మంచు విష్ణు - హన్సిక హీరో హీరోయిన్లు గా 'దొరకడు' చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. 24 ఫ్రేమ్స్ బ్యానర్ పై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తోన్నఈ సినిమా, ప్రస్తుతం తిరుపతిలో షూటింగ్ జరుపుకుంటోంది.హీరో హీరొయిన్ సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. విష్ణు వ్యక్తిగత కారణాల వలన ఆలస్యమైన ఈ సినిమా షూటింగ్ తిరిగి వేగాన్ని పుంజుకుంది. ఈ సినిమాకి జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆయన 'సీమ టపాకాయ్' ... 'సీమశాస్త్రి' ... 'కాస్కో' వంటి చిత్రాలను తెరకెక్కించారు. అందువల్ల ఈ సినిమాలో అటు యాక్షన్ ... ఇటు కామెడి చక్కగా పండుతాయని అభిమానులు ఆశిస్తున్నారు. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా ప్రచారానికి దూరంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక డీ సినిమా తరువాత వరుస ఫ్లాపులతో ఉన్న విష్ణుకి ఈ సినిమా ఎంత వరకూ హెల్ప్ అవుతుందో చూడాలి ఈ సినిమా విష్ణు కి హిట్ ఇవ్వాలి అని కోరుకుందాం .
Post a Comment