Latest Post

Detective Satyabhama Movie Release Pressmeet

 ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి ఈ నెల 31 న వస్తున్న సోని అగర్వాల్‌  ‘డిటెక్టివ్‌ సత్యభామ’



 సిన్మా ఎంటర్టైన్మెంట్‌ పతాకంపై  శ్రీశైలం పోలెమోని నిర్మాతగా నవనీత్‌ చారి దర్శకత్వంలో సోనీ అగర్వాల్‌ నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘డిటెక్టివ్‌ సత్యభామ’. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల డిసెంబర్ 31న సుమారు 500 థియేటర్స్ లలో విడుదల చేస్తున్నారు.ఈ సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్, టీజర్, పాటలను చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్  విడుదల చేశారు. డిటెక్టివ్‌ సత్యభామ చిత్రం లోని ట్రైలర్ ను నిర్మాత పోలెమోని శ్రీశైలం విడుదల చేశారు.  అలాగే ఇందులోని మొదటి పాటను  రాజ పోలెమోని విడుదల చేయగా, నటి సునీత పాండే రెండవ పాటను, సినీ పి.ఆర్.ఓ ఆర్.కె. చౌదరి మూడవ పాటను, నటి శివ జ్యోతి  నాలుగవ పాటను, నటుడు మురళి ఐదవ పాటను విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో_


 చిత్ర నిర్మాత శ్రీశైలం పోలెమోని మాట్లాడుతూ ..  ప్రతి ఒక్కరూ నా సినిమా అనుకోని చాలా కష్టపడ్డారు.సోనీ అగర్వాల్ ఈ సినిమాలో చాలా చక్కగా నటించారు.7 జి బృందావనం చేసినప్పటి ఫ్యాన్స్ ఇప్పడు వస్తున్న ఈ సినిమా విడుదల కోసం ఇంకా ఎదురు చూస్తుండం గొప్ప విషయం.. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశాను సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేవిధంగా అన్ని అంగులతో తీర్చి దిద్దాము. స్క్రీన్ మాక్స్  ప్రసాద్ గారు మా చిత్రాన్ని  విడుదల చేస్తున్నందుకు ధన్యవాదాలు. ప్రపంచ వ్యాప్తంగా  ఈ నెల 31 న సుమారు 500 థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని అన్నారు.


     

 చిత్ర దర్శకుడు నవనీత్‌ చారి మాట్లాడుతూ .. సంగీత దర్శకుడుగా వర్క్ చేసిన నాకు నేను చెప్పిన కథను నిర్మాత శ్రీశైలం పోలెమోని నమ్మి నాకీ అవకాశం ఇచ్చారు. ఇందులో నటించిన వారంతా నేను అనుకున్న దానికంటే ఎక్కువ చేశారు. టెక్నిసిషన్స్ అందరూ చాలా డెడికేటెడ్ గా వర్క్ చేశారు.ఎవ్వరు ఎక్సెప్ట్ చెయ్యని ట్విస్ట్స్,టర్న్స్ ఇందులో ఉంటాయి. ఇందులోని పాటలు చాలా బాగుంటాయి..సోనీ అగర్వాల్ యాక్షన్స్ సీన్స్ ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటాయి.

సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో ఈ నెల 31 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధిస్తుంది అన్నారు .


 డి.ఓ.పి లక్కీ మాట్లాడుతూ .. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. స్క్రీన్ మాక్స్ ద్వారా ప్రసాద్ గారు విడుదల చేస్తున్నారు.మాకు దర్శక,నిర్మాతలు ఎంతో సపోర్ట్ చేసినందున ఈ సినిమా త్వరగా షూట్ కంప్లీట్ అయ్యింది. యూత్ కు కావాల్సిన అంశాలు అన్ని ఇందులో ఉంటాయి.


 నటి శివజ్యోతి మాట్లాడుతూ .. ఇది నా నాలుగవ సినిమా ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలకు ఇది భిన్నంగా ఉంటుంది. అందరం ఎంతో కష్టపడి చేశాము.ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు.


 ఈ చిత్రంలో లీడ్ రోల్ లో నటించిన సునీత పాండే  మాట్లాడుతూ .. కార్పొరేటర్ తరువాత వస్తున్న మూడవ చిత్రమిది. "డిటెక్టీవ్ సత్యభామ'  వంటి మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.


 మాటల రచయిత సంతోష్ ఇంగాని మాట్లాడుతూ .. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు.


 నటుడు మురళి మురళి మాట్లాడుతూ. . మా నిర్మాతకు థియేటర్స్ లోనే విడుదల చేయాలని పట్టుబట్టి ఈ నెల 31 న విడుదల చేశారు.అందరం ఎంతో మంచి మనసుపెట్టి నటించాము. ఈ నెల 31 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న మా చిత్రాన్ని  ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని అన్నారు.


 నటీ నటులు :

సోని అగర్వాల్‌, సాయి పంపన, రవివర్మ, సునీత పాండే, రోబో గణేష్‌, సోనాక్షివర్మ, సంజన, పూజ, బాలు, రెహాన్‌, భరత్‌ తదితరులు.


 సాంకేతిక నిపుణులు :

బ్యానర్‌ : సిన్మా ఎంటర్టైన్మెంట్‌

నిర్మాత : శ్రీశైలం పోలె మోని

సంగీతం`దర్శకత్వం: నవనీత్‌ చారి

కెమెరా&ఎడిటర్‌: లక్కీ ఏకరి

డైలాగ్‌ : సంతోష్ ఇంగాని

పి.ఆర్‌.ఓ : ఆర్‌.కె. చౌదరి

Pan India Film LIGER (Saala Crossbreed) First Glimpse Date And Time Locked

 Vijay Deverakonda, Puri Jagannadh, Karan Johar, Charmme Kaur’s Pan India Film LIGER (Saala Crossbreed) First Glimpse Date And Time Locked



Pan India star Vijay Deverakonda and dashing director Puri Jagannadh’s maiden Pan India project LIGER (Saala Crossbreed) that also marks Dynamite Mike Tyson’s debut in Indian cinema is nearing completion.


As part of promotions, the makers will be coming up with multiple updates. The Big Announcement video is out now and it announces the date and time of First Glimpse. The video begins with a voiceover and the makers announce, “Witness The Madness. Unleashing The Beast To The Nation… Glimpse On December 31st at 10:03 AM.”


On December 30th, we will have two special treats. While BTS Stills will be released at 10:03 AM, Special Insta Filter will be unveiled at 4 PM.


Liger is going to be one of the biggest action extravaganzas in India, as it deals with the subject of Mixed Martial Arts and moreover, it features Legend Mike Tyson in a mighty role.

In association with Puri connects, the film is being produced jointly by Bollywood's leading production house Dharma Productions. Puri Jagannadh, Charmme Kaur, Karan Johar and Apoorva Mehta together are bankrolling the film on a grand scale.


The film in the crazy combination has cinematography handled by Vishnu Sarma, while Kecha from Thailand is the stunt director.


Ramya Krishnan and Ronit Roy play prominent roles in Liger which is being made in Hindi, Telugu, Tamil, Kannada and Malayalam languages.


The Pan India Movie is ready to splash its blood, sweat and entertainment, as it is releasing in theatres worldwide on 25th August, 2022.


Benchmark Studios Proud To Welcome Mythri Movie Makers On Board For Sudheer Babu Aa Ammayi Gurinchi Meeku Cheppali

 Benchmark Studios Proud To Welcome Mythri Movie Makers On Board For Sudheer Babu, Mohanakrishna Indraganti’s Aa Ammayi Gurinchi Meeku Cheppali



Hero Sudheer Babu and director Mohanakrishna Indraganti’s third film together titled Aa Ammayi Gurinchi Meeku Cheppali is done with its shooting. The most happening actress Krithi Shetty is playing Sudheer Babu’s love interest in the film produced jointly by B Mahendra Babu and Kiran Ballapalli, while Gajulapalle Sudheer Babu presents it under Benchmark Studios.


Benchmark Studios is proud to welcome Tollywood’s leading production house Mythri Movie Makers on board for Aa Ammayi Gurinchi Meeku Cheppali which is tipped to be a romantic entertainer with a wonderful love story. The film is already carrying good buzz for the successful combination and appealing title. Now, Mythri Movie Makers being part of the project will be a big advantage for it.


The makers have also announced to release first look poster of the movie soon.


Vivek Sagar composes the music, while cinematography is handled by P G Vinda. Sahi Suresh and Marthand K Venkatesh look after art and editing departments respectively.


Avasarala Srinivas, Vennela Kishore, Rahul Ramakrishna, Srikanth Iyengar and Kalyani Natarajan are the other prominent cast in the film.


Cast: Sudheer Babu, Krithi Shetty, Avasarala Srinivas, Vennela Kishore, Rahul Ramakrishna and others.


Technical Crew

Writer, Director: Mohanakrishna Indraganti

Producers: B Mahendra Babu, Kiran Ballapalli

Presenter: Gajulapalle Sudheer Babu

Banner: Mythri Movie Makers, Benchmark Studios

Music Director: Vivek Sagar

DOP: P G Vinda

Art Director: Sahi Suresh

Editor: Marthand K Venkatesh

Lyrics: Sirivennela Seetharama Sastry, Rama Jogayya Sastry, Kasarla Shyam

Co -Director: Kota Suresh Kumar

PRO: Vamsi Shekar

Hero Sree Vishnu Interview About Arjuna Phalguna

 అర్జున ఫల్గుణలో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో పాటు అద్భుతమైన ఎమోషన్స్ ఉంటాయి -  హీరో శ్రీ విష్ణు



శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం అర్జున ఫ‌ల్గుణ‌. తేజ మార్ని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో హీరో శ్రీ విష్ణు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..


ఈ ఏడాది ఇది నా మూడో చిత్రం

ఈ ఏడాదిలో నాకు ఇది మూడో చిత్రం. రైటింగ్ స్కిల్స్, రైటర్స్‌ని నేను ఎక్కువ ఎంచుకున్నాను. కొత్త దర్శకులనే నేను ఎంచుకుంటూ వచ్చాను. మంచి కథతో దర్శకులు వస్తే.. అన్నీ దగ్గరుండి నేనే చూసుకుంటాను. నాకు మొదటి సారి తేజ మార్నిలో దర్శకుడు కనిపించాడు. బాగా హ్యాండిల్ చేయగలడని నాకు నమ్మకం కలిగింది. ఎమోషన్ సీన్స్ బాగా రాశాడు. ఎమోషనల్ హ్యాండిల్ చేయగలిగితే సినిమా వర్కవుట్ అవుతుంది. అందుకే సినిమాను ఓకే చేశాను. చాలా తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేసి నాకు షాక్ ఇచ్చాడు. 55 రోజుల్లో షూట్ చేయడం చాలా కష్టం. చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు.


ఈ టైటిల్ అలా వచ్చింది

అర్జున ఫల్గుణ అనేది భారతంలోని టాపిక్. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటీ, కృష్ణ, విజయ, ఇలా ఓ పది పేర్లు తలుచుకుంటూ ధైర్యం వస్తుందని పురాణాల్లో చెప్పారు. కానీ రాను రాను అది అర్జున ఫల్గుణ వరకే చెప్పారు. ఉరుములు మెరుపులు పిడుగులు వస్తే అందరూ అర్జున ఫల్గుణ అని అనుకునేమనేవారు. కానీ కొన్ని పేర్లు విన్నప్పుడు, తలుచుకున్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది. అలా అర్జున ఫల్గుణ అనే పేరులో ఆ వైబ్రేషన్స్ ఉంటాయి. ఈ సినిమాకు ముందుగా వేరే పేరు అనుకున్నాం. కానీ అది కుదరలేదు. ఒకరోజు వర్షంలో కూర్చుని డైరెక్టర్, నేను మాట్లాడుకున్నాం. అలా ఈ టైటిల్ వచ్చింది.


చాలా ఫ్రెష్‌గా అనిపించింది

నన్ను తేజ కలిసినప్పుడు జోహార్ సినిమా ఇంకా రాలేదు. ఆర్టాస్ అనే కూల్ డ్రింక్ అనే పాయింట్ ఈస్ట్ వెస్ట్ వాళ్లకు మాత్రమే తెలుసు. నాకు ఇంకా అవి గుర్తున్నాయి. గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్‌లో కథ చేయాలని అనుకున్నాను. ఊరి బ్యాక్ డ్రాప్‌లోంచి సిటీకి వచ్చిన కథలు చేశాను. కానీ మొత్తం ఊరి బ్యాక్ డ్రాప్‌లో చేయలేదు. ఇది చాలా ఫ్రెష్‌గా అనిపించింది. పూర్తి కథను సిద్దం చేయమని చెప్పాను.


ఐదుగురు కుర్రాళ్ల కథ

మేం ఐదుగురం ఫ్రెండ్స్. ఆ పేర్లలో ఫస్ట్ లెటర్స్‌తో ఆర్టాస్ అని వస్తుంది. ఇంతకు ముందు అయితే ఆర్టాస్ కూల్‌డ్రింక్‌ కంపెనీలో పని చేసే కుర్రాళ్ల కథ. కానీ అది కుదరలేదు. అందుకే సోడా మీదకు కథ మార్చేశాం. డిగ్రీ అయిపోయి ఊర్లోనే ఉంటూ సంపాదించుకుందామనే కుర్రాళ్ల కథ. సిటీకి వెళ్లి పాతిక వేలు సంపాదించేకంటే.. ఊర్లో ఉండి పది వేలు సంపాదించుకుని తల్లిదండ్రులను బాగా చూసుకుంటే చాలని అనుకునే మనస్తత్వంతో ఉంటారు.


కరెక్ట్ స్లాంగ్

ఇది వరకు చాలా సినిమాల్లో ఈ యాసలో మాట్లాడాను. కానీ ఇప్పుడు పూర్తిగా గోదావరి యాసలోనే  ఉంటుంది. ఇది కరెక్ట్ స్లాంగ్. ఈ సినిమాలో యాస పరంగా ఎలాంటి హద్దుల్లేవు. పూర్తిగా ఎటకారంగా ఉంటుంది.


ఫీమేల్ కారెక్టర్‌ను స్ట్రాంగ్‌గా చూపిస్తాను

గ్రామ వాలంటీర్ల గురించి తప్పుగా వెళ్లింది. ట్రైలర్ అలా కట్ చేశాం కాబట్టి అలా అనిపించింది. నా ప్రతీ సినిమాల్లో ఫీమేల్ కారెక్టర్‌ను స్ట్రాంగ్‌గా చూపిస్తాను. ఇందులో కూడా అలానే ఉంటుంది. కానీ ఆ గ్యాంగులో ఎవరికీ ఉద్యోగం రాకుండా ఆ అమ్మాయికి మాత్రమే వస్తుందని కడుపు మంటతో అలా మాట్లాడతారు. వివాదమనిపిస్తే, నిజంగానే ఎవరైనా హర్ట్ అవుతారని నాకు అనిపిస్తే నేనే ముందుగా సీన్లు తీసేయమని అంటాను.


ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పుకునే అవకాశం

తెలుగు హీరోలందరినీ నేను ఆరాధిస్తాను. అందరినీ ఇష్టపడతాను. పెద్ద ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇలా అందరినీ నేను గొప్పగా చూస్తుంటాను. మన హీరోలను గౌరవించుకునే అవకాశం వస్తే నేను దాన్ని వాడుకుంటాను. వాళ్లంతా గొప్ప వాళ్లు కాబట్టే స్టార్లు అయ్యారు. నాకు ఈ సినిమాలో ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పుకునే అవకాశం వచ్చింది. ఇందులో ఎంతో పాజిటివ్‌గా ఉంటుంది.


నర్సీపట్నం ఘటనల ఆధారంగా..

యథార్థ సంఘటనలే కానీ దాన్ని గోదావరి జిల్లాకు అడాప్ట్ చేశాం. నర్సీపట్నంలో జరిగిన ఘటనల ఆధారంగానే ఈ సినిమాను తీశాం.


ఆ సీన్లు అద్భుతంగా వచ్చాయి.

మన దగ్గర పర్మిషన్ త్వరగా రాదని ట్రైన్ ఎపిసోడ్ కోసం ఒరిస్సా వెళ్లాం. రెండు రోజుల పర్మిషన్ అనుకుంటే ఇచ్చింది ఒక రోజే. అందులోనూ కరెక్ట్‌గా రెండున్నర గంటలే దొరికాయి. అందులోనూ మేం గట్టిగా వాడింది గంటన్నర మాత్రమే. చాలా కష్టపడి సీన్లు తీసేశాం. బ్రిడ్జ్ దగ్గర సీన్లు అద్భుతంగా వచ్చాయి. బ్రిడ్జ్ దగ్గర పరిగెత్తే సీన్లలో కిందకు మాత్రం చూడొద్దని అన్నారు. కానీ మధ్యలోకి వెళ్లాక చూశాను. నాకు ఒక్కసారిగా భయమేసింది.


తెలుసుకునే ప్రయత్నం చేస్తారు..

తెలుగు టైటిల్స్ నాకు చాలా ఇష్టం. తెలుగులో పెట్టేందుకే నేను ఎక్కువగా మొగ్గు చూపుతుంటాను. అలా మధ్య మధ్యలో సంస్కృత పదాలు కూడా పెడుతుంటాను. ఈ తరం వాళ్లకు అర్జున ఫల్గుణ అనేది ఎవ్వరికీ తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఒకరో ఇద్దరూ దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.


ఐదు నిమిషాల్లోనే..

అర్జున ఫల్గుణలో అద్భుతమైన ఎమోషన్స్ ఉంటాయి. పద్దతులు, సంప్రదాయాలు చూపిస్తాం. ఫ్రెండ్స్ మధ్య ఉండే ఎమోషన్ బాగా ఉంటుంది. సినిమా ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే ముల్కల లంక అనే ఊర్లోకి వెళ్తారు.


ప్రతీ ఒక్కరు హీరో..

రంగస్థలం మహేష్, చైతన్య, రాజావారు రాణివారు చౌదరి, నేను, అమృతా అయ్యర్ మేం ఐదుగురం ఉంటాం. ప్రతీ పాత్రకు సమానమైన ప్రాధాన్యం ఉంటుంది. పెద్ద నరేష్ గారు, శివాజీ రాజాగారు, సుబ్బరాజు గారు అందరూ అద్భుతంగా నటించారు. తేజ అందరి దగ్గరికి వెళ్లి మీరే హీరో అని చెప్పినట్టున్నాడు. ప్రతీ ఒక్కరు హీరోలా ఇరగ్గొట్టేశారు.


అవే నా బలం..

రియలిస్టిక్ సినిమాలు చేయడం అంత ఈజీ కాదు. కెరీర్‌లో ఒకటో రెండో రియలిస్టిక్ కథలు వస్తాయి. కానీ నా దగ్గరకు వచ్చిన ప్రతీ కథను రియలిస్టిక్ చేసేందుకు ప్రయత్నిస్తాను. నా సినిమాలన్నీ నాచురల్‌గా ఉంటాయని అందరూ అంటుంటారు. రియలిస్టిక్‌ కథలే నా బలం.


కొత్తగా చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాను..

నేను పెద్దగా ప్రయోగాలు ఏమీ చేయలేదు. నార్మల్ కథనే కాస్త కొత్తగా చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాను. తిప్పరా మీసం సినిమాను బాగా నమ్మాం. అమ్మ సెంటిమెంట్‌తో ఆ సినిమా చేశాను. అంతకు ముందే బ్రోచేవారెవరురా అంటూ ఫుల్ కామెడీ సినిమాను తీశాను. తిప్పరా మీసం కూడా ఎక్కువ సరదాగా ఉంటుందని అనుకున్నారు. కానీ అది పూర్తిగా మదర్ సెంటిమెంట్‌తో ఉంటుంది. కానీ నా వరకు అదే బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన చిత్రం.


రియలిస్టిక్‌గా అనిపిస్తాయి..

ప్రియదర్శన్ అనే కొత్త అబ్బాయి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సుధీర్ రాసిన డైలాగ్స్ ఎంతో రియలిస్టిక్‌గా అనిపిస్తాయి. డైలాగ్స్ రాసినట్టు ఎక్కడా అనిపించవు.


మంచి యాక్షన్ డ్రామా..

భళా తందనాన అనే సినిమా చేస్తున్నాను. లక్కీ మీడియాలో మరో చిత్రం చేస్తున్నాను. భళా తందనాన పెద్ద స్పాన్ ఉన్న సినిమా. మంచి యాక్షన్ డ్రామా. లక్కీ మీడియాలో చేస్తోన్నది పోలీస్ ఆఫీసర్ బయోగ్రఫీ. ఇందులో ఐదు ఏజ్ గ్రూపులుంటాయి.


పెద్ద సినిమాల హవా ఇప్పట్లో తగ్గదు..

మనకు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. రాజ రాజ చోర కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే విడుదల చేశాం. ఒమిక్రాన్ వస్తుందంటే మనం ఏం చెప్పలేం. ఇక పెద్ద సినిమాల హవా ఇప్పట్లో తగ్గదు. మాకు కనీసం ఓ వారం సోలోగా దొరికిందని సంతోషంగా ఉన్నాం. కొత్త ఏడాదిని ఇలా పాజిటివ్ సినిమాతో ప్రారంభిస్తే బాగుంటుందని అనిపించింది. ఇది కరెక్ట్ సీజన్. ముందు డిసెంబర్ మొదటి రెండు వారాల్లో అనుకున్నాం. కానీ చివరకు ఇలా డిసెంబర్ చివరన వస్తున్నాం.


నాకు చాలా సిగ్గు..

నాకు చాలా మొహమాటం. కానీ క్లోజ్ అయితే చాలా దూరం వెళ్తాను. నా డైరెక్షన్ టీం, కెమెరా డిపార్ట్మెంట్ ఇలా అందరి మీద చేతులు వేసుకుని మాట్లాడుతాను. కెమెరా ముందు పోజులు పెట్టాలంటే కూడా నాకు చాలా సిగ్గు. ఓ అరవై రోజులు ఒకే చోట ఉంటాం కాబట్టి అందరితో కలిసిపోవడానికి ట్రై చేస్తాను.


మమ్మల్ని చాలా నమ్మారు..

నిర్మాత నిరంజన్ రెడ్డి గారు వైల్డ్ డాగ్, ఆ తరువాత ఆచార్య మధ్యలో మేం. కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారు. ఎప్పుడూ కూడా ఆయన మమ్మల్నీ ఏమీ అడగలేదు. ఆయన మమ్మల్ని చాలా నమ్మారు.

Sarasalu Chalu Movie Launched Grandly

 పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "సరసాలు చాలు"




 సికే ఇన్ఫిని సమర్పణలో మూన్ వాక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నరేష్ అగస్త్య,సంజన సారధి జంటగా డాక్టర్ సందీప్ చేగూరి దర్శకత్వంలో బి.చంద్రకాంత్ రెడ్డి 

నిర్మిస్తున్న  'సరసాలు చాలు'  చిత్రం పూజ కార్యక్రమాలు హైదరాబాద్ లోని జె ఆర్.సి కన్వెన్షన్ సెంటర్ లో ఘణంగా జరుపుకుంది..ఈ కార్యా క్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ చిత్ర యూనిట్ కు స్క్రిప్ట్ ను అందజేయగా..చిత్ర నిర్మాత భార్య శృతి రెడ్డి  హీరో, హీరోయిన్ లపై తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్ కొట్టారు, నిర్మాత చంద్రకాంత్ రెడ్డి ,రోహిత్ లు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. లూజర్ వెబ్ సిరీస్  దర్శకుడు అభిలాష్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.ఈ పూజా కార్యక్రమాలు అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో


 చిత్ర నిర్మాత బి.చంద్రకాంత్ రెడ్డి  మాట్లాడుతూ . చిన్నప్పటి నుండి  సినిమా అంటే ఏంతో ఇష్టం ఉండడంతో  సందీప్ చెప్పిన కథ నచ్చి  ఈ మూవీ చేస్తున్నాను రొమాంటిక్ కామెడీ  ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులను అలరించే విధంగా తీస్తాము.ఇక ముందు మా బ్యానర్లో ఇలాంటి మంచి సినిమాలు చేస్తాము అని అన్నారు


 చిత్ర దర్శకుడు డాక్టర్ సందీప్ చేగూరి మాట్లాడుతూ . ఒక "చిన్న విరామం" సినిమా తర్వాత వస్తున్న నా రెండవ సినిమా "సరసాలు చాలు" పేరుకు తగ్గట్టే ఈ సినిమా చాలా కలర్ ఫుల్ బ్రీజి ఎంటర్ టైనర్.,కామెడీ కు ఇంపార్టెంట్ ఇస్తూ సాగే ఫుల్ కామెడీ క్లిన్ ఎంటర్ టైనర్ గా  ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ప్రతి కపుల్ కి, రిలేషన్ షిప్ లో ఉన్న వాళ్ళకి, పెళ్లైన వాళ్ళ కి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది.ఇందులో  కూడా ఎమోషన్స్, హార్ట్ బ్రేక్స్, నవ్వులు, కోపాలు ఉంటాయి. మంచి రొమాంటిక్ కామెడీతో వస్తున్న ఈ చిత్రంలో అద్భుతమైన నాలుగు పాటలు ఉంటాయి. మూడు షెడ్యూల్లో  ఈ సినిమాను పూర్తి చేసి సమ్మర్ లో విడుదల చేస్తామని  అన్నారు. 


 చిత్ర హీరో నరేష్ అగస్త్య మాట్లాడుతూ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు. 


 హీరోయిన్ సంజన సారధి మాట్లాడుతూ..దర్శకుడు చెప్పిన కథ వినగానే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. నటనకు మంచి స్కోప్ వుండే ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు. 


ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.


 నటీనటులు

నరేష్ అగస్త్య,సంజన సారధి తదితరులు 


 సాంకేతిక నిపుణులు

సమర్పణ : సికే ఇన్ఫిని

బ్యానర్ : మూన్ వాక్ ఎంటర్టైన్మెంట్స్

నిర్మాత : బి.చంద్రకాంత్ రెడ్డి 

రైటర్, డైరెక్టర్ : డాక్టర్ సందీప్ చేగూరి

డి.ఓ.పి : రోహిత్ బట్చు,

మ్యూజిక్ : భరత్ మంచిరాజు

పి ఆర్.ఓ : శ్రీధర్

ప్రొడక్షన్స్ డిజైనర్ : ఝాన్సీ

4 Years of Okka Kshanam Allu Sirish recalls Memories

 4 Years of Okka Kshanam: Allu Sirish recalls how film screened in 4 different languages in 4 years



Allu Sirish's Okka Kshanam clocked 4 years to its release today, which was screened in 4 different languages. The Telugu film went on to garner rave reviews by Hindi, Tamil and Malayalam audiences, truly a 'Pan-India' film. Taking to his social media, Allu Sirish shared, "Okka Kshanam has completed 4 years and it remains one of my best films. The Telugu version was dubbed into Hindi as "Shoorveer 2" and became a big hit on television & YouTube. In the last lockdown, the film got dubbed into Tamil as "Andha Oru Nimidam" on Star Vijay and repeated its success on Disney+HotStar too. Finally it got dubbed into Malayalam to repeat & was well received by the audience and critics.It's a moment of pride for director Vi Anand and myself that our sci-fi thriller was screened in 4 India languages & was successful in all of them. Truly a "pan Indian" film. Couldn't have asked for a better way to celebrate 4 years of Okka Kshsnam. Thank you everyone for all the love."

Radhe Shyam Musical Tour Begins From Vizag

 Radhe Shyam Musical Tour Begins From Vizag



Radhe Shyam is one of the most anticipated films in Indian cinema at the moment. The Prabhas starrer is up for theatrical release on the 14th of January and the film is riding high on expectations already. 


Now, Radhe Shyam's musical tour has begun in Vizag. A promotional wagon with Radhe Shyam's posters imprinted all over it has been inaugurated by fans and this wagon will be extensively used to promote the film through offline mediums.


Prabhas will be actively taking part in Radhe Shyam's promotions from the 7th of January. He will be interacting with pan-India media outlets and promote Radhe Shyam.


Prabhas plans to take the hype surrounding Radhe Shyam to a whole new level with his whirlwind promotions. Also, the makers are planning to line up more promotional material in the days to follow. 


Radhe Shyam is a proper love drama directed by Radha Krishna Kumar. The film has Prabhas and Pooja Hegde in the lead roles.

Bhala Chora Bhala Shooting Completed

 షూటింగ్ పూర్తి చేసుకున్న ‘భళా చోర భళా’



ఖయ్యూమ్, నవీన్ నేని, రోయిల్ శ్రీ, చింటు, శాంతి దేవగుడి, రామ్ జగన్, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో యాక్టివ్ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న చిత్రం ‘భళా చోర భళా’. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మిస్టరీ చిత్రానికి ఏ. ప్రదీప్ దర్శకత్వం వహిస్తుండగా.. ఏ. జనని ప్రదీప్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది.


ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఏ. ప్రదీప్ మాట్లాడుతూ.. ‘‘సరికొత్త కథాంశంతో ‘భళా చోర భళా’ చిత్రం తెరకెక్కిస్తున్నాము. ఫుల్ లెంగ్త్ కామెడీ‌తో పాటు మిస్టరీ అంశాలు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. మంచి ఆర్టిస్టులు కుదిరారు. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరిపి త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం. లక్షణ్ సినిమాటోగ్రఫీ.. సింహ కొప్పర్తి, వెంకటేష్ అద్దంకిల మ్యూజిక్; రవితేజ నిమ్మన ఆర్ట్ వర్క్ హైలెట్‌గా ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఈ చిత్రం ఉంటుంది. త్వరలోనే విడుదల వివరాలను ప్రకటిస్తాము. సహకరించిన అందరికీ ధన్యవాదాలు..’’ అని తెలిపారు.


ఖయ్యూమ్, నవీన్ నేని, రోయిల్ శ్రీ, చింటు, శాంతి దేవగుడి, రామ్ జగన్, చిత్రం శ్రీను, వెంకటేష్, రవి కిరణ్, రవి శంకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి

సినిమాటోగ్రఫీ: లక్ష్మణ్,

ఎడిటింగ్: వెంకటేష్,

ఎడిటర్: రాము అద్దంకి,

ఆర్ట్: రవితేజ నిమ్మన,

సంగీతం: సింహ కొప్పర్తి, వెంకటేష్ అద్దంకి;

నిర్మాత: ఏ. జనని ప్రదీప్,

కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: ఏ. ప్రదీప్. 

Yagna Movie Shooting Started

    `య‌జ్ఞ` మూవీ షూటింగ్ ప్రారంభం!!



 ముర‌ళీ మూవీ క్రియేష‌న్స్ బేన‌ర్ పై పొందూరి లక్ష్మీదేవి స‌మ‌ర్ప‌ణ‌లో పొందూరి రామ్మోహ‌న్ రావు నిర్మిస్తోన్న చిత్రం `య‌జ్ఞ‌`.  చిత్త‌జ‌ల్లు ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వంలో సుగ‌మ్య శంక‌ర్‌, నందిని , రాఘ‌వ, చ‌ర‌ణ్ జ‌డ్చ‌ర్ల హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. భానుచంద‌ర్, జీవా, బాలాజీ, గౌతంరాజు, సుమ‌న్ శెట్టి, పొట్టి చిట్టిబాబు, క‌విత‌, జ‌బ‌ర్ద‌స్త్ అప్పారావు ప్ర‌ధాన పాత్ర‌ల్లో  న‌టిస్తున్నారు.  ఈ చిత్రం ప్రారంభోత్స‌వం ఈ రోజు హైద‌రాబాద్ లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టియ‌ఫ్‌సిసి ఛైర్మ‌న్ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్ ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ నివ్వ‌గా ల‌య‌న్ సాయి వెంక‌ట్ కెమెరా స్విచాన్ చేశారు. గూడూరు చెన్నారెడ్డి, శ్రీమ‌తి విజ‌య‌ల‌క్ష్మి, మారంరెడ్డి కొండా రెడ్డి, కొండ‌పాక శ్రీరామ మూర్తి పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు.

 అనంత‌రం ఏర్పాటు  చేసిన పాత్రికేయుల స‌మావేశంలో ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ...``ద‌ర్శ‌క నిర్మాత‌లు ఇద్ద‌రూ నాకు చాలా కావాల్సిన‌వారు. సినిమా పట్ల ఎంతో అభిరుచి ఉన్న వ్య‌క్తులు. క‌థ విన్నాను. చాలా బాగుంది. సినిమా విజ‌యవంతంగా షూటింగ్ పూర్తి అవ్వాలని కోరుకుంటూ ... సినిమా విడుద‌ల విష‌యంలో మా తెలంగాణ చాంబ‌ర్ అన్ని విధాలుగా సాయ‌ప‌డుతుంది`` అన్నారు.

 ల‌య‌న్ సాయి వెంక‌ట్ మాట్లాడుతూ...``య‌జ్ఞ‌` టైటిల్ చాలా బావుంది. ఎంతో అనుభ‌వం ఉన్న ద‌ర్శ‌కులు ప్ర‌సాద్ గారు. కొత్త, పాత న‌టీన‌టుల‌తో రూపొందుతోన్న ఈ చిత్రం యూనిట్ అంద‌రికీ మంచి పేరు తీసుక‌రావాల‌న్నారు.

 ద‌ర్శ‌కుడు చిత్త‌జ‌ల్లు ప్ర‌సాద్ మాట్లాడుతూ...``హార‌ర్  అండ్ రొమాంటిక్  కామెడీ చిత్రంగా `య‌జ్ఞ‌` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. కొత్త‌, పాత న‌టీన‌టులు న‌టిస్తున్నారు. మా నిర్మాత ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమాను నిర్మించ‌డానికి ప్లాన్ చేశారు. ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు షూటింగ్ చేస్తాం. కొంత గ్యాప్ త‌ర్వాత జ‌న‌వ‌రి 5నుంచి 15 రోజుల పాటు కంటిన్యూ షెడ్యూల్ ప్లాన్  చేశాం`` అన్నారు.

 నిర్మాత పొందూరి రామ్మోహ‌న్ రావు మాట్లాడుతూ...``మా చిత్రం ప్రారంభోత్స‌వానికి విచ్చేసి మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించిన అతిథులంద‌రికీ నా ధ‌న్య‌వాదాలు. ప్ర‌సాద్ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో ఈ సినిమా ప్రారంభించాను. నా గ‌త చిత్రాల‌న్నీ ఆదిరించారు. ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారి కోరుకుంటున్నా`` అన్నారు.

  హీరో రాఘ‌వ మాట్లాడుతూ...`` య‌జ్ఞ ` చిత్రంలో హీరోగా న‌టించే అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు నా కృత‌జ్ఞ‌త‌లు`` అన్నారు.

 ఇంకా  ఈ కార్య‌క్ర‌మంలో హీరోయ‌న్లు నందిని, సుగ‌మ్య శంక‌ర్ పాల్గొన్నారు.

   భానుచంద‌ర్, జీవా, బాలాజీ, గౌతంరాజు, సుమ‌న్ శెట్టి, పొట్టి చిట్టిబాబు, క‌విత‌, జ‌బ‌ర్ద‌స్త్ అప్పారావు, కోట‌కొండ కృష్ణ‌, క‌రుణాక‌ర్, సికింద‌ర్, భీమ్ రాజ్‌, రాజేష్‌, మునిచంద్ర‌, ధ‌ర్మ‌తేజ‌, మ‌ల్లీశ్వ‌రి, మంజుల‌, దీపిక‌, స్వ‌ర్ణ‌ల‌త‌, శ్రీజ రెడ్డి, దివ్య‌, సంజ‌న త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్ః ఎస్‌.క‌ర‌ణ్‌,  ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్ః శ్యామ్ కోట‌, కో-డైర‌క్ట‌ర్ః కొండా శ్రీనివాస‌రెడ్డి;  కెమెరాః శ్రావ‌ణ్ కుమార్‌;  సంగీతంః దేవేంద‌ర్‌; ఆర్ట్ డైర‌క్ట‌ర్ః శివ బోగోలు;  కొరియోగ్ర‌ఫీః తాజ్ ఖాన్‌, ఫైట్స్ః హుస్సేన్ భాయ్‌;  పాట‌లుః జి.సీతారామ చౌద‌రి, ఎస్ ర‌ఘుబాబు;  పీఆర్వోః చందు ర‌మేష్‌;  నిర్మాతః పొందూరి రామ్మోహ‌న్ రావు, క‌థ‌-స్ర్ర్క్రీన్ ప్లే-మాట‌లు-ద‌ర్శ‌క‌త్వంః చిత్త‌జ‌ల్లు ప్ర‌సాద్.


New The Ten Commendments Releasing on New Year

 ప్రపంచమంతటా నూత‌న సంవ‌త్స‌ర  కానునగా విడుద‌ల కానున్న‌

న్యూ ‘ది టెన్ కమాండ్మెంట్స్’



ప్ర‌పంచ సినిమా చ‌రిత్ర లో   ‘ది టెన్ కమాండ్మెంట్స్’ ది ఒక ప్ర‌త్యేక స్థానం. ఓల్డ్ టెస్టెమెంట్ లోని మోషే చేసిన అద్భుతం ని తెర‌మీద కు తెచ్చిన ‘ది టెన్ కమాండ్మెంట్స్’ ఒక విజువ‌ల్ వండ‌ర్. ఎర్ర స‌ముద్రం ని రెండుగా చీల్చిన మోషే క‌థ ఇప్ప‌టికీ క‌న్నుల‌ముందు ఒక అద్భుతంగా క‌నిపిస్తుంది. దేవుని పై న‌మ్మ‌కం ఉంచి మోషే చేసిన ఈ అద్భుతం ఇప్పుడు మరో సారి వెండిత‌ర మీద నూత‌న సంవ‌త్స‌ర కానుక‌గా రాబోతుంది.


1956లో సెసిల్ బి డెమిల్లే (అమెరికన్ సినిమా వ్యవస్థాపక పితామహుడిగా, చలనచిత్ర చరిత్రలో అత్యంత విజయవంతమైన నిర్మాత/దర్శకుడిగా నిలిచిన వ్యక్తి) 220 నిమిషాల నిడివితో “ది టెన్ కమాండ్‌మెంట్స్” చిత్రాన్ని (పారామౌంట్ పిక్చర్స్) ప్రపంచ సినీ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

భారతదేశంలో, ఈ చిత్రం ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు మరియు చెన్నై (క్యాసినో) వంటి మెట్రో నగరాలలో 50 వారాలకు పైగా ప్రదర్శితమైంది.

65 సంవత్సరాల తర్వాత ఆ అద్భుతమైన చిత్రాన్ని రీమేక్ చేశారు. ఇందులో డౌగ్రే స్కాట్ (మిషన్ ఇంపాజిబుల్ 2 & బాట్‌వుమన్ 2022 ఫేమ్) మోసెస్‌ పాత్రలో నటించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 2021, డిసెంబర్ 31న నూత‌న సంవ‌త్స‌ర కానుకగా పాన్ ఇండియా స్థాయిలో (ఇంగ్లీష్, తమిళం & తెలుగులో) మరియు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

ఈ చిత్రంలో మోసెస్‌గా డౌగ్రే స్కాట్, ఆరోన్‌గా లినస్ రోచ్, మెనెరిత్‌గా నవీన్ ఆండ్రూస్, జిప్పోరాగా మియా మాస్ట్రో, రామ్‌సెస్‌గా పాల్ రైస్, అనందర్‌గా రిచర్డ్ ఓబ్రెయిన్, జెరెడ్‌గా సిలాస్ కార్సన్, యువరాణి బిథియాగా పద్మా లక్ష్మి, మిరియమ్‌గా సుసాన్ లించ్, రాణిగా క్లైరే బ్లూమ్, ఇంకా జెత్రోగా ఒమర్ షరీఫ్ నటించారు.

రాబర్ట్ డోర్న్‌హెల్మ్ మరియు జెఫ్రీ మడేజా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జేసన్ కామియోలో, రాండీ ఎడెల్‌మాన్ సంగీతం, ఎడ్వర్డ్ జె పేయ్ సినిమాటోగ్రఫీ అందించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 31వ తేదీన ప్రపంచమంతటా ఈ చిత్రం బ్రహ్మాండమైన స్థాయిలో విడుదల కాబోతుంది.

Iravatham Movie lyrical song launch by BiggBoss Contestants

 ఐరావతం"సినిమాలోని 'నా దేవేరి' పాట లిరికల్ వీడియోని రిలీజ్ చేసిన బిగ్ బాస్ టీం 



నూజివీడు టాకీస్ నుంచి రేఖ పలగాని సమర్పణలో  వస్తున్న చిత్రం ఐరావతం.ఈ సినిమాలోని  "ఓ నా దేవేరి" లిరికల్ వీడియో ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా రిలీజ్ అయినందుకు ఆరోజు గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. రామ్ మిర్యాల పాడిన ఈ పాట రిలీజైన మొదటి ఇరవై నాలుగు గంటల్లో మంచి వ్యూస్ వచ్చాయి. అలాగే ఇంతకు ముందే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చినట్టు తెలిపారు. 


ఈ ఈవెంట్ లో బిగ్ బాస్ 5 టీమ్ లో సభ్యులైన నటరాజ్ మాస్టర్, లోబో, మానస్, కాజల్ మరియు 

ప్రణీత్  యాంటీలియా మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ గారు కలిసి 'నా దేవేరి' పాట లిరికల్ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. 


హీరో,హీరోయిన్ పాత్రలలో నటించిన అమర్ దీప్,తన్వీ లు మాట్లాడుతూ..  ఒక సరికొత్త కథ లో నటించినందుకు ఆనందం వ్యక్తపరిచారు. నిర్మాతలైన రాంకీ సల్లగాని, లలితకుమారి, తోట బాలయ్య చౌదరి చల్లా మాట్లాడుతూ కథలోని న్యూ వేవ్ ట్రీట్మెంట్ మూవీ తీయడానికి ప్రేరేపించిందని ,ఇటువంటి కొత్త కథలు చెప్తే ప్రేక్షకులు ఖచ్చితంగా తమని దీవిస్తారని ఈ సినిమా షూట్ పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉందని చెప్పారు. 


దర్శకుడు సుహాస్ మీరా మాట్లాడుతూ.. "ఓ నా దేవేరి" పాటని టూ మెలోడియస్ గా కంపోజింగ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కి, అడగగానే పాడి ఆ పాటకు ప్రాణాన్ని పోసిన రామ్ మిరియాల కి కృతజ్ఞతలు తెలిపారు.ఐరావతం లో ఉన్న ప్రముఖ పాత్రల్లో "ఐరావతం" అనే ముఖ్య పాత్ర ఎవరిది !? మరియు వైట్ కలర్ లో ఉన్న కెమెరా ని క్లిక్ చేస్తే జరిగే మ్యాజిక్ ఏంటనేది మూవీ చూస్తేనే తెలుస్తుంది అని 

తెలిపారు. ఈ వైట్ కెమెరా హీరోయిన్ చేతుల్లోకి వచ్చాక ఆమె పడిన ఇబ్బందులు ఏమిటి అనేదీ చాలా యంగేజింగ్ గా రాసుకున్న స్క్రీన్ ప్లే అని సినిమా చూస్తే తెలుస్తోంది అన్నారు. 


మ్యూజిక్ డైరెక్టర్ సత్య మాట్లాడుతూ.. తన పైన నమ్మకం ఉంచి పాట కంపోజింగ్ అయ్యే వరకు తనని నమ్మి, అన్నివిధాలా సహకరించి ఒక మంచి పాట ఆడియన్స్ కి అందించేలా సహకరించిన నిర్మాతలకి దర్శకుడికి తను కృతజ్ఞుడినై ఉంటానన్నారు. ఇటువంటి యునీక్ స్టోరీకి మ్యూజిక్ ఇవ్వడం తన లక్ అని అన్నారు. 


నటీనటులు

హీరో: అమర్‌దీప్‌, హీరోయిన్: తన్వి, 2వ హీరో: అరుణ్, 2వ హీరోయిన్: ఎస్తేర్, కామెడీ: సప్తగిరి హీరో తల్లి: జయవాణి, SI : సంజయ్ నాయర్, హెడ్ ​​కానిస్టేబుల్: రవీంద్ర, 


టెక్నిషియన్స్

సమర్పణ :  రేఖ పలగాని 

నిర్మాతలు: రాంకి పలగాని, లలిత కుమారి తోట, బాలయ్య చౌదరి చల్లా 

దర్శకుడు: సుహాస్ మీరా 

డిఒపీ: Rk వల్లెపు 

సంగీతం: సత్య కశ్యప్ 

ఎడిటర్: సురేష్ దుర్గం 

పి.ఆర్.ఓ: మధు వి.ఆర్ 

డిజిటల్ : మనోజ్ 

పోస్టర్లు: ధని ఎల్


Meet the oggu katha artistes from Nalgonda, who hogged the limelight in 'World of Senapathi'

 Meet the oggu katha artistes from Nalgonda, who hogged the limelight in 'World of Senapathi', a glimpse of aha's web original film Senapathi starring Rajendra Prasad



100% Telugu streaming platform aha is gearing up to entertain audiences with their upcoming web original film titled Senapathi, the crime drama that marks the OTT debut of veteran actor Rajendra Prasad on December 31. Directed by Pavan Sadineni (who has helmed Prema Ishq Kaadhal in the past), the film is produced by Sushmitha Konidela and Vishnu Prasad under Gold Box Entertainments. 


Earlier this week, the film hit the headlines with World of Senapathi, which offered a sneak peek into the film's ambience. A major highlight of the glimpse was the effort to tell the story of Senapathi through the oggu katha tradition with intriguing mythological parallels. The oggu katha narrated the story of two characters SI Krishna (Naresh Agastya) and Krishna Murthy (Rajendra Prasad) - two supposed modern-day incarnations of Krishna in Kaliyuga, who adopt different paths to accomplish the same goal. 


A group of four oggu katha artistes from Nalgonda - Chinnam Srinu (main singer), Kondeboyina Mahesh, Kadakanchi Parasuramulu (chorus) and JB Laxman Ganga (lyricist) were brought on board by the team of Senapathi for the same. For the uninitiated, oggu katha is a storytelling tradition unique to the Golla Kuruma community in Telangana and originated as a tool to narrate glorious tales of kings, warriors and Gods to the masses. The small two-headed drum, popularly referred to as damarukam, besides anklets and dhol are integral elements to the storytelling tradition.


Expressing his happiness about the oggu katha artistes getting their due among audiences, Senapathi director Pavan Sadineni exclaims, "So much of struggle went into finding the right voices and finally everything paid off. It's heartening to see the reaction of the singers when they felt very happy for creating an identity for them. They felt it as an achievement coming from a backward place and singing in a city like Hyderabad. They don't even know what they are contributing exactly, but today their contribution has made things explode. That's the beauty of art and cinema. Talent anywhere won't go wasted. Everyone gets their due when the time arrives."


Gnaneswari Kandregula, Harshavardhan, Keshav Deepak and Rakendu Mouli also essay crucial roles in Senapathi. aha is also home to some of the biggest Telugu releases in 2021, including Love Story, Unstoppable with NBK, 3 Roses, One, Manchi Rojuloachaie, Romantic, Most Eligible Bachelor, Anubhavinchu Raja, Sarkaar, Chef Mantra, The Baker and The Beauty, Krack, Alludu Garu, 11th Hour, Naandhi, Super Deluxe, Tharagathi Gadhi Daati, Maha Ganesha, Parinayam, and Ichata Vahanamulu Nilupa Radu.


Pushpa The Rise Thanks Meet Held Grandly

సుకుమార్ లేకపోతే నేను లేను.. పుష్ప థ్యాంక్యూ మీట్లో ఐకాన్ సార్ అల్లు అర్జున్..



అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే వసూళ్లు 280 కోట్లు దాటిపోయాయి. ఈ నేపథ్యంలోనే సినిమా థ్యాంక్ యూ మీట్ ఏర్పాటు చేసారు దర్శక నిర్మాతలు.


పుష్ప సినిమా విడుదలై సంచలన విజయం దిశగా అడుగులు వేస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ థ్యాంక్యూ మీట్ ఏర్పాటు చేశారు. తన కెరీర్లో సాధించిన విజయం లో సుకుమార్ పాత్ర ఎంతో ఉంది అంటూ ఎమోషనల్ అయ్యారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆయన మాట్లాడుతూ.. ' ఈ రోజు సినిమా ఇంత పెద్ద విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. నా కెరీర్లో ఆర్య అనేది ఒక మైలురాయి.. సుకుమార్ లేకపోతే ఆర్య లేదు.. ఆర్యా లేకపోతే నేనులేను.. ఈ రోజు నా కెరీర్ ఇంత అద్భుతంగా ఉంది అంటే దానికి కారణం సుకుమార్ అని గర్వంగా చెబుతాను. సుకుమార్ నాకు మంచి స్నేహితుడు. ఇక సినిమా విషయానికి వస్తే హిట్ అయినా.. ఫ్లాప్ అయినా థాంక్యూ మీట్ అనేది కచ్చితంగా పెడతాను. ఎందుకంటే ఫలితంతో సంబంధం లేకుండా ఏ సినిమాకైనా కష్టపడేది అంతా సమానంగానే ఉంటుంది. థాంక్యూ చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. పుష్ప సినిమా కోసం అహర్నిశలు కష్టపడిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. నాతో పాటు నటించిన నటీనటులకు.. సినిమా కోసం అడవుల్లో సైతం లెక్క చేయకుండా కష్టపడిన టెక్నికల్, అలాగే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పుష్ప సినిమాను ఇంత బాగా ఆదరించినందుకు మరొకసారి తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ సినీ అభిమానులకు థాంక్యూ..' అని తెలిపారు.


పుష్ప సినిమా తన కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకొచ్చింది రష్మిక మందన. తాజాగా పుష్ప థ్యాంక్యూ మీట్లో ఆమె మాట్లాడుతూ.. ' ముందుగా ఈ చిత్రంలో నన్ను సెలెక్ట్ చేసినందుకు దర్శకుడు సుకుమార్ గారికి థాంక్స్. ఆయన నాలో శ్రీవల్లిని ఎలా చూసాడో తెలియదు. ఏదైనా సినిమా అయిపోతే ఎమోషనల్ గా ఫీల్ అవుతారు కానీ పుష్ప అయిపోతే సంతోషంగా ఉంది. ఎందుకంటే రెండు నెలల్లో కలిసి పార్ట్ 2 కోసం పని చేయబోతున్నాం కాబట్టి. ఇది నా కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్. అది నాకు ఇచ్చిన నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్.. దర్శకుడు సుకుమార్.. హీరో అల్లు అర్జున్ గారికి థాంక్స్..' అని తెలిపారు.


పుష్ప సినిమా థ్యాంక్ యూ మీట్ చాలా ఎమోషనల్‌గా జరిగింది. ముఖ్యంగా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. అల్లు అర్జున్ తనకు దేవుడు అంటూ చెప్పుకొచ్చాడు ఈయన. సుకుమార్ మాట్లాడుతూ.. ‘అల్లు అర్జున్ నాకు దేవుడు లాంటి వాడు. ఆయన చాలా గొప్ప నటుడు. మొహంలోనే అన్ని భావాలు పలికించగల గొప్ప నటుడు. అలాంటి నటుడు దొరకడం అదృష్టం. అన్ని ఎమోషన్స్ అద్భుతంగా పండించగల సత్తా అల్లు అర్జున్ సొంతం. ఆయనతో ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను..’ అని తెలిపారు.


హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘పుష్ప సినిమా జనవరి 6 వరకు కచ్చితంగా ప్రపంచ వ్యాప్తంగా 325 కోట్లకు పైగానే కలెక్ట్ చేస్తుందని నమ్మకంగా చెప్తున్నాము. ఇప్పటి వరకు 285 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. ఇంకా బాగా వెళ్తుంది. తమ బ్యానర్‌కు పాన్ ఇండియన్ స్థాయి గుర్తింపు ఇవ్వడమే కాకుండా.. ఇంత పెద్ద విజయం అందించినందుకు ముందుగా హీరో అల్లు అర్జున్ గారికి, దర్శకుడు సుకుమార్ గారికి ధన్యావాదాలు తెలుపుకుంటున్నాము..’ అని తెలిపారు.

LIGER (Saala Crossbreed) Multiple Updates Ahead Of New Year

Vijay Deverakonda, Puri Jagannadh, Karan Johar, Charmme Kaur’s Pan India Film LIGER (Saala Crossbreed) Multiple Updates Ahead Of New Year



Pan India star Vijay Deverakonda and dashing director Puri Jagannadh’s maiden Pan India project LIGER (Saala Crossbreed) that also marks Dynamite Mike Tyson’s debut in Indian cinema is in last leg of shoot. Only a small shooting schedule is pending which will be canned soon in India.


As earlier revealed by the makers, Liger will ‘Aag Laga Denge’ for New Year with First Glimpse that will be out on December 31st. That’s not all, they have come up with multiple updates. “The Big Announcement Video”, will be released on December 29th at 10:03 AM.


On December 30th, we will have two special treats. While BTS Stills will be released at 10:03 AM, Special Insta Filter will be unveiled at 4 PM. On last day of this year, First Glimpse will be out. So, get ready for back-to-back treats from team Liger.


Vijay Deverakonda is seen taking a break, before going for the big fight in ring in the announcement poster. Underwent a tremendous makeover, Vijay appears with ponytail here.


Liger is going to be one of the biggest action extravaganzas in India, as it deals with the subject of Mixed Martial Arts and moreover, it features Legend Mike Tyson in a mighty role. Fans and cine goers are waiting with bated breath to witness the real action on big screens. They are eager to see the breath-taking stunt sequences of Vijay Deverakonda and Mike Tyson. The glimpse is sure to offer a perfect New Year presentation for action movie lovers.


In association with Puri connects, the film is being produced jointly by Bollywood's leading production house Dharma Productions. Puri Jagannadh, Charmme Kaur, Karan Johar and Apoorva Mehta together are bankrolling the film on a grand scale.


The film in the crazy combination has cinematography handled by Vishnu Sarma, while Kecha from Thailand is the stunt director.


Ramya Krishnan and Ronit Roy play prominent roles in Liger which is being made in Hindi, Telugu, Tamil, Kannada and Malayalam languages.


The Pan India Movie is ready to splash its blood, sweat and entertainment, as it is releasing in theatres worldwide on 25th August, 2022. Vijay Deverakonda’s pathbreaking film Arjun Reddy was also released on August 25th four years ago in 2017. So, Liger is going to be another cult, iconic and trendsetting movie for Vijay Deverakonda.


Cast: Vijay Deverakonda, Ananya Pandey, Ramya Krishnan, Ronit Roy, Vishu Reddy, Ali, Makarand Desh Pandey and Getup Srinu.


Technical Crew:

Director: Puri Jagannadh

Producers: Puri Jagannadh, Charmme Kaur, Karan Johar and Apoorva Mehta

Banners: Puri connects and Dharma Productions

DOP: Vishnu Sarma

Art Director: Jonny Shaik Basha

Editor: Junaid Siddiqui

Stunt Director: Kecha

Pushpa Will Make 325 Crores

 'Pushpa Will Make Rs 325 Crores'



Icon Staar Allu Arjun's Pushpa: The Rise is going great guns at the box office. The film is doing pretty well not just in the domestic circuit but also in the pan-India market.


The makers held a success meet event today to celebrate the success of the Sukumar directorial. Speaking at the event, Mythri Movie Makers stated that Pushpa will make Rs 300 - Rs 325 crores in its full run at the box office. 


"Pushpa: The Rise has already grossed over Rs 285 crores at the box office. We are expecting that the film will gross in upwards of Rs 300 - 325 crores in its full run. We would like to thank Allu Arjun and Sukumar for giving us a pan-India blockbuster with Pushpa: The Rise." Mythri Movie Makers state. 


The director of Pushpa, Sukumar said Allu Arjun is like a god for him. "Allu Arjun is a very composed actor. The way he emotes subtle emotions and nuances are of top notch quality. He is like a god for me and I hope to collaborate with him multiple times in the future as well."

Karan Johar Praised Allu Arjun For His Pushpa

 'Allu Arjun Is A Huge Megastar,' Karan Johar Heaps Praises On ‘Pushpa’ Star And Success In North Markets !!!



Allu Arjun‘s latest release Pushpa: The Rise is roaring at box office. The actor has achieved a smashing box office number with the film’s pan India release and has become the talk of the town. The entertainment industry of South and Bollywood, both have been praising the actor for his performance and the way director Sukumar has presented him in the film.


Bollywood Producer and director Karan Johar who recently spoke about Allu Arjun’s stardom across India. In a recent interaction with the producers on a show, he shared his views about Allu Arjun’s star stature and the success of Pushpa: The Rise. The film has surprised everyone in the North markets with extremely pleasant numbers at the Box office. Adding to the numbers the director-producer spoke about how the Superstar has managed to penetrate Pan India markets that have seen his popular films on satellite and digital platforms.


He also said that Allu Arjun is a huge megastar. He is a big superstar in South but his films have been watched on pan-India level through satellite and Digital platforms. He did not forget to mention Allu’s previous film Ala Vaikunthaourumuloo and how Big Hit it was in Telugu states. Meanwhile, Pushpa: The Rise is running successfully in theaters with new shows being allotted even in its second week.

Recce First Look Launched

 మాంచి కిక్కిచ్చే క్రైమ్ థ్రిల్లర్ "రెక్కీ"



# "రెక్కీ" ఫస్ట్ లుక్ విడుదల 

వేడుకలో చిత్ర బృందం!!


     "స్నోబాల్ పిక్చర్స్" పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1గా తెరకెక్కుతున్న సూపర్ క్రైమ్ థ్రిల్లర్ "రెక్కీ". "కొన్ని క్రైమ్ కథలు ఊహకు అందవు" అనే ట్యాగ్ లైన్ తో శ్రీమతి సాకా ఆదిలక్ష్మి సమర్పణ... ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వంలో కమలకృష్ణ నిర్మిస్తున్న ఈ యునీక్ ఎంటర్టైనర్ తో అభిరామ్ హీరోగా పరిచయమవుతుండగా... క్రేజీ కమెడియన్ భద్రమ్ సెకండ్ హీరోగా... ఇప్పటివరకు తన కెరీర్ లోనే చేయని ఓ వినూత్నమైన పాత్ర పోషిస్తున్నారు. అమీక్షా పవార్, జస్విక హీరోయిన్లు. 

     ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో ఎంతో ఆహ్లాదకరంగా జరిగిన వేడుకలో యూనిట్ సభ్యులు ఆవిష్కరించుకున్నారు. చిత్ర కథానాయకుడు అభిరామ్, దర్శకుడు ఎన్. ఎస్.ఆర్.ప్రసాద్, నాయకి సమీక్ష, సెకండ్ హీరో భద్రమ్, ఈ చిత్రంలో ఓ ముఖపాత్ర పోషించిన భాష, ఎడిటర్ పాపారావు ఈ వేడుకలో పాల్గొన్నారు.

    క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్ లో తెలుగు తెరపై ఇప్పటివరకు రాని కథాoశంతో, ఎవరూ ఊహించని ట్విస్టులతో అత్యంత ఆసక్తికరంగా రూపొందుతున్న "రెక్కీ" టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ సెట్టర్ అవుతుందని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తి చేసుకుని, తుది మెరుగులు దిద్దుకుంటున్న "రెక్కీ" చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ చిత్ర రూపకల్పనలో ప్రముఖ నిర్మాత జెమిని కిరణ్ గారు అందించిన మోరల్ సపోర్ట్ కు ఎప్పటికీ రుణపడి ఉంటామని పేర్కొన్నారు.

      నాగరాజు ఉండ్రమట్ట, దేవిచరణ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పబ్లిసిటీ డిజైనర్: శక్తి స్వరూప్, ఆర్ట్: రాజు, కెమెరా: వెంకట్ గంగాధరి, ఎడిటర్: కె.ఎల్.వై.పాపారావు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ఎస్.చిన్నా, ప్రొడక్షన్ మేనేజర్: నాగార్జున, సమర్పణ: శ్రీమతి సాకా ఆదిలక్ష్మి, నిర్మాత: కమలకృష్ణ, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్!!

Tremendous Response for Dharmapuri Lyrical Song Ayyayo Ayyayo

 రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదలైన 'ధర్మపురి' సినిమాలోని లిరికల్ సాంగ్ 'అయ్యయ్యో అయ్యాయ్యో'కు అనూహ్య స్పందన..



తెలుగు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని.. టాలీవుడ్ టూ బాలీవుడ్ సత్తా చూపించిన డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్. ఇప్పటి వరకు ఈయన డాన్స్ చూసాం.. ఇప్పుడు ఈయనలోని అభిరుచి గల నిర్మాత బయటకు వచ్చారు. గగన్ విహారి, అపర్ణ దేవి జంటగా విశ్వజగత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ధర్మపురి. 1995 ప్రాంతంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు విశ్వజగత్. అక్కడ ఉండే రాజ గడిలో పని చేసే ఓ జీతగాడు.. బీడీలు చుట్టుకునే అమ్మాయి మధ్య నడిచే ప్రేమకథ ఈ ధర్మపురి. అక్కడున్న ఒరిజినల్ లొకేషన్స్ లో చాలా రియాలిస్టిక్ గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమాలోని అయ్యాయ్యో అయ్యాయ్యో లిరికల్ సాంగ్ ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదలైంది. ఈ పాటకు అనూహ్య స్పందన వస్తుంది. భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ లో శేఖర్ మాస్టర్ సమర్పణలో భాస్కర్ యాదవ్ దాసరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఓషో వెంకట్ సంగీతం అందిస్తున్న ధర్మపురి చిత్రానికి మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.


నటీనటులు:

గగన్ విహారి, అపర్ణ దేవి, నాగ మహేష్, జనార్దన్, కేశవ, బస్టాప్ కోటేశ్వరరావు, రాగిని తదితరులు..


టెక్నికల్ టీమ్:

రచన, దర్శకత్వం: విశ్వజగత్

సమర్పణ: శేఖర్ మాస్టర్

బ్యానర్: భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా

నిర్మాత: భాస్కర్ యాదవ్ దాసరి

ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్

కొరియోగ్రాఫర్: శేఖర్ మాస్టర్

సంగీతం: ఓషో వెంకట్

PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Megastar Chiranjeevi Appreciated Sukumar For Pushpa The Rise







 

Tremendous Response for Aha Telugu Indian Idol

 ‘ఆహా’ తెలుగు ఇండియన్ ఐడల్‌కి హ్యూజ్ రెస్పాన్స్.. భారీగా త‌ర‌లి వ‌చ్చిన యువ‌త‌



100% తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ఆహా... తన తదుపరి షో  తెలుగు ఇండియన్ ఐడల్ ద్వారా  తెలుగు రాష్ట్రాల్లోని అత్యుత్తమ సింగింగ్ టాలెంట్ గుర్తించాలనే ఆశ‌యంతో సరికొత్త అడుగు వేసింది. అందుకోసం తెలుగు వారిలోని గాత్ర ప్ర‌తిభ‌ను వెలికితీయ‌డానికి, స‌రైన వేదిక క‌ల్పించ‌డానికి  ప్రపంచంలోనే అతిపెద్ద పాటల పోటీని తెలుగులోకి తీసుకువస్తోంది ఆహా!. అందులో భాగంగా, 12 సీజ‌న్ల‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అయిన ఇండియ‌న్ ఐడ‌ల్ ప్లాట్‌ఫార్మ్‌ని ద‌క్షిణాదిన తొలి సారిగా, అందులోనూ మ‌న తెలుగులో తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ పేరుతో ప్రారంభిస్తోంది ఆహా. నాన్‌-ఫిక్ష‌న్ స్పేస్‌లో  ప్రారంభం కానున్న ఈ షో గురించి ఇప్ప‌టికే జనాల్లో క్యూరియాసిటీ క‌నిపిస్తోంది. త్వ‌ర‌లోనే సింగింగ్ కాంపిటిష‌న్స్ ఆడిష‌న్స్ కూడా  పూర్తయ్యాయి. 


ఇండియ‌న్ ఐడ‌ల్ విన్న‌ర్‌గా నిలిచి తెలుగువారికి ఎంతో గ‌ర్వ‌కార‌ణంగా నిలిచిన శ్రీరామ్ చంద్ర .. తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించే అంశం. తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ కోసం ఆన్ లైన్‌లోనూ ఆఫ్‌లైన్‌లోనూ ఆడిష‌న్స్ జరిగాయి. తెలుగు ఇండియన్ ఐడల్ ఆడిషన్స్‌లో పాల్గొనడానికి పాటించాల్సిన గైడ్ లైన్స్‌ను ఆహా విడుదల చేయగా.. వాటిని పాటిస్తూ..ఈ ఆడిషన్స్‌కు 5వేలకు పైగా కంటెస్టెంట్స్ పాల్గొనడం విశేషం. ఇంత మంది పార్టిసిపేట్ చేస్తున్నారంటే, తెలుగు ఇండియన్ ఐడల్‌కు ఉన్న క్రేజేంటో అర్థం చేసుకోవచ్చు. ఇక త్వరలోనే తెలుగు సినీ ప్రేమికులను అలరించబోతున్న ఈ కార్యక్రమం తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందనడంలో సందేహం లేదు. 


2021లో ఆహాలో ఇప్పటికే లవ్‌స్టోరీ, అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే, త్రీ రోసెస్‌, ఒన్‌, మంచి రోజులొచ్చాయి, రొమాంటిక్‌, మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌, అనుభవించురాజా, సర్కార్‌,  చెఫ్‌ మంత్ర, ది బేకర్‌ అండ్‌ ది బ్యూటీ, క్రాక్‌, అల్లుడు గారు, లెవన్త్ హవర్‌, నాంది, సూపర్‌ డీలక్స్, తరగతి గది దాటి, మహా గణేశ, పరిణయం, ఇచట వాహనములు నిలపరాదు... ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.