Latest Post

Sairam Shankar Vey Daruvey Movie Launched

హీరోలు శర్వానంద్, అల్లరి నరేష్,విశ్వక్ సేన్ ల బ్లెస్సింగ్స్ తో ప్రారంభమైన హీరో సాయిరాం శంకర్ సినిమా  "వెయ్ దరువెయ్"



శంకర్ పిక్చర్స్ సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాయి రామ్ శంకర్, యషా శివకుమార్ జంటగా నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పొత్తూరు నిర్మిస్తున్న చిత్రం "వెయ్ దరువెయ్" ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన హీరో శర్వానంద్ హీరో, హీరోయిన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా,హీరో అల్లరి నరేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.హీరో విశ్వక్ సేన్ గౌరవ దర్శకత్వం వహించారు.


 పూజా కార్యక్రమాల అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో



హీరో సాయి రామ్ శంకర్ మాట్లాడుతూ..ఈ కార్యక్రమానికి వచ్చిన హీరోలు శర్వానంద్, అల్లరి నరేష్, విశ్వక్ సేన్ లకు పెద్దలకు ధన్యవాదములు."యస్. ఆర్ కల్యాణ మండపం" తర్వాత శంకర్ పిక్చర్స్ తో దేవరాజ్ పొత్తూరు నిర్మిస్తున్న మాస్ ఎంటర్ టైనర్

 "వెయ్ దరువెయ్".దర్శకుడు నవీన్ రెడ్డి చెప్పిన కథ విన్న తరువాత నాకు "బంపర్ ఆఫర్" తర్వాత అలాంటి బాడీ లాంగ్వేజ్ ఉన్న కథ లభించడం నా అదృష్టం . ఈ కథ నాకు 100% సక్సెస్  ఫుల్ సినిమా అవుతుందని అనిపిస్తుంది. ఫుల్ ఔట్ ఔట్ ఎంటర్ టైనర్ గా వస్తున్న "వెయ్ దరువెయ్" టైటిల్ లోనే మాస్ కనిపిస్తుంది. లవ్, యాక్షన్, సెంటిమెంట్ ఉన్న ఈ సినిమా నాకు చాలా మంచి సినిమా అవుతుంది. ఈ సినిమాకు భీమ్స్ మ్యూజిక్, సతీష్ ముత్యాల డి ఓ పి ఇస్తున్నారు.ఈ సినిమాతో  యషా శివకుమార్ హీరోయిన్ గా పరిచయ మవుతుంది. తను కన్నడ లో శివరాజ్ కుమార్ తో చేసిన సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది. తన క్యారెక్టర్ కూడా నాకు ఈక్వల్ గా ఉంటుంది. నాకింత మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయడానికి ప్లాన్ చేసి ఈ సంవత్సరం లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు అన్నారు..


చిత్ర నిర్మాత దేవరాజ్ పొత్తూరు మాట్లాడుతూ..ఇక్కడకు వచ్చిన హీరోలకు, పెద్దలకు ధన్య వాదములు.నవీన్ రెడ్డి ఫుల్ ఔట్ ఔట్ ఎంటర్ టైనర్ కథ చెప్పగానే  నాకు బాగా నచ్చి ఈ సినిమా చేద్దాం అని చెప్పాను. శంకర్ పిక్చర్స్ ప్రెజెంట్స్ లో మేమంతా కలసి  నిర్మిస్తున్నాము. ఈ సినిమాకు మంచి నటీనటులు, టెక్నిషియన్స్ దొరికారు. మంచి కథతో తీస్తున్న  ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.


చిత్ర దర్శకుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ...ఈ కార్యక్రమానికి వచ్చిన హీరోలకు, పెద్దలకు ధన్యవాదములు. నెక్స్ట్ మంత్  షూట్ కు వెళ్తున్నాము.మా "వెయ్ దరువెయ్" సినిమాను సింగిల్ షెడ్యూల్ లో పూర్తి  చెయ్యాలని ప్లాన్ చేశాము. నిర్మాతకు ఈ కథ చెప్పగానే కథ బాగుందని ఈ సినిమాకు ఎం కావాలో ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. ఇలాంటి మంచి కథను చేసే అవకాశం ఇచ్చినందుకు వారికి నా ధన్యవాదములు. ఈ సినిమాలో కాశీ గారు ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నారు, ఇంకా ఈ సినిమాలో పోసాని, సప్తగిరి ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. వీరితో పాటు మంచి టెక్నిషియన్స్  దొరికారు  ఫుల్ ఔట్ ఔట్ ఎంటర్ టైనర్ కథతో వస్తున్న ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు


హీరోయిన్ యషా శివకుమార్ మాట్లాడుతూ..ఇది తెలుగులో నా మొదటి సినిమా. ఇలాంటి మంచి సినిమలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు


నటుడు కాశీ విశ్వనాధ్ మాట్లాడుతూ..దర్శకుడు మంచి కథ రాసుకున్నాడు.నవీన్ చెప్పిన కథ చాలా బాగా నచ్చింది .ఈ సినిమాకు హిట్ కావలసిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. యస్. ఆర్. కళ్యాణ మండపం సినిమాను రిలీజ్ చేసిన శంకర్ పిక్చర్స్, సాయితేజ్ పిక్చర్స్ సంయుక్తంగా చేస్తున్న ఈ సినిమా "యస్.ఆర్. కళ్యాణ మండపం"  అంత పెద్ద హిట్ అవ్వాలి. సాయిరాం శంకర్ తో ఇంతకు ముందు రీ సౌండ్ సినిమాకు కలసి వర్క్ చేశాను . తనకు,నవీన్ కు మంచి బ్రేక్ రావాలి. అలాగే నిర్మాత దేవరాజ్ కు ఎక్కువ డబ్బులు రావాలి అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో  పాల్గొన్న వారందరూ మంచి కథతో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు. ఈ కార్యక్రమానికి  హీరో ఆకాష్ పూరి , నిర్మాత , కోడి దివ్య దీప్తి  హాజరయ్యారు. 


నటీ నటులు

హీరో : సాయి రామ్ శంకర్,

హీరోయిన్ : యషా శివకుమార్

కాశీ విశ్వనాథ్,పోసాని కృష్ణ మురళి,


సాంకేతిక నిపుణులు :

బ్యానర్: సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్

నిర్మాత: దేవరాజ్ పొత్తూరు

దర్శకుడు: నవీన్ రెడ్డి

 కెమెరామెన్: సతీష్ ముత్యాల

సంగీతం: భీమ్స్ సిసిరోలియా

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కార్తీక్ 

Megastar Chiranjeevi Mega154’s Worldwide Grand Release in Theatres For Sankranthi 2023

 Megastar Chiranjeevi, Bobby, Mythri Movie Makers Mega154’s Worldwide Grand Release in Theatres For Sankranthi 2023



The most-awaited Mega154 in the crazy combination of Megastar Chiranjeevi, the very talented director Bobby (KS Ravindra) and the most happening production house Mythri Movie Makers gets its theatrical release date. The mega update for mega fans and cine goers is that Mega154’s poonakalu in theatres will begin from Sankranthi, as the movie is aimed for festival release, 2023.


“Kaluddam… Sankranthi ki Jan 2023,” announced they through the poster. Official title and teaser of the movie will be revealed soon. Although his face isn’t visible, megastar Chiranjeevi can be seen holding an anchor in his hand in the poster and in the background, sea and boats are visible.


Mega154, as of now, has completed 40% of its shoot. The film’s next schedule will begin from next month and they will shoot non-stop to wrap it up within the deadline. 


Bobby who is a die-hard fan of Megastar Chiranjeevi is putting in maximum efforts to present his demi-god in a never seen before mass-appealing and power-packed role. The Poonakalu will begin from the day, the title and first look will be released.


Shruti Haasan is playing the leading lady opposite Chiranjeevi in the movie billed to be a mass action entertainer laced with all the commercial ingredients.


Naveen Yerneni and Y Ravi Shankar are producing the film, while GK Mohan is the co-producer. A top-notch technical team is associating for the project, while several notable actors are part of it.


#Mega154 has music by Rockstar Devi Sri Prasad who provided several chartbuster albums to Chiranjeevi, while Arthur A Wilson handles the cinematography. Niranjan Devaramane is the editor and AS Prakash is the production designer. Sushmita Konidela is the costume designer.


While story and dialogue were written by Bobby himself, Kona Venkat and K Chakravarthy Reddy penned screenplay. The writing department also include Hari Mohana Krishna and Vineeth Potluri. 


Cast: Chiranjeevi, Shruti Haasan


Technical Crew:

Story, Dialogues, Direction: KS Ravindra (Bobby)

Producers: Naveen Yerneni and Y Ravi Shankar

Banner: Mythri Movie Makers

Music Director: Devi Sri Prasad

DOP: Arthur A Wilson

Editor: Niranjan Devaramane

Production Designer: AS Prakash

Co-Producers: GK Mohan, Praveen M

Screenplay: Kona Venkat, K Chakravarthy Reddy

Additional Writing: Hari Mohana Krishna, Vineeth Potluri

CEO: Cherry

Costume Designer: Sushmita Konidela

Line Producer: Balasubramanyam KVV

PRO: Vamsi-Shekar

Publicity: Baba Sai Kumar

Marketing: First Show

Mega Macho Event of Pakka Commercial on June 26

మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా జూన్ 26న మ్యాచో హీరో గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్..



వరస విజయాలతో జోరు మీదున్న విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకున్న జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బ‌న్నీ వాస్ నిర్మాత‌గా మ్యాచో హీరో గోపీచంద్‌తో చేస్తున్న పక్కా కమర్షియల్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మేజర్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. జూన్ 26న మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ వేడుక ఘనంగా జరగనుంది. చిత్రయూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా రాసారు. అలాగే రాశీ ఖన్నా పాత్రను హిలేరియస్‌గా డిజైన్ చేసారు. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన టైటిల్ సాంగ్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జులై 1, 2022న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో అపజయమే లేని జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ - బ‌న్నీవాసు - కాంబినేష‌న్ లో పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది. గ‌తంలో ఈ బ్యాన‌ర్స్ నుంచే ద‌ర్శ‌కుడు మారుతి భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించారు. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. SKN సహ నిర్మాత‌. మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రయూనిట్ తెలియజేయనున్నారు.


నటీనటులు:

గోపీచంద్, రాశీఖ‌న్నా, స‌త్య‌రాజ్, రావు ర‌మేశ్, సప్తగిరి తదితరులు


టెక్నికల్ టీం:

స‌మ‌ర్ప‌ణ - అల్లు అరవింద్

బ్యాన‌ర్ - జీఏ2పిక్చ‌ర్స్, యూవీక్రియేష‌న్స్

నిర్మాత‌ - బ‌న్నీ వాస్

ద‌ర్శ‌కుడు - మారుతి

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ - ర‌వీంద‌ర్

మ్యూజిక్ - జ‌కేస్ బీజాయ్

స‌హ నిర్మాత - ఎస్ కే ఎన్

లైన్ ప్రొడ్యూసర్ - బాబు

ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ - సత్య గమిడి

ఎడిటింగ్ - ఎన్ పి ఉద్భ‌వ్

సినిమాటోగ్ర‌ఫి - క‌ర‌మ్ చావ్ల‌

పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌ శ్యామ్

Kichcha Sudeep’s Vikrant Rona' trailer is out now

 Kichcha Sudeep’s Vikrant Rona' trailer is out! A perfect blend of a unique concept, studded with grand visuals



Finally, the much-awaited trailer of Kichcha Sudeep’s Vikrant Rona' is out, showcasing grand visuals in an interesting story


Well loaded with mesmerizing visuals Kichcha Sudeep’s Vikrant Rona' trailer is finally here!


Watch the trailer of Kichcha Sudeep’s Vikrant Rona'! A treat to the cinema lovers with mesmerizing visuals


Finally the much-awaited trailer of Kichcha Sudeep’s 3D Mystery Thriller Vikrant Rona’ is out and it is much grand than what anyone would have expected. From the grand entry of Kichcha Sudeep to its wonderful visual effects, the trailer consists of many factors for the audience to love on. 


With an interesting concept and mesmerizing 3D visuals, the trailer captured glimpses of a village scene in a most majestic way. Moreover, Kichcha Sudeep’s entry on the ship is truly grand and astounding. And then comes the glamorous Jacqueline Fernandez who steals the show with her hot avatar. The trailer launched in Mumbai, where the media got to see the 'Ra Ra Rakkamma' song exclusively. The trailer has come as a perfect treat to the audience.


Moreover, The trailer has come as a big thing for the audience to set their eyes on, as the big names from different industries will be coming together to launch the same in different languages. Where Salman Khan will launch it in Hindi, Dhanush will launch it in Tamil, Dilquar Salmaan in Malayalam, Ramcharan Telegu, and Kichcha Sudeep in Kannada. 


Vikrant Rona’ will release worldwide in 3D on July 28th, starring Kichcha Sudeepa, directed by Anup Bhandari, also starring Jacqueline Fernandez, Nirup Bhandari, and Neetha Ashok is presented by Salman Khan Films, Zee Studios and Kichcha Creatiions in North India produced by Jack Manjunath under his production Shalini Artss, and co-produced by Alankar Pandian of Invenio Origins the film. The Film will be distributed in North India by PVR Pictures.

Tharun Bhascker Dhaassyam VG Sainma’s Production No 1 Titled Keedaa Cola

 Tharun Bhascker Dhaassyam VG Sainma’s Production No 1 Titled Keedaa Cola



The highly talented Tharun Bhascker Dhaassyam directed two films so far and both PelliChoopulu, Ee Nagaraniki Emaindi were big hits. The director who is a specialist in making hilarious and youthful movies is coming up with a crime comedy this time.


It’s very first feature length production of VG Sainma. The makers in addition to announce the project have also unleashed its title. The movie has been titled intriguingly and peculiarly as Keedaa Cola.


Keedaa means a creature with six legs and Cola is the name of a popular soft-drink brand. The poster sees cap of a soft drink bottle with title written on it. Indicating crime part, we can spot the blood. In the down part, we can also observe a creature. “Experience crime comedy like never before…” assures the makers.


Following the sentiment, the poster is painted yellow. It may be mentioned here that, Pelli Choopulu and Ee Nagaraniki Posters were also designed in yellow colour.


Produced by Bharath Kumar, Sripad Nandiraj, Upendra Varma, Srinivas Kaushik, Saikrishna Gadwal, Vijay Kumar, the film will release in 2023.


Cast and technical crew of the movie will be revealed soon.


Written & Directed by Tharun Bhascker Dhaassyam

Production House - VG Sainma

Writer’s Room - Quick Fox

Produced by Bharath Kumar, Sripad Nandiraj, Upendra Varma, Srinivas Kaushik, Saikrishna Gadwal, Vijay Kumar

Raghava Lawrence Rudhrudu First Look Out In Theatres Christmas 2022

Raghava Lawrence, Kathiresan, Five Star Creations LLP’s Rudhrudu First Look Out, In Theatres Christmas 2022



Actor-choreographer-filmmaker Raghava Lawrence is presently starring in an action thriller under the direction of Kathiresan. Five Star Creations LLP is producing the movie, while Kathiresan is the presenter.


Rudhrudu is the title and the film’s first look is out now. Raghava Lawrence appears intense in the poster from a stunt sequence. As the poster suggests, the movie is going to be high on action.


EVIL IS NOT BORN, IT IS CREATED is the tagline of the movie and Lawrence looks like an evil in the first look poster.


Sarath Kumar is playing a vital role and Priya Bhavani Shankar is the leading lady opposite Lawrence. GV Prakash Kumar provides music for the movie for which cinematography is by RD Rajasekar ISC. Editing is by Anthiny, wherein stunts are by Siva – Vicky.


90% Shooting of the movie is done. Rudhrudu will release in theatres for Christmas, 2022.


Cast: Raghava Lawrence, Sarath Kumar, Priya Bhavani Shankar, Poornima Bhagyaraj, Nasser and Others


Technical Crew:

Director - Kathiresan

Producer- Kathiresan

Banner: Five Star Creations LLP

Music: G.V. Prakash Kumar

DOP: RD Rajasekar ISC 

Editor: Anthony

Stunts: Siva - Vicky 

ChorBazaar Pre Release Event Held Grandly

 ఘనంగా "చోర్ బజార్" ప్రీ రిలీజ్ వేడుక



ఆకాష్ పురి హీరోగా నటించిన సినిమా చోర్ బజార్.  గెహనా సిప్పీ నాయికగా నటించింది. దర్శకుడు జీవన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. ఈనెల 24న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో విశ్వక్ సేన్, నిర్మాత బండ్ల గణేష్, హీరో సాయిరామ్ శంకర్, పూరీ జగన్నాథ్ భార్య లావణ్య, దర్శకుడు పరశురామ్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 


దర్శకుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ...జీవన్ దర్శకుడిగా సినిమా బాగా చేస్తావని నీ మీద నమ్మకం ఉంది. మా అబ్బాయితో మంచి సినిమా చేయ్ అని చెప్పి ఆకాష్ ను నాతో పంపించారు పూరి జగన్నాథ్. ఆయన మాట నిలబెట్టుకుంటానని పూర్తి నమ్మకం ఉంది. ఆకాష్ ఈ కథకు పర్పెక్ట్ యాక్టర్. బచ్చన్ సాబ్ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించాడు. గెహనా సిప్పీ మంచి హీరోయిన్ అవుతుంది. అర్చన మేడమ్ రూపంలో నాకు అక్క దొరికింది. నా నెక్ట్ సినిమాలోనూ ఆమె డేట్స్ ఇవ్వాలి. చోర్ బజార్ ను కలర్ ఫుల్ ఫిల్మ్ గా మార్చింది మా టీమ్ మెంబర్సే. ఆర్ట్ వర్క్ నుంచి డైరెక్షన్ డిపార్ట్ మెంట్ వరకు అంతా కష్టపడి మంచి సినిమా చేశారు. అన్నారు.


రచయిత బీవీఎస్ రవి మాట్లాడుతూ...హీరో కావాలంటే సిక్స్ ప్యాక్, హెయిర్ స్టైల్, హైట్ అడుగుతారు కానీ నటించడం వచ్చా అని తెలుసుకోరు. ఆకాష్ కు నటన తెలుసు. స్టార్ డమ్ ఇవాళ కాకున్నా రేపైనా వస్తుంది. కానీ నటుడిగా ఆకాష్ ఎప్పుడో సక్సెస్ అయ్యాడు. పూరీ జగన్నాథ్ కొడుకు అవడం వల్ల అతని స్టైల్ మీద వాళ్ల నాన్న పూరి ప్రభావం పడింది. ఈ సినిమాతో దాన్నుంచి కూడా ఆకాష్ బయటకొస్తాడు. అన్నారు.


బండ్ల గణేష్ మాట్లాడుతూ...ఆకాష్ పూరి స్టార్ అవడానికే పుట్టాడు. అతనిలో ఆ టాలెంట్ ఉంది.  ఆకాష్ స్టార్ కాకుండా ఎవరూ ఆపలేరు. మా గబ్బర్ సింగ్ సినిమాలో చిన్నప్పటి పవన్ కళ్యాణ్ గా నటించినప్పుడే ఆకాష్ పెద్ద హీరో అవుతాడని ఫిక్స్ అయ్యా. దర్శకుడు జీవన్ రెడ్డి మంచి ప్రతిభావంతుడు, మేధావి, అతనితో ఎక్కువ సేపు మాట్లాడితే నాకు భయమేస్తుంది. ఆయన లాస్ట్ సినిమా చాలా బాగుంది. ఆకాష్ కు నా రిక్వెస్ట్ ఏంటంటే నువ్వు స్టార్ అయ్యాక మీ నాన్నకు డేట్స్ ఇవ్వొద్దు. మీ నాన్న నీతో సినిమా చేసేందుకు క్యూలో నిల్చోవాలి అంత పెద్ద హీరో కావాలి.  ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావాలి అని కోరుకుంటున్నా. అన్నారు.


హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ...చోర్ బజార్ సినిమా చూస్తే నా ఫలక్ నుమా దాస్ సినిమా గుర్తొస్తోంది. ఆకాష్ ఈ సినిమాతో హిట్ కొడతాడని కన్ఫర్మ్ గా చెప్పగలను. చోర్ బజార్ కు నేనూ చాలాసార్లు వెళ్లాను. ఎక్కడా దొరకని వస్తువులన్నీ అక్కడ ఉంటాయి. ఈ కథతో సినిమా చేయాలన్న ఆలోచన రావడమే గ్రేట్. జీవన్ రెడ్డి సినిమాల్లో రీసౌండ్ ఎక్కువ ఉంటుంది. అందుకే థియేటర్ కు వెళ్లి ఈ సినిమా చూడండి. నాకు రిలీజ్ ముందే సినిమాను చూడాలన్నంత ఆసక్తిగా అనిపిస్తోంది. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. అన్నారు.


హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ...చోర్ బజార్ సినిమా ఇంత బాగా రావడానికి మా టీమ్ కారణం. సురేష్ బొబ్బిలి చేసిన పాటలకు వేల రీల్స్ చేస్తున్నారు. జగదీశ్ చీకటి సినిమాటోగ్రఫీతో మ్యాజిక్ చేశారు. నిర్మాతలు లాక్ డౌన్ లో సినిమా ఆగిపోయినా, బడ్జెట్ పెరిగినా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. గెహనా సిప్పీకి కెరీర్ లో ఎదగాలని ఎంతో తపన ఉంది. ఈ సినిమా దర్శకుడు జీవన్ రెడ్డి క్రియేట్ చేసిన మ్యాజిక్ అనుకోవచ్చు. ఇలా టీమ్ అంతా పడిన శ్రమే ఈ సినిమా. హీరోగా నాకు మంచి పేరొస్తుందని నమ్ముతున్నా. ఈ కార్యక్రమానికి వచ్చిన విశ్వక్, మా బాబాయ్ సాయిరామ్, బండ్ల గణేష్ కు థాంక్స్. ఇతనికేంటి పూరి జగన్నాథ్ కొడుకు అనుకుంటారు. కానీ నేను మా నాన్న స్టార్ డైరెక్టర్ కాక ముందే హీరో అవ్వాలని ఫిక్స్ అయ్యా. మా నాన్న అన్నీ ఇచ్చారు. ఆయన నా పక్కన లేకుంటే నేను జీరో ఆ విషయం నాకు తెలుసు. అందుకే సొంతగా నాకంటూ ఓ పేరు గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నా. రేపు మా అమ్మకు, చెల్లికి ఒక కొడుకుగా అన్నయ్యగా ధైర్యాన్ని ఇవ్వాలనుకుంటున్నా. స్టార్ కిడ్స్ అంటే రాగానే స్టార్స్ అయిపోరు, వాళ్లలో టాలెంట్ ఉంటేనే అవుతారు. నా గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటూ నన్ను నేను మెరుగుపర్చుకుంటున్నా. ఏదో ఒకరోజు మా నాన్న స్థాయికి వెళ్లి, ఆయనతో కలిసి సినిమా చేస్తా. మాతో పాటు రిలీజ్ అవుతున్న సమ్మతమే, ఇతర సినిమాలూ విజయం సాధించాలి. అన్నారు.


నటి అర్చన మాట్లాడుతూ...ఆకాష్ నాకు హీరోగా పరిచయం అయ్యాడు. నాకిప్పుడు కొడుకు అయ్యాడు. ఆకాష్ లో హీరోకు కావాల్సిన హీరోయిజం ఉంది. ఆకాష్ ది మంచి క్యారెక్టర్. అతని డిసిప్లిన్ ఉంది. అతనితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. త్వరలో ఆకాష్ తండ్రి పూరీ జగన్నాథ్ అని చెప్పుకునే స్థాయికి వెళ్తాడు. అన్నారు.


బిగ్ టికెట్ రిలీజ్ చేసిన అనంతరం దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ... ఆకాష్ కు సక్సెస్ బాకీ పడిపోయింది. వడ్డీతో సహా అది దక్కుతుంది. జీవన్ రెడ్డి సహాయ దర్శకుడిగా ఉన్నప్పటి నుంచి తెలుసు. ఆయన కమిట్ మెంట్  ఉన్న దర్శకుడు. జార్జ్ రెడ్డి తో సూపర్బ్ సినిమా చేశాడు. దర్శకుడికి పెద్ద హిట్ రావాలి. ఆకాష్ ఈ సినిమాతో కమర్షియల్ సినిమాగా నిలబడాలి. అన్నారు.


నిర్మాత వీఎస్ రాజు మాట్లాడుతూ... చోర్ బజార్ అనేది కలర్ ఫుల్ కమర్షియల్ ఫిల్మ్. ఫుల్ ఫిల్మ్ ఎంజాయ్ చేస్తారు. సినిమా సక్సెస్ మీద కాన్ఫెడెన్స్ తో ఉన్నాం. జీవన్ ఇలాంటి సినిమాలు చేయాలని కోరుకునేవాడిని. చోర్ బజార్ రాత్రి జరిగే కథ 35 రోజుల వరకు కేవలం రాత్రి షూటింగ్ చేశాం. యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. పృథ్వీ అనే స్టంట్ మాస్టర్ ఫైట్స్ బాగా డిజైన్ చేశాడు. ఈ సినిమాతో ఆకాష్ కు హిట్ గ్యారెంటీ. అన్నారు.


నటుడు సుబ్బరాజు మాట్లాడుతూ...జీవన్ రెడ్డి ఆకాష్ తో విప్లవ సినిమా చేస్తాడనుకున్నా కానీ ఔట్ అండ్ ఔట్ హిలేరియస్ ఎంటర్ టైనర్ రూపొందించాడు. నేను కూడా ఈ చిత్రంలో నటించాడు. బ్యూటిఫుల్ గా మూవీ వచ్చింది. చిత్రబృందం అందరికీ కంగ్రాట్స్, బెస్ట్ విశెస్ చెబుతున్నా. అన్నారు.


హీరో సాయి రామ్ శంకర్ మాట్లాడుతూ...రొమాంటిక్ సినిమా క్లైమాక్స్ బాగా నచ్చింది. అప్పుడు ఆకాష్ కు పోన్ చేసి ఇంత బాగా నటించడం ఎప్పుడు నేర్చుకున్నావురా. మెహబూబా కంటే రొమాంటిక్ లో మెచ్యూర్డ్ గా నటించాడు. చోర్ బజార్ కమర్షియల్ లోడెడ్ ఫిల్మ్. ఆకాష్ కు ఈ సినిమాతో విజయం దక్కాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నాకు అందరూ తెలిసిన వాళ్లే ఉన్నారు. నిర్మాత సుబ్రహ్మణ్యం కూడా బెస్ట్ ఫ్రెండ్. జీవన్ కు దర్శకుడిగా సక్సెస్ ఫుల్ ఫిల్మ్ అవుతుంది.  అన్నారు.


ఈ కార్యక్రమంలో హీరో సందీప్ మాధవ్, దర్శకుడు అజయ్ భూపతి, సుబ్బరాజు, రచయిత బీవీఎస్ రవి, సంగీత దర్శకులు రామ్ మిర్యాల, గీత రచయిత మిట్టపల్లి సురేందర్, కాసర్ల శ్యామ్ తదితరులుపాల్గొన్నారు.

Whistle Song from The Warriorr Launched

 నేను పని చేసిన బెస్ట్ డైరెక్ట‌ర్స్‌లో లింగుస్వామి ఒకరు

- 'ది వారియర్'లోని 'విజిల్...' సాంగ్ లాంచ్‌లో ఉస్తాద్ రామ్ పోతినేని




ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో యువ కథానాయకుడు, ఉస్తాద్ రామ్ పోతినేని కనిపించనున్న సినిమా 'ది వారియర్'. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. 


సినిమాలో 'విజిల్' సాంగ్‌ను బుధవారం ప్రముఖ కథానాయకుడు సూర్య ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. హైదరాబాద్‌లో అభిమానుల సమక్షంలో లిరికల్ వీడియో ప్రదర్శించారు. 


రామ్ పోతినేని మాట్లాడుతూ ''లాస్ట్ సినిమా 50 శాతం అక్యుపెన్సీలో చూశా. ఇప్పుడు థియేటర్‌లో 100 శాతం ఆక్యుపెన్సీ చూస్తుంటే అదిరిపోయింది. మంచి ఫీల్ వచ్చింది. నాకు ఇప్పుడు లాక్‌డౌన్‌ తీసినట్టుంది. 'విజిల్' వేసే బాధ్యత మీది (ప్రేక్షకులను ఉద్దేశిస్తూ)... వేయియించాల్సిన బాధ్యత నాది. మేం అడిగిన వెంటనే సాంగ్ విడుదల చేసిన సూర్య గారికి థాంక్స్. ముందుగా... దేవి శ్రీ ప్రసాద్ గురించి మాట్లాడాలి. 'బుల్లెట్...' సాంగ్‌తో స్టార్ట్ చేశాడు. అది ఇంకా రన్ అవుతుంది. ఎక్కడా ఆగడం లేదు. ఈ రోజే విడుదల చేశామా అన్నట్టు ట్రెండ్ అవుతోంది. సౌత్ ఇండియా అంతా షేక్ చేస్తోంది. 'విజిల్' సాంగ్‌కు కూడా సూపర్ డూపర్ హిట్ ట్యూన్ ఇచ్చాడు. నెక్స్ట్ సాంగ్స్ కూడా విన్నాను. షూట్ చేశాడు. బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చాడు. నా మీద తనకు ఉన్న ప్రేమను పాటల్లో చూపిస్తాడు డీఎస్పీ. నా కెరీర్ అంతా చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చాడు. 'విజిల్' సాంగ్ షూట్ చేసేటప్పుడు 'ది వారియర్' అనే టైటిల్ ఎందుకు పెట్టామో అర్థం అయ్యింది... చాలా ప్రాబ్లమ్స్ వచ్చినా సాంగ్ ఫినిష్ చేయాలని చేశాం. రంజాన్ సమయంలో ఉపవాసం చేస్తూ జానీ మాస్టర్ సాంగ్ కొరియోగ్రఫీ చేశారు. వేరే షూటింగ్ ఉన్నప్పటికీ... మేనేజ్ చేసి డేట్స్ అడ్జస్ట్ చేసి కృతి ఈ సాంగ్ చేసింది. ఈ సినిమాలో మాస్ కృతిని చూస్తారు. ఫుడ్ పాయిజన్ అయ్యి రెండు రోజులు ఆస్పత్రిలో ఉన్నప్పటికీ... సుజీత్ లైటింగ్ దగ్గరనుంచి ప్రతి విషయంలో కేర్ తీసుకున్నారు. దర్శకుడు లింగుస్వామి గారు ప్రతి ఫ్రేమును ఆయన భుజాలపై మోశారు. అద్భుతంగా సినిమా తీశారు. నేను పని చేసిన బెస్ట్ డైరెక్ట‌ర్స్‌లో ఆయన ఒకరు. 'ది వారియర్'కు మంచి టీమ్ కుదిరింది. టీమ్ వర్క్ సినిమాలో చూస్తారు. ఇక, 'విజిల్' సాంగ్ గురించి ఒక్కటే చెబుతా... ఇది టిక్ టాక్ సాంగ్ కాదు, థియేటర్ సాంగ్. థియేటర్లకు వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళండి. అభిమానుల కోసం సినిమాలో చాలా ఉన్నాయి'' అని అన్నారు.  


కృతి శెట్టి మాట్లాడుతూ ''ప్రేక్షకులు విజిల్స్ వేస్తున్నారు. అయితే... వాళ్ళను చూస్తుంటే నాకు విజిల్ వేయాలనిపిస్తోంది. రామ్ గారు ఉంటే సినిమాలో ఒక ఎనర్జిటిక్ సాంగ్ ఉండాలి. ఆయన పెర్ఫార్మన్స్ చూడటం కోసం! విజిల్ మహాలక్ష్మి కోసం ఒక విజిల్ సాంగ్ సిట్యువేషన్ క్రియేట్ చేసినందుకు లింగుస్వామి గారికి థాంక్స్. 'ఉప్పెన' తర్వాత డీఎస్పీ గారితో నేను చేస్తున్న చిత్రమిది. సూపర్ సాంగ్స్ ఇచ్చారు. 'ఉప్పెన'లో సాంగ్స్ పెద్ద హిట్. 'ది వారియర్' ఫస్ట్ సాంగ్ విడుదలైనప్పుడు ఆల్బమ్ పెద్ద హిట్ కావాలని కోరుకున్నాను. హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్. జానీ మాస్టర్ అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. 'బుల్లెట్' సాంగ్‌లో విజువల్స్ చూశారు. అందులో ప్రొడక్షన్ వేల్యూస్ తెలుస్తాయి. బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు ప్రొడక్షన్ వేల్యూస్ ఇంకా బాగా తెలుస్తాయి. మా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి ఖర్చుకు ఎక్కడా వెనుకాడలేదు'' అని అన్నారు. 


దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ ''స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయాలని పదేళ్ల నుంచి ఆలోచిస్తూ ఉన్నాను. హీరోలు, నిర్మాతలను కలిశాను. అప్పుడు జరగలేదు. 'ది వారియర్', ఈ టీమ్ కోసమే వెయిట్ చేస్తున్నాని తర్వాత అర్థమైంది. మా హీరో రామ్ గారి ఎనర్జీ, డీఎస్పీ ఎనర్జీ, నా ఎనర్జీ, మా టీమ్ అందరి ఎనర్జీ ఒకే లెవెల్‌లో ఉంది. మీకు 'విజిల్' సాంగ్‌లో కనపడి ఉంటుంది. అద్భుతమైన సందర్భంగా ఈ పాట వస్తుంది. సాంగ్ వచ్చేటప్పుడు ప్రేక్షకులు అందరూ పెద్ద పెద్ద విజిల్స్ వేస్తారని అనుకుంటున్నాను. 'బుల్లెట్...' సాంగ్ విడుదల తర్వాత ఒక రెస్టారెంట్‌కు 'మా పిల్లలు బుల్లెట్ సాంగ్ పెడితేనే తింటారు సార్. మీ సాంగ్ అంత పెద్ద హిట్' అని తల్లిదండ్రులు చెప్పారు. షార్ట్ వీడియోస్ లో 900 కోట్ల మంది 'బుల్లెట్' సాంగ్ చేశారు. త్వరలో వెయ్యి కోట్ల మార్క్ చేరుకోవచ్చు. 'బాహుబలి' వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది. నా సాంగ్ షార్ట్ వీడియోస్ రూపంలో వెయ్యి కోట్లు చేరుకుంది. ప్రేక్షకుల ఆశీర్వాదంతో సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. మా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి సాంగ్స్, సినిమా కోసం ఏం అడిగితే అది ఇచ్చారు. మమ్ముట్టి గారితో మొదలు పెడితే... మాధవన్, సూర్య, విక్రమ్, అజిత్ వంటి మంచి హీరోలతో నేను పని చేశాను. రామ్ స్పెషాలిటీ ఏంటంటే... స్కిప్ట్ విన్న రోజు నుంచి సినిమా కంప్లీట్ అయిన తర్వాత చూసే వరకూ ఎనర్జీ లెవల్ ఎక్కడా తగ్గలేదు. ఆయన నెక్స్ట్ లెవల్ హీరో. అది నాకు తెలుస్తుంది. త్వరలో మీకు తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ అన్ని హిట్ సాంగ్స్ ఇచ్చారు. మా సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్'' అని అన్నారు. 


ఈ కార్యక్రమంలో నిర్మాత శ్రీనివాసా చిట్టూరి, ప్రొడక్షన్ డిజైనర్ సత్యనారాయణ, సినిమాటోగ్రాఫర్ సుజీత్ వాసుదేవన్, 'విజిల్' తెలుగు పాటకు సాహిత్యం అందించిన సాహితి, 'విజిల్' తమిళ పాటకు సాహిత్యం అందించిన వివేక్ తదితరులు పాల్గొన్నారు. 


రామ్ సరసన కృతి శెట్టి కథానాయికగా, ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా, అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళ: డి.వై. సత్యనారాయణ, యాక్షన్: విజయ్ మాస్టర్ & అన్బు-అరివు, ఛాయాగ్రహణం: సుజీత్ వాసుదేవ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా - లింగుస్వామి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్, స‌మ‌ర్ప‌ణ: ప‌వ‌న్ కుమార్‌, నిర్మాత‌: శ్రీ‌నివాసా చిట్టూరి, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శ‌క‌త్వం: ఎన్‌. లింగుస్వామి.

Vishwak Sen Aishwarya Arjun Movie Launched Grandly

విశ్వక్ సేన్ - ఐశ్వర్య అర్జున్- అర్జున్ సర్జా- శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ నంబర్ 15 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లాప్ తో గ్రాండ్ గా ప్రారంభం



యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడి గా ఐశ్వర్య అర్జున్‌ కథానాయిక గా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా రచయిత, నిర్మాత, దర్శకుడిగా వ్యవహరిస్తున్న చిత్రం గ్రాండ్ గా ప్రారంభమైయింది. అర్జున్ సొంత బ్యానర్ శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ నెం 15లో స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్‌ తెలుగులో కథానాయికగా పరిచయం అవుతున్నారు. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరై క్లాప్ కొట్టి చిత్ర యూనిట్ కి బెస్ట్ విశేష్ అందించారు. తొలి షాట్ కి వెటరన్ దర్శకులు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా, ప్రకాష్ రాజ్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మంచు విష్ణు స్క్రిప్ట్ ని హ్యాండోవర్ చేశారు. వీరితో పాటు బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ కార్యక్రమానికి హాజరై టీమ్ కి బెస్ట్ విశేష్ అందించారు.


 


విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. అర్జున్ గారు కలవాలని అడిగితే షాక్ అయ్యా. ఎందుకో అర్ధం కాలేదు. 'నేను డైరెక్ట్ చేస్తున్న కథ చెప్తా విను' అనగానే చాలా సర్ ప్రైజ్ అయ్యా. ఇది నా విష్ లిస్టులో వున్న సినిమా. అంత గొప్ప కథ. ఈ సినిమా కథ అన్నిటికంటే పెద్దగా కనిపించింది. ఈ కథకు నన్ను ఎంపిక చేసిన అర్జున్ గారికి ధన్యవాదాలు. మా అమ్మగారు అర్జున్ గారికి పెద్ద అభిమాని. తెలుగు సరిగ్గా రాదని చెబుతూనే ఐశ్వర్య అద్భుతమైన తెలుగు మాట్లాడారు. నన్ను, అర్జున్ గారిని డామినేట్ చేయడానికి ఐశ్వర్య రెడీ అవుతున్నట్లుగా వుంది. రవి బసూర్ గారితో ఇంత త్వరగా సినిమా చేస్తానని అనుకోలేదు. బుర్రా సాయి మాధవ్ గారితో పని చేయడం ఆనందంగా వుంది. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి, రాఘవేంద్రరావు గారికి, విష్ణు గారికి, బీవీఎస్ఎన్ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు'' తెలిపారు.


 


అర్జున్ సర్జా మాట్లాడుతూ... 1984లో ఒక తెలుగు సినిమా ఆఫర్ వచ్చింది. కానీ చేయనని చెప్పాను. దర్శకుడు కారణం అడిగితే నాకు యాక్టింగ్ తెలీదని చెప్పాను. మేము నేర్పిస్తామని కాన్ఫిడెన్స్ ఇచ్చారు. తర్వాత తెలుగు భాష రాదని చెప్పాను. అదంతా మేము చూసుకుంటామని చెప్పారు. ఆ సినిమా పేరు మా పల్లెలో గోపాలుడు. ఆ దర్శకుడు మా గురువు గారు కోడి రామకృష్ణ గారు. నిర్మాత భార్గవ్ ఆర్ట్ ఫిల్మ్స్ గోపాల్ రెడ్డి గారు.ఆ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్. నా గురువు గారిని తలుచుకుని ఈ కొత్త సినిమాకి శ్రీకారం చుట్టడం ఆనందం వుంది. ఇన్నేళ్ళుగా నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులు, పరిశ్రమకి నా కుమార్తె ఐశ్వర్య అర్జున్‌ ని పరిచయం చేస్తున్నందుకు గర్వంగా వుంది. తను ఒక తమిళ్ సినిమా, నా దర్శకత్వంలో ఒక కన్నడ సినిమా చేసింది. ఇప్పుడీ తెలుగు సినిమా చేయబోతుంది. తను చాలా డెడికేటెడ్ గా పని చేస్తుంది.  మీ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా కష్టపడి పని చేస్తుందనే నమ్మకం వుంది. ప్యాషన్, హార్డ్ వర్క్, భయం ఉంటేనే ఇక్కడ నిలబడగలమని తనకు చెబుతుంటాను. డబ్బులు ఇచ్చి ప్రేక్షకులు సినిమా చుస్తున్నారనే భయం ఆర్టిస్ట్ లో ఉంటేనే విజయం సాధిస్తారని చెప్తాను. పరిశ్రమలో నాకు 42 ఏళ్ళు. ఈ ప్రయాణంలో ఇండస్ట్రీ నవ్వు, ఏడుపు, నొప్పి, విజయం, అపజయం ఇలా అన్నీ నేర్పించింది. ఇలాంటి అద్భుతమైన పరిశ్రమకి నా కుమార్తెని పరిచయం చేస్తున్నందుకు చాలా గర్వంగా వుంది.


ఇది చాలా ఫీల్ గుడ్ మూవీ. చాలా అరుదైన జోనర్. ఈ కథ చెప్పగానే మరో ఆలోచన లేకుండా నటులు, టెక్నిషియన్స్ ఈ ప్రాజెక్ట్ చేస్తామని చెప్పారు. అందరికీ ఇంత నమ్మకం వున్నపుడు ఖచ్చితంగా అద్భుతమైన సినిమా చేయాలనే భయం వుంది. మా హీరో విశ్వక్ వండర్ ఫుల్ హీరో. ఈ కథ విన్నాక పిచ్చిపిచ్చిగా నచ్చేసింది అని హీరో విశ్వక్ చెప్పారు. అప్పుడు ఇంకా భాద్యత పెరిగినట్లనిపించింది. వందశాతం మంచి సినిమాని తీస్తాను. ఇది కంప్లీట్ ఎంటర్ టైనర్ ఫీల్ గుడ్ మూవీ. దర్శకుడిగా ఇది 13వ సినిమా. నిర్మాతగా 15వ సినిమా. స్టార్ రైటర్  సాయి మాధవ్ బుర్రా గారు  ఈ చిత్రానికి మాటలు రాస్తున్నారు. ఆయన మాటలతో కథ మరోస్థాయికి వెళుతుంది. బాలమురగన్ గారు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా విజువల్ ఫీస్ట్ గా వుంటుంది. ''కేజీఎఫ్' తో పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టరైన రవి బసూర్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇస్తున్నారు. ఆయనకి ఈ కథ చాలా నచ్చింది. ఆయన మ్యూజిక్ ఈ చిత్రానికి మరో మెయిన్ పిల్లర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా లాంచింగ్ కి రావడం, 'మీరు చాలా రోజుల తర్వాత సినిమా చేస్తున్నారు. మీతో పాటు వుంటాం''అని ఆయన చెప్పడం ఆనందంగా వుంది. ఈ చిత్రంలో నటులకి, టెక్నిషియన్లకు మంచి స్కోప్ వుంది. ఈ రోజు నా భార్య కూడా ఈ వేడుకలో వుండటం ఆనందంగా వుంది. నా సక్సెస్ ఫుల్ జీవితానికి, ఆనందానికి ప్రధాన కారణం నా భార్య. ఇన్నేళ్ళుగా ప్రేక్షకులు నన్ను ఆదరించారు. నా కుమార్తెని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను. ఒక మంచి సినిమాని తెలుగు చిత్ర పరిశ్రమకి ఇస్తాననే నమ్మకం వుంది. త్వరలోనే టైటిల్ ని ప్రకటిస్తాం.'' అన్నారు.


 


ఐశ్వర్య అర్జున్ మాట్లాడుతూ.. ఈ చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి రావడం ఆనందంగా వుంది. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. మా నాన్న గారు దర్శకత్వంతో పాటు నిర్మిస్తున్నారు. ఇది నాకు భాద్యత. మా నాన్నకి నేను పెద్ద ఫ్యాన్. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన నన్ను తెలుగు పరిశ్రమలో పరిచయం చేస్తారని అనుకోలేదు. ఇది నాకు బిగ్ సర్ప్రైజ్.  అలాగే ఒక భాద్యత. మీ అందరి అంచనాలకి తగ్గట్టు కష్టపడి పని చేస్తాను. గ్రేట్ టీం కుదిరింది, విశ్వక్ గారు , రవి బసూర్, సాయి మాధవ్ గారు, బాలమురగన్  వీరందరితో కలసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను. నాన్నగారిని ఇన్నేళ్ళు ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. నన్ను కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.


 


సాయి మాధవ్‌ బుర్రా మాట్లాడుతూ.. అర్జున్ దర్శకత్వం వహిస్తున్న మొదటి తెలుగు సినిమా, వారి కుమార్తె తెలుగు లో పరిచయం అవుతున్న చిత్రానికి మాటలు రాసే అవకాశం రావడం ఆనందంగా వుంది. చాలా అద్భుతమైన కథ ఇది. ప్రతి టెక్నిషియన్ తనని తాను ఆవిష్కరించుకునే అవకాశం కథకి మాటలు రాసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా వుంది. విశ్వక్ నా అభిమాన హీరో. విశ్వక్ గారి ఒక సినిమాకి పని చేస్తున్నా. ఆ సినిమా ఇంకా సెట్స్ కి వెళ్ళకముందే మరో సినిమాకి రాసే అవకాశం రావడం  హ్యాపీగా వుంది. అర్జున్ గారు గ్రేట్ యాక్టర్ మాత్రమే కాదు డైరెక్టర్ కూడా. ఇంతమంచి కాంబినేషన్ లో వర్క్ చేయడం సంతోషంగా వుంది. ప్రతి మాట బావుండేలా రాయడానికి ప్రయత్నిస్తా'' అన్నారు.


 


ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ చూసి సర్ ప్రైజ్ అయ్యాను. ''మీరు ఇక్కడ ఏంటి ?' అని అడిగాను. అర్జున్ గారు అంటే ఇష్టం. అద్భుతమైన వ్యక్తి. ఆయన పక్కన నిల్చోవాలనిపించింది'' అన్నారు. ఇది అర్జున్ గారు ఇన్నేళ్ళుగా సంపాదించుకున్న మంచితనం. తన కుమార్తెని ఇండస్ట్రీకి పరిచయం చేయడం ఇంకా నచ్చింది. ఈ సినిమాలో నేను కూడా ఉంటా. ఐతే డబ్బులు మాత్రం తీసుకోనని కండీషన్ పెట్టా(నవ్వుతూ). ఐశ్వర్య ని మీ అందరూ ఆదరించాలి. విశ్వక్ ఎనర్జీటిక్ హీరో. తనకంటూ ఒక ఇమేజ్ ని సంపాదించుకొని ముందుకు వెళ్తున్నారు. మంచి టెక్నికల్ టీమ్ పని చేస్తుంది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను.


 


నటీనటులు: విశ్వక్ సేన్, ఐశ్వర్య అర్జున్, జగపతి బాబు తదితరులు


సాంకేతిక విభాగం:


రచన, దర్శకత్వం, నిర్మాత: అర్జున్ సర్జా


బ్యానర్: శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్


మాటలు: బుర్రా సాయి మాధవ్


సంగీతం : రవి బసూర్


డీవోపీ:  జి. బాలమురుగన్


పీఆర్వో: వంశీ-శేఖర్



Naga Chaitanya Venkat Prabhu Bilingual Film Launched Majestically

 Naga Chaitanya, Venkat Prabhu, Srinivasaa Chitturi, Srinivasaa Silver Screen’s Bilingual Film Launched Majestically



Hero Naga Chaitanya who is riding high with consecutive hits will be joining forces with the ace director Venkat Prabhu for his 22nd film to be made grandly as a bilingual in Telugu and Tamil languages rich production values and first-class technical standards. Srinivasaa Chitturi will be producing this commercial entertainer on Srinivasaa Silver Screen banner, while Pavan Kumar presents it. Krithi Shetty will share the screen space with Naga Chaitanya in NC22 which is also the most awaited #VP11. 


The coming together of the gigantic three for this Telugu-Tamil bilingual project is being viewed as a mammoth combination. What’s more, the movie will have music by the legendary father-son duo of Isaignani Ilaiyaraaja and Yuvan Shankar Raja. This is their first film together and a chartbuster album is assured in the combination. This indeed is going to be one of the major attractions.


The yet-to-be-titled movie was launched majestically today with a Pooja Ceremony in Hyderabad. The team and south celebrities Sivakarthikeyan, Gangai Amaren, yuvan Shankar Raja, Premgi were in attendance for this launch event.


For the muhurtham shot on the lead pair, mass director Boyapati Sreenu sounded the clapboard, while versatile actor Rana Daggubati switched on the camera. Veteran actor and director Bharathi Raja garu, "The Warriorr" director N Lingusamy, and Burugupally Siva Rama Krishna handed over the script to the makers.


While this yet to be titled film marks Naga Chaitanya’s first Tamil movie, Venkat Prabhu is making his debut in Telugu. Many noted actors will feature in the movie, while popular technicians will take care of different crafts. Abburi Ravi has penned dialogues.


The film’s regular shoot commences from July. Other details will be revealed soon.


Cast: Naga Chaitanya, Krithi Shetty and others


Technical Crew:

Story, Screenplay, Direction: Venkat Prabhu

Producer: Srinivasaa Chitturi

Banner: Srinivasaa Silver Screen

Presents: Pavan Kumar

Music: Ilayaraja, Yuvan Shankar Raja

Dialogues: Abburi Ravi

PRO: Vamshi-Shekar

Digital Media: Vishnu Thej Putta

Sammathame Pre Release Event Held Grandly

 'సమ్మతమే' ప్రేక్షకులందరికీ సమ్మతంగా వుంటుంది: ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 'సమ్మతమే' టీమ్



యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ "సమ్మతమే". చాందిని చౌదరి కథానాయికగా నటిస్తోంది. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ జూన్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తుంది. తెలంగాణ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, ఎమ్మెల్యే గాదరి కిషోర్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిధులుగా విచ్చేసిన ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. చిత్ర బృందంతో పాటు మెగా నిర్మాత అల్లు అరవింద్, నిర్మాత బన్నీవాసు, దర్శకుడు సందీప్ రాజ్ ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా 'సమ్మతమే'  బిగ్ టికెట్ లాంచ్ చేశారు నిర్మాత అల్లు అరవింద్.

 


ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. సమ్మతమే గీతా ఆర్ట్స్ లో విడుదల చేయడానికి ముఖ్య కారణం..  కిరణ్ మా గీతా ఆర్ట్స్ సొంత మనిషి. కిరణ్ నటుడు గానే కాకుండా మంచి మనిషి గా నాకు అభిమానం వుంది. నేడు ఇండస్ట్రీలో ఒక పెక్యులర్ పరిస్థితిలో వున్నాం. ప్రతి యంగ్ స్టర్ గుండెల్లో చిన్న భయం వుంది. యంగ్ స్టర్ చిన్న సినిమానే తీస్తాడు. చిన్న సినిమాని థియేటర్లో కి వచ్చి చూస్తారా ? అనే భయం వుంటుంది. అటువంటి తరుణంలో గత వారంలో సినిమాలన్నీ విడుదలై ఆ సినిమాలన్నీ భాగా ఆడుతూ థియేటర్లు  లేని సందర్భంలో ఈ సినిమా రిలీజ్ కావడం వెనుక కిరణ్ లాంటి యంగ్ స్టర్ పక్కన మనలాంటోళ్ళం నిలబడితే థియేటర్లు దొరుకుతాయని, థియేటర్స్ తీసుకొని బాగా రిలీజ్ చేసేలాగా వుండాలని ముందుకొచ్చి విడుదల చేస్తున్నాం. అలాగే కొడుకు ప్రతిభని గుర్తించి అతను పైకి రావాలని తల్లితండ్రులే రిస్క్ చేయడం నాకు కొత్తకాదు. గోపీనాథ్ తల్లితండ్రులు కూడా ముందుకు వచ్చి ఈ సినిమా చేయడం ఆనందంగా వుంది. చాందిని లక్కీ హ్యాండ్. ఆమె సినిమాలు కూడా బావుంటాయి. టెక్నికల్ టీం అంతటికి అల్ ది బెస్ట్. అందరూ ఎంతో ఉత్సాహంగా తీసిన ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అన్నారు


హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. సినిమా తీయడం ఒక ఛాలెంజ్ అయితే ప్రేక్షకులని థియేటర్ కి రప్పించడం మరో ఛాలెంజ్ గా మారిన పరిస్థితి నెలకొంది. థియేటర్స్ ని కాపాడాల్సిన భాద్యత మనందరిపై వుంది. చిన్నవాడినైనా అందరికీ వేడుకుంటున్నాను. టీవీలో ఓటీటీలో సినిమా చూడొచ్చు కానీ థియేటర్ లో సినిమా చూడటంలో ఓ ఆనందం వుంటుంది. పెళ్లి చేసుకోవడానికి ఇద్దరు వుంటే చాలు. కానీ కళ్యాణ మండపం బుక్ చేసి అందరినీ పిలిచి వైభవంగా పెళ్లి చేసుకుంటాం. అందులో ఒక ఆనందం ఉంటుంది. సినిమాని థియేటర్లో చూడటం కూడా లాంటి ఆనందమే వుంది.  నా మొదటి రెండు సినిమాలకి థియేటర్స్ విషయంలో చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఈ సినిమాకి మాత్రం హాయిగా ప్రమోషన్స్ చేసుకొని ఊరూరా తిరిగాను. ఈ విషయంలో నిర్మాత అల్లు అరవింద్, బన్నీ వాసు గారికి రుణపడి వుంటాను. వారితో మాట్లాడితే చాలు ధైర్యంగా వుంటుంది, నాకు ఇంత ధైర్యం ఇచ్చిన వారికి కృతజ్ఞతలు. సమ్మతమే చిత్రం చాలా ప్రశాంతంగా వుంటుంది. ఒక్క ఇబ్బందికరమైన సీన్ కూడా వుండదు. ఫ్యామిలీ కలసి అందరూ ఎంజాయ్ చేస్తారు. థియేటర్ నుండి బయటికి వెళ్ళినపుడు మేము ఒక పాయింట్ చెప్పాం. దాని గురించి ప్రేక్షకులు ఆలోచిస్తారు. ఈ చిత్రానికి పని చేసిన  డీవోపీ సతీష్, ఎడిటర్ విప్లవ్ , సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర.. ప్రతి ఒక్కరికి థాంక్స్. చిత్రాన్ని నిర్మించిన ప్రవీణ అమ్మగారికి కృతజ్ఞతలు. చాందిని నేను షార్ట్ ఫిలిమ్స్ నుండి వచ్చాం. ఇద్దరం కలసి ఈ చిత్రం చేయడం ఆనందంగా వుంది. ఎక్కువగా అలోచించవద్దు. కాన్ఫిడెంట్ గా టికెట్ బుక్ చేసుకోండి. సినిమా మీ అందరికీ నచ్చుతుంది'' అన్నారు.


దర్శకుడు గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. కథ రాస్తూ దర్శకత్వం వహిస్తూ నిర్మాణం కూడా చేయడం అంత సులువుగా సాధ్యం కాదు. అలా సాధ్యం కావాలంటే మన పాత్రని రీప్లేస్ చెస్తూ ఇంట్లో సపోర్ట్ చేసేవారు వుండాలి. అలా నాకు సపోర్ట్ గా నిలిచింది మా సిస్టర్ సౌమ్య. సమ్మతమే సాధ్యపడిందంటే అది తన వల్లే. దర్శకుడు కావాలనుకున్నపుడు ప్యాషన్ అనేవాడిని. కానీ ప్యాషన్ అనే మాట నిర్మాత మాత్రమే వాడాలని ఈ క్రమంలో తెలుసుకున్నాను. ప్రొడక్షన్ చేయడం అంత తేలికకాదు. నాతో పని చేసిన డీవోపీ సతీష్, ఎడిటర్ విప్లవ్ , సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర.. అందరికీ థాంక్స్. కిరణ్ ప్రతి విషయంలో సపోర్ట్ చేశారు. చాందిని గారితో పని చేయడం ఆనందంగా వుంది.  సినిమా చాలా బాగా వచ్చింది.  మీ అందరికీ నచ్చుతుంది'' అన్నారు.


చాందిని చౌదరి మాట్లాడుతూ.. అల్లు అరవింద్ గారి దీవెనలు నాకు లక్కీ చార్మ్ లా అనిపిస్తుంది. కలర్ ఫోటో తర్వాత మరిన్ని మంచి కథలు చేయాలని భావించిన సమయంలో ఎంపిక చేసుకున్న మరో అద్భుతమైన కథ సమ్మతమే. ఒక మంచి పాత్రని ఇచ్చిన గోపీనాథ్ గారికి థాంక్స్. కిరణ్ తో పని చేయడం ఆనందంగా అనిపించింది. శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ కి ఫ్యాన్ నేను. ఈ చిత్రం కోసం అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. సమ్మతమే గీతా ఆర్ట్స్ లో విడుదల కావడం మాటల్లో చెప్పలేని ఆనందం ఇస్తుంది. ఇలాంటి గొప్ప అవకాశం వచ్చినందుకు సంతోషంగా వుంది. మా నిర్మాత ప్రవీణ గారు ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డీవోపీ సతీష్ గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. మిగతా టెక్నికల్ టీం అంతటికి థాంక్స్. ఈ చిత్రాన్ని 24న థియేటర్ లో చూసి సమ్మతమే అనాలని కోరుకుంటున్నాను. ప్రతి అమ్మాయి చూడాల్సిన సినిమా ఇది. అలాగే అన్ని వర్గాల ప్రేక్షకులు తప్పకుండ నచ్చే సినిమా సమ్మతమే'' అన్నారు.


నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. కిరణ్, గోపి ఒక ఏడాదిగా నాతో ప్రయాణం మొదలుపెట్టారు. జులై 1న మా సొంత సినిమా ' పక్కా కమర్షియల్' విడుదలకు వుండగా 'సమ్మతమే' ని ఎందుకు విడుదల చేస్తున్నారని చాలా మంది అడిగారు.  దీనికి రెండు కారణాలు. ఒక యంగ్ టీం మంచి కథతో సినిమాని తయరు చేశారు. ఈ రోజుల్లో ఒక చిన్న, మీడియం సినిమాని విడుదల చేయడానికి చాలా గట్స్ కావాలి. థియేటర్ లో మనుపటి పరిస్థితి లేవు. ఇలాంటి సమయంలో నన్ను కలిసి సినిమా చూడండి నచ్చితే సపోర్ట్ చేయమని అడిగినప్పుడు సినిమా చూడటం జరిగింది. చాలా మంచి సినిమా ఎలాగైనా జనాల్లోకి తీసుకెళ్లాలని నిర్మాత అరవింద్ గారిని అడిగాను. ఏ సినిమా నిర్మాత కూడా తన సినిమా వారంలో విడుదల పెట్టుకొని మరో సినిమాకి తన థియేటర్లు ఇచ్చి ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళే నిర్మాత చాలా అరుదుగా వుంటారు. ఈ విషయంలో అరవింద్ గారికి హాట్స్ ఆఫ్ చెప్పాలి. చిన్న వాళ్ళని, యంగ్ ట్యాలెంట్ ని ఆశిర్వదించాలని ఆయన తీసుకున్న నిర్ణయానికి హాట్స్ ఆఫ్. నాకు ఇష్టమైన వ్యక్తుల్లో కిరణ్ ఒకరు. ఆయనకి ఇండస్ట్రీలో మంచి భవిష్యత్ వుండాలి. మా తరుపు నుండి పూర్తి సపోర్ట్  వుంటుంది. చాందిని గారి కలర్ ఫోటో నేనే రిలీజ్ చేశాను. సమ్మతమేలో కూడా చాందిని గారు అద్భుతంగా నటించారు. ఈ చిత్రాన్ని నిర్మించిన దర్శకుడు గోపినాద్ గారి తల్లితండ్రులు ప్రవీణ వెంకట్ గారికి అభినందనలు. గోపినాద్ కి మంచి భవిష్యత్ వుంది. చాలా సన్నివేశాలు అద్భుతంగా తీశారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.


మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని అందరూ చూసే విధంగా 'సమ్మతమే' అనే టైటిల్ పెట్టడం సంతోషించదగ్గ విషయం. దర్శకుడు గోపీనాథ్, నిర్మాత ప్రవీణ వెంకట్ రెడ్డి, కిరణ్ అబ్బవరం, చాందిని .. టీం అంతటికి అభినందనలు. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు చిత్ర పరిశ్రమకు పూర్తి స్థాయి ప్రోత్సాహన్ని అందిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ స్టామినా నేడు విశ్వవ్యాప్తమైయింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప చిత్రాలు రికార్డులు సృష్టించాయి. యూత్ ట్యాలెంట్ అంతా కలసి సమ్మతమే అనే మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న గోపీనాథ్ కు అభినందనలు. హీరో కిరణ్ అబ్బవరం కి ఈ చిత్రంతో మరింత పేరు వస్తుంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ విడుదల చేయడం అదృష్టం కలిసొస్తుందని నమ్ముతున్నాను. అల్లు అరవింద్ గారు ఆషామాషీ సినిమాలు చేసే నిర్మాత కాదు. ఈ చిత్రం సూపర్ హిట్ కావాలి. భవిష్యత్ లో ప్రవీణ ,వెంకట్ రెడ్డి గారి నిర్మాణంలో మరిన్ని సినిమాలు రావాలి'' కోరుకుంటున్నాను'' అన్నారు   

మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ..యంగ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో వారి తల్లితండ్రులు ప్రవీణ వెంకట్ నిర్మాణంలో 'సమ్మతమే' చిత్రం రావడం ఆనందంగా వుంది. తెలంగాణలో చిత్ర పరిశ్రమకు వెళ్తున్నామంటే తల్లితండ్రులు పెద్ద ఆసక్తి చూపరు. కానీ గోపినాద్ సినిమా తీస్తానని చెప్పినపుడు ముందుకు వచ్చిన వారి తల్లితండ్రులని అభినందిస్తున్నా. సమ్మతమే ట్రైలర్ చూశాను. డైలాగులు నచ్చాయి. విషయం వున్న చిత్రమనిపించింది. అందరికీ సమ్మతమయ్యే చిత్రమౌతుందని నమ్మకం వుంది. కిరణ్ చాందిని  మంచి ఫెఫార్మెన్స్ ఇచ్చారు. నిర్మాత అల్లు అరవింద్ గారు విడుదల చేస్తున్న ఈ చిత్రం తప్పకుండా గొప్ప విజయం సాధిస్తుంది. అంతా యంగ్ టీం కలసి చేసిన ఈ చిత్రం విజయవంతం కావాలని, అందరికీ మంచి భవిష్యత్ వుండాలి'' అని కోరారు. 

నిర్మాత కంకణాల ప్రవీణ మాట్లాడుతూ.. ఈ వేడుకకు విచ్చేసిన మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ గారికి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి గారికి ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గారికి ఎమ్మెల్యే గాదరి కిషోర్ గారికి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. హీరో కిరణ్ గారు, హీరోయిన్ చాందిని గారు ఈ చిత్రంలో అద్భుతంగా నటించి మాకెంతో సపోర్ట్ ఇచ్చారు. కెమరామెన్ సతీస్, సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర, ఎడిటర్ విప్లవ్ టీం అందరికీ ధన్యవాదాలు. ఈ చిత్రం కోసం యూజీ టీం చాలా కష్టపడి పని చేశారు. అందరికీ ధన్యవాదాలు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్న గీతా ఆర్ట్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు. జూన్ 24న సమ్మతమే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇది మా సినిమా కాదు, మనందరి సినిమా. మీరంతా థియేటర్లో సినిమా చూడాలి'' అని కోరుకున్నారు.

సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర మాట్లాడుతూ.. "సమ్మతమే'' ఒక ఫ్యామిలీ జర్నీలా అనిపించింది. పాటలు అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. టీజర్ ట్రైలర్ కో మంచి స్పందన వచ్చింది. దర్శకుడు గోపినాద్ తో పని చేయడం కొత్త అనుభూతిని ఇచ్చింది. పాటలని చాలా అందంగా డిజైన్ చేశారు. కిరణ్, చాందిని అద్భుతంగా నటించారు. సినిమా మీ అందరికీ నచ్చుతుంది'' అన్నారు


ఎడిటర్ విల్పవ్ నైషదం మాట్లాడుతూ: సమ్మతమే క్లీన్ కమర్షియల్ ఎంటర్ టైనర్. యూత్, ఫ్యామిలీ అందరికీ కనెక్ట్ అవుతుంది. దర్శకుడు గోపి చాలా సిన్సియర్, క్లియర్, తనకి ఏం కావాలో క్లారిటీ వున్న దర్శకుడు. శేఖర్ చంద్ర మంచి మ్యూజిక్ ఇచ్చారు. కిరణ్ అబ్బరం, చందనీ అద్భుతంగా నటించారు. మా నిర్మాతలకు కృతజ్ఞతలు. జూన్ 24న సినిమా వస్తుంది. మీ అందరికీ నచ్చుతుంది'' అన్నారు.

డీవోపీ సతీష్ రెడ్డి మాసం మాట్లాడుతూ: 'సమ్మతమే' నా మొదటి సినిమా. కానీ నాకిది పది సినిమాల అనుభవంలా వుంది. సినిమా అద్భుతంగా వచ్చింది. నిర్మాతలు, దర్శకుడు, హీరో కిరణ్ అబ్బవరం, చాందిని, మా యూనిట్ అందరికీ థాంక్స్. సినిమా మీ అందరికీ నచ్చుతుంది'' అన్నారు.

Cinesarkar Entertainments Media Office Launched

 "సినీ సర్కార్ ఎంటర్టైన్మెంట్" మీడియా ఆఫీస్  ప్రారంభం...



 ప్రముఖ పాత్రికేయుడు ,పి ఆర్ ,ఓ వీరబాబు నూతన కార్యాలయాన్ని నేడు హైదరాబాద్ లో ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా యాక్షన్ కింగ్ అర్జున్, 'ఏజెంట్ సాయి శ్రీనివాస్'చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ నక్క పాల్గోన్నారు.


 ఇంకా ఈ కార్యక్రమంలోఆర్టిస్ నాగ మహేష్,దర్జా చిత్ర నిర్మాత  శివశంకర్ పైడిపాటి ,బూరగడ్డ కిషన్ తేజ్, వెంకట్ యాదవ్ ,తదితరులు పాల్గొన్నారు.

MS Raju Interview About 7days 6 Nights

 ఇంట్లో చెప్పకుండా ఒక్కడినే గోవా వెళ్లి '7 డేస్ 6 నైట్స్' స్క్రిప్ట్ రాశాను

- మెగా మూవీ మేకర్ ఎంఎస్ రాజు ఇంటర్వ్యూ



'7 డేస్ 6 నైట్స్' అంటే అమ్మాయిలను తీసుకుని బీచ్‌కు వెళ్లడం కాదు... ఇందులో ఎమోషనల్ కంటెంట్ చాలా ఉంది

- మెగా మూవీ మేకర్ ఎంఎస్ రాజు ఇంటర్వ్యూ


మెగా మేకర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన తాజా సినిమా '7 డేస్ 6 నైట్స్'. మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించారు. వైల్డ్ హనీ ప్రోడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు చిత్రనిర్మాణంలో భాగస్వాములు. ఇందులో సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలు. మెహర్ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లు. 'డర్టీ హరి'తో గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఎంఎస్ రాజు, ఆ తర్వాత దర్శకత్వం వహించిన చిత్రమిది. శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఎంఎస్ రాజుతో ఇంటర్వ్యూ... 


*ప్రశ్న: '7 డేస్ 6 నైట్స్' కథకు మూలం ఏమిటి? మీ మనసులో ఎప్పుడు ఈ ఆలోచన వచ్చింది?*

ఎంఎస్ రాజు: నేను మొదటి నుంచి న్యూ జనరేషన్ సినిమాలతో పాటు పాత చిత్రాలు చూస్తుంటాను. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం... ఎపిక్ సినిమాలు చూస్తా. ఆ సినిమాల్లో స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే... ఇప్పుడు లేవని కాదు. 'బాహుబలి' లాంటి సినిమాలు వస్తున్నాయి. మొదటి మూడు రోజుల్లో డబ్బులు చేసుకోవాలని కొన్ని సినిమాలు వస్తున్నాయి. నేను అలా కాకుండా స్ట్రాంగ్ క్యారెక్టర్లతో సినిమా తీయాలనుకున్నాను. కరోనా కాలంలో 'డర్టీ హరి' తర్వాత కొన్ని కథలు అనుకుంటున్నాను. అప్పుడు రాజ్ కపూర్ 'బర్సాత్' చూశా. అందులో రెండు పాత్రలు నాకు బాగా నచ్చాయి. ఒకడు అతి మంచోడు. వాడికి ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. హీరో ఎప్పుడూ ఏదో ఒక డేంజర్ లో ఉంటాడు. అప్పుడే సినిమా బావుంటుంది. 'ఖుషి'లో విలన్ లేకపోయినా... అమ్మాయి ఓకే అనదు. అదొక కాన్‌ఫ్లిక్ట్ అన్నమాట. 'బర్సాత్' క్యారెక్టర్లు నచ్చడంతో వాటిని స్ఫూర్తిగా తీసుకుని కొత్త కథ రాశా. 


*ప్రశ్న: ఈ సినిమాలో మీ అబ్బాయి సుమంత్ అశ్విన్ పాత్ర ఎలా ఉంటుంది?*

ఎంఎస్ రాజు: 'బర్సాత్'లో రాజ్ కపూర్ క్యారెక్టర్ తరహాలో సుమంత్ పాత్ర ఉంటుంది. తనను గడ్డం పెంచమని, బరువు పెరగమని చెప్పాను. అదొక కేర్‌లెస్ రోల్. జీవితంలో అతడికి ఒక లక్ష్యం ఉంటుంది. దాన్ని ఇంకా చేరుకోలేదు. మరో వైపు ప్రేమించిన అమ్మాయి అమెరికా వెళుతుంది. ఆ డిప్రెషన్ కనిపించాలంటే గడ్డం పెంచి, బరువు పెరగాలని చెప్పాను. పెరిగాడు కూడా! డాక్టర్‌కు సైతం అందని డిప్రెషన్‌లో ఉంటారు. 'బర్సాత్'లో రాజ్ కపూర్ ఫ్రెండ్ రోల్ ప్రేమనాథ్ చేశారు. మన సినిమాలో అటువంటి రోల్ రోహన్ నటించాడు. కథ, నేపథ్యాలు వేర్వేరు. 


*ప్రశ్న: కథ రాసేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి?*

ఎంఎస్ రాజు: కథ, కాన్‌ఫ్లిక్ట్స్‌ బాగా కుదిరాయి. అయితే, యూత్‌ఫుల్ సినిమా కదా! డైలాగ్స్, సీన్స్ ఎలా రాయాలి? అనుకున్నా. అప్పుడు ఒక్కడినే గోవా వెళ్ళాను. మా ఇంట్లో కూడా చెప్పలేదు. రాజమండ్రిలో అమ్మానాన్న దగ్గరకు వెళుతున్నానని చెప్పా. డ్రైవర్ కూడా లేడు. నేనే నడుపుతూ వెళ్ళాను. గోవా వెళ్ళాక ఫోన్ స్విచ్ఛాఫ్ చేశా. ఐదారు రోజులు అంతా తిరిగా. నిర్మాతగా నేను విజయాలు సాధించా. అయితే, దర్శకుడిగా ఆశించిన విజయాలు అందుకోలేదు. అందుకని, పట్టుదలతో '7 డేస్ 6 నైట్స్' కథ రాశా. గోవాలో యువత తిరిగే ప్రదేశాలు తిరిగా. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో గమనించాను. కొంత మందికి 'వీడు మనల్ని కిడ్నాప్ చేస్తాడా?' అనే ఫీలింగ్ కూడా వచ్చింది. అయినా చాలా రీసెర్చ్ చేశా. బయోపిక్ కోసమే కాదు, ఇటువంటి యూత్ ఫిలిమ్స్ చేయాలనుకున్నప్పుడు కూడా రీసెర్చ్ అవసరమే. ప్రతి సినిమాకు నేను ఈ విధంగా కష్టపడతా.     


*ప్రశ్న: సుమంత్ అశ్విన్ ఈ జనరేషన్ కుర్రాడు కాబట్టి అతడి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు కదా!*

ఎంఎస్ రాజు: సుమంత్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. అయితే, ఎంత లేదన్నా తన సర్కిల్ పూర్తిగా వేరు. తనది మెట్రో సిటీస్ కల్చర్. సుమంత్ స్నేహితులతో నేను సరదాగా కూర్చుంటాను. వాళ్ళు మాట్లాడుకునే మాటలు వింటాను. అయితే, నేను ఉన్నప్పుడు వాళ్ళు కొంత ఆలోచించి మాట్లాడతారు.  

 

*ప్రశ్న: ఇండస్ట్రీలో ఎవరూ అట్టెంప్ట్ చేయని సినిమాలు చేయాలనుకుంటున్నారా?*

ఎంఎస్ రాజు: రిటైర్మెంట్ వయసు వచ్చిన తర్వాత ఎవరైనా అలసిపోయామని, ఇక విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు. నాలో రోజు రోజుకూ తపన పెరుగుతోంది.  నేను మధ్యలో వదిలేసిన గ్యాప్ ఉంది కదా! దాన్ని భర్తీ చేసుకునే సినిమాలు తీస్తున్నాను. ఇండస్ట్రీలో ఎవరూ అట్టెంప్ట్ చేయని జానర్ సినిమాలు అని కాదు, ఒక్కసారి సినిమా స్టార్ట్ అయితే అలా వెళ్లిపోయే సినిమాలు చేయాలనుకుంటున్నా. ఒక్కోసారి చిన్న ట్విస్ట్ సినిమాను తిప్పేస్తున్నాయి. అటువంటి సినిమాలు తీయాలనుంది. '7 డేస్ 6 నైట్స్' ఎలా ఉందో ప్రేక్షకులు చెప్పాలి. 


*ప్రశ్న: ఎన్ని థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నారు?*

ఎంఎస్ రాజు: ముందు తక్కువ థియేటర్లలో విడుదల చేయాలనుకున్నాం. అయితే, మొన్న విడుదల ట్రైలర్ విడుదల చేశాక... చాలా మంది అడుగుతున్నారు. థియేటర్ల సంఖ్య పెరుగుతోంది. 


*ప్రశ్న: '7 డేస్ 6 నైట్స్'లో ఇద్దరు కొత్త హీరోయిన్లు ఉన్నారు. వాళ్ళు ఎలా చేశారు?*

ఎంఎస్ రాజు: కొత్త హీరోయిన్లు అని అలుసుగా చూడలేదు. మహేష్ బాబు - భూమిక, ప్రభాస్ - త్రిష, సిద్ధార్థ్ - ఇలియానా నుంచి కొత్త హీరో హీరోయిన్ల వరకూ ఎవరికైనా నేను ఇచ్చే గౌరవం ఒక్కటే. పాత్రలకు తగ్గట్టు వాళ్ళిద్దరూ బాగా చేశారు. 


*ప్రశ్న: ఇది దర్శకుడిగా మీరు నిలబడే ప్రయత్నమా? మీ అబ్బాయిని హీరోగా నిలబెట్టే ప్రయత్నమా?*

ఎంఎస్ రాజు: మా అబ్బాయిని హీరోగా నిలబెట్టాలంటే 'డర్టీ హరి' చేసేవాడిని. అది నాకు కరెక్ట్ కాదనిపించింది. తను ఏ పాత్రకు సూట్ అవుతాడో... ఆ పాత్రకు తీసుకోవాలి. '7 డేస్ 6 నైట్స్'లో ఇద్దరు హీరోలు ఉన్నారు. రోహన్ చేసే కామెడీకి జనాలు నవ్వుతారు. పక్కన మరో ఎమోషనల్ రోల్ ఉంది. దానికి సుమంత్ సూట్ అవుతాడని అతడిని తీసుకున్నా. '7 డేస్ 6 నైట్స్' అంటే ఏదో అమ్మాయిలను తీసుకుని బీచ్‌కు వెళ్లడం కాదు... ఇందులో ఎమోషనల్ కంటెంట్ చాలా ఉంది. ఇంటర్వెల్ నుంచి ప్రేక్షకులు ఒక ట్రాన్స్‌లోకి వెళతారు.  


*ప్రశ్న: మీ అబ్బాయికి రొమాంటిక్ సీన్స్ వివరించేటప్పుడు ఇబ్బంది ఏమైనా పడ్డారా?*

ఎంఎస్ రాజు: సెట్‌లో మా ఇద్దరి మధ్య ప్రొఫెషనల్ రిలేషన్షిప్ ఉండేది. సుమంత్ అశ్విన్ జన్మించే సమయానికి నేను సినిమాల్లో ఉన్నాను. షూటింగ్ వాతావరణంలో పెరిగాడు. సన్నివేశాల గురించి ఇంట్లో నా భార్యకు వివరించేటప్పుడు వినేవాడు. అందుకని, ఇబ్బంది ఏమీ లేదు. ప్రొఫెషనల్స్ గా ఉన్నాం. సెట్‌లో నా దగ్గరకు వచ్చి నెమ్మదిగా ఎలా చేయాలని అడిగేవాడు. చెప్పినట్టు చేశాడు. 


*ప్రశ్న: '7 డేస్ 6 నైట్స్' యూత్ కోసమేనా? ఫ్యామిలీస్ కూడా చూడొచ్చా?*

ఎంఎస్ రాజు: థియేటర్లకు ముందు వచ్చేది యువతరమే. అందుకని, యూత్ సినిమా అంటున్నాను. అలాగే, ఇది ఫ్యామిలీ సినిమా కూడా! శుక్రవారం సాయంత్రానికి కుటుంబ ప్రేక్షకులు అందరూ థియేటర్లకు వస్తారు. ఇది అడల్ట్ కంటెంట్ సినిమా కాదు. సెన్సార్ దీనికి 'యు/ఎ' సర్టిఫికెట్ ఇచ్చింది.  


*ప్రశ్న: 'సతి' సినిమా కంప్లీట్ చేసినట్టున్నారు!*

ఎంఎస్ రాజు: అవును. రాజమండ్రి లాంటి ప్రాంతంలో భార్యాభర్తల మధ్య జరిగే కథతో తీసిన సినిమా 'సతి'. మిస్టరీ జానర్ సినిమా అని చెప్పవచ్చు. 


*ప్రశ్న: మీరు గతంలో తీసిన సినిమాలకు సీక్వెల్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా?*

ఎంఎస్ రాజు: ఒక సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాను. దాన్ని 14 భాషల్లో తీస్తాం. అక్టోబర్ లో స్టార్ట్ కావచ్చు. చాలా పెద్ద స్కేల్ లో ఉంటుంది.

Akash Puri Interview About Chor Bazaar

 చోర్ బజార్ నన్ను కొత్తగా చూపిస్తుంది - హీరో ఆకాష్ పూరి


 


మాస్, కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన చోర్ బజార్ సినిమా ప్రేక్షకులను తప్పక ఆకట్టుకుంటుందని అంటున్నారు యువ హీరో పూరి ఆకాష్. జీవన్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాకు వీఎస్ రాజు నిర్మాత. యూవీ క్రియేషన్స్ సమర్పిస్తున్నది. గెహనా సిప్పీ నాయిక. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపారు పూరి ఆకాష్.



నాకు ఈ సినిమా కథను ఐదు గంటల పాటు చెప్పారు దర్శకుడు జీవన్ రెడ్డి. ఇందులో బచ్చన్ సాబ్ అనే హీరో క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. చోర్ బజార్ ఏరియా అంటే మనం అక్కడి వాళ్లు దొంగతనాలు చేస్తారు అనుకుంటాం. కానీ దగ్గరగా చూస్తే వాళ్ల జీవితాలు వేరుగా ఉంటాయి. అక్కడి మనుషులు, కుటుంబాలు, వాళ్ల కష్టాలు అవన్నీ ఈ సినిమాలో చూస్తారు. హీరో టైర్లు విప్పిసే అమ్మే దొంగ. మీరు కార్ పార్క్ చేస్తే నిమిషాల్లో టైర్లు మాయం చేస్తాడు. ఇందులో రికార్డులు కూడా సాధించేస్తుంటాడు. అయితే ఆ డబ్బుతో అక్కడి పేదవారికి సాయం చేస్తుంటాడు. వాళ్లకు మాత్రం హీరో మంచి వాడు.


నేను ఇప్పటిదాకా చేసిన చిత్రాల్లో ఇది భిన్నమైన సినిమా. పూర్తి కమర్షియల్ అంశాలతో హీరోయిజం ఎలివేట్ చేస్తూ సాగుతుంది. దర్శకుడు జీవన్ రెడ్డి గత చిత్రాల్లోనూ హీరోయిజం బాగా చూపించారు. అలాగే ఈ సినిమాలోనూ ఉంటుంది. నాకు కొత్త ఇమేజ్ క్రియేట్ అవుతుందని ఆశిస్తున్నాను. సీనియర్ నటి అర్చనతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఆమె మా సినిమాలో నటించేందుకు ఒప్పుకోవడమే అదృష్టం అనుకుంటాం. నా పేరు బచ్చన్ సాబ్ అని ఆమె పెడతారు. నాకు బచ్చన్ సాబ్ అనే పేరు పెట్టడం నాన్న పూరీకి బాగా నచ్చింది. దిల్ దార్ గా బతుకే వ్యక్తి అతను. ఇది కంప్లీట్ గా ఫిక్షన్ క్యారెక్టర్.


ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చాలా స్టైలిష్ గా ఉంటాయి. క్లైమాక్స్ పదిహేను నిమిషాలు అదిరిపోతుంది. ఫైట్ మాస్టర్ పృథ్వీ బాగా ఫైట్స్ కంపోజ్ చేశారు. వజ్రం ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తుంది. డైమండ్ ఒక క్యారెక్టర్ గా కనిపిస్తుంది. హీరోయిన్ మూగ అమ్మాయిగా ఉంటుంది అనగానే నాకు ఎగ్జైటింగ్ గా అనిపించింది. మూగ అమ్మాయి అంటే మనం జాలి పడతం కానీ వాళ్లు మాకేం తక్కువ కాదు అనే ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మాటలు రాకున్నా హీరోయిన్ స్పీకర్ పెట్టి సినిమా డైలాగ్స్ తో సమాధానం చెబుతుంది.


పాటలు, ట్రైలర్ చూశాక నాన్న పూరి జగన్నాథ్ ..సినిమా బాగుందిరా గ్రాండ్ గా కనిపిస్తుంది అని చెప్పారు. ఈ సినిమా కథ ఆయనకు తెలియదు. నీ సినిమాల నిర్ణయాలు నువ్వే తీసుకో, ధైర్యంగా ముందుకెళ్లు అంటారు. నాన్న ఆయన పనుల్లో బిజీగా ఉంటారు. నేను కథ వినేప్పుడే ఒక ప్రేక్షకుడిగా వింటాను. ఈ సినిమాను దర్శకుడు జీవన్ రెడ్డి మీదున్న నమ్మకంతో చేశాను. చానార్ వంటి లొకేషన్స్ లో షూటింగ్ చేశాం. ఒక పెద్ద సెట్ లో కూడా చిత్రీకరణ జరిపాం.


నాకూ వెను వెంటనే సినిమాలు చేయాలని ఉంటుంది. కానీ పరిస్థితులు వేరుగా ఉంటాయి. నాకు ఇప్పటికిప్పుడు ఒక హిట్ సినిమా కావాలి. అందుకోసం ప్రయత్నిస్తున్నా. రొమాంటిక్ సినిమా వేడుకలో నేను హీరోగా నిలబడతాను అని వేదిక మీద చెప్పాను. అందుకు కాలర్ ఎగరేసా. అది ఒక సినిమాతో అయ్యేది కాదు. జర్నీలో జయాపజయాలు భాగమే. చోర్ బజార్ సినిమాలో ఒక కొత్త ప్రపంచం చూస్తారు. జీవన్ రెడ్డి పెద్ద సీన్స్ తెరకెక్కిస్తారు. ఒక సీన్ సాయంత్రం ఆరు గంటలకు మొదలు పెడితే రాత్రి మూడయ్యింది. 


వెబ్ సిరీస్ లలో నటించడం ఇష్టమే కానీ నా మొదటి ప్రాధాన్యం సినిమాకే. సినిమాను థియేటర్ లో చూడాలని కోరుకుంటా. ఎందుకంటే అక్కడే సినిమాకు గౌరవం లభిస్తుంది. నా గత సినిమాలు చూసిన వాళ్లు నా వయసుకు మించిన పాత్రలు చేశానని అన్నారు. ఇక నుంచి అందరికీ నచ్చే సినిమాలే ఎంచుకోవాలని అనుకుంటున్నాను. రెండు మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటి వివరాలు త్వరలో వెల్లడిస్తా.

Prakash Nag - A New Face for the Telugu Industry in GODSE

 Prakash Nag - A New Face for the Telugu Industry in GODSE



SatyaDev starrer Godse, directed by Gopi Ganesh Pattabhi and produced by C. Kalyan under the banner of CK Screens, was released on June 17.  Prakash Nag, who plays a negative role in the film, impressed the audience with his portrayal of a smooth-talking politician.  He interacted with the media on the occasion of the movie's release in theatres.


The film highlights the issues that are seen in society and community. It shows the gaps in our political and governing systems and what may be going wrong.  The character of Ajay Saradhi in this movie is sophisticated, and is a lead negative role in this film, with a strong social message. 


“The Director and I met via common social connections, we discussed briefly the vision and the storyline. I was keen to be a part of a strong message, in a defining role that brings social awareness. Being my first movie, I thank the Director, the Producers, the Lead Actors, and the Co-Actors for being patient and also for an excellent work team. The journey with Satya Dev , has been amazing. He is a very balanced actor. "


"In my personal life, I operate as a business consultant and an advisory role to with MNCs across the world.  I have worked and continue to work with multiple sectors of business in Manufacturing, Services, Hotels, Hospitality, and working in the Middle East/ Africa / Europe / USA  / Far East while being based in Dubai, UAE. I am an Indian first -  my roots are of Telugu Origin- I was born in Vizag, however, being born into an Army / Defense Services family – I have traveled and lived across India” 


“I intend to continue to explore the world of media and movies and look forward to being cast in a character with a twist, mystery, and intensity in the upcoming projects.  As regards more movies - some stories are under conversation now will let you as we finalize something soon."

It is 'Pelli SandaD' time with ZEE5 from June 24

 It is 'Pelli SandaD' time with ZEE5

Blockbuster musical rom-com is set to stream from June 24



Hyderabad, 22nd June, 2022: ZEE5 has had the sole aim of dishing out the best entertainment, be it in the form of comedy, drama, or action. The beloved OTT platform has been continuously engaging its patrons for years by choosing a variety of stories and myriad subjects. From web series, direct-to-digital releases, and new films, it has been offering them all. In recent months, it has brought out post-theatrical releases such as 'RRR', 'Bangarraju', 'Rowdy Boys', 'Varudu Kaavalenu', and many more.


And now, ZEE5 is all set to stream the blockbuster hit 'Pelli SandaD'. Starring Roshan Meka and Sreeleela, the musical romantic comedy has been one of the most sought-after by the audience. And the wait of the audience is coming to an end, with ZEE5 set to stream the film from June 24.


The film was creatively headed by K Raghavendra Rao, while Gowri Ronanki directed it. Movie buffs have reacted to the announcement with glee. There is excitement in the air ahead of the streaming. On social media, the audience are expressing joy through replies and posts over the fact that Pelli SandaD is finally hitting OTT more than eight months after its theatrical release.


ZEE5 has been releasing movies and originals every month. It has been moving forward with the sole aim of keeping its patrons engaged. In recent months, 'Gaalivaana' and 'Recce' have become big hits. 'Oka Chinna Family Story', 'Loser', 'Loser 2', Sumanth-starrer 'Malli Modalaindi', among others, have been streaming successfully on ZEE5.


Dance icon a new Show from Oak Entertainment in aha

'డ్యాన్స్ ఐకాన్‌' అనే సరికొత్త షోతో వస్తున్నారు ఆహా, ఓక్‌ ఎంటర్‌టైన్మెంట్

- 22 జూన్‌ నుంచి ప్రారంభం కానున్న ఆడిషన్స్



నెమలికి నేర్పిన నడకలివి అని ఆనాడు పాడిన, రారా రమ్మంటున్న రణరంగంలో సిద్ధంగున్నా చావో రేవో తేలాలిపుడే డ్యాన్స్ అని ఈ మధ్య పాడినా, డ్యాన్స్ అనే పదం వినపడగానే ప్రతి ఒక్కరికీ వారిలో ఉన్న ఒక డ్యాన్సర్‌ బయటికొస్తారు. మరి మీలో ఎవరైనా అలాంటి డ్యాన్సర్‌ ఉంటే, ఆ ప్రతిభ మీకుంటే ఆహా, ఓక్‌ ఎంటర్‌టైన్మెంట్‌తో కలిసి సమర్పిస్తున్న 'డ్యాన్స్ ఐకాన్‌' అనే షో మీ కోసమే. మీ ప్రతిభకు మా వేదిక శిరస్సు వంచి ఆహ్వానిస్తుంది. ఇంకా ఎందుకు ఆలస్యం, ఆడిషన్స్ ఇచ్చేయండి, డ్యాన్స్ ఐకాన్‌ టైటిల్‌ను గెలుచుకోండి.

జూన్‌ 22 నుంచి ప్రారంభం కానున్న ఈ షో డిజిటల్‌ ఆడిషన్స్ జులై 10 వరకు కొనసాగుతాయి. మీ వయసు 5 నుంచి 50 మధ్యలో ఉన్నట్టయితే, మీరు తెలుగు రాష్ట్రాలకి చెందిన వారైతే, మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. danceikon@oakentertainments.comఅనే ఈ మెయిల్‌కు, 60 సెకండ్స్ మీ డ్యాన్స్ వీడియోని మెయిల్‌ చేయండి.

ఈ షో యాంకర్‌, ప్రొడ్యూసర్‌ ఓంకార్‌ మాట్లాడుతూ ''ఈ షో ద్వారా నేను ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ లోకి అడుగుపెడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అరవింద్‌గారికి, ఆహాకు ధన్యవాదాలు. నేను ఎన్నో డ్యాన్స్ షోస్‌ చేశాను. కానీ ఇది చాలా డిఫరెంట్‌గా ఉండబోతుంది. ఈ షో కంటెస్టంట్స్ తో పాటు వారిని కొరియోగ్రాఫ్‌ చేసే మాస్టర్స్ జీవితాల్ని కూడా మార్చేస్తుంది. గెలిచిన కంటెస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌కు టాలీవుడ్‌లో ఒక పెద్ద హీరోకి నేను డ్యాన్స్ కొరియోగ్రాఫీ చేసే అవకాశం వస్తుంది. అది ఎవరు అని మేము ఫినాలేలో చెప్తాం. అందుకే ఈ షో మీ కోసమే. మీరు డ్యాన్స్ చేయగలరు అనుకుంటే తప్పకుండా ఈ షోలో పార్టిసిపేట్‌ చేయాలని కోరుకుంటున్నాను.''

ఇంకా ఎందుకు ఆలస్యం, మీ డ్యాన్స్ షూస్‌ వేసుకుని నచ్చిన పాటకి డ్యాన్స్ చేసి - డ్యాన్స్ ఐకాన్‌ అనిపించుకోండి.

 

Mass Maharaja Ravi Teja Ramarao On Duty Releasing On July 29th

 Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri’s Ramarao On Duty Releasing On July 29th



Mass Maharaja Ravi Teja’s unique action thriller Ramarao On Duty directed by debutant Sarath Mandava and produced grandly by Sudhakar Cherukuri under SLV Cinemas LLP and RT Teamworks is done with its shoot. Post-production works are currently underway for the movie. Meanwhile, today the makers announced release date of the movie.


Ramarao On Duty will have grand release worldwide on July 29th. It’s nearly one month left for the film’s theatrical release. The team will up the game with massive promotional campaign in coming days. Ravi Teja is seen giving serious gaze in the announcement poster. The film will be high on action and thrilling elements and Ravi Teja will appear in a power-packed role.


The film based on real incidents features two heroines- Divyansha Kaushik and Rajisha Vijayan. Venu Thottempudi in his comeback will be seen in a vital role in the movie.


Sam CS rendered soundtracks and first two songs of the movie enthused melody song lovers. While cinematography of the film was done by Sathyan Sooryan ISC, Praveen KL is the editor.


Cast: Ravi Teja, Divyasha Kaushik, Rajisha Vijayan, Venu Thottempudi, Nasser, Sr Naresh, Pavitra Lokesh, ‘Sarpatta’ John Vijay, Chaitanya Krishna, Tanikella Bharani, Rahul Rama Krishna, Eerojullo Sree, Madhu Sudan Rao, Surekha Vani and more.


Technical Crew:

Story, Screenplay, Dialogues & Direction: Sarath Mandava

Producer: Sudhakar Cherukuri

Banner: SLV Cinemas LLP, RT Teamworks

Music Director: Sam CS

DOP: Sathyan Sooryan ISC

Editor: Praveen KL

Art Director: Sahi Suresh

PRO: Vamsi-Shekar

Karthikeya-2 teaser will be unveiled on June 24th

 Karthikeya-2 teaser will be unveiled on June 24th.



One of the most awaited sequels this year is Nikhil's Karthikeya-2. Chandu Mondeti has taken Karthikeya to a new level of the expedition to a hidden city Dwaraka. Motion poster, Characters introducing posters created enough buzz and hyped up the expectations on this film.


Makers unveiled a teaser announcement video where Nikhil, Anupama Parameswaran, Srinivas Reddy, and Harsha Chemudu were seen in their respective getups in the aftermath of the fight scene setup.


Peoples Media Factory and Abhishek Pictures are bankrolling this crazy project while Kalabhairava is composing the music. Karthikeya-2 is scheduled to be released on July 22nd worldwide.

Oo Antava Mava Oo Oo Antava Mava Movie Title Launch

రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న   "ఊ అంటావా మావా ఊఊ  అంటావా మావ"



కాశ్మీర్ లోని అందమైన లొకేషన్స్ లలో పాటలకు చిత్రీకరించడానికి వెళ్తున్న "ఊ అంటావా మావా ఊఊ  అంటావా మావ"


శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్  పతాకంపై యస్వంత్ , జబర్దస్త్ రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ నటీనటులుగా రేలంగి నరసింహారావు దర్శకత్వంలో తుమ్మల ప్రసన్నకుమార్ నిర్మిస్తున్న చిత్రం "ఊ అంటావా మావా ఊఊ  అంటావా మావ" ఈ చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుని రెండు పాటల షూట్ కొరకు కాశ్మీర్ కు వెళుతున్న సందర్బంగా చిత్ర యూనిట్  హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో సినీ అతిరదుల మధ్య  టైటిల్ అనౌన్స్ మెంట్ కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చి ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు కొల్లి రామకృష్ణ, ఫిలిం ఛాంబర్ ప్రధాన కార్యదర్శి దామోదర్ ప్రసాద్ లు "ఊ అంటావా మావ ఊఊ  అంటావా మావ" చిత్ర టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో  నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, దర్శకులు అజయ్  కుమార్, రాజా వన్నెం రెడ్డి, సత్య ప్రకాష్, ఆచంట గోపినాథ్ , దర్శకుడు  సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాత బెక్కం వేణుగోపాల్ తదితరులు హాజరయ్యి చిత్ర యూనిట్ కు బ్లెస్సింగ్స్ ఇచ్చారు అనంతరం చిత్ర  యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో



ముఖ్య అతిధిగా వచ్చిన ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు కొల్లి రామకృష్ణ మాట్లాడుతూ.. దాసరి గారితో నేను ఎక్కువగా ట్రావెల్ చేయడం జరిగింది.. ఆలా నాకు రేలంగి గారు నాకు బాగా పరిచయం. తను చేసిన చాలా సినిమాలు  బిగ్ హిట్టయ్యాయి. అయన దర్శకత్వంలో  ప్రసన్న  చేస్తున్న ఈ సినిమా బాగా వచ్చింది. ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.




ఫిలిం ఛాంబర్ ప్రధాన కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ప్రస్తుతం క్రాఫ్ట్ తెలిసిన వారు చాలా తక్కువ మంది వున్నారు.అన్ని తెలిసిన దర్శకుడు నరసింహా రావు గారు లాంటి  దర్శకత్వంలో చాలా రోజుల తర్వాత మంచి టైటిల్  తో నిర్మిస్తున్న ప్రసన్న గారికి  ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.




చిత్ర దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ... నిర్మాత ప్రసన్న గారు పిలిచి "ఊ అంటావా మావ ఊఊ  అంటావా మావ" సినిమా చేస్తారా అని అడిగారు. ఇప్పటి వరకు చేసిన కామెడీ సీనిమాలకు భిన్నంగా ఉండాలని కామెడీ డెవిల్స్. ఎన్నో హార్రర్ సినిమాలు వచ్చాయి. అయితే ఇది పూర్తి హార్రర్ సినిమా కాదు. ఇందులో కామెడీ తో కూడుకున్న హార్రర్ సినిమా. ప్రసన్న కుమార్ గారికి ఈ సినిమా చాలా ప్లస్ అవుతుంది. ఈ సినిమా అందరూ చాలా డెడికేటెడ్ గా చేశాము.  ఇందులో హీరోలుగా యస్వంత్ , జబర్దస్త్ రాకేష్ లను,నటి సత్య కృష్ణ కూతురు అనన్య అయితే బాగా ఉంటుందని సెలెక్ట్ చేయడం జరిగింది.ఈ సినిమాను రామోజీ ఫిల్మ్ సిటీ లో మంచి క్యాస్టింగ్ తో, మంచి టెక్నిషియన్స్  తో ఈ సినిమా చెయ్యడం జరిగింది.కొన్ని పాటలు, మినహా సినిమా పూర్తి అయ్యింది.  కాశ్మీర్ లో  జరిగే పాటల షూట్ తో సినిమా పూర్తి చేసుకొని జులై చివరి వారంలో ఈ సినిమాను విడుదల చేస్తాము అని అన్నారు.





చిత్ర నిర్మాత తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. మా సినిమా అనౌన్స్ మెంట్  కార్య క్రమానికి వచ్చిన ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు కొల్లి రామకృష్ణ గారు భైరవ ద్వీపా నికి నంది అవార్డు విన్నర్ అయిన తను అప్పటి నుండి ఇప్పటివరకు ఇండస్ట్రీ కి సేవ చేస్తూ ఆడియో గ్రాఫర్ యూనియన్ నాయకుడిగా, కార్మిక నాయకుడిగా, తరువాత ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జి బ్యూటర్స్ లకు నాయకుడిగా ఎదిగిన కొల్లిరామకృష్ణ గారు , ఛాంబర్ ప్రధాన కార్యదర్శి  దామోదర్ ప్రసాద్, దర్శకులు అజయ్ కుమార్, రాజా వన్నెం రెడ్డి, సత్య ప్రకాష్, ఆచంట గోపీనాథ్ , మా నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ,నిర్మాత బెక్కం వేణుగోపాల్,దర్శకుడు  సునీల్ కుమార్ రెడ్డి,దర్శకుడు చంద్ర మహేష్ ఇలా అందరూ మా సినిమాను ఆశీర్వదించ డానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. ఇప్పటి వరకు వచ్చిన కామెడీ సినిమాలు ఎలా చరిత్ర సృష్టించాయో ఇప్పుడు వస్తున్న "ఊ అంటావా మావ ఊఊ  అంటావా మావ" కూడా చరిత్ర సృష్టిస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ సినిమా చేశాము. గతం లో 76 సినిమాలతో సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు మా రేలంగి నరసింహారావు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. రేలంగి గారు ఇప్పటికీ ఎంతో డెడికేషన్ తో వర్క్ చేయడం చాలా గ్రేట్, డి .ఓ. పి శంకర్ గారు డబ్బు కోసం కాకుండా ఎమోషన్ కు పని చేస్తారు తన కెమెరా పని తనం ఎంతో అత్యంత అద్భుతంగా ఉంటుంది , ఎడిటర్ వెలగపూడి రామారావు ,చీఫ్ కో డైరెక్టర్  రామారావు కూరపాటి, రఘు కుంచె,యస్వంత్ , జబర్దస్త్ రాకింగ్ రాకేష్, అనన్య  ఇలా టీం అందరు మాకు  ఎంతో ప్రేమగా  ఫుల్ సపోర్ట్ తో సినిమాకు వర్క్ చేశారు. అందరూ ఎంతో కస్టపడి చేసిన ఈ సినిమా రేలంగి నరసింహారావు గారు గత సినిమాల రికార్థులను ఈ సినిమా అదిగమించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.



నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ...ఎన్నో హిట్ సినిమాలు తీసిన రేలంగి నరసింహారావు  గారి దర్శకత్వంలో  మిత్రుడు ప్రసన్న నిర్మాణ సారద్యం లో వస్తున్న ఈ చిత్రాన్ని రామోజీ ఫిల్మ్ సిటీ లో నిర్మించారు ఇందులో నాకు మంచి పాత్ర ఇచ్చారు.మంచి కామెడీ హార్రర్ సినిమా గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.



దర్శకులు అజయ్ కుమార్ మాట్లాడుతూ..టైటిల్ చాలా బాగా ఉంది. ఈ టైటిల్ తో కథ రెడీ చేసి కామెడీ సినిమాగా మలచడం చాలా గ్రేట్. ప్రసన్న గారే టైటిల్ చెప్పి ఈ టైటిల్ తో దర్శకుడుతో మంచి కథ రెడీ చేయించుకుని సినిమా తీస్తున్నారు.వీరిద్దరి కాంబినేషన్  లో వస్తున్న ఈ టైటిల్ కు ఎలా జస్టిఫికేషన్ చేసారో తెలియాలి అంటే సినిమా తప్పక చూడాలి. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.



రాజా వన్నెం రెడ్డి మాట్లాడుతూ.. రేలంగి గారు నా గురువు. ప్రేక్షకులలో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఈ టైటిల్ తో దెయ్యాల కథలో కామెడీ జోడించి చేసిన ఈ సినిమా ప్రసన్నకు, మా గురువు గారికి ఈ సినిమా పెద్ద విజయం సాదించాలి అన్నారు.



నిర్మాత ఆచంట గోపినాథ్ మాట్లాడుతూ..మేము ఈ రోజు ఈ స్టేజ్ మీద ఉండడానికి కారకుడు రేలంగి నరసింహ రావు గారు. సినిమా ఇండస్ట్రీలో నాకు ఎటువంటి అండలేని టైం లో నాకు రేలంగి,బాలయ్య బాబు లతో సినిమా చేసి నన్ను నిర్మాతగా నిలబెట్టారు.ఇప్పటికీ నిర్మాతగా వున్నాను అంటే దానికి వీరిచ్చిన సపోర్ట్ మరువలేను. .ప్రసన్న గారు మంచి డైరెక్టర్ ను సెలక్ట్ చేసుకుని,మంచి టైటిల్ తో వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాదించాలి అన్నారు.


నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ప్రసన్న గారు నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేశాడు. నేను ఈ రోజు నిర్మాతగా ఎదగడానికి తను నాకు ఎంతో సపోర్ట్ గా నిలిచాడు.రేలంగి గారు సినిమాలు చూసి ఇండస్ట్రీ కు వచ్చాను తను ఎంతో మంది నిర్మాతలకు సక్సెస్ నిచ్చాడు. అలాంటి వారితో  చాలా పాజిటివ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ప్రసన్న  గారికి,ఈ చిత్రంలోని నటీనటులకు, టెక్నిషియన్స్ అందరికీ ఈ చిత్రం మంచి పేరు తీసుకువస్తుంది అన్నారు.



నటి సత్య కృష్ణ మాట్లాడుతూ.. ప్రసన్నగారి బ్యానర్ లో రేలంగి నరసింహారావు  దర్శకత్వం లో  మంచి కామెడీ హార్రర్ సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా  ఉంది అన్నారు.



దర్శకుడు  సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రేలంగి గారు నాకు గురువు లాంటి వారు తను ఎన్నో హిట్ మూవీస్ ఇచ్చారు.మంచి కామెడీ, హార్రర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి  అన్నారు.



దర్శకుడు చంద్ర మహేష్ మాట్లాడుతూ..ఈ మధ్య కామెడీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. ఇలాంటి టైం లో ప్రపంచాన్ని ఊపేసిన పాటను టైటిల్ గా పెట్టి కామెడీ, హర్రర్ సినిమా తీస్తున్న ఈ సినిమా దర్శక, నిర్మాతలకు పెద్ద విజయం  సాదించాలి  అన్నారు.



నటుడు చిట్టి బాబు మాట్లాడుతూ..రేలంగి నరసింహరావు వంటి సీనియర్ దర్శకులతో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తాను. ప్రసన్న సర్ తను ఈ సినిమా చేసినా మంచి క్యారెక్టర్స్ ఇస్తూ వస్తున్నారు. ఇలాంటి వీరిద్దరి కాంబినేషన్ లో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు



హీరో యస్వంత్ మాట్లాడుతూ.. మంచి కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాము.కంటెంట్ ను నమ్మే నిర్మాత, కంటెంట్ ను కరెక్ట్ గా ప్రాజెక్ట్ చేసే సీనియర్స్ తో వర్క్ చేసే అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం గా ఉంది అన్నారు.



హీరోయిన్ అనన్య మాట్లాడుతూ.. ఎన్నో హిట్ సినిమాలు చేసిన ప్రసన్న సర్, రేలంగి సర్ లతో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు



జబర్దస్త్ రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ..చిన్న కమెడీయన్ గా చేస్తున్న నాకు రేలంగి సర్, ప్రసన్న సర్ లు తమ సినిమాలో హీరో గా నటించే అవకాశం కల్పించారు. వారికి నా ధన్యవాదాలు.ఇలాంటి మంచి  సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.నేను ఎదిగితే చూడాలి అనుకునే శంకర్ గారికి ధన్యవాదాలు.కామెడీ హార్రర్ తో వస్తున్న ఈ సినిమా అందరికి నచ్చుతుంది అన్నారు.



నటుడు,మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె మాట్లాడుతూ... చాలా రోజుల తర్వాత వస్తున్న హాస్య భరిత చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాధాలు అన్నారు




నటీ నటులు

యస్వంత్ , జబర్దస్త్ రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్, రఘు కుంచె, సత్య కృష్ణ, తుమ్మలపల్లి రామసత్యనారాయణ  తదితరులు


సాంకేతిక నిపుణులు

ప్రొడ్యూసర్ :  ప్రసన్న కుమార్

ద‌ర్శ‌క‌త్వం : రేలంగి నరసింహారావు

చీఫ్ కో డైరెక్టర్ : రామారావు కూరపాటి

కో డైరెక్టర్స్ : కోటి, గోలి వెంకటేశ్వర్లు

ఎడిటర్ : వెలగపూడి రామారవు

మ్యూజిక్ : సాబు వర్గీస్

మాట‌లుః అంగిరెడ్డి శ్రీనివాస్

డి .ఓ .పి : కంతేటి శంకర్

ఆర్ట్స్ :తెలప్రోలు శ్రీనివాస్

పిఆర్. ఓ : మధు వి. ఆర్