎడిటర్. 


ఈ చిత్రానికి సంబధించిన మరిన్ని  వివరాలు త్వరలోనే తెజయజేస్తారు మేకర్స్. 


నటీనటులు : ఆనంది - వరలక్ష్మి శరత్‌కుమార్ -జాన్ విజయ్ - డా.కోయ కిషోర్,

ప్రొడక్షన్ హౌస్: ఫస్ట్ కాపీ మూవీస్

నిర్మాత: నరేష్ బాబు.పి

రచన, దర్శకత్వం : భరణి కె ధరన్

సంగీతం : AH.కాసిఫ్ - ఎబినేజర్ పాల్

డీవోపీ: భరణి కె ధరన్

ఎడిటర్: సంజిత్ Mhd

ఆర్ట్ : రఘు కులకర్ణి

పీఆర్వో: తేజస్వి సజ్జా

Rajkummar Rao and Jyothika promote Srikanth - Aa Raha Hai Sabki Aankhein Kholne in Hyderabad along with Srikanth Bolla

 Rajkummar Rao and Jyothika promote Srikanth - Aa Raha Hai Sabki Aankhein Kholne in Hyderabad along with Srikanth Bolla



With only a week left for its release, Rajkummar Rao, Jyothika, and Srikanth Bolla continue to inspire the masses and touch as many hearts as they can. Recently, the trio was in Hyderabad where they had quite an engaging conversation with Srikanth Bolla in attendance.


As we all know, Srikanth - Aa Raha Hai Sabki Aankhein Kholne is the inspiring life story of the visually impaired industrialist Srikanth Bolla. During the Hyderabad promotions, Rajkummar and Jyothika joined the man himself for a chat with the members of FICCI where Rajkummar highlighted his thoughts on the film business and his ideology on entrepreneurship.


Present at this chat were many young businessmen and industrialists, who were not just impressed with Srikanth, but also with Rajkummar who essays the character in Srikanth - Aa Raha Hai Sabki Aankhein Kholne.


Gulshan Kumar and T-Series Presents a T-Series Films & Chalk N Cheese Films Production LLP, ‘Srikanth -  Aa Raha Hai Sabki Aankhein Kholne’ is directed by Tushar Hiranandani, is produced by Bhushan Kumar, Krishan Kumar & Nidhi Parmar Hiranandani. The film releases nationwide on the 10th of May 2024 on the occasion of Akshaya Tritiya.



20 Years For Sukumar and Arya

 Genius Director Sukumar's Career Turns 20: A Snapshot Of The Genius Filmmaker's Unrivalled Filmography



It was on 7 May 2004 that Telugu cinema gave birth to a new-age director who shattered conventions with his romantic-comedy 'Arya'. Director Sukumar burst forth on the scene with a new narrative sense and visual style. His debut film remade Icon star Allu Arjun, who became synonymous with style.


Sukumar's second film, 'Jagadam', was an action film with rare sensibilities. It presented energetic star Ram Pothineni as a mass hero. Sukumar demonstrated his ability to conceive mass moments without falling back on run-of-the-mill templates.


'Arya 2', once again, was a film that showed Sukumar as someone who can drive emotions mainly based on characterizations. The film featured excellent songs made special by his Midas Touch. Yuva samrat Naga Chaitanya’s 100% Love' was remarkable in terms of how a flawed male lead could have a terrific character arc.


Prince Mahesh Babu-starrer '1: Nenokkadine', with its slick action and unique emotional quotient, was compelling in many ways. Sukumar showed that you don't have to be conventional and play safe while doing a superstar movie. Like that film, Young tiger NTR stareer 'Nannaku Prematho', too, showcased Sukumar's penchant for intelligent screenplay-writing.


Global star Ramcharan’s ‘Rangasthalam' is considered one of the greatest classics from Telugu cinema. The Ram Charan-starrer remains worthy of repeat viewing, thanks to its all-round appeal.


And the 'Pushpa' films have solidified his position as one of the top-most directors in the country. 'Pushpa: The Rise' in 2021 was loved by the Hindi audience as well. 'Pushpa 2: The Rule', which will hit the screens on August 15 this year, is hugely awaited.


Sukumar is peerless when it comes to exploring the psyche of his protagonists and showing their struggles. His films are technically superior without fail. As one of the finest and top-tier filmmakers in the country, he attracts a great deal of respect for the intellectual writing and making he is known for.