Home » » FNCC Farmer President Dr. K. L. Narayana and Director B. Gopal presented the prizes to the winners of FNCC 12th All India Open Bridge Tournament

FNCC Farmer President Dr. K. L. Narayana and Director B. Gopal presented the prizes to the winners of FNCC 12th All India Open Bridge Tournament

 ఎఫ్ ఎన్ సి సి 12వ ఆల్ ఇండియా ఓపెన్ బ్రిడ్జ్ టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచిన వారికి ఎఫ్ ఎన్ సి సి ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ కే. ఎల్. నారాయణ గారు మరియు డైరెక్టర్ బి. గోపాల్ గారు చేతుల మీదగా బహుమతులు అందించే కార్యక్రమం ఘనంగా జరిగింది



ఎఫ్ ఎన్ సి సి పన్నెండవ ఆల్ ఇండియా ఓపెన్ బ్రిడ్జ్ టోర్నమెంట్ 9/3/2024 ప్రారంభమై 11/3/2024 న ముగిసినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎఫ్ ఎన్ సి సి ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ కే. ఎల్. నారాయణ గారు, డైరెక్టర్ బి. గోపాల్ గారు పాల్గొన్నారు. అలానే ఎఫ్ ఎన్ సి సి సెక్రటరీ ముళ్ళపూడి మోహన్ గారు, జాయింట్ సెక్రెటరీ పెద్ది రాజు గారు, ట్రెజరర్ బి. రాజశేఖర్ రెడ్డి గారు, కమిటీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ గారు, జె బాలరాజు గారు, శైలజా జుజల గారు, ఏడిద రాజా గారు, సామా ఇంద్రపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు. టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన నెస్ట్ ఇన్ టీం చెన్నై గ్రూప్, నవయుగ ట్రోఫీ మరియు క్యాష్ ప్రైస్ ని గెలుచుకున్నారు. ఈ టోర్నమెంట్ లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ కి మెయిన్స్ స్పాన్సర్ గా నవయుగ ఇంజనీరింగ్ వారు వ్యవహరించారు.


Share this article :