Home » » Vishal Laatti Pre Release Event Held Grandly in Tirupati

Vishal Laatti Pre Release Event Held Grandly in Tirupati

 విశాల్ 'లాఠీ' పందెంకోడిలా ఆడుతుంది.. ఇది గ్యారెంటీ హిట్: ‘లాఠీ’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో అగ్ర హీరో మంచు మోహన్ బాబు



యాక్షన్ హీరో విశాల్ కథానాయకుడిగా ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్‌పై రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘లాఠీ’. సునైనా కథానాయికగా నటిస్తోంది. రమణ, నంద సంయుక్తగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన యాక్షన్‌తో కూడిన ‘లాఠీ’ టీజర్, ట్రైలర్‌ కు ట్రెమండస్ రెస్పాన్ వచ్చింది. డిసెంబర్ 22న 'లాఠీ' అన్ని భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ తిరుపతి ఎస్డీహెచ్ఆర్ జూనియర్ కాలేజ్ లో గ్రాండ్ గా జరిగింది. అగ్ర హీరో మంచు మోహన్ బాబు ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.


ప్రీరిలీజ్ ఈవెంట్ లో మోహన్ బాబు మాట్లాడుతూ.. ''నేను గత ఏడేళ్ళుగా బయట సినిమా వేడుకలకు వెళ్ళడం లేదు. ఏడేళ్ళ తర్వాత ఇప్పుడు విశాల్ 'లాఠీ' వేడుకకు వచ్చాను.'' తిరుపతిలో వేడుక వుంది. మీరు రావాలి'' అని విశాల్ ఫోన్ చేసి చాలా చనువుగా పిలిచాడు. నేనూ వస్తానని చెప్పాను. మా కుటుంబాల మధ్య ఆ అనుబంధం వుంది. విశాల్ నాన్న గారు నాతో 'యం. ధర్మరాజు ఎం.ఎ' లాంటి అద్భుతమైన సినిమా తీశారు. ఆయన నా నిర్మాత. ఈ సందర్భంగా విశాల్ తల్లితండ్రులకు నమస్కారం తెలియజేస్తున్నాను. విశాల్ 'పందెంకోడి' చూశాను. ఎక్స్ టార్డినరీ ఫెర్ఫార్మెన్స్. విశాల్ చేసిన సినిమాలన్నీ బావుంటాయి. అన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు 'లాఠీ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పోలీస్ అనే పదాన్ని గౌరవిస్తాను. అందులో కానిస్టేబుల్ నుండి వచ్చిన వారంటే మరింత గౌరవం. ఇలాంటి ఒక గొప్ప కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విశాల్. భగవంతుని ఆశీస్సులతో 'లాఠీ' పందెంకోడిలా ఆడుతుంది. ఇది గ్యారెంటీ హిట్..హిట్..హిట్. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతుంది. అందరూ థియేటర్ లో చూడండి. విశాల్ ని ఆశీర్వదించండి'' అని కోరారు.


హీరో విశాల్ మాట్లాడుతూ.. మోహన్ బాబు గారికి నేను మూడో కొడుకుని. నన్ను వాళ్ళ ఇంటి బిడ్డలా ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ వేడుకకు మోహన్ బాబు గారిని పిలవడానికి ఒక కారణం వుంది. మోహన్ బాబు గారు ఒక నటుడిగా, నిర్మాతగా, విద్యావేత్త గొప్ప సేవ చేస్తున్నారు. ఆయనకంటూ ఒక స్టయిల్ పెట్టుకొని ఎన్నో సినిమాలు చేసి మనల్ని అలరించారు. 18 ఏళ్లుగా మీ ఆదరణ వలన ఇక్కడ హీరోగా నిలబడ్డాను. నన్ను ఎంతగానో ఆదరించి విజల్స్ చప్పట్లు కొడుతున్నారు. దీనంతటికీ కారణం.. మోహన్ బాబు గారు. నేను టెన్త్ క్లాస్ చదువుకుంటున్నప్పుడు  'యం. ధర్మరాజు ఎం.ఎ' షూటింగ్ కి నాన్న గారు తీసుకెళ్ళారు.  ఒక మూల నిలబడి మోహన్ బాబు గారి డైలాగ్ డెలివరీ గమనిస్తున్నాను. అప్పుడు మోహన్ బాబు గారు నన్ను నాన్న గారిని పిలిచి'' ఈ అబ్బాయి మొహంలో కళ వుంది. తప్పకుండా హీరో అవుతాడు'' అన్నారు. అలా చెప్పిన మొదటి వ్యక్తి మోహన్ బాబు గారు. అప్పటికి నేను ఒక నటుడిని అవుతానే ఆలోచన కూడా లేదు. కానీ మోహన్ బాబు గారు అప్పుడే బలంగా చెప్పారు. ఆనాడు ఆయన చెప్పిన మాటలు నిజమయ్యాయి. దేవుడు, ప్రేక్షకుల దయ వల్ల హీరోగా మీ ముందు నిలబడ్డాను. 'లాఠీ' డిసెంబర్ 22న వస్తోంది. మీ అందరూ చూడండి. తప్పకుండా నచ్చుతుంది. లాఠీ సినిమా ప్రతి కానిస్టేబుల్ కి ఒక ట్రిబ్యూట్. కానిస్టేబుల్ కి ఒక లైఫ్ స్టయిల్ లేదు. సమాజం మేలు కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తారు. నేను రీల్ లైఫ్ హీరో. వాళ్ళు రియల్ లైఫ్ హీరోలు. వాళ్ళే స్ఫూర్తి. ఖాకీ యూనిఫామ్ వేసుకొని నటించేటప్పుడు తెలియని ఒక వైబ్రేషన్ వస్తుంది. కానిస్టేబుల్ కి గన్ వుండదు. ఒకే ఒక లాఠీ పట్టుకొని రంగంలో దిగుతారు. నేరస్తులని పట్టుకుంటారు. ఈ కథ విన్నప్పుడు తప్పకుండా చేయాలనిపించింది. అందుకే ఈ సినిమా చేశాను. ఇందులో యాక్షన్ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా చెప్పుకుంటారు. పీటర్ హెయిన్స్ మాస్టర్ ఎక్స్ టార్డినరీ యాక్షన్ సీక్వెన్స్ లు డిజైన్ చేశారు. మీరంతా థియేటర్ లో చాలా ఎంజాయ్ చేస్తారు. మోహన్ బాబు గారు ఈ వేడుకకు రావడం ఆనందంగా వుంది. ఆయన పక్కన నిలబడటం ఒక గౌరవంగా భావిస్తున్నాను'' అన్నారు.


పీటర్ హెయిన్స్ మాస్టర్ మాట్లాడుతూ.. దర్శకుడు 'లాఠీ' కథ చెప్పినపుడు నాకు చాలా నచ్చింది. ఈ సినిమా ఖచ్చితంగా చేయాలని నిర్ణయించుకున్న. విశాల్ గారి తో ఎప్పటినుండో పని చేయాలని అనుకుంటున్నాను. 'లాఠీ'తో కుదిరింది. ఈ సినిమా కోసం కొనాళ్ళు ఫ్యామిలీకి దూరంగా వుండి పని చేశాను. కొన్ని సినిమాలు కూడా పక్కనపెట్టాను. అంత బాగా నచ్చింది 'లాఠీ' కథ. మీలానే ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను'' అన్నారు


Share this article :