Home » » Grandhalayam Trailer Going Viral

Grandhalayam Trailer Going Viral

 డిస్టుబ్యూటర్స్ వాట్సాప్ లలో గ్రంథాలయం ట్రైలర్ వైరల్



వైష్ణవి శ్రీ క్రియేషన్స్‌ పతాకం పై విన్ను మద్దిపాటి, స్మిరితరాణిబోర, కాలికేయ ప్రభాకర్‌, కాశీవిశ్వనాథ్‌, డా.భద్రం, సోనియాచదరి నటీనటులుగా సాయిశివన్‌ జంపాన దర్శకత్వంలో ఎస్‌. వైష్ణవి శ్రీ నిర్మిస్తున్న కమర్షియల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ "గ్రంథాలయం". అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 3 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా  చిత్రం ట్రైలర్ ను ప్రసాద్ ల్యాబ్ లో రీసెంట్ గా విడుదల చేశారు.


ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఆద్యంతం వరకు సినిమాపై మంచి ఆసక్తిని రేకెత్తించేలా ట్రైలర్ ను కట్ చేసారు.

"మర్చిపోలేని జ్ఞాపకాలను గుర్తుచేసుకుని మళ్ళీ మళ్ళీ మాట్లాడుకునే కథ కాదు నాది" లాంటి డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఫైట్స్ సీక్వెన్స్ కూడా ఆకట్టుకునేలా ఉండబోతుంది అని ట్రైలర్ లో అర్ధమవుతుంది.


ప్రస్తుతం గ్రంథాలయం చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఈ ట్రైలర్ డిస్టుబ్యూటర్స్ వాట్సాప్ లలో వైరల్ గా మారింది. ట్రేడు వర్గాల్లో కూడా ఈ సినిమాకి మంచి బిజినెస్ జరుగుతుంది.అన్ని పనులని పూర్తిచేసుకున్న ఈ చిత్రం మార్చ్ 3న రిలీజ్ కి సిద్దమవుతుంది.


నటీనటులుః

విన్నుమద్దిపాటి, స్మిరితరాణిబోర, కాలకేయప్రభాకర్‌, సోనియాచౌదరి, అలోక్‌జైన్‌, జ్యోతిరానా, కాశీశినాథ్‌, డా.భద్రం, మేకరామకృష్ణ, పార్వతి, శివ, శ్రావణి, మురళీకృష్ణ, నవ్యశారద, నరేంద్రనాయుడు. స్నేహగప్త తదితరులు


సాంకేతిక నిపుణులు

బ్యానర్ ::వైష్ణవి శ్రీ క్రియేషన్స్‌

ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ః) : అల్లంనేని అయ్యప్ప,

రచన దర్శకత్వం : సాశివన్‌జంపాన.

సినిమాటోగ్రఫీ : సామలభాస్కర్‌,

సంగీతం : వర్ధన్‌,

ఎడిటర్‌ : శేఖర్‌పసుపులేటి,

బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ఃల్ : చిన్నా,

ఆర్ట్‌డైరెక్టర్‌ : రవికుమార్‌ మండ్రు,

పి. ఆర్. ఓ : దీరజ్, ప్రసాద్



Share this article :