Home » » Vaarasudu Team in Vizag Success Tour

Vaarasudu Team in Vizag Success Tour

 వారసుడు విజయంతో పాటు గౌరవాన్ని తీసుకొచ్చింది : వారసుడు సక్సెస్ టూర్(వైజాగ్) ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్  



దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ల హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వారసుడు సంక్రాంతి కానుకగా విడుదలైన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. విజయ్ సరసన రష్మిక మందన్న కథానాయిక నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జనవరి 14న తెలుగులో విడుదలైన ఈ చిత్రం ఎక్స్ ట్రార్డినరీ కలెక్షన్స్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ టూర్ ని నిర్వహించింది. సక్సెస్ టూర్ లో భాగంగా వైజాగ్ లో పర్యటించిన చిత్ర యూనిట్ అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించింది.


వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. విజయంతో పాటు గౌరవం రావాలనేది నా, దిల్ రాజు గారి ప్రయత్నం. ఊపిరి, మహర్షి అలా చేసిన చిత్రాలే. ఇప్పుడు వారసుడుతో మరోసారి మా ప్రయత్నం విజయం సాధించింది. సక్సెస్ తో పాటు గౌరవాన్ని తీసుకొచ్చింది వారసుడు. సినిమా చూసిన ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ ని ఏ రూపంలోనూ బెరీజ వేయలేం. ఈ అనుభూతి జీవితంలో మర్చిపోలేం. ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. దిల్ రాజు గారు డబ్బు కంటే మార్యద కోరుకునే నిర్మాత. సినిమా ఇంత గొప్ప ఉందనే ప్రసంశ వస్తుందంటే.. దీనికి కారణం దిల్ రాజు గారు. ఎక్కడా రాజీ పడకుండా సినిమాని నిర్మించారు. విజయ్ గారు బిగ్గెస్ట్ స్టార్. ఆయన ఇమేజ్ కి సరిపడేలా ఈ కథని చేయడం ఒక సవాల్. మా టీం ఎంతో హార్డ్ వర్క్ చేసింది. తమన్ మ్యూజిక్ ఈ సినిమా సోల్. ఇంత నమ్మకం మాపై పెట్టిన విజయ్ గారికి కృతజ్ఞతలు. తమిళ్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. అందరూ ప్రేమతో ఈ సినిమా చేశారు. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు’’ తెలిపారు 


నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఎప్పుడూ గెలిచేది మంచి కథ. వంశీ అనుకున్న మంచి కథకు విజయ్ గారు తోడయ్యారు. దీంతో ఒక మంచి సినిమా ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోయింది. అందుకే ఇంత గొప్ప రెవెన్యు, అప్రిషియేషన్ వస్తోంది. సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాలు అద్భుతంగా ఆడటం ఇండస్ట్రీకి మంచి పరిణామం’’ అన్నారు 


కిక్ శ్యామ్ మాట్లాడుతూ.. వారిసు తమిళ్ లో బిగ్ బ్లాక్ బస్టర్ అయింది. తెలుగు వారసుడు కూడా అంతే పెద్ద విజయం సాధించింది. దిల్ రాజు గారి లాంటి ప్యాషనేట్ నిర్మాతతో పని చేయడం చాలా ఆనందంగా వుంది. ఎక్కడా రాజీపడకుండా తీశారు. వంశీ లాంటి డెడికేషన్ వున్న దర్శకుడితో పని చేయడం గొప్ప అనుభవం. ఆయన చాలా నిజాయితీ వున్న వ్యక్తి. ఆయన నుండి చాలా నేర్చుకున్నాను. తమన్ ఈ చిత్రానికి బ్యాక్ బోన్. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. విజయ్ గారు బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఆయనతో పని చేయడం గొప్ప అనుభూతిని ఇచ్చింది.నటన పట్ల చాలా అంకితభావం వున్న వ్యక్తి ఆయన. ఈ సినిమాని ఇంత విజయం చేసిన ప్రేక్షకులు కృతజ్ఞతలు. 


సంగీత మాట్లాడుతూ.. వారసుడు చిత్రాన్ని ఇంత పెద్ద విజయాన్ని చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. వంశీ గారు, దిల్ రాజు గారి లాంటి ఫిల్మ్ మేకర్స్ తో పని చేయడం చాలా అనందంగా వుంది. విజయ్ గారు, శరత్ కుమార్ గారు, జయసుధ గారు లాంటి లెజెండరీ నటులతో పని చేసే అవకాశం రావడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన వంశీ గారికి, దిల్ రాజు గారికి మరోసారి కృతజ్ఞతలు’’ తెలిపారు 


తమన్ మాట్లాడుతూ.. వారసుడు కోసం ఒక ఏడాది పాటు ప్రయాణించాం. బ్యూటీఫుల్ జర్నీ. దర్శకుడు వంశీ తో బృందావనం తర్వాత చేసిన సినిమా ఇది. దిల్ రాజు గారు, వంశీ గారికి కృతజ్ఞతలు. వారసుడు కోసం వంద శాతం కష్టపడ్డాం. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. వారసుడిని తెలుగు గొప్పగా ఆదరిస్తున్నారు. విజయ్ గారిని తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. పాటలు, నేపధ్య సంగీతానికి మంచి పేరు రావడం ఆనందంగా వుంది. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ తెలిపారు



Share this article :