Latest Post

Actress Samyuktha Launches 'Adishakti For Women's Empowerment

 మహిళా సాధికారత కోసం "ఆదిశక్తి" సేవా సంస్థను లాంఛ్ చేసిన హీరోయిన్ సంయుక్త




స్టార్ హీరోయిన్ సంయుక్త నిస్సహాయులైన మహిళలకు అండగా నిలబడేందుకు ముందుకొచ్చింది. సమాజంలో వారు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలకు తన వంతు పరిష్కారం సూచించేందుకు, సహాయం అందించేందుకు ఈ స్టార్ హీరోయిన్ అడుగు ముందుకు వేసింది. ఇవాళ శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఆదిశక్తి అనే సేవా సంస్థను అనౌన్స్ చేసింది. ఈ సంస్థ ద్వారా మహిళలకు అనేక రంగాల్లో సహకారం అందించబోతోంది.


మహిళలకు సమాన అవకాశాలు కల్పించి వారిని అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడపాలనే లక్ష్యంతో ఆదిశక్తి సంస్థను స్థాపించింది సంయుక్త. అన్ని వయసుల మహిళలకు ఈ సంస్థ చేయూతనివ్వనుంది. విద్య, ఉపాధి, శిక్షణ, ఆరోగ్యం వంటి విషయాల్లో మహిళలకు సపోర్ట్ గా నిలవనుంది ఆదిశక్తి సంస్థ. మహిళలు ఆత్మగౌరవంతో జీవించాలని, అన్ని రంగాల్లో తమ గొంతు వినిపించాలనేది ఆదిశక్తి సంస్థ ఉద్దేశమని సంయుక్త తెలిపింది.

Heroa Satyam Rajesh Interview About Tenant

ఈ సినిమా మనం చూస్తూ ఉండే కథ. సినిమా చూసిన ప్రతి ఒక్కరు అలాగే అంటారు - సత్యం రాజేష్ 



‘పొలిమేర-2’తో ఊహించని సక్సెస్ అందుకున్న సత్యం రాజేష్ హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మేఘా చౌదరి, చందన పయ్యావుల, ఎస్తర్‌ నోరోన్హా, భరత్‌ కాంత్‌ కీలక పాత్రలు పోషించారు. మహాతేజ క్రియేషన్స్ బ్యానర్‌పై మోగుళ్ల చంద్రశేఖర్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కొత్తగా పెళ్లైన జంట .. వేరు కాపురం .. అందమైన జీవితం. ఎన్నో ఆశలతో ఆ జంట కొత్తకాపురాన్ని మొదలుపెడుతుంది. ఆనందంగా .. అన్యోన్యంగా సాగిపోతున్న వారి జీవితంలోకి అతని వైపు నుంచి మరదలు .. ఆమె వైపు నుంచి ఒక ఫ్రెండ్ ఎంటరవుతారు. ఆ ఇద్దరితో పాటే ఈ దంపతుల మధ్య అపోహలు .. అపార్థాలు మొదలవుతాయి. అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? వాళ్ల జీవితం ఎలాంటి మలుపు తీసుకుంటుంది? అనేది కథ. ఒక వైపున క్రైమ్ .. మరోవైపున సస్పెన్స్ .. ఇంకోవైపున రొమాన్స్‌తో కూడిన ఈ సినిమాపై బజ్ పెరుగుతూ వచ్చింది. ఈ చిత్రానికి సాహిత్య సాగర్ అందించిన సంగీతం మరో ప్లస్ అయింది. సినిమా విడుదల దగ్గర పడడంతో జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది చిత్రయూనిట్. అందులో భాగంగా హీరో సత్యం రాజేష్ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఆ విశేషాలు...



టెనెంట్ ఎవరు? ఎవరు ఎవరింటికి వస్తున్నారు? ఏంటి ఈ సినిమా కథ?

ఇది ఎదురింట్లో లేదా పక్కింట్లో జరిగే కథ. భార్యభార్తల మధ్య వచ్చే ప్రాబ్లమ్స్ గురించి చూపించే కథ. ఒక అపార్ట్‌మెంట్‌లో జరిగే స్టోరీ. అన్నీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్‌లాగే ఉంటాయి. డైరెక్టర్ ఏం చెప్పారో అది పర్‌ఫెక్ట్‌గా తీశారు. ప్రతి సీన్ చాలా బాగుంటుంది. సినిమా థియేటర్‌లో చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని చెప్పేలా ఉంటుంది. ఆడియన్స్‌కు ఈ సినిమా బ్యూటిఫుల్ ఫీల్ ఇస్తుంది.


టెనెంట్‌కు ‘A’ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారు?

సినిమా ట్రైలర్‌లో మేడమీద నుంచి పడి చనిపోయే సీన్ ఉంది కదా.. అది సినిమాటిక్‌గా చూపిస్తే క్లీన్ సర్టిఫికెట్ వస్తుంది. కానీ రియాలిటీకి దగ్గరగా చూపిస్తేనే ఆడియన్స్‌కు ఒరిజినల్ ఫీల్ కలుగుతుంది. ఈ సీన్‌ను రియాలిటీకి దగ్గరగా చూపించడం వల్లే ‘A’ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమాలో చాలా లేయర్స్ ఉంటాయి.


మీరు ఇలాంటి సినిమాలనే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు?

నేను మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలనే సెలెక్ట్ చేసుకుంటున్నా. నాకు యాక్షన్, డ్యాన్స్‌లు, రొమాంటిక్, మాస్ ఎలిమెంట్స్, భారీ బడ్జెట్ లాంటి సినిమాలను ఎంచుకోను. నేను ఆర్టిస్ట్‌గా చేస్తూనే.. మంచి పాయింట్ ఉన్న సినిమాలు చేయాలనేది నా కోరిక. ఇప్పుడు ఎవరితోనే పోటీ పడాలనే కోరిక నాకు లేదు.


ట్రైలర్‌లో ఎడిటింగ్ కట్స్ చాలా బాగున్నాయి. సినిమాలో షార్ట్సే వాడారా? ట్రైలర్ కోసం సెపరేట్‌గా కట్ చేయించారా?

ఒక్క షాట్ కూడా ట్రైలర్ కోసం అని చేయలేదు. అన్నీ సినిమాలో షార్ట్సే వాడాము. డైరెక్టర్ యుగంధర్ గారు కథ చెప్పినప్పుడే నేను హ్యాపీ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నేను కథ వింటూనే ఉన్నా. ఇది భలే ఉందే అని ఫీలయిన కథ ఇది.


ఇది ఓటీటీ కోసం తీసిన కథ అని చెప్పారు. కానీ థియేటర్‌లో రిలీజ్ చేస్తున్నారు. ‘పొలిమేర-2’తో సక్సెస్ రావడం వల్ల థియేటర్‌లో రిలీజ్ చేస్తున్నారా?

కథ చాలా బాగుందని చిన్న సినిమాగా స్టార్ చేశాం. ఓటీటీ కోసమే అనుకుని చేస్తున్న క్రమంలో సినిమా అవుట్‌పుట్ చూసుకుంటే అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. అప్పుడు థియేటర్‌లో రిలీజ్ చేయాలని అనుకున్నాం. అందుకోసం ఇంకా ఇంప్రూవ్ చేశాం.


ఇలాంటి ఆఫ్ బీట్ సినిమాలకు రైటింగ్ చాలా ముఖ్యం.. ఈ సినిమా రైటింగ్‌లో ఉన్న మ్యాజిక్ ఏంటి?

ఈ సినిమా కథను వర్మ శ్రీనివాస్ గారు రాశారు. ఆయన రైటింగ్ చాలా నేచురల్‌గా ఉంది. ఇందులో ఓవర్ డైలాగ్స్ ఉండవు. సినిమాలో నేను మాట్లాడేదే చాలా తక్కువ ఉంటుంది. సినిమా మొత్తం ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంటుంది.


మీరు అన్నీ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తున్నారు కదా.. మీరు పర్టికులర్‌గా ఇలాంటివే సెలెక్ట్ చేసుకుంటున్నారా? లేక ఇలాంటి కథలే మీ దగ్గరికి వస్తున్నాయా?

నా దగ్గరకు వచ్చిన వాటిలో నేనే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేని సినిమాలు చేయడం వల్ల ఇండస్ట్రీలో పది కాలాలపాటు చల్లగా ఉంటాం. పోటీలో దిగి ఫైట్ చేసి ఓడిపోతే ఇంటికి వెళ్లిపోవాలి. మనం కుమ్మేస్తా.. కొట్టేస్తాం అని చెప్పే అలవాటు నాకు లేదు. నా జీవితం ఏంటో అందరూ చూసేశారు కదా. నాకు నప్పే సినిమాలనే నేను చేస్తా.


థ్రిల్లర్ సినిమాలకు మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్.. పొలిమేర-2లో కూడా మ్యూజిక్ బాగా హైలైట్ అయింది. ఈ సినిమాలో మ్యూజిక్ ఎలా ఉంటుంది?

ఈ సినిమాకు సాహిత్య సాగర్ సంగీతం అందించారు. ఈ సినిమాకు మ్యూజిక్కే ప్రాణం. క్లైమాక్స్‌లో డబ్బింగ్ చెప్తున్నప్పుడు నేనే అలా అలా పాజ్ అయ్యా. ఒక ఆడియన్‌లాగా నాకే కన్నీళ్లు వచ్చాయి. సినిమాలో మ్యూజిక్ ఫీల్ అంతగా ఉంటుంది. సాహిత్య సాగర్‌కు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి.


ఇకపై హీరోగానే చేస్తారా? ఆర్టిస్ట్‌గా కూడా కొనసాగుతారా?

నేను ఆర్టిస్టుగా చేస్తా.. ఆల్రెడీ కొన్ని సినిమాల్లో చేస్తున్నా. మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు వస్తే.. నాకు సూట్ అవుతాయనుకుంటేనే హీరోగా చేస్తా.


హీరో అంటే చాలామంది ఎలివేషన్స్ కోరుకుంటారు.. మీ సినిమాల్లో అలాంటివి లేవు. భవిష్యత్తులో ఏమైనా ఉంటాయా?

నాకు అలాంటి ఎలివేషన్స్ నచ్చవు. నేను మెయిన్ క్యారెక్టర్‌లో స్ట్రీట్ ఫైట్ అనే ఒక కామెడీ సినిమా చేస్తున్నా. అందులో ఎలివేషన్స్ ఉండవు కానీ.. కమర్షియల్ సినిమాలా ఉంటుంది.


మీ కెరీర్‌లో ‘క్షణం’ చెప్పుకోదగ్గ సినిమా కదా.. అలాంటి క్యారెక్టర్స్ మీ దగ్గరకు రాలేదా? వచ్చినా మీరు చేయలేదా?

క్షణం తర్వాత దగ్గర దగ్గర 50 సినిమాల్లో పోలీస్ రోల్స్ వచ్చాయి. కానీ మళ్లీ అలాంటి పాత్రలే చేస్తే బాగోదని చేయలేదు. కొన్ని పోలీస్ పాత్రలు కామెడీ చేసేలా ఉంటాయి. అలాంటివి చేయను. కొంచెం పవర్‌ఫుల్‌గా ఉంటే చేయొచ్చు. ప్రకాష్ రాజ్, రఘువరన్ లాంటి వాళ్లలాగా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలనేది నా కోరిక.


టెనెంట్‌లో ట్విస్ట్‌లు, సస్పెన్స్ ఎంతవరకూ ఉంటాయి?

ఈ సినిమాలో ట్విస్ట్‌లు ఉండవు కానీ.. సస్పెన్స్ ఉంటుంది. మర్డర్ మిస్టరీ కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. నా క్యారెక్టర్ చూసి ఆడియన్స్ సింపతీతో బయటకు వస్తారు.


నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు?

స్ట్రీట్ ఫైట్ అని నేను మెయిన్ లీడ్‌లో ఒక సినిమా చేస్తున్నా. మాస్ మహారాజా రవితేజ గారి మిస్టర్ బచ్చన్ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నా. ఇంకా కొన్ని చర్చల దశలో ఉన్నాయి.

 

Chitralayam Studios Production No 2 has Announced

 శ్రీరామ నవమి సంద‌ర్భంగాచిత్రాల‌యం స్టూడియోస్ ప్రొడ‌క్ష‌న్ నెం.2 అనౌన్స్‌మెంట్‌...  ‘జర్నీ టు అయోధ్య’ అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో మొదలు పెట్టిన నిర్మాత వేణు దోనేపూడి



 జగదభిరాముడు, సకల గుణధాముడు..ధర్మ రక్షకుడు, ఏకపత్నివ్రతుడైన అయోధ్య రామయ్యను స్మరిస్తూ అనంత కోటి భక్తజనం అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండగ శ్రీరామనవమి. ఈ ప‌ర్వ‌దినాన‌ ప్యాష‌నేట్ ప్రొడ్యూస‌ర్ వేణు దోనేపూడి త‌న చిత్రాల‌యం స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.2ను అనౌన్స్ చేశారు. ‘జర్నీ టు అయోధ్య’ అనేది వ‌ర్కింగ్ టైటిల్.  ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వి.ఎన్‌.ఆదిత్య క‌థ‌ను అందిస్తున్నారు.


రామాయ‌ణంపై, రామాయ‌ణంను ఆధారంగా చేసుకుని ఇప్ప‌టి వ‌ర‌కు చాలా సినిమాలు వ‌చ్చాయి. ఎంద‌రో గొప్ప గొప్ప న‌టీన‌టులు సీతా రాములుగా, రావ‌ణ‌, ల‌క్ష్మ‌ణ‌, ఆంజ‌నేయులుగా న‌టించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. ఇప్పుడు అదే బాట‌లో రామాయ‌ణంను తెర‌కెక్కించ‌టానికి నిర్మాత వేణు దోనేపూడి సిద్ధ‌మ‌య్యారు. వి.ఎన్‌.ఆదిత్య‌ నేతృత్వంలో ఒక‌ టీమ్ ఈ చిత్రానికి సంబంధించి అయోధ్య స‌హా ప‌లు చోట్ల‌ లోకేషన్స్ రెక్కీ నిర్వహిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.


ఒక యంగ్ డైరెక్ట‌ర్ దర్శకత్వంలో  తెర‌కెక్కించ‌బోతున్న ఈ సినిమాలో న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌న్నారు మేక‌ర్స్‌. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో,  భారీగా నిర్మించబోతున్న ఈ ప్యాన్ ఇండియా చిత్రానికి నిర్మాణ సారధ్యం తమ్మారెడ్డి భరద్వాజ.


ప్ర‌స్తుతం చిత్రాల‌యం స్టూడియోస్ బ్యాన‌ర్ పీపుల్ మీడియా బ్యాన‌ర్‌తో క‌లిసి గోపీచంద్‌, శ్రీనువైట్ల కాంబినేష‌న్‌లో ‘విశ్వం’ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే.


LINK - 




#90s web series Director Aditya Hasan's feature film titled "Teacher"

క‌ల‌ర్స్ స్వాతి ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతోన్న హిలేరియస్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘టీచర్’

90స్ టీమ్ నుంచి వ‌స్తోన్న మ‌రో న‌వ్వుల జ‌ల్లు



ఆద్యంతం కడుపుబ్బ నవ్వించే నవ్వుల జల్లుతో తెరకెక్కుతోంది టీచర్‌. తెలంగాణలోని అంకాపూర్‌ అనే గ్రామంలో ఉన్న ముగ్గురు డల్‌ స్టూడెంట్స్ కి సంబంధించిన కథతో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో టీచర్‌గా కలర్స్ స్వాతి నటిస్తున్నారు. అడ్డూఅదుపూ లేకుండా అల్లరి చేసే ముగ్గురు విద్యార్థులు టీచర్‌ని కలిసిన తర్వాత ఏం జరిగింది? వాళ్ల జీవితాలు ఎలా మారాయి? అనేది హృద్యంగా ఉంటుంది. సరదా సన్నివేశాలు, సంభాషణలు, అందమైన, అమాయకమైన ప్రేమ, భావోద్వేగాలతో కూడిన ప్రయాణం... ప్రేక్షకుల మనసులను టచ్‌ చేస్తుందనడంలో అసలు సందేహం లేదు.

ఇటీవల 90స్‌- ఎ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌ తో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న టీమ్‌ నుంచి వస్తోంది టీచర్‌. ఆదిత్య హసన్‌ ఈ సినిమాను డైరక్ట్ చేశారు. నవీన్‌ మేడారం నిర్మించారు. ఎంఎన్‌ఓపీ (మేడారం నవీన్‌ అఫిషియల్‌ ప్రొడక్షన్స్) సంస్థ నిర్మిస్తోన్న రెండో సినిమా ఇది.


నటీనటులు

స్వాతి రెడ్డి (కలర్స్ స్వాతి), నిఖిల్‌ దేవాదుల (బాహుబలి ఫేమ్‌), నిత్యశ్రీ (కేరాఫ్‌ కంచరపాళెం ఫేమ్‌), రాజేంద్ర గౌడ్‌, సిద్ధార్థ్‌ (90స్‌ ఫేమ్‌), హర్ష, పవన్‌ రమేష్‌, నరేందర్‌ నాగులూరి, సురేష్‌ తదితరులు


సాంకేతిక నిపుణులు

రచన - దర్శకత్వం: ఆదిత్య హసన్‌

కెమెరా: అజీమ్‌ మహమ్మద్‌

సంగీత దర్శకత్వం: సిద్ధార్థ్‌ సదాశివుని

ఎడిటర్‌: అరుణ్‌ తాచోత్‌

ఆర్ట్ డైరక్టర్‌: తిపోజి దివ్య

లిరిక్స్ : కందికొండ

కాస్ట్యూమ్‌ డిజైనర్‌: రేఖ బొగ్గారపు

లైన్‌ ప్రొడ్యూసర్‌: వినోద్‌ నాగుల

సహ నిర్మాతలు: శ్రావిన్‌, రాజశేఖర్‌ మేడారం

ప్రొడక్షన్‌: ఎంఎన్‌ఓపీ - అమోఘ ఆర్ట్స్ సహకారంతో...

పీఆర్‌ఓ : నాయుడు - ఫణి (బియాండ్‌ మీడియా)

సమర్పణ: రాజేశ్వర్‌ బొంపల్లి

నిర్మాత: నవీన్‌ మేడారం 

Maruthi Nagar Subramanyam's 2nd Single Madam Sir is Unveiled

అల్లు అర్జున్‌ సినిమాల్లో సీన్లు రీక్రియేట్‌ చేస్తూ 'మారుతి నగర్ సుబ్రమణ్యం'లో రొమాంటిక్ సాంగ్... 'మేడమ్ సార్ మేడమ్ అంతే'



రావు రమేష్ హీరోగా నటించిన సినిమా 'మారుతీ నగర్ సుబ్రమణ్యం'. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. రావు రమేష్ సరసన ఇంద్రజ నటించారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై సినిమా రూపొందుతోంది. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు. సినిమాలో రెండో పాట 'మేడమ్ సార్ మేడమ్ అంతే'ను ఇవాళ విడుదల చేశారు.

'మారుతి నగర్ సుబ్రమణ్యం' సినిమాలో రావు రమేష్ కుమారుడిగా అంకిత్ కొయ్య నటించారు. ఆయన ప్రేమించే అమ్మాయిగా రమ్య పసుపులేటి కనిపించనున్నారు. వాళ్లిద్దరి మీద 'మేడమ్ సార్ మేడమ్ అంతే' పాటను తెరకెక్కించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ అభిమానిగా అంకిత్ కొయ్య కనిపించనున్నారు. అందుకని, ఆయన అల్లు అర్జున్ సినిమాల్లో హీరోయిన్ ఇంట్రడక్షన్ సన్నివేశాలను ఊహించుకుంటూ తన ప్రేమ పాటను పాడుకున్నారు.

'తొలి తొలి సారి తొలిసారి

గుండె గంతులేస్తున్నదే!

ఏంటీ అల్లరి అంటే వినకుందే!

ఎందుకనో నువ్వు నచ్చేసి

వెంట వెంట పడుతున్నదే!

కన్ను తోడు రమ్మని పిలిచిందే!

నిన్ను చూడగానే ఒంటిలోన ఉక్కపోత

నువ్వు నవ్వగానే సంబరాలు ఎందుచేత

ఒక్క మాట చెప్పు ఇంటి ముందు వాలిపోతా

ఏదో మాయ చేశావటే

నిన్ను ఇడిసిపెట్టి నేను యాడికెళ్ళిపోతా

నక్సలైటు లాగ నేను నీకు లొంగిపోతా

ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ ఎప్పుడు లేదే

తనందం ఎంతటి గొప్పది అంటే

తలెత్తి చూడక తప్పదు అంతే

తలొంచి మొక్కిన తప్పేం కాదే

మేడమ్ సారు మేడమ్ అంతే' అంటూ సాగిందీ పాట.


'మేడమ్ సార్ మేడమ్ సార్'ను ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ పాడారు. ఇప్పటి వరకు ఆయన ఇంత హుషారైన పాటను పాడలేదని చెప్పాలి. కళ్యాణ్ నాయక్ అందించిన అద్భుతమైన బాణీని తన గాత్రంతో మరో స్థాయికి తీసుకు వెళ్లారు. భాస్కరభట్ల పాటను రాశారు.  


'మారుతీ నగర్ సుబ్రమణ్యం' దర్శక నిర్మాతలు మాట్లాడుతూ... ''టైటిల్ పాత్రలో రావు రమేష్ గారి లుక్, ఆల్రెడీ విడుదల చేసిన టైటిల్ సాంగ్ 'నేనే సుబ్రమణ్యం... మై నేమ్ ఈజ్ సుబ్రమణ్యం'కు సూపర్బ్ రెస్పాన్స్ లభించింది. భాస్కరభట్ల గారు తొలి పాటతో పాటు ఈ పాటకూ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఈ రోజు సన్నాఫ్ సుబ్రమణ్యంగా నటించిన అంకిత్ కొయ్య సాంగ్ విడుదల చేశాం. అతను పోషించిన పాత్రకు, అల్లు అర్జున్ గారికి సినిమాలో చిన్న కనెక్షన్ ఉంటుంది. అది ఏమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. 'జోహార్', 'తిమ్మరుసు', 'మజిలీ', 'శ్యామ్ సింగ రాయ్'తో పాటు మరికొన్ని సినిమాల్లో నటించిన అంకిత్ కొయ్య మంచి నటన కనబరిచారు. రమ్య పసుపులేటి ఈ జనరేషన్ ఇన్నోసెంట్ అమ్మాయి రోల్ చేశారు. వీళ్లిద్దరి మధ్య సన్నివేశాలు ప్రేక్షకుల్ని నవ్విస్తాయి, కవ్విస్తాయి. లిధా మ్యూజిక్‌ యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా మా సినిమాలో పాటల్ని విడుదల చేస్తున్నాం.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీ వెల్లడిస్తాం'' అని చెప్పారు.


రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సాహిత్యం: ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్, భాస్కరభట్ల, కళ్యాణ్ చక్రవర్తి, ఆర్ట్ డైరెక్షన్: సురేష్ భీమంగని, ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి, పీఆర్వో: పులగం చిన్నారాయణ, సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాల్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: శ్రీహరి ఉదయగిరి, క్రియేటివ్‌ హెడ్‌: గోపాల్‌ అడుసుమల్లి, సహ నిర్మాతలు: రుషి మర్ల, శివప్రసాద్ మర్ల, నిర్మాతలు: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: లక్ష్మణ్ కార్య. 

Chitravaahini and RYG Banners Announced TUK TUK Title For Their Film


"టుక్ టుక్" - చిత్రవాహిని మరియు ఆర్ వై జి బ్యానర్‌లచే ఆవిష్కరించబడిన సరి కొత్త టైటిల్



చిత్రవాహిని మరియు ఆర్ వై జి బ్యానర్‌లు తమ తాజా చలనచిత్రం టైటిల్ "టుక్ టుక్" టైటిల్ పోస్టర్ ని శ్రీ రామ నవమి సందర్భంగా విడుదల చేశారు. విచిత్రమైన ఆటో ఈ పోస్టర్ లో చాలా ఆకర్షణీయంగా ఉంది.


చూడడానికి ఏదో ఫాంటసీ చిత్రాన్ని తలపించేలా పోస్టర్ లుక్ ఉంది. సుప్రీత్ సి కృష్ణ దర్శకత్వం వహించిన, "టుక్ టుక్" ఒక ఆహ్లాదకరమైన సినిమాటిక్ అనుభూతిని అందిచేలా ఉంది, అసలు కథలో ఆ ఆటో పాత్ర ఏంటి అనేది ముందు ముందు యూనిట్ సభ్యులు ఇచ్చే అప్డేట్స్ లో చూసి తెలుసుకోవాలిసి ఉంది.

 

పోస్టర్ లో అంశాలని బట్టి ఈ కథ ఒక గ్రామం నేపథ్యంలో సెట్ చేయబడింది. అనేక ఫాంటసీ ఎలెమెంట్స్ కూడా ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాయి.  రాహుల్ రెడ్డి, లోక్కు సాయి వరుణ్ మరియు శ్రీరాములు రెడ్డి నిర్మించిన "టుక్ టుక్" క్రియేటివ్ తరహాలో ప్రేక్షకుల మనన్నలు పొందుతుంది. పోస్టర్ లో హీరో నో హీరోయిన్ ఓ కాకుండా ఈ ఆటో పెట్టడం వెనుక ఉన్న కథాంశం ఏంటి అనేది కూడా ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. దీనికి సంతు ఓంకార్ సంగీతం అందించారు మరియు హార్థిక్ శ్రీకుమార్ సినిమాటోగ్రఫీ అందించారు.


"టుక్ టుక్" ఒక ఉత్తేజకరమైన సినిమాటిక్ రైడ్‌గా ఎక్స్పీరియన్స్ చెయ్యడానికి ప్రేక్షకులు సిద్దంగా ఉన్నట్టు ఈ పోస్టర్ రెస్పాన్స్ బట్టి అర్ధమవుతుంది.


తారాగణం:

హర్ష రోషన్

కార్తికేయ దేవ్

స్టీవెన్ మధు

సాన్వీ మేఘన

నిహాల్ కోధాటి


సాంకేతిక నిపుణులు:

దర్శకుడు: సి.సుప్రీత్ కృష్ణ

సినిమాటోగ్రాఫర్: కార్తీక్ సాయికుమార్

సంగీతం: సంతు ఓంకార్

ఎడిటర్: అశ్వత్ శివకుమార్

నిర్మాతలు:

రాహుల్ రెడ్డి

లోక్కు శ్రీ వరుణ్

శ్రీరాముల రెడ్డి

సుప్రీత్ సి కృష్ణ

పి ఆర్ ఓ: ఏలూరు శ్రీను, మాడురి మధు

డిజిటల్ మీడియా : పిక్చర్ పిచ్

 

Osey Arundhati title Song creates a Stir Online

 నెటింట్లో 'ఒసేయ్ అరుంధతి' పాట హల్చల్



మోనికా చౌహాన్,  కమల్ కామరాజు, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్ ‘ఒసేయ్ అరుంధతి’. విక్రాంత్ కుమార్ దర్శకత్వంలో గూడూరు ప్రణయ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా టైటిల్ లిరికల్ సాంగ్ ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.


దర్శకుడు ఈ పాటను బాగా రాశారు...

ఈ చిత్రానికి సునీల్ క‌శ్య‌ప్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఒసేయ్ అరుంధతి పాటను చిత్ర దర్శకుడు విక్రాంత్ కుమార్ చాలా బాగా రాశారని ఆయన పేర్కొన్నారు. లిరిక్స్ క్యాచీగా ఉండటంతో చాలా మంచి మ్యూజిక్ ఇచ్చామన్నారు. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడారని తెలిపారు.


త్వరలో సినిమా రిలీజ్ తేదీని ప్రకటిస్తాం....

చిత్ర నిర్మాత గూడూరు ప్రణయ్ రెడ్డి మాట్లాడుతూ... ‘‘అంద‌రికీ శ్రీరామ‌న‌వమి శుభాకాంక్ష‌లు. ఈరోజు ఒసేయ్ అరుంధ‌తి అంటూ సాగే టైటిల్ ట్రాక్‌ను విడుద‌ల చేయ‌టం ఆనందంగా ఉంది. కమల్ కామరాజు, వెన్నెల కిషోర్, మోనికలతో ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్‌గా ‘ఒసేయ్ అరుంధతి’ సినిమాను నిర్మిస్తుండటం ఆనందంగా ఉంది. సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.


కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం

చిత్ర దర్శకుడు విక్రాంత్ కుమార్ మాట్లాడుతూ... ‘‘హైదరాబాద్‌లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఇల్లాలుఅరుంధతి పిల్లాడితో పాటు ఇంటి బాధ్యతలను చూసుకుంటూ ఉంటుంది. ఓసారి సత్యనారాయణ స్వామి వత్రం చేయాలని అనుకుంటుంది. అయితే అనుకోకుండా అరుంధతికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్య నుంచి తనని తాను కాపాడుకుంటూ ఇంటి పరువును ఎలా కాపాడుకుంటుందనేదే ‘ఒసేయ్ అరుంధతి’ సినిమా. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీ ప్రధానంగా సాగే చిత్రమిది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు.


నటీనటులు:


మోనికా చౌహాన్, కమల్ కామరాజు, వెన్నెల కిషోర్‌, పృథ్వీరాజ్, చిత్రం శ్రీను, అరియానా గ్లోరి, సునీతా మనోహర్, టార్జాన్ తదితరులు


సాంకేతిక వర్గం:


నిర్మాత- గూడూరు ప్రణయ్ రెడ్డి, దర్శకత్వం - విక్రాంత్ కుమార్, సినిమాటోగ్రఫీ - సాయి చైతన్య మాటేటి, మ్యూజిక్ - సునీల్ కశ్యప్, ఎడిటర్ - మార్తాండ్ కె.వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వెంకట్ మద్దిరాల, లైన్ ప్రొడ్యూసర్ - ఎన్.మురళీధర్ రావు, ప్రొడక్షన్ కంట్రోలర్ - వాసు, పి.ఆర్‌.ఒ:  వంశీ కాకా.

Sree Vishnu Lightbox Media Completed 60 percent Shoot

 శ్రీవిష్ణు హీరోగా లైట్ బాక్స్ మీడియా, పిక్చ‌ర్ ప‌ర్‌ఫెక్ట్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్స్‌పై హుస్సేన్ షా కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర‌వేగంగా రూపొందుతోన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌.. 60 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి



వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు రీసెంట్‌గా సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌, ఓం భీమ్ బుష్ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న త‌న త‌దుప‌రి చిత్రాన్ని ఈరోజు ప్ర‌క‌టించారు. హుస్సేన్ షా కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ తెర‌కెక్కుతోంది. లైట్ బాక్స్ మీడియా, పిక్చ‌ర్ ప‌ర్‌ఫెక్ట్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్స్‌పై సందీప్ గుణ్ణం, విన‌య్ చిల‌క‌పాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


‘సామజవరగమన’ చిత్రంలో శ్రీవిష్ణుకి జంట‌గా న‌టించిన రెబా జాన్ ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ ఎగ్జ‌యిటింగ్ థ్రిల్ల‌ర్ ఇప్ప‌టికే 60 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. మేక‌ర్స్ వీలైనంత త్వ‌ర‌గా సినిమాను పూర్తి చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో వీర్ ఆర్య‌న్‌, అయ్య‌ప్ప శ‌ర్మ‌, సుద‌ర్శ‌న్‌, ర‌చ్చ ర‌వి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు.


హీరో శ్రీవిష్ణు కెరీర్ ప్రారంభం నుంచి డిఫ‌రెంట్ జోన‌ర్ సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తూ వ‌స్తున్నారు. ఇప్పుడు లైట్ బాక్స్ మీడియా, పిక్చ‌ర్ ప‌ర్‌ఫెక్ట్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్స్‌పై హుస్సేన్ షా కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న సినిమా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌. ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో తెర‌కెక్కుతోంది. విద్యాసాగ‌ర్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. కాల భైర‌వ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా,మ‌నీషా ఎ.ద‌త్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాల‌ను వెల్ల‌డిస్తామ‌ని మేక‌ర్స్ తెలిపారు.

Versatile Actor Thiruveer next Movie Poster Unveiled

 శ్రీరామనవమి సందర్భంగా వెర్సటైల్ యాక్టర్ తిరువీర్, RES ఎంటర్టైన్మెంట్, స్టార్ పిక్చర్స్ ప్రొడక్షన్ నెం.1 పోస్టర్ రిలీజ్



డిఫరెంట్ కాన్సెప్ట్‌లను ఎంచుకుంటూ మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న తిరువీర్ నాలుగో ప్రాజెక్ట్ అప్డేట్ వచ్చింది. RES ఎంటర్టైన్మెంట్, స్టార్ పిక్చర్స్ బ్యానర్ల మీద రాధాకృష్ణ తేలు, రామకృష్ణ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ప్రొడక్షన్ నెంబర్ వన్‌ను శ్రీరామ నవమి సందర్భంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ఘంటా సతీష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో తిరువీర్‌కు జోడిగా మలయాళీ భామ కార్తీక మురళీధరన్ నటిస్తున్నారు.


బిల్లా, ముకుంద, బ్రహ్మోత్సవం వంటి చిత్రాలకు చీఫ్ అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన రామకృష్ణ రెడ్డి (ఆర్కే) ఈ మూవీతో నిర్మాతగా పరిచయం కానున్నారు. అర్దశతాబ్దం, లూట్ వంటి ప్రాజెక్టు‌లు నిర్మించిన రాధాకృష్ణ తేలు, ఆర్కేతో కలిసి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. శ్రీకాంత అడ్డాల వద్ద అసిస్టెంట్‌గా కొత్త బంగారు లోకం, ముకుంద, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రమ్మోత్సవం వంటి సినిమాలకు దర్శకుడు ఘంటా సతీష్ బాబు పని చేశారు. బట్టర్ ఫ్లై సినిమాతో దర్శకుడిగా మారి ఇప్పుడు ఈ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్దం అవుతున్నారు.


ఈ మూవీ మైథలాజికల్ కాన్సెప్ట్‌తో రాబోతోంది. త్రేతాయుగానికి, కలియుగానికి మధ్య ఈ కథ జరుగుతుంది. ఎంతో థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ మూవీలో అయ్యప్ప పి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్య ప్రకాష్, సమ్మెట గాంధీ, మీసాల లక్ష్మణ్, పంకజ్ కేసరి వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.


ఈ చిత్రానికి రామి రెడ్డి కెమెరామెన్‌గా, మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.


నటీనటులు  : తిరువీర్, కార్తీక మురళీధరన్, అయ్యప్ప పి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్య ప్రకాష్, సమ్మెట గాంధీ, మీసాల లక్ష్మణ్, పంకజ్ కేసరి తదితరులు


సాంకేతికబృందం

బ్యానర్ : RES ఎంటర్టైన్మెంట్, స్టార్ పిక్చర్స్

నిర్మాత : రాధాకృష్ణ తేలు, రామకృష్ణ రెడ్డి

దర్శకుడు : ఘంటా సతీష్ బాబు

కెమెరామెన్ : రామి రెడ్డి

ఎడిటర్ : మార్తాండ్ కే వెంకటేష్

పీఆర్వో  : వంశీ కాకా

Actress Samyuktha Debuting in Bollywood

Rising Star Samyuktha: From Tollywood Sensation to Bollywood Debutante



Samyuktha: Bridging the Gap Between Tollywood Success and Bollywood Debut


In the glitzy realm of Tollywood, one name has been shining brighter than ever – Samyuktha. With a string of consecutive successes under her belt, this talented actress has quickly ascended the ranks to become a household name synonymous with meaningful roles and stellar performances.


Since her debut in the industry, Samyuktha has captivated audiences with her versatility and charm. Her journey to stardom reached new heights with five consecutive super hit films: "Bheemla Nayak," "Bimbisara," "SIR," "Virupaksha," and "Devil." Each role showcased her depth as an actress and solidified her status as a rising star in Tollywood.


Currently, Samyuktha is gearing up for two highly anticipated projects. She is set to star opposite Nikhil in the Pan India movie *Swayambhu*, promising audiences an unforgettable cinematic experience. Additionally, she is slated to be the leading lady in Sharwanand's upcoming film, further solidifying her presence in the industry.


However, amidst her flourishing career in Telugu cinema, rumors have been swirling about Samyuktha's potential foray into Bollywood. Speculation is rife that she has received an enticing offer for an interesting project in Hindi cinema. Recently, photos of Samyuktha at the Hyderabad airport, bound for Mumbai, have sent social media into a frenzy, fueling further speculation about her Bollywood aspirations.


It seems that Samyuktha is on the brink of making a significant announcement regarding her Bollywood debut. As she sets her sights on new horizons, the actress is poised to conquer hearts on a national scale with her talent and dedication. With her sights set high, Samyuktha is ready to mesmerize audiences across the country with her enthralling performances.

Director V S Mukesh Interview About Market Mahalakshmi

 మార్కెట్ మహాలక్ష్మి పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్: దర్శకుడు విఎస్ ముఖేష్



బి2పి స్టూడియోస్ బ్యానర్ లో కేరింత మూవీ ఫెమ్ హీరో పార్వతీశం, నూతన పరిచయం హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం 'మార్కెట్ మహాలక్ష్మి'. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను వియస్ ముఖేష్ నిర్వహించారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. అఖిలేష్ కలారు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న థియేటర్ లో రిలీజ్ కానుంది. మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీ ఉండగా, ఈ క్రమంలో దర్శకుడు వియస్ ముఖేష్ మీడియాతో ముచ్చటించి సినిమా గురించి ఆసక్తికర విషయాలను తెలిపారు.


నా పేరు విఎస్ ముఖేష్. YouTube ప్లాట్ ఫామ్   ‌లో దాదాపు 100+ షార్ట్ ఫిలిమ్స్ చేశాను. అలా ఒకరోజు నేను అఖిలేష్‌ గారిని కలవడం "మార్కెట్ మహాలక్ష్మి" స్క్రిప్ట్‌ను నరేట్ చేయడం జరిగింది.


"మార్కెట్ మహాలక్ష్మి" స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. చాలా మంది తమ సినిమాలలో కొత్త పాయింట్ ని టచ్ చేశామని చెప్తుంటారు. అలానే మేము కూడా నిజాయితీగా, ఇప్పటి వరకు ఆడియన్స్ కి తెలియని ఒక కొత్త పాయింట్‌ను టచ్ చేసాము. ఆ మేజర్ పాయింట్ ని ప్రమోషన్ల కోసం ఉపయోగించుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే టీజర్, ట్రైలర్‌లో చూపించలేదు. ఆ కొత్త పాయింట్   అందర్నీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాము.


పార్వతీశం నాకు చాలా కాలంగా తెలుసు, అతను నాకు మంచి స్నేహితుడు. నేను పార్వతీశం & కొత్త నటిని ఎంచుకోవడానికి కారణం వాళ్ళు ఈ పాత్రలకి సరైన న్యాయం చేయగలరని నమ్మకమే. ఒక కొత్త దర్శకుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి ఆ తర్వాతే స్టార్స్ అవకాశాలు ఇస్తారు.


"మార్కెట్ మహాలక్ష్మి" పూర్తి లవ్ స్టోరీ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్. నిజ జీవితంలో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూరగాయలు అమ్మే అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. అది బేస్ చేసుకొని సినిమా కథ గా రాయడం జరిగింది.  రియల్ లవ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. 

వాస్తవికత కు దగ్గర గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. అల్లాగే, నేను మార్కెట్‌లో కొంతమంది వ్యక్తులను కూడా గమనించాను.


"మార్కెట్ మహాలక్ష్మి" బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు పాటలు అద్భుతంగా మరియు ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది. థియేటర్లలో ఒకసారి సినిమా చూస్తే, మీకు ఆ ఫీల్ కలుగుతుంది.


శ్రీముఖి మరియు పార్వతీశంతో ఒక ఇంటర్వ్యూలో, వైరల్ చెంప దెబ్బ సంఘటన వంటి వినూత్న ప్రమోషన్స్ సినిమాకి బజ్ ని పెంచాయి


మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. చాలా రిస్క్ చేసి ఈ సినిమా చేయడం జరిగింది. నా నమ్మకం నటీనటులపై కాదు, నా స్క్రిప్ట్‌పై, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నేను నమ్ముతున్నాను.


మార్కెట్ మహాలక్ష్మి సెన్సార్ పనులన్నీ పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి థియేటర్ లో ఈనెల 19న వచ్చేస్తుంది. ఈ సినిమా మొదటి నుంచే కథతో ప్రారంభమవ్వుతుంది అందుకే, సినిమాలో ఎక్కడ మీకు డ్రాగ్ అనిపించదు. కొంతమంది పరిశ్రమ వ్యక్తులకు కూడా మేము చిత్రాన్ని ప్రదర్శించాము. సినిమా విడుదలైన తర్వాత గర్వంగా తమ అభిప్రాయాలను పంచుకుంటారని ఆశిస్తున్నాను.


మా సినిమా లో 6 పాటలు, ఒక ఫైట్‌తో సహా మొత్తం షూటింగ్ భాగాన్ని 24 రోజుల్లో పూర్తి చేసాము. ముందు నుంచే ప్రీ-ప్రొడక్షన్ మీద కూర్చోవడం వళ్ళ త్వరగా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాతో నా పొటెన్షియల్ ఏంటో చూపించాలి అనుకున్నాను. అందుకే, చాలా జాగ్రత్త గా ప్లాన్ చేసి షూట్ చేసాము. 


పార్వతీశం మరియు ప్రణీకాఅన్విక ఇద్దరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. పార్వతీశంకి ఇది కమ్ బ్యాక్ సినిమా అవుతుందని భావిస్తున్నాను.


మాకు చాలా OTT ఆఫర్‌లు వచ్చాయి, కానీ మా టీమ్ థియేట్రికల్ రిలీజ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఆడియన్స్ ఆదరిస్తారనే భావంతో రిస్క్ తీసుకున్నాం.


మా సినిమా అందరికీ నచ్చుతుంది. థియేటర్లలో నా సినిమాను ఒక్కరు చూసినా, తప్పకుండా నచ్చుతుందని నమ్మకంతో చెప్పగలను.

50 Million Streaming Minutes For Gaami

 ZEE5లో విశ్వక్ సేన్ ‘గామి’ సెన్సేషన్.. 72 గంటల్లోపు 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్  క్రాస్ చేసిన చిత్రం



తెలుగువారికే కాదు అన్ని భాషల వారికి వైవిధ్యమైన కథలను అందించడంలో ముందు ఉంటుంది ఓటీటీ ప్లాట్ ఫామ్ ZEE5. తాజాగా ‘గామి’ చిత్రంతో ZEE5 ప్రేక్షకులను అలరిస్తోంది.  మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధానపాత్రలో నటించారు. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా, వైవిధ్యమైన కథాంశంతో ‘గామి’ సినిమా తెరకెక్కింది.  విధ్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ  మార్చి 8న థియేటర్స్‌లో విడుదలై సూపర్బ్ రెస్పాన్స్‌ను రాబట్టకుంది. ఈ సూపర్ హిట్ చిత్రాన్ని జీ 5 ఏప్రిల్ 12 నుంచి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. జీ 5లో గామి చిత్రానికి అపూర్వ ఆదరణ దక్కుతోంది. 72 గంటల్లోపే ఈ చిత్రం 50 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ రాబట్టుకోవటం విశేషం. 


హరిద్వార్‌లో ఉండే అఘోరా శంకర్ (విశ్వక్ సేన్) వింత సమస్యతో బాధపడుతుంటాడు. అందుకనే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లడు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా శంకర్ తనున్న ప్రదేశాన్ని వీడి తన సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కుంటూ కాశీకి వెళతాడు. అక్కడ తన సమస్యకు పరిష్కారం దొరికే చోటు హిమాలయాలు అని తెలుస్తుంది. అక్కడ 36 ఏళ్లకు అరుదుగా దొరికే మాలి పత్రాలు కోసం శంకర్ అన్వేషిస్తూ బయలుదేరుతాడు. అదే సమయంలో అతనికి డాక్టర్ జాహ్నవి పరిచయం అవుతుంది. ఈ ప్రయాణంలో శంకర్ మనసులో చిత్ర విచిత్రమైన ఆలోచనలు, కలలు వస్తుంటాయి. ఓ పల్లెటూరుల్లో ఉండే దేవదాసి ఉమ, ఓ ప్రయోగశాలలో చిక్కుకుని తప్పించుకోవాలనుకునే ఓ యువకుడు కనిపిస్తుంటారు. అసలు వాళ్లకు శంకర్‌కు ఉన్న సంబంధం ఏంటి? శంకర్ సమస్య ఏంటి? తన సమస్యకు శంకర్ పరిష్కారం కనుక్కున్నాడా? అనే విషయాలను దర్శకుడు తెరకెక్కించిన తీరు అభినందనీయం.


నరేశ్ కుమార్, స్వీకర్ అగస్తి సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్‌తో పాటు విశ్వనాథ్ రెడ్డి, ర్యాంపి నందిగాం సినిమాటోగ్రఫీ  సినిమాను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాయి. చక్కటి ఎమోషన్స్‌తో ఎప్పుడు ఏం జరుగుతుందా? అని ఆసక్తికరమైన కథనం, చక్కటి విజువల్స్ అన్ని ప్రేక్షకుడిని కట్టిపడేస్తున్నాయి ఇప్పుడు ఈ విజువల్, ఎమోషనల్ వండర్ జీ5 ద్వారా ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది. 


జీ5 గురించి:

జీ5 భార‌త‌దేశ‌పు యంగ‌స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్ల‌ర్‌గా ప్ర‌సిద్ధి పొందింది. మిలియ‌న్ల కొద్దీ అభిమానుల‌ను సంపాదించుకుంది. గ్లోబ‌ల్ కంటెంట్ ప‌వ‌ర్ హౌస్ జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎంట‌ర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్‌) నుంచి శాఖ‌గా మొద‌లైంది జీ5. అత్య‌ద్భుత‌మైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్ర‌రీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజిన‌ల్స్, 5 ల‌క్ష‌ల‌కు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాష‌ల్లో (హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ, మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ్‌, మ‌రాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజ‌రాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజిన‌ల్స్, ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీస్‌, టీవీ షోస్‌, మ్యూజిక్‌, కిడ్స్ షోస్‌, ఎడ్‌టెక్‌, సినీ ప్లేస్‌, న్యూస్‌, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్‌పార్మ్ కావ‌డంతో జీ5 12 భాష‌ల్లో అత్య‌ద్భుత‌మైన కంటెంట్‌ని ప్రేక్ష‌కుల‌కు అందించ‌గ‌లుగుతోంది.

Police Vaari Hecharika in Song Shooting

 పాటల  చిత్రీకరణలో

"" పోలీస్ వారి హెచ్చరిక ""



నల్లపూసలు ఫేం  " బాబ్జీ" 

దర్శకత్వం లో  తూలికా  తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై

బెల్లి జనార్థన్ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న

"" పోలీస్  వారి  హెచ్చరిక ""

చిత్రం శరవేగంగా టాకీ పార్ట్ ను

పూర్తి చేసుకొని  ప్రస్తుతం పాటల చిత్రీకరణను జరుపుకుంటుంది.....!


ఈ సందర్భంగా  దర్శకుడు బాబ్జీ చిత్రం ప్రోగ్రెస్ ను తెలుపుతూ  " అరకులోయ , కాఫీ వనం , ఆపిల్ రిసార్ట్స్ ,

వైజాగ్  యారాడా  బీచ్ , నకిరేకల్  లాండ్స్ , యస్ స్టూడియో మొదలైన  లొకేషన్ లలో యీ చిత్రం లోని పాటలను చిత్రీకరించమని ...."

తెలిపారు....!

గత రెండు దశాబ్దాలుగా  రెండు

తెలుగు రాష్ట్రాలలోని గాయనీ గాయకులతో  ఐదు లక్షల ప్రైవేట్  సాంగ్స్ ను  స్వరపరచి సంచలనం సృష్టించి , రెండు రాష్ట్రాలలోని ప్రైవేటు పాటల గాయనీ గాయకులకు , పాటల రచయితలకు అభిమాన పాత్రుడైన  సంగీత దర్శకుడు

" గజ్వేల్  వేణు" ను  యీ సినిమా ద్వారా వెండితెరకు 

పరిచయం చేస్తున్నామని ..."

దర్శకుడు బాబ్జీ తెలిపారు...!


చిత్ర నిర్మాత   బెల్లి జనార్థన్ 

మాట్లాడుతూ  " రెండు రోజులలో పాటల చిత్రీకరణ పూర్తి అవుతుందని , ఆ వెంటనే  నల్గొండ లో  క్లైమాక్స్

సన్నివేశాలను చిత్రీకరించడం తో  సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని " తెలిపారు....!


అఖిల్ సన్నీ , అజయ్ ఘోష్ , రవి కాలే , షియాజీ షిండే , శుభలేఖ సుధాకర్ , కాశీ విశ్వనాథ్ , సంజయ్ నాయర్, జబర్దస్త్ వినోద్ , జబర్దస్త్ పవన్ , 

హిమజ , జయ వాహిని , శంకరాభరణం తులసి, మేఘనా ఖుషి , రుచిత తదితరులు ఈ చిత్ర తారాగణం.....!


కెమెరా : నళినీ కాంత్ , సంగీతం : గజ్వేల్ వేణు ,

ఎడిటర్ : శివ శర్వాణి ,

పి ఆర్ ఓ .మధు వి .ఆర్

ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ : హను మంతరావు ,

నిర్మాణ నిర్వహణ : ఎన్. వై. సుబ్బరాయుడు ,

నిర్మాత : బెల్లి జనార్థన్ ,

రచన , దర్శకత్వం :  బాబ్జీ

Tremendous Response for Rathnam

 మాస్‌ను మెప్పించే విశాల్ ‘రత్నం’ ట్రైలర్.. యాక్షన్ సీక్వెన్స్‌తో ఊచకోత




మాస్, యాక్షన్ హీరో విశాల్ ప్రస్తుతం రత్నం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ చిత్రాన్ని నిర్మించారు. కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరించారు. యాక్షన్ డైరెక్టర్ హరి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. హరి దర్శకత్వంలో రాబోతుండటంతో  రత్నం మీద మంచి హైప్ ఏర్పడింది. ఈ మూవీని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్ మీద తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కే రాజ్ కుమార్ సంయుక్తంగా  ఏప్రిల్ 26న రిలీజ్ చేస్తున్నారు. 


ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో మంచి ఆధరణను దక్కించుకున్నాయి. ఇక తాజాగా రిలీజ్ చేసిన రత్నం ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.  రత్నం ట్రైలర్ చూస్తుంటే.. ఏపీ,తమిళనాడు బార్డర్ గొడవల ఆధారంగా ఈ కథ నడిచేలా ఉంది. ఇక హీరోయిన్ కోసం హీరో చేస్తున్న ఊచకోతను చూస్తుంటే మాస్ యాక్షన్ జానర్లను ఇష్టపడే ఆడియెన్స్‌కు పండుగలానే కనిపిస్తోంది. ఇక ఈ ట్రైలర్‌లో దేవీ శ్రీ ప్రసాద్ ఆర్ఆర్ అదిరిపోయింది. యాక్షన్, లవ్ సీన్లకు తగ్గట్టుగా మంచి ఆర్ఆర్ ఇచ్చారు.


కళ్యాణ్ సుబ్రహ్మణ్యం అలంకార్ పాండియన్ కో-ప్రోడ్యుసర్‌గా రాబోతోన్న ఈ మూవీకి ఎం సుకుమార్ కెమెరామెన్‌గా, టీ ఎస్ జై ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 26న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయబోతోన్న సంగతి తెలిసిందే.

Akshay Kumar Joins the shoot of Kannappa in Hyderabad

విష్ణు మంచు ‘కన్నప్ప’ షూట్‌లో అడుగు పెట్టిన బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్



డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘భక్త కన్నప్ప’లోకి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ జాయిన్ అయ్యారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహాభారత్ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు. మంచు విష్ణు ఈ సినిమాను భారీ ఎత్తున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో కన్నప్ప సినిమా రాబోతోంది. ఇప్పటికే న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో రెండు భారీ షెడ్యూల్స్‌ను కంప్లీట్ చేశారు.


ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైద్రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఆల్రెడీ ఈ చిత్రంలో మోహన్ లాల్, ప్రభాస్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీ షూటింగ్ సెట్‌లోకి బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ జాయిన్ అయ్యారు. ఈ మేరకు అక్షయ్ కుమార్‌కు మోహన్ బాబు, విష్ణు మంచు గ్రాండ్‌గా స్వాగతాన్ని పలికారు. ఇక ప్రస్తుతం అక్షయ్ కుమార్ మీద సీన్లను చిత్రీకరించనున్నారు. 


పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ చిత్రానికి రచయితలు. కన్నప్ప సినిమాను పాన్ ఇండియాగా అన్ని భాషల్లోనూ విడుదల చేయబోతోన్న సంగతి తెలిసిందే. కన్నప్ప కథను అందరికీ తెలియపర్చే విధంగా కామిక్ బుక్స్‌ని కూడా రిలీజ్ చేయగా.. వాటికి మంచి స్పందన వచ్చింది. 

Paarijatha Parvam Pre Release Event Held Grandly

అంగరంగ వైభవంగా 'పారిజాత పర్వం' ప్రీరిలీజ్ ఈవెంట్



చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో వనమాలి క్రియేషన్స్ బ్యానర్‌పై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మించిన హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’. ‘కిడ్నాప్ ఈజ్ ఎన్ ఆర్ట్’ అనేది ట్యాగ్ లైన్. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్, కిడ్నాప్ డ్రామా, ఫన్ ఇలా అన్ని ఎలిమెంట్స్‌‌ను మేళవించి రూపొందించిన ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రం హైదరాబాద్ దసపల్లా హోటల్‌ లో అంగరంగ వైభవంగా ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించింది. ‘పారిజాత పర్వం ప్రీ కిడ్నాప్ ఈవెంట్’ పేరుతో వెరైటీగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘పారిజాత పర్వం’ బిగ్ టికెట్‌ ను చీఫ్ గెస్ట్, స్టార్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారు లాంచ్ చేశారు.



ఈ కార్యక్రమంలో లిరిసిస్ట్ రాంబాబు గోసాల మాట్లాడుతూ..‘‘ఈ సినిమాలో నేను ‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా’ సాంగ్ రాశాను. ఇంత మంచి పాట నాతో రాయించినందుకు సంతోష్ కంభంపాటి గారికి, అలాగే అనంత్ సాయి గారికి థ్యాంక్యూ. ప్రొడక్షన్ విలువలు చాలా బాగున్నాయి. మ్యూజిక్ చాలా ట్రెండీగా ఉంది. ఈ సినిమా టీమ్ అందరికీ బిగ్గెస్ట్ హిట్ అవుతుందని నమ్ముతున్నా. ఈ నెల 19న అందరూ ఈ సినిమా చూడాలని కోరుతున్నా.’’


మ్యూజిక్ డైరెక్టర్ రి మాట్లాడుతూ..‘‘నాకు ఈ అవకాశం ఇచ్చిన సంతోష్ గారికి థ్యాంక్స్. ఈ సినిమాలో ఐదు పాటలున్నాయి. ఈ సినిమాలో శ్రద్ధా ఒక పాట పాడారు. ఫస్ట్ ఆమె పాడుతుందనగానే షాక్ అయ్యా. కానీ ఆమె చాలా బాగా పాడి సర్‌ప్రైజ్ చేశారు. మా నిర్మాతలకు థ్యాంక్యూ. ఇందులో హర్ష, సునీల్ గారి కామెడీ చాలా బాగా వచ్చింది. అందరూ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి’’.


ఆర్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ..‘‘కో ప్రొడ్యూసర్ అనంత్ గారి ఆధ్వర్యంలో, డైరెక్టర్ సంతోష్ గారి సూచనల మేరకు ఆర్ట్ వర్క్ చేశాను. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నా’’.


నటుడు గుండు సుదర్శన్ మాట్లాడుతూ..‘‘ఇక్కడ అందరి చేతుల్లో గన్నులు ఉన్నాయి.  అయితే కనిపించని గన్ ఒకటి ఉంది. దాని పేరు పెన్ను. అది మా డైరెక్టర్ సంతోష్ కంభంపాటిది. అందరికీ గన్స్ ఇచ్చారు. నేను అందులో ఒక బులెట్‌ని. సునీల్ గారు ఒక ఏకే47. శ్రద్ధాదాస్ గారు ఒక మిస్సైల్, వైవా హర్ష ఫుల్ ఆఫ్ ఫన్ బులెట్స్ నింపుకుని రెడీగా ఉన్నాడు. ఈ ఈవెంట్ కు ప్రీ కిడ్నాప్ ఈవెంట్ అని పేరు పెట్టడంలోనే డైరెక్టర్ క్రియేటివిటి ఏంటో అర్థం చేసుకోవచ్చు. నిర్మాతలకు ఇదొక అద్భుతమైన విజయాన్నివాలని కోరుకుంటూ అందరికి బెస్ట్ విషెస్’’.



ఎడిటర్ శశాంక్ ఉప్పుటూరి మాట్లాడుతూ..‘‘ముఖ్య అతిథిగా వచ్చిన విశ్వప్రసాద్ గారికి థ్యాంక్యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్, నిర్మాతలకు థ్యాంక్యూ. ఎడిటింగ్‌లో కొన్ని సీన్స్ కట్ చేయడానికి కూడా నాకు ఇబ్బంది కలిగింది. వైవా హర్ష రష్ చూసే నేను చాలా నవ్వుకున్నా. సినిమా చూసి మీరు చాలా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా’’.



డిస్ట్రిబ్యూటర్ విశ్వనాథ్ మాట్లాడుతూ..‘‘ఈ సినిమా నేను చూశాను. నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ సినిమాను మేము ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో రిలీజ్ చేస్తున్నాం. 125కు పైగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం’’.



సహ నిర్మాత అనంత్ సాయి మాట్లాడుతూ..‘‘ఈ సినిమా స్టార్ట్ అవడానికి కారణం శ్రద్ధాదాస్, సునీల్ గారు. వాళ్లిద్దరూ ఓకే చెప్పిన వెంటనే సినిమా మొదలు పెట్టాం. ఒక పది పదిహేను నిమిషాలు తప్ప సినిమా మొత్తం నవ్వుతూనే ఉంటారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది.’’



వైవా హర్ష మాట్లాడుతూ..‘‘ముఖ్య అతిథిగా వచ్చిన నిర్మాత విశ్వప్రసాద్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఇలాంటి వాళ్ల సపోర్ట్ ఎంతో ఎంకరేజ్‌‌మెంట్‌ గా ఉంటుంది. రెగ్యూలర్ సినిమాలు కాకుండా ఇలాంటి డిఫరెంట్ సినిమాలు రావాలంటే నిర్మాతలకు గట్స్ ఉండాలి. నేను చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశా. అన్ని రకాల ఏజ్ గ్రూప్ వాళ్లు బాగా నవ్వుకునే సినిమా ఇది. డైరెక్టర్ సంతోష్ గారు చాలా సెన్సిబుల్‌ గా ఈ సినిమాను తీశారు. ఏప్రిల్ 19న మంచి ఓపెనింగ్స్ వస్తాయని భావిస్తున్నా’’.



నిర్మాత మహీధర్ రెడ్డి మాట్లాడుతూ..‘‘చాలా ప్యాషనేట్‌ గా ఈ సినిమా చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఆర్టిస్టులందరూ చాలా బాగా చేశారు. డైరెక్టర్ సంతోష్ ప్రాణం పెట్టి చేశారు. 19న థియేటర్లలో ఈ సినిమా చూడండి. అందరూ ఎంజాయ్ చేస్తారు.’’


నిర్మాత దేవేష్ మాట్లాడుతూ...‘‘నేను నిర్మాతగా కాకుండా ఒక ఆడియన్‌ గా ఈ సినిమా చూశా. చాలా బాగా వచ్చింది. యాంకర్ సుమ గారిని కిడ్నాప్ చేశాక ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. అందరూ ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా.’’



డైరెక్టర్ సంతోష్ కంభంపాటి మాట్లాడుతూ..‘‘ఈ సినిమా గురించి చెప్పాలంటే.. ఏ సినిమా చేయాలన్నా నిర్మాతలు.. డైరెక్టర్, నటీనటులను నమ్మాలి. కానీ ఇలాంటి సినిమా చేయాలంటే ఇంకా ఎక్కువగా నమ్మాలి. ఎందుకంటే ఇది కన్ఫ్యూజ్ కిడ్నాప్ డ్రామా. దానికి ఒక చిన్న థిన్ లైన్ ఉంటుంది. ఆ లైన్ దాటితే ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. అలా అయితే ప్రాబ్లం అవుతుంది. అందుకే నా మీద నమ్మకం ఉంచిన నిర్మాతలకు హ్యాట్సాఫ్ చెప్తున్నా. నేను ఏ క్యారెక్టర్‌ కు ఎవరు కావాలని రాసుకున్నానో వాళ్లందరినీ ఇచ్చారు. మాలాంటి చిన్న సినిమాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నవాళ్లకు థ్యాంక్యూ. కీడాకోలాతో చైతన్యరావు నిరూపించుకున్నారు. మిగతావాళ్లంతా ఎంత ఫన్ చేస్తారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2 గంటల 10 నిమిషాల సినిమా ఇది. ఇందులో ఫస్ట్ 25 మినిట్స్ క్యారెక్టర్స్ గురించి చెప్పడానికి తీసుకున్నా. ఆ టైమ్ తప్ప మిగతా టైమ్ అంతా నవ్వుతూనే ఉంటారు. ఈ సినిమా బాగుంటే ప్రేక్షకులందరూ ఇంకో పదిమందికి చెప్పండి. బాగా లేకపోతే వద్దని చెప్పండి. ఈ నెల 19న థియేటర్లలో మా సినిమాను చూసి ఆదరించండి.’’


హీరోయిన్ శ్రద్ధాదాస్ మాట్లాడుతూ..‘‘కొంచెం గ్యాప్ తర్వాత నేను ఒక తెలుగు సినిమా చేశా. గ్లామర్ పరంగా కాకుండా నటనకు స్కోప్ ఉన్న సినిమా ఇది. ఇందులో నా క్యారెక్టర్ సినిమా మొత్తం ఉంటుంది. నా కోసం ఈ పాత్రను రాసిన డైరెక్టర్ సంతోష్ గారికి థ్యాంక్యూ. ఇందులో కొంచెం సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఇలాంటి నిర్మాతలు ఉంటే ప్రతి ఒక్కరికీ చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. సునీల్, హర్ష, చైతన్యతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. వాళ్ల కామెడీ టైమింగ్‌ ను మ్యాచ్ చేయడం చాలా కష్టం. కానీ నేను కొంచెం ట్రై చేశా. ఈ సినిమాను ఏప్రిల్ 19న అందరూ థియేటర్లలో చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నా’’.


చీఫ్ గెస్ట్ ప్రముఖ నిర్మాత, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారు మాట్లాడుతూ..‘‘నిర్మాత మహీధర్ నాకు 20 ఏళ్ల నుంచి ఫ్రెండ్. మేమిద్దరం సియాటెల్‌లో ఉండేవాళ్లం. మేము అక్కడ సినిమా చూడాలంటే వేరే ప్రాంతానికి వెళ్లి చూసేవాళ్లం. అయితే చిరంజీవి గారి స్టాలిన్ సినిమా నుంచి సియాటెల్‌లో మహీధర్ సినిమాలు రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. అంత ప్యాషన్ ఉన్న మహీధర్ కచ్చితంగా ఒక మంచి సినిమా తీశారని నమ్ముతున్నా. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఈ సినిమా పని చేసిన ప్రతి ఒక్కరికీ ఆల్ ది బెస్ట్’’.


హీరో చైతన్య రావు మాట్లాడుతూ..‘‘ఎక్కడో కరీంనగర్‌లో మధ్య తరగతి కుటుంబంలో పుట్టి మంచి పేరు తెచ్చుకుని మంచి సినిమా చేయాలనుకుని చేస్తున్నా. ఎప్పటికైనా నా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ కి సుమ గారు యాంకరింగ్ చేయాలని అనుకున్నా. ఈ రోజు చేశారు. ఇది పెద్ద సక్సెస్‌ గా భావిస్తున్నా. 300పై చిలుకు సినిమాలు చేసి 90శాతం సక్సెస్ రేట్ ఉన్న సుమ గారు మా సినిమా చేయడం మాకు గౌరవం. మా సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. నిర్మాతలు మహీధర్, దేవేష్ నిజంగా అద్భుతమైన నిర్మాతలు. ఎంతో బిజీగా ఉన్న ఆర్టిస్టులందరినీ తీసుకొచ్చి సినిమా చేయడం చాలా కష్టం. మా డైరెక్టర్ అక్కడే ఫస్ట్ సక్సెస్ అయ్యారు. ఈ సినిమాతో మన ఇండస్ట్రీకి ఇంకో మంచి డైరెక్టర్ రాబోతున్నాడు. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంది. టీమ్ అందరికీ థ్యాంక్యూ. ఇది చిన్న సినిమా కాదు.. కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్. ఏప్రిల్ 19న థియేటర్లలో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్‌తో చూడాల్సిన సినిమా ఇది. అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నా. అందరూ మా సినిమాను ప్రమోట్ చేయండి’’.



తారాగణం: సునీల్, శ్రద్ధా దాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్, గుండు సుదర్శన్ , జబర్దస్త్ అప్పారావు, టార్జాన్ , గడ్డం నవీన్, తోటపల్లి, మధు, జబర్దస్త్ రోహిణి


సాంకేతిక విభాగం :

రచన, దర్శకత్వం - సంతోష్ కంభంపాటి

ప్రొడక్షన్: వనమాలి క్రియేషన్స్

నిర్మాతలు : మహీధర్ రెడ్డి, దేవేష్  

సహ నిర్మాత -అనంత సాయి

డీవోపీ-బాల సరస్వతి

సంగీతం-రీ

ఎడిటర్- శశాంక్ వుప్పుటూరి

ఆర్ట్ డైరెక్టర్ - ఉపేందర్ రెడ్డి

డిజైనర్ - చిన్మయి కాకిలేటి

పబ్లిసిటీ డిజైనర్ - అనంత్ కంచెర్ల

సౌండ్ ఎఫెక్ట్స్- పురుషోత్తం రాజు

సాహిత్యం-రామజోగయ్య శాస్త్రి, కిట్టు విస్సాప్రగడ, సాయి కిరణ్, రాంబాబు గోసాల

పీఆర్వో -వంశీ శేఖర్

 

Bhavanam Movie Trailer Launched

సూపర్ గుడ్ ఫిల్మ్స్ సస్పెన్స్ థ్రిల్లర్ 'భవనమ్' ట్రైలర్, యాదమ్మ సాంగ్ విడుదలకు అనూహ్య స్పందన



హీరోలను స్టార్ హీరోలుగా చేసిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, అజయ్, మాళవిక సతీషన్, స్నేహ ఉల్లాల్ ప్రధాన పాత్రలలో బాలాచారి కూరెళ్ల దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ 'భవనమ్'. సూపర్ గుడ్ ఫిల్మ్స్ సమర్పణలో ఆర్ బి చౌదరి, వాకాడ అంజన్ కుమార్, వీరేంద్ర సీర్వి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలే 'భవనమ్' ఫస్ట్ లుక్, టీజర్ ని విడుదల చేయగా అనూహ్య స్పందన లభించింది.


తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను, జానపద పాటయైన యాదమ్మ.. సాంగ్ ను మంగళవారంనాడు ప్రసాద్ ల్యాబ్ లో విడుదలచేసి విలేకరులకు ప్రదర్శించారు. ఈ సాంగ్ జానపద బాణీలతో వుంటూ అలరించింది. ట్రైలర్  మరింత ఆకట్టుకుంది.


అనంతరం ఆర్.బి. చౌదరి మాట్లాడుతూ,మా బేనర్ లో ఇది 95 వ సినిమా. మలయాళంలో 96 వ సినిమా చేస్తున్నాం. అలాగే 97, 98 సినిమాలు కూడా షూటింగ్ జరుపుకుంటున్నాయి. త్వరలో  100 సినిమాలకు చేరుకోబోతున్నాం. దర్శకుడు బాలాచారి భవనమ్ సినిమాను చక్కగా తీశాడు. ఆల్ రెడీ సాంగ్స్ వెరీ గుడ్. సంగీత దర్శకుడు చరణ్  గొప్ప టాలెంట్ పర్సన్. ఇందులో పనిచేసిన అందరికీ మంచి విజయం రావాలని కోరుకుంటున్నానని అన్నారు.


సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ మాట్లాడుతూ, రామ్ చరణ్ రచ్చలో ..మిల్క్ మిల్క్ చిలక.. పాట చేశాను. అదే నన్ను బతికిస్తుంది. అదే సూపర్ గుడ్ బేనర్ లో మరో అవకాశం దక్కేలా చేసింది. నల్గొండ గద్దర్ నర్సన్న.. రేవంత రెడ్డి గారికి ఎలక్షన్ సమయంలో పాట పాడారు. ఆ పాట విన్న దర్శకుడు బాలాచారిగారు యాదమ్మ.. పాటను నర్సన్న తో పాడించారు. తనకు ఈ సినిమా నుంచి మంచి విజయాలు దక్కాలి.ఈ పాటటకు మంగ్లీ వాయిస్ చాలా ప్లస్ అయింది. ఇలా అందరి కాంబినేష న్ లో పనిచేయడం నాకూ చాలా ఆనందంగా వుంది. నిర్మాత అంజన్ కుమార్ సపోర్ట్ మర్చిపోలేను. నాకు గతంలో లారెన్స్ నన్ను ప్రోత్సహించారు. అందరికీ ఈ సినిమా మంచి గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు.


ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన విఎస్.ఆర్. మాట్లాడుతూ, సూపర్ గుడ్ అంటే గౌరవం. అదే సంస్థలో పనిచేయడం ఆనందంగా వుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అవకాశం ఇచ్చిన చౌదరిగారికి ఈ సినిమా పెద్ద హిట్ అయి, చరణ్ కు బ్రేక్ రావాలని కోరుకుంటున్నా అన్నారు.


నల్గొండ గద్దర్ నర్సన్న మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాజకీయ నేపథ్య పాటలు పాడినా త్రుప్తి లేదు. కానీ ఒక్క సినిమా చేయాలనే కోరిక ఇరవై ఏళ్ళుగా వుంది. స్నేహితుడు చరణ్ అర్జున్ ఏదోరోజు నీకూ వస్తుంది అని ప్రోత్సహించారు. భవనం లో   నా పాటకు డాన్స్ లు వేయడం మర్చిపోలేని అనుభూతి కలిగించింది. యాదమ్మ పాటలో జానపదబాణీలకు చరణ్ చక్కటి బాణీలు సమకూర్చారు. రచయితలు చక్కగా ప్రాసలతో రాశారు అన్నారు.


నటి స్నిగ్థ మాట్లాడుతూ, ఆర్.బి. చౌదరి గారి నిర్మాణ సంస్థలో చేయడం గొప్ప వరం.. ఈ మూవీ చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమాలో ఫైట్ మాస్టర్ రోప్ కట్టి నాతో కఠినమైన ఫైట్లు కూడా చేయించారు. అవి తెరపై బాగుంటాయి. పాటలు చాలా బాగున్నాయని అని అన్నారు.


ఆర్ట్ డైరెక్టర్ ఆంథోని మాట్లాడుతూ, ప్రేమలు సినిమా చేశాను హిట్ అయింది. ఇది కూడా కావాలని కోరుకుంటున్నానన్నారు.

 

కొరియో గ్రాఫర్ శ్యామ్ తెలుపుతూ, ఆర్.బి. చౌదరి బేనర్ లో చేయడం అద్రుష్టం. అదే సక్సెస్ అనుకుంటున్నాను. దర్శకుడు నమ్మి అవకాశం ఇచ్చారు. యాదమ్మ సాంగ్ లో షలకలశంకర్, సప్తగిరి. బిత్తిరి సత్తి.. స్నేహా ఉల్లాల్ బాగా నటించారు. సాంగ్ హిట్ కావాలి. ఈ సాంగ్ ను అందించిన నల్గొండ గద్దర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు.


బిత్తిరి సత్తి మాట్లాడుతూ, సూపర్ గుడ్ లోగో అనేది పెద్ద బ్రాండ్. గతంలోనే సినిమా చేయాలనుకున్న నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది. దర్శకుడు నా పాత్రను సరికొత్తగా క్రియేట్ చేశారు. ఇదంతా టీమ్ వర్క్. పాటల్లో సోల్ వుంది అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నానని తెలిపారు.


చిత్ర దర్శకుడు బాలాచారి మాట్లాడుతూ, సూపర్ గుడ్ బేనర్ లో ఇరవై ఏల్ళ నాడు విద్యార్థి చేశాను. మరోసారి చౌదరి గారు అవకాశం ఇచ్చారు. చరణ్ అర్జున్ సంగీతం ఈ సినిమా చాలా ప్లస్ అవుతుంది. విఎస్ ఆర్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కెమెరా పనితనంతో మరింత బాగా భవనమ్ సినిమా వచ్చింది అన్నారు.


షకలకల శంకర్ మాట్లాడుతూ, తనదైన శైలిలో మాట్లాడుతూ, దర్శకులు ఓ భవనాన్ని కట్టి మా చేత కూలీలుగా చేయించారు. గ్రుహ ప్రవేశం కోసం మేం వెయిట్ చేస్తున్నాం. నాకు సూపర్ గుడ్ అనే పేరు ఎంతో ఇష్టం. చిన్నతనంలో చదువుకన్నా థియేటర్లలో ఎక్కువగా వుండేవాడిని సూపర్ గుడ్ లోగో చూసి బొమ్మలు వేసేవాడిని. అలా అగ్రహీరోల బొమ్మలు కూడా వేశాను. ఇప్పుడు అటువంటి గొప్ప సంస్థలో నటించడం చాలా ఆనందంగా వుంది. హార్రర్ సినిమాలు తీసే వారు ఆశ్చర్యపరిచేలా మా దర్శకుడు సినిమాను తీశారు. ప్రేక్షకులకు గగుర్పాటును కలిగించడంతోపాటు కడుపుప్ప నవ్విస్తుంది అన్నారు.


అతిథి దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ, సూపర్ గుడ్ బేనర్ లో 95 వ సినిమాగా భవనమ్ రావడం ఆనందంగావుంది.  ఎవిఎం. సురేష్ సంస్థలా త్వరలో  100 సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను. ఈ బేనర్ లో వచ్చే సినిమాలలో ఆడియో చాలా బాగుంటుంది. అలా ఇందులో పాటలు చాలా బాగున్నాయి అని చెప్పారు.


 

Galla Yetthi From Nara Rohit Prathinidhi 2 is out now

నారా రోహిత్, మూర్తి దేవగుప్తా, వానరా ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్ 'ప్రతినిధి 2' నుండి మాస్ నంబర్ గల్లా యెత్తి విడుదల



నారా రోహిత్ హీరో గా ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకుడు గా పరిచయం అవుతున్న చిత్రం ప్రతినిధి 2 ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానుంది. వానరా ఎంటర్టైన్మెంట్స్ మరియు రానా ఆర్ట్స్ పతాకాలపై కుమార్ రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, మరియు సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మించిన ఈ చిత్రం టీజర్ మరియు  పబ్లిసిటీ మెటీరియల్ తో సినీ అభిమానులలో ఆసక్తిని సృష్టించింది.


ఈ చిత్రం నుండి మొదటి సింగిల్- గల్లా యెత్తిని విడుదల చేయడం ద్వారా చిత్ర యూనిట్ మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభించింది. ఈ మాస్ నంబర్ ను మహతి స్వర సాగర్ స్కోర్ చేశారు.

కాసర్ల శ్యామ్ సాహిత్యం సమాజంలో మంచి చెడుల గురించి ఆలోచింపజేసే లా ఉంది, రామ్ మిరియాల వాయిస్ మంత్రముగ్ధులను చేసింది. భాను మాస్టర్ కొరియోగ్రఫీ లో నారా రోహిత్ ఉత్సాహంగా కనిపిస్తూ డాన్స్ మూవ్స్ కూడా చాలా బాగా చేశారు. గల్లా యెత్తి పాట సినిమా ప్రమోషన్స్ కి సరైన ప్రారంభాన్ని ఇచ్చింది అని చెప్పొచ్చు


ప్రతినిధి 2 అనేది ప్రతినిధి సిరీస్ నుండి రెండవ ఫ్రాంచైజీ. నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ పాత్రలో నారా రోహిత్ నటించాడు. సిరీ లెల్లా కథానాయికగా నటిస్తుండగా, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్గుప్తా, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.


నాని చమిడిశెట్టి కెమరామెన్ కాగా యువ సంచలనం మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. రవితేజ గిరిజాల ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.


తారాగణం: నారా రోహిత్, సిరీ లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్గుప్తా, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ గోష్, అజయ్, ప్రవీణ్, పృధ్వీ రాజ్, రఘుబాబు, రఘు కారుమంచి


సాంకేతిక సిబ్బంది:

దర్శకుడు: మూర్తి దేవగుప్తపు

నిర్మాతలు: కుమార్ రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని

బ్యానర్లు: వానరా ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్

సంగీతం: మహతి స్వర సాగర్

ఎడిటర్: రవితేజ గిరిజాల

DOP: నాని చమిడిశెట్టి

కళ: కిరణ్ కుమార్ మన్నె

ఫైట్ మాస్టర్స్: శివరాజు & పృధ్వి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కార్తీక్ పుప్పాల

పబ్లిసిటీ డిజైన్స్: అనిల్ & భాను

PRO: వంశీ-శేఖర్

డిజిటల్: ప్రవీణ్ & హౌస్ఫుల్ డిజిటల్


Rudrakshapuram Releasing on April 26

 హీరోగా మణి సాయితేజను

మరిన్ని మెట్లు ఎక్కించే చిత్రం

ఆర్.కె. గాంధి "రుద్రాక్షపురం"

ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు



ఆర్.కె.గాంధి దర్శకత్వంలో మ్యాక్ వుడ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై  కొండ్రాసి ఉపేందర్ నిర్మించిన విభిన్న కథాచిత్రం "రుద్రాక్షపురం". "మెకానిక్" ఫేమ్ మణిసాయితేజ- వైడూర్య జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు నాగ మహేష్ కీలక పాత్ర పోషించగా... ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్స్ సురేష్ కొండేటి, బి.వీరబాబు, ధీరజ అప్పాజీ ముఖ్య పాత్రల్లో నటించారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ప్రి రిలీజ్ వేడుక హైద్రాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా జరిగింది. 


తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్, ప్రముఖ దర్శకనిర్మాత లయన్ సాయి వెంకట్, ప్రముఖ నటి - ఎన్నారై ప్రశాంతి హారతి, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ బాపిరాజు, గణేష్ భేరి, బోగాల సుధాకర్, మెకానిక్ దర్శకుడు ముని సహేకర్, ప్రముఖ దర్శకుడు శ్రీరాజ్ బల్లా ముఖ్య అతిథులుగా హాజరై  "రుద్రాక్షపురం" ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. "రుద్రాక్షపురం" చిత్రంతో హీరోగా మణిసాయితేజ మరిన్ని మెట్లు ఎక్కాలని అభిలషించారు.


రేఖా, రాజేశ్, అజయ్ రాహుల్, పవన్ వర్మ , శోభరాజ్, శ్రీవాణి, వెంకటేశ్వర్లు, అక్షర నీహా, ఆనంద్ మట్ట తదితరులు ఇతర పాత్రల్లో  నటించిన ఈ చిత్రానికి కథ - స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం ఆర్ కె గాంధీ, సంగీతం: ఎం.ఎల్. రాజా - ఘంటాడి కృష్ణ - జయసూర్య బొంపెం, స్టంట్స్: థ్రిల్లర్ మంజు- బాజి- స్టార్ మల్లి, కెమెరా: నాగేంద్ర కుమార్ ఎం, ఎడిటర్: డి.మల్లి, నృత్యం: కపిల్ అన్నారాజ్, పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ!!

Silk Saree Movie First Look and Teaser Launched

 వాసుదేవ్ హీరో  గా ‘ సిల్క్ శారీ  ’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ లాంచ్  ! 




చాహత్  బ్యానర్ పై కమలేష్ కుమార్  నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం సిల్క్ శారీ . ప్రముఖ హీరో గా వెబ్ సిరీస్ లో  మంచి గుర్తింపు తెచ్చుకొన్న వాసుదేవ్  రావు హీరో గా రీవా చౌదరి మరియు ప్రీతీ గోస్వామి హీరోయిన్స్ గా  టి . నాగేందర్  స్వీయ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రముఖ ప్రొడ్యూసర్ రాజకందుకూరి గారి చేతుల మీదుగా  ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ మేకర్స్ విడుదల చేశారు.


రాజ్  కందుకూరి గారు మాట్లాడుతూ, సినిమా    టైటిల్  సిల్క్ శారీ అద్భుతంగా   గ్రాండియర్‌  ఉందని ,   డైరెక్టర్  నుండి ఆశించిన అద్భుతమైన పనితనం కనిపించింది .  టీజర్ మరియు ఫస్ట్ లుక్ చాల బాగున్నాయి అని .. ప్రొడ్యూసర్ గారికి మరియు డైరెక్టర్ గారికి పేరుతో పాటు మనీ కూడా రావాలి అని ఆశిస్తున్నాను . ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా ఈ సిల్క్ శారీ పై  నమ్మకాన్ని  చేశాడు.


హీరోగా నటిస్తున్న వాసుదేవ్ రావు  మాట్లాడుతూ  మా డైరెక్టర్ నాగేందర్ ఒక  మంచి సబ్జెక్టు తో ఈ సినిమా ని తెరకెక్కించారు.  ప్రొడ్యూసర్ గారు ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా మంచి చిత్రాన్ని నిర్మించారు . టైటిల్ రిలీజ్ చేసినందుకు రాజుకందుకూరి గారికి థాంక్స్ చెప్పుకుంటున్నాను . 

బలమైన కథ, దానికి తగ్గట్టుగానే డ్రామా  సన్నివేశాలను అద్భుతంగా రాసుకొని  ఓ ఆసక్తికరమైన సంఘటన చుట్టూ "సిల్క్ శారీ " చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం కచ్చితంగ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని,   మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.


నటీనటులు: వాసుదేవ్ రావు , రీవా చౌదరి , ప్రీతీ గోస్వామి , ఓంకార్ నాథ్ శ్రీశైలం , కోటేష్ మానవ    తదితరులు.

డైరెక్టర్ :టి . నాగేందర్ 

నిర్మాతలు : కమలేష్ కుమార్ , రాహుల్ అగర్వాల్ హరీష్  చండక్ 

బ్యానర్: చాహత్ ప్రొడక్షన్స్ 

సంగీత దర్శకుడు: వరికుప్పల యాదగిరి 

కెమెరా : సనక రాజశేఖర్ 

పీఆర్ఓ: శ్రీపాల్ చొల్లేటి