ఇటీవల వచ్చిన 'బిజినెస్ మేన్' సినిమా ద్వారా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన మహేష్ బాబు, కాజల్ జంట మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక్క చిత్రంతోనే హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట తాజాగా మరో భారీ చిత్రంలో నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మించే చిత్రంలో మహేష్ పక్కన కథానాయికగా తాజాగా కాజల్ అగర్వాల్ ఎంపికైంది. వచ్చే నెలాఖరులో ఈ చిత్రం షూటింగు ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మొదట్లో ఈ చిత్రంలో తమన్నాను కథానాయికగా ఎంచుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే, డేట్స్ సమస్య వల్ల ఆమె ప్రాజక్టు నుంచి తప్పుకుంది. ఆ తర్వాత మరి కొన్ని పేర్లు పరిశీలించినప్పటికీ, చివరికి కాజల్ కే ఆ అవకాశం దక్కింది!
ఇటీవల వచ్చిన 'బిజినెస్ మేన్' సినిమా ద్వారా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన మహేష్ బాబు, కాజల్ జంట మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక్క చిత్రంతోనే హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట తాజాగా మరో భారీ చిత్రంలో నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మించే చిత్రంలో మహేష్ పక్కన కథానాయికగా తాజాగా కాజల్ అగర్వాల్ ఎంపికైంది. వచ్చే నెలాఖరులో ఈ చిత్రం షూటింగు ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మొదట్లో ఈ చిత్రంలో తమన్నాను కథానాయికగా ఎంచుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే, డేట్స్ సమస్య వల్ల ఆమె ప్రాజక్టు నుంచి తప్పుకుంది. ఆ తర్వాత మరి కొన్ని పేర్లు పరిశీలించినప్పటికీ, చివరికి కాజల్ కే ఆ అవకాశం దక్కింది!
Post a Comment