Latest Post

101 Flats to Television 24 Crafts Artists

 టెలివిజన్ 24 క్రాఫ్ట్స్ లోని నిరుపేద  కళాకారులకు 101 ప్లాట్లు ఇచ్చిన ధాత  వివికే వి.విజయ్ కుమార్ భూదాన ప్రెస్ మీట్ లో సినిమాటోగ్రఫీ  మినిష్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వాఖ్యలు 



దివంగత నేత అన్న నందమూరి తారక రామారావు లాంటి నటుడు, రాజకీయ నాయకుడు  తెలుగోడి ఆత్మ గౌరవం ఇలాంటి వ్యక్తి రాడు రాలేడు అన్నాడు మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్,విజన్ వివికే వి.విజయ్ కుమార్ గారు టెలివిజన్ లోని 24 క్రాఫ్ట్స్ లో వుండే వెనుకబడిన పేద కళాకారులకు 101 ఫ్లాట్స్ ను  ఉచితంగా  అందిస్తున్న సందర్బంగా హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో  ఈ కార్యక్రమం ఘనంగా  జరుపుకుంది.సాంసృతిక  కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సభకు ముఖ్య అతిధులు వచ్చిన సినిమాటోగ్రఫి  మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్,ఎమ్మెల్యే గోపీనాథ్, జ్యోతి ప్రజ్వలన చేశారు. ఇంకా వీరితో పాటు ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ కె.వి. రమణాచారి,జాయింట్ లేబర్ కమీషనర్ గంగాధర్,బిసి కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణ  మోహన్, నటులు జాకీ, హరిత , ధనలక్ష్మి,, కల్పన, సుష్మ,సింగర్స్, మరియు సీరియల్ ఆర్టిస్టులు, సినిమా ఆర్టిస్టులు, తెలుగు టెలివిజన్ & డిజిటల్ మీడియా టెక్నీషియన్స్ మరియు వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు పాల్గొన్నారు.

అనంతరం విజన్ వివికే వి. విజయ్ కుమార్ గారూ ఇచ్చిన  మాట ప్రకారం 101 మంది  నిరుపేద టీవీ కళాకారులకు ఉచితంగా ఇళ్ల స్థలాలు పత్రాలను శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ కె.వి.రమణాచారి గారి చేతుల మీదుగా అందజేశారు

ఈ సందర్బంగా.విజన్ వివికే విజయ్ కుమార్ మాట్లాడుతూ.. నేను చేసే సేవ ఎవరికైతే మాటిచ్ఛా మో వారికి అందితే చాలు తీసుకున్న వారికి ఇచ్చిన వారికి తెలిస్తే చాలు బహిరంగంగా అక్కర్లేదు అని రమణాచారి గారితో చెపితే.. లేదు ఇలాంటి మంచి విషయం అందరికీ తెలవాలని  నాగబాల సురేష్ గారు వారి సభ్యులు ఈ రోజు ఇంత గ్రాండ్ గా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారందరికీ ధన్యవాదములు తెలుపు కుంటున్నాను.ఈ కార్యక్రమానికి , మినిష్టర్ తలసాని,ఎమ్మెల్యే గోపినాథ్ తో పాటు పలువురు పెద్దలు రావడం చాలా సంతోషంగా ఉంది.గత సంవత్సరం టివి ఫెడరేషన్ ఆధ్వర్యంలో మూడు వేల మందితో ఒక నివేదన సభ జరిగితే అక్కడకు మినిస్టర్స్, ఎమ్మెల్యే లు, ఐ ఏ యస్, ఐ. పి. యస్ ఆఫీసర్స్ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి సమక్షంలో టెలివిజన్ లోని 24 క్రాఫ్ట్స్ లో వుండే వెనుకబడిన పేద కళాకారులు వారి కష్టాలు, కన్నీళ్లు చెపుతూవుంటే నా మనసు చాలా చలించిపోయింది.మనం ఎంతసేపు నేను నా పిల్లలు, వారి పిల్లలు అంటూ కుటుంబ మొత్తానికి తరతరాలు తిన్నా తరగని కోట్ల ఆస్తిని సంపాదించుకొని వారసత్వంగా ఎన్నో ఆస్తులు పిల్లలకు కూడబెట్టడం కాదు కష్టాలతో వున్న వారికి ఇబ్బందులుతో వున్న వారికి మనం కొంత చేయూత నిచ్చి మనం కొంత సహకరించ గలిగితే చాలు అనేది నా అభిప్రాయం. అయితే నేను  టెలివిజన్ 24 క్రాఫ్ట్స్ లోని  ప్రతి క్రాఫ్ట్ నుండి 5 మంది  వెనుకబడిన పేద కళాకారులకు ఇస్తానన్న మాటకు కట్టుబడి ఉండాలని సినీ, రాజకీయ  నాయకులు, ఆఫిసియల్స్  మధ్యలో  ఇవ్వడం జరిగింది.చాలా మంది కోట్ల విలువజేసే  భూమిని ఎందుకు ఇవ్వడం అన్నారు. అయితే నా దృష్టిలో మన పిల్లలకు మనం కోట్ల ఆస్తిని ఇవ్వడం ముఖ్యం కాదు. మన చుట్టూ ఉన్న పేద కార్మికులకు సహాయం చేస్తే మనకంటూ ఓక దైవ శక్తి వస్తుంది. ఆ దైవ శక్తి ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అనే విధంగా మన పిల్లకు మంచి నాలెడ్జ్, ఆలోచనలు ఇస్తే వారు కూడా సమాజానికి ఉపయోగ పడే టటువంటి  మంచి పనులు చేస్తారనేది నా అభిప్రాయం. 2014 లో ప్రగతి నగర్  లో ప్రారంభమైన మా సంస్థ  ఈ రోజు అంచె లంచెలుగా ఎదుగుతూ చాలా బ్రాంచ్ లను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మా కు వచ్చే ఆదాయంలో  కొంత పేద కళాకారులకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అన్నారు.

తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. విజయ్ కుమార్ గొప్ప నిర్ణయం తీసుకోవడమే కాకుండా టివి రంగానికి సంబందించిన పేద కళాకారులను  సహాయం చేసే మంచి నిర్ణయం తీసుకున్నాడు.టెలివిజన్ లోని 24 క్రాఫ్ట్స్ లలో వున్న ఒక్కొక్క క్రాఫ్ట్ నుండి  ఐదు గురు కళాకారులను  సెలెక్ట్ చేసుకొని 101 ఫ్లాట్స్ ఇవ్వడం గొప్ప విషయం. ఈ భూమి సుమారు 6 కోట్ల విలువ చేసే భూమిని ఇవ్వడం గొప్ప విషయం.పేదవాడి ఆశీర్వాదములు మనకు జీవితకాలం తోడుగా ఉంటాయి .విజయ్ కు వారి ఆశీర్వాదములు ఎల్లప్పుడూ ఉంటూ వారి బిజీనెస్ దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే ఈ రోజు ముఖ్యమంత్రి కె. సి.ఆర్ గారు పేద ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. అవన్నీ ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజు హైదరాబాద్ కు కరెంట్ కొరత, నీటి కొరత ఇలా అన్ని  రకాలుగా  హైదరాబాద్ అందరికీ సౌకర్య వంతంగా ఉంది.

తెలుగు సినీ పరిశ్రమ వైపు ఇప్పుడు ప్రపంచమే చూస్తుంది.

సినీ పరిశ్రమ ఇంత ఎదగడానికి  ఒక చరిత్ర ఉంది. దివంగత నేత అన్న నందమూరి తారక రామారావు ఒక కళాకారుడు గా  ఒకప్పుడు చెన్నై నగరంలో తెలుగు వారందరూ షూటింగ్ చేస్తున్నపుడు వారిని మాదరాసి అనే వారు. దాంతో  తెలుగు గడ్డపై వున్న మమకారం తో అక్కినేని నాగేశ్వరావు, రామారావు లు ఇక్కడికి వచ్చి సినిమా స్టూడియో లను స్థాపించడం జరిగింది.అయితే రామారావు  గారు తెలుగు నెలకు నేను ఏమైనా చెయ్యాలని తెలుగు దేశం పార్టీని ఏర్పాటు చేసి భారత దేశ రాజకీయాలను గడ గడ లాడించిన వ్యక్తి రామారావు గారు.ఈ రోజు రామారావు దయావల్ల ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారికి గుర్తింపు వచ్చింది అంటే దానికి  నందమూరి తారకరామారా వు గారే కారణం. కాబట్టి దివంగత నేత అన్న నందమూరి తారక రామారావు లాంటి నటుడు, రాజకీయ నాయకుడు  తెలుగోడి ఆత్మ గౌరవం ఇలాంటి వ్యక్తి రాడు రాలేడు..అని ఈ సభా ముఖంగా తెలియ జేస్తున్నాను అన్నారు.ఆ తరువాత  కార్మిక పక్ష పాతిగా  పేదవర్గాల  పక్షపాతీగా సినిమా రంగంలో దాసరి గారు ఏది వచ్చినా  తన బుజాలమీద వేసుకొని పరిష్కారం ఇచ్చేవారు.


ఎమ్మెల్యే గోపినాథ్ మాట్లాడుతూ.. విజయ్ కుమార్ గారు 101 మందికి ఫ్లాట్స్ ఇవ్వడం చరిత్రలో  నిలిచిపోతుంది. నేను సినిమా ఇండస్ట్రీ లో ఉన్నా ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు.విజయ్ గారు ఈ పని చేయడం గొప్ప విషయం. ఇలాగే ప్రతి ఒక్కరూ చెయ్యాలి. ఈ ప్రభుత్వం ద్వారా పేద వారికి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వారిని ఆదుకోవడం జరుగుతుంది.సినిమా ఇండస్ట్రీ కంటే టివి ఇండస్ట్రీ లోని వర్కర్స్ ఎక్కువమంది వున్నారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అదృష్టంగా  బావిస్తున్నాను అన్నారు.

ప్రభుత్వ సలహాదారుడు రమణా చారి  మాట్లాడుతూ..తన జన్మదిన సందర్బంగా 101 మందికి భూదానం  చేస్తున్నటు వంటి విజయ్ గారికి ధన్యవాదములు. నేను గత 47ఏళ్లుగా ఎంతో మందిని చూశాను. కానీ మాట తప్పకుండా  చేసే టటువంటి  వ్యక్తులు అరుదుగా  వుంటారు. ప్రతి రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా మంచి మనసుతో ఆలోచించి పేద కళాకారులకు సహాయం చూస్తే వారి అందరి  జీవితాల్లో వెలుగును నింపిన వారవుతారు అన్నారు.

నటుడు జాకీ, హరిత  మాట్లాడుతూ.  విజన్ వివికే "భూదాన" ప్రెసిడెంట్ తెలుగు టెలివిజన్ కార్మికులకు సాంకేతిక నిపుణులకు మరియు కళాకారులకు ఉచితంగా 101 ఫ్లాట్ల అలాట్మెంట్ లెటర్ అందజేయడానికి విచ్చేసిన వినోబాబావే శ్రీమాన్ విజయ్ కుమార్ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతాభి వందనములు అని అన్నారు

తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా టెక్నీషియన్స్ వర్కర్స్ ఫెడరేషన్  అధ్యక్షులు మాట్లాడుతూ..1972 లో మొదలైన ఒక్క టివి ఛానెల్ తో నేటికు 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అప్పట్లో ఒక్క ఛానల్ తో ప్రారంభమై  నేడు తెలుగులో 104 ఛానెల్స్ తో ఈ రోజు టివి రంగం దినాదినాబి వృద్ధి చెందుతుంది. విజయ్ కుమార్ గారి జన్మదినం సందర్బంగా టివి కార్మికులకు ఇళ్ల స్థలాలు అందజేయడం చాలా సంతోషంగా  ఉంది. ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం జరుపుకుంటూ మా కళాకారులకు  సహాయం చేయాలని కోరుతున్నాను అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఇది భారత దేశ  టీవీ చరిత్రలో టీవీ కళాకారులకు మొట్టమొదటి భూదాన కార్యక్రమమిది. ఇది సువర్ణాక్షరాలతో లిఖించబడింది అని పలువురు పెద్దలు అభివర్ణించారు  అన్నారు.

Virata Parvam Trailer Dropped

 Rana, Sai Pallavi, Venu Udugula, Suresh Productions, SLV Cinemas, Sudhakar Cherukuri’s Virata Parvam Trailer Dropped



The much-awaited theatrical trailer of Virata Parvam starring Handsome hunk Rana Daggubati and the talented Sai Pallavi has been dropped just a while ago. The trailer launch event is taking place in Kurnool.


Directed by Venu Udugula, Virata Parvam is an epic love story set in the backdrop of Naxalite Movement in Telangana region in 1990s. The same is revealed through the trailer that faithfully shows the hardships of the people of Telangana due to inequality in society. The revolution occurs from the suppression and atrocity. One such rebel born to fight for his people is Ravanna who has many admirers not just for the path he’s chosen, but for his revolutionary writings. One such admirer is Vennela whose wish is to meet him at least once in her life.


While Ravanna is rebel in nature, Vennela is a pure soul who believes in harmony. Their paths may be different, but that won’t stop the two from admiring each other. Venu Udugula brings more purity to the love story with his writing. The dialogues are provocative.


Rana appeared as Ravanna and this is definitely one of the finest performances. It’s Vennela’s story and Sai Pallavi brings magic to the narration with her wonderful portrayal of the character.


Dani Sanchez Lopez and Divakar Mani’s cinematography is incomparable, while Suresh Bobbili enhances the narrative with his background score. A Sreekar Prasad’s editing is one of the major plus points.


D Suresh Babu is presenting the film and Sudhakar Cherukuri of Sri Lakshmi Venkateswara Cinemas is bankrolling it. 


Virata Parvam also stars Priyamani, Nanditha Das, Naveen Chandra, Zareena Wahab, Eswari Rao and Sai Chand in important roles.


The movie is scheduled for its theatrical release on 17th of this month.


Cast: Rana Daggubati, Sai Pallavi, Priyamani, Nanditha Das, Naveen Chandra, Zareena Wahab, Eswari Rao, Sai Chand, Benarji, Nagineedu, Rahul Ramakrishna, Devi Prasad, Anand Ravi, Anand Chakrapani and others.


Crew:


Writer & Director: Venu Udugula

Producer: Sudhakar Cherukuri. 

Banner: Suresh Productions, Sri Lakshmi Venkateswara Cinemas

Presents: Suresh Babu

DOP: Dani Sanchez Lopez, Divakar Mani

Editor: Sreekar Prasad

Production designer: Sri Nagendra 

Music: Suresh Bobbili

Stunts: Stephen Richard, Peter Hein

Choreography: Raju Sundaram.

PRO: Vamsi - Sekhar

Executive producer: Vijay kumar chaganti 

Publicity Design: Dhani Aelay

Jagapathi Babu in Simbaa

‘సింబా’లో ప్రకృతి తనయుడిగా జగపతిబాబు



రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సంప‌త్ నంది రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సింబా’. అరణ్యం నేపథ్యంలో అల్లుకున్న కథతో సింబా ను తెరకెక్కిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్‌ థ్రిల్లింగ్‌ సబ్జెక్ట్ కు రచయిత సంపత్‌నంది. ‘ది ఫారెస్ట్ మ్యాన్’ అనేది ట్యాగ్ లైన్. సంప‌త్ నంది టీమ్ వ‌ర్క్స్ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ దాస‌రి ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ముర‌ళీ మోహ‌న్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సంప‌త్ నంది, రాజేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మేకర్స్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. వెర్సటైల్‌ యాక్టర్‌ జగపతిబాబు ‘సింబా’లో ప్రకృతి తనయుడిగా అద్భుతమైన పాత్రను పోషిస్తున్నారు. అడవుల్లో నివసించే మాచోమ్యాన్‌గా జగపతిబాబును ఈ చిత్రంలో చూపిస్తున్నారు సంపత్‌నంది.

ఫస్ట్ లుక్‌ పోస్టర్‌లో జగపతిబాబు భుజాలమీద చెట్లను మోసుకుంటూ వెళ్లడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ''ప్రకృతి తనయుడు ఇతడు... జగపతిబాబు గారిని సింబాగా పరిచయం చేయడానికి ఆనందిస్తున్నాం. వరల్డ్ ఎన్విరాన్‌మెంట్‌ డే సందర్భంగా ఫారెస్ట్ మ్యాన్‌ సింబాను పరిచయం చేస్తున్నాం" అని మేకర్స్ రాసిన వాక్యాలు అట్రాక్ట్ చేస్తున్నాయి.


సింబాకు సంబంధించిన మిగిలిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. డి.కృష్ణ సౌరభ్‌ సంగీతం అందిస్తోన్న సింబా చిత్రానికి కృష్ణప్రసాద్‌ సినిమాటోగ్రాఫర్‌

F3 Triple Blockbuster Event Held Grandly

 ఎఫ్3 తొమ్మిది రోజుల్లో రూ. 100 కోట్లు కలెక్ట్  చేసి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఇంతపెద్ద విజయం ప్రేక్షకుల వల్ల సాధ్యమైయింది:  ట్రిపుల్ బ్లాక్ బస్టర్ 'ఫన్'టాస్టిక్ ఈవెంట్లో ఎఫ్ 3 టీమ్ 



''ఎఫ్ 3 విడుదలై ఇది తొమ్మిదో రోజు. వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సినిమా దూసుకెల్తుంది. ఒక ఫ్యామిలీ సినిమా కోవిడ్ తర్వాత వందకోట్లు టచ్ చేయడం మాకు ఎంతో ప్రత్యేకం. ఈ విజయం ప్రేక్షకుల వల్లే సాధ్యమైయింది'' అని పేర్కొంది ఎఫ్ 3 టీమ్.

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్  దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం 'ఎఫ్ 3'.  డబుల్ బ్లాక్‌బస్టర్ 'F2' ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పకులుగా నిర్మాత శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'ఎఫ్3 'మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. తొమ్మిది రోజుల్లో వంద కోట్ల రూపాయిల గ్రాస్ కలెక్ట్ చేసి హౌస్ ఫుల్ వసూళ్ళతో దూసుకుపోతున్న ఈ చిత్రం ట్రిపుల్ బ్లాక్ బస్టర్ 'ఫన్'టాస్టిక్ ఈవెంట్ చిత్ర బృందం, అభిమానులు కేరింతలతో వైజాగ్ లో గ్రాండ్ జరిగింది.   


ఈ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ..  ఎఫ్ 3ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన అభిమానులకి ప్రేక్షకులకు బిగ్ థాంక్స్. వైజాగ్ అంటే నాకు చాల స్పెషల్. నా మొదటి సినిమా కలియుగ పాండవులు ఇక్కడే చేశాను. స్వర్ణ కమలం, గోపాల గోపాల, సీతమ్మ వాకిట్లో,మల్లీశ్వరి, గురు  ఇలా చాలా సినిమాలు ఇక్కడ చేశాను. ఇక్కడ ఎఫ్ 3 ట్రిపుల్ బ్లాక్ బస్టర్  వేడుక జరుపుకోవడం ఆనందంగా వుంది. అనిల్ రావిపూడి, దిల్ రాజు గారు మంచి స్క్రిప్ట్ తో వచ్చారు. మీరు గొప్ప విజయాన్ని అందించారు. నారప్ప, దృశ్యం ఓటీటీ కి వెళ్ళడంతో అభిమానులు కొంత నిరాస చెందారు. అందుకే ఎఫ్ 3లో నారప్ప గెటప్ లో వచ్చి ఫ్యాన్స్ ని థ్రిల్ చేయాలనీ అనుకున్నాను. ఈ చిత్రానికి పని చేసిన టెక్నికల్ టీంకి, ఆర్టిస్ట్ లకి అందరికీ థాంక్స్. ఈ ఈవెంట్ లో లేడి , ఫ్యామిలీ ఆడియన్స్  ఎక్కువగా వుండటం ఆనందంగా వుంది. ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ మరోసారి కృతజ్ఞతలు'' అన్నారు. 


వరుణ్ తేజ్ మాట్లాడుతూ..  ప్రేక్షకులు, అభిమానులందరికీ థాంక్స్. 200 మంది ఆర్టిస్ట్ లతో రెండేళ్ళ పాటు ఎంతో కష్టపడి రెండున్న గంటల పాటు మీరు ఆనందంగా వుండాలని సినిమా తీసి మీ ముందుకు తెచ్చాం. డబ్బులు, కలెక్షన్స్ ఇవ్వలేని తృప్తి.. మీరు సినిమా చూశాక శభాస్ అంటే వస్తుంది. అది మాకు వందకోట్లు. ఎఫ్ 3 సినిమాకి మీరు చూపిన ఆదరణే మాకు వంద కోట్లతో సమానం. డీవోపీ సాయి శ్రీరామ్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్, లిరిక్ రైటర్స్, ఎడిటర్ , కెమరా వెనుక వున్న టెక్నికల్ టీం అందరికీ థాంక్స్. రాజేంద్ర ప్రసాద్ గారికి, అలీ, సునీల్, రఘుబాబు గారు.. ఇలా ఆర్టిస్ట్ లందరికీ కృతజ్ఞతలు. ఆర్టిస్ట్ లందరికీ మంచి పేరు వచ్చింది. దీనికి కారణం దర్శకుడు అనిల్ రావిపూడి గారు. ఇంతమంచి సినిమా ఇచ్చిన అనిల్ గారికి కృతజ్ఞతలు. ఆయనకి ఒక యునిక్ స్టయిల్ వుంది. దాని వలనే వరుసగా ఆరు హిట్లు కొట్టారు. ఆరే కాదు ఇంకో ముఫ్ఫై ఆరు హిట్లు కొట్టాలి. నిర్మాత దిల్ రాజు గారు సినిమా పై ప్యాషన్ వున్న ప్రొడ్యుసర్, ఆయన చూడని కోట్లు లేవు. అయినా సినిమాని ఎంతో ప్యాషన్ తో చేస్తారు. వెంకటేష్ గారితో పని చేసిన ప్రతి క్షణం ఎంజాయ్ చేశాను. ఇకపై వెంకటేష్ గారితో  కాంబినేషన్ అంటే కథ అడగకుండా సినిమా చేసేస్తాను. వెంకటేష్ గారు ఇచ్చిన సపోర్ట్ ని మర్చిపోలేను.   ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు'' అన్నారు


అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. వైజాగ్ తో నాకు చాలా కనెక్ట్ వుంటుంది, నేను రాసే ప్రతి స్క్రిప్ట్ ఇక్కడ నుండే మొదలుపెడతాను. ఎఫ్ 3 ని ఇంత సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది తొమ్మిదో రోజు. వందకోట్లు క్రాస్ చేశాం. ఈ క్రెడిట్ ప్రేక్షకులకు దక్కుతుంది.  'F2' ఫ్రాంచైజీని కొనసాగించవచ్చనే ధైర్యాన్ని ఎఫ్ 3 విజయంతో ఇచ్చారు. ఈ సినిమాని నవ్వుకోవడాకే తీశామని మొదటి నుండి చెబుతూనే వున్నాం, ఈ రోజు ఆ నవ్వుల విలువ వందకోట్ల రుపాయిలతో తిరిగిచ్చారు. నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేసే నిర్మాత దిల్ రాజు గారికి, శిరీష్ గారికి థాంక్స్. అలీ , రాజేంద్ర ప్రసాద్ తో పాటు నటులందరికీ కృతజ్ఞతలు. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారికి థాంక్స్. వెంకటేష్ గారు, వరుణ్ తేజ్ గారు, దిల్ రాజు గారికి బిగ్ హాగ్. ఈ సినిమా కోసం ఏది అడిగితె అది ఇచ్చి ముందుండి నడిపించారు. ఎఫ్ 2కి వచ్చిన కలెక్షన్ కంటే ఎఫ్ 3 కి వచ్చిన కలెక్షన్స్ కిక్ ఎక్కువ కిక్ ఇస్తున్నాయి. కారణం అప్పుడు పరిస్థితతులు వేరు.ఇప్పుడున్న పరిస్థితితో మీరంతా థియేటర్ కి వచ్చి వందకోట్లు కలెక్షన్స్ ఇవ్వడం మామూలు విషయం కాదు. ఎఫ్ 2కంటే ఎఫ్ 3 ని ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. మేము ముందు నుండి ఇదే చెప్పాం. ఇప్పుడు అదే నిజమైయింది.  ఎఫ్ 4ప్రకటన కూడా త్వరలోనే వస్తుంది.  'F2' ఫ్రాంచైజీ మీరు హాయి నవ్వుకోవడానికే.'' అన్నారు.


దిల్ రాజు మాట్లాడుతూ.. నా, మన అభిమాన హీరో విక్టరీ వెంకటేష్ గారి అభిమానులకు, మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మా ఆరడుగుల అందగాడు వరుణ్ తేజ్ ఫ్యాన్స్ కి కృతజ్ఞతలు. ముఖ్యంగా   ఎఫ్ 3 ని ఆదరించిన ఇంత పెద్ద విజయం అందించిన తెలుగు కుటుంబాలకు స్పెషల్ థాంక్స్. కరోనా తర్వాత ఫ్యామిలీస్ థియేటర్ రావడం తగ్గించారని వినిపించించి కానీ ఇప్పుడే జగదాంబ థియేటర్ ఓనర్ గారు షోలన్నీ ఫ్యామిలీస్ తో నిండిపోతున్నాయని చెప్పారు. మంచి సినిమాలు ఇస్తామని మా సంస్థపై నమ్మకం వుంచిన తెలుగు ప్రేక్షకులకు, ఫ్యామిలీ ఆడియన్స్ కి ధన్యవాదాలు, ఇది తొమ్మిదో రోజు. వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సినిమా ముందుకు వెళుతుంది. ఒక ఫ్యామిలీ సినిమా కోవిడ్ తర్వాత వందకోట్లు టచ్ చేయడం  మాకు ఎంతో ప్రత్యేకం. ఈ విజయం ప్రేక్షకుల వల్లే సాధ్యమైయింది. ఈ విజయం క్రెడిట్ అనిల్ రావిపూడికి దక్కుతుంది. నవ్వించాలానే ఉద్దేశంతోనే ఈ సినిమా తీస్తున్నానని చెప్పి కడుపుబ్బా నవ్వించారు. ఎఫ్ 3 చుసిన ప్రేక్షకులంతా సినిమాని తెగ ఎంజాయ్ చేశామని చెబుతుంటే చాలా ఆనందం అనిపించింది. జగదాంబ లో పదకుండు వందల సీట్లు ఫిల్ కావడం అంటే మామూలు మాటలు కాదు. ఇది విశాఖ పట్నం ప్రేక్షకుల వల్ల సాధ్యమైనందుకు చాలా హ్యాపీ. వెంకటేష్ , వరుణ్ గారు ఈ సినిమాని నెక్స్ట్ లెవల్ లోకి తీసుకెళ్ళినందుకు థాంక్స్. తమన్నా, మేహరీన్, పూజా, సోనాల్,  రాజేంద్ర ప్రసాద్, సునీల్, అలీ ఎంతో మంది ఆర్టిస్ట్ లతో సినిమాని మీ ముందుకు తీసుకొచ్చాం మీరు గొప్పగా ఆదరించారు. ఎఫ్ 4ని ఎలా చేయాలనే టెన్షన్ ఇప్పటి నుండే అనిల్ రావిపూడికి పట్టుకుంది. లాజికల్ గా మ్యాజికల్ గా చింపే సినిమా చేద్దాం అదే మన గోల్. ఎఫ్  4కోసం వెయిట్ చేస్తుండండి. త్వరలోనే ప్రకటిస్తాం'' అన్నారు 


రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..   ఎఫ్ 3 ప్రీరిలీజ్ లో ఈవెంట్ లో ఈ సినిమా హిట్ కాకపొతే మళ్ళీ మీ ముందు కనిపించనని ఛాలెంజ్ చేశాను. చాలా మంది మిత్రులు, మీడియా వారు ఆశ్చర్య పోయారు. కానీ నాకు నవ్వు, ప్రేక్షకులపై వున్న నమ్మకం. ఈ రోజు సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. నా నమ్మకం వమ్ముకాలేదు. తెలుగు ప్రేక్షకులు వినోదం పంచె సినిమాలకు న్యాయం చేస్తారు,ఎఫ్3తో మరోసారి రుజువు చేశారు, ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. వెంకటేష్, వరుణ్ తేజ్ ,. సినిమాలో నటించిన అందరికీ ధన్యవాదాలు. అన్ని పాత్రలకు మంచి పేరు రావడం చాలా అరుదు. ఈ క్రెడిట్ అనిల్ రావిపూడి గారికి దక్కుతుంది. ఇంత పెద్ద చిత్రాన్ని అందించిన నిర్మాత దిల్ రాజు గారికి కృతజ్ఞతలు. రామానాయుడు గారి తర్వాత నేను దిల్ రాజు గారిని మూవీ మొఘల్ అని పిలుస్తాను. దిల్ రాజు గారు మన దిల్ లో వుండే నిర్మాత. నిర్మాత శిరీష్ గారంటే కూడా నాకు చాలా ఇష్టం. ఎఫ్3ని  ఇంత చక్కగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు'' అన్నారు

Major Collects 24.5 Crore Gross In 2 Days Worldwide

 Adivi Sesh’s Pan India Film Major Collects 24.5 Crore Gross In 2 Days Worldwide



Major Sandeep Unnikrishnan belongs to India, thus his biopic Major had wider release across the country. The film starring Adivi Sesh Major, which was released June 3rd, has received appreciation from public, media and celebs alike. A lot of stars including Allu Arjun have watched the film and expressed their liking through social media.


The day 2 numbers are higher than day one, with a record 60% jump in North India and a strong hold in the Telugu states and Karnataka. The movie directed by Sashi Kiran Tikka amassed a total of Rs 24.5 Crores worldwide in its two days run. This is turning out to be a biggest hit in Sesh’s career.


The movie crossed $700K in two days and it is soon to enter $1 Million club.


Overall, it is being proven that content is the king and it makes money!

Director Vivek Athreya Interview About Ante Sundaraniki

 'అంటే సుందరానికీ' నవ్వులతో పాటు బలమైన కంటెంట్ వున్న కథ: దర్శకుడు వివేక్ ఆత్రేయ ఇంటర్వ్యూ 




నేచురల్ స్టార్ నాని హీరో గా వరుస బ్లాక్  బస్టర్ విజయాల దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'అంటే సుందరానికీ' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నజ్రియా తెలుగు లో హీరోయిన్ గా పరిచయం కాబోతున్న ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.  జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్ , మలయాళ  భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపధ్యం లో దర్శకుడు వివేక్ ఆత్రేయ మీడియాతో  అంటే సుందరానికీ' విశేషాలు పంచుకున్నారు. ఆయన పంచుకున్న చిత్ర విశేషాలివి. 


'అంటే సుందరానికీ'  ట్రైలర్ చూస్తే బలంగా నవ్వించాలని ఫిక్స్ అయినట్లు అనిపించింది ? 

కేవలం నవ్వించడమే కాదు అన్నీ రకాల ఎమోషన్స్ ఫీలౌతారు. ఎమోషనల్ గా కూడా చాలా బలమైన కంటెంట్ వుంటుంది.


ట్రైలర్ లో  బ్రాహ్మణ, క్రిస్టియన్ లవ్ కనిపించింది కదా.. భారతీ రాజా 'సీతాకోక చిలుక'  ప్రేరణ ఉందా ?

లేదండీ. 'సీతాకోక చిలుక' తో సంబంధం లేదు.


నాని లుక్ బారిష్టర్ పార్వతీశం ని గుర్తిచేసింది.. ఇందులో ఆ నవల ప్రేరణ ఉందా ? 

నాకు చాలా ఇష్టమైన నవల  బారిష్టర్ పార్వతీశం. ఈ కథలో ఒక చిన్న ఎపిసోడ్ లో దాని ప్రేరణ తీసుకొని పంచకట్టు, మిగతా సంరంజామా పెడితే బావుంటుందనిపించి పెట్టాం. ఐతే దీనికి కథకి ఎలాంటి సంబంధం లేదు. 


'అంటే సుందరానికీ' కథ ఎప్పుడు పుట్టింది ? 

ఐదేళ్ళ క్రితమే ఈ కథ ఐడియా వచ్చింది. మొదట విష్ణుతో షేర్ చేసుకున్న. ఈ కథకి నాని ఐతే బావుంటుందని అప్పుడే  అనుకున్నాం. 


నాని గారు ఈ కథ విన్నతర్వాత ఎలా స్పందించారు ? 

నాని గారు చాలా ఎక్సయిట్ అయ్యారు. చాలా నిజాయితీ గల కథ. కథలో పాత్రలు కనిపిస్తాయి తప్పితే ప్రత్యేకమైన ఎలివేషన్స్ ఏమీ వుండవు. చాలా హానెస్ట్ గా వుంటుంది. 


ఒక సంప్రదాయవాద సమాజం నుండి బయటికి రావాలనే సందేశం ఇందులో వుంటుందా ? 

సంప్రదాయవాద సమాజం అనేది ప్రత్యేకమైన సబ్జెక్ట్. దీని గురించి చర్చ వుండదు. ఐతే మనం ఎలాంటి సమాజం వైపు రావాలనే చిన్న సోషల్ కామెంట్ ఇందులో వుంటుంది. ఐతే అది క్లాసులు పీకినట్లు వుండదు. పాత్రల నుండే సహజంగా వస్తుంది. ఆ పాత్రలు మాట్లాడేటప్పుడు అవును కరక్టే కదా అని ప్రేక్షకులు ఫీలౌతారు. 


నాని గారు ఇప్పటికే చాలా వైవిధ్యమైన పాత్రలు చేశారు కదా .. ఇందులో ఎంత వైవిధ్యంగా చూపించారు ? 

నాని గారు ఇప్పటివరకూ ఇలాంటి పాత్రని చేయలేదు. చాలా డిఫరెంట్ పాత్ర. ఆయన పాత్రలో చాలా లేయర్స్ వుంటాయి. ఫన్ వుంటుంది. దాని వెనుక  పెయిన్ వుంటుంది. ప్రతి మాట వెనుక భిన్నమైన లేయర్  వుంటుంది. ఐతే అవన్నీ లోపల పెట్టుకొని బయటకి మాత్రం ఏమీ కనిపించకుండా మాట్లాడే పాత్ర చేయడం అంత సులువు కాదు. నాని గారి ఫన్ గురించి చెప్పక్కర్లేదు. ఐతే ఇందులో ఖచ్చితంగా డిఫరెంట్ నానిని కొత్తగా చూడబోతున్నారు. 

 

'అంటే సుందరానికీ'లో అంటే ఏమిటో ఇంకా సస్పెన్స్ లో పెట్టారు కదా ? 

అవును. టీజర్, ట్రైలర్ లో కథ ఎలా ఉండబోతుందో ఒక ఐడియా మాత్రమే ఇచ్చాం. సస్పెన్స్ అలానే కొనసాగుతుంది. ట్రైలర్ లో ఎమోషన్, ఫన్ చూపించాం. ట్రైలర్ చివర్లో నవ్వుకున్నారు. ఏం జరుగుతుందో అనే ఆసక్తి ఏర్పడింది కదా.. సినిమా అంతా కూడా ఇంతే ఆసక్తికరంగా వుంటుంది. ఆ అంటే ఏమిటో అనేదే ఇందులో కీలకం. అది మీకు కచ్చితంగా నచ్చుతుంది. 


మతాలకి సంబధించిన పాయింట్ టచ్ చేసినప్పుడు వివాదాలు వచ్చే అవాకాశం వుంది కదా.. మరి  ఎలా డీల్ చేశారు ? 

చాలా సెన్సిటివ్ పాయింట్ ఇది. ఈజీగా హర్ట్ అయ్యే పాయింట్. ఐతే ఎవరినీ హర్ట్ చేయకుండా ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని అని కాకుండా పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తీశాం. సెన్సార్ బోర్డ్ ఎలాంటి కట్స్ లేకుండా  క్లీన్' యూ' సర్టిఫికేట్ ఇవ్వడమే దీనికి నిదర్శనం. ఇందులో అభ్యంతరకరమైన అంశాలు వుంటే.. సెన్సార్ క్లీన్ యూ ఇవ్వదు కదా.


నజ్రియా గారు ఈ సినిమాలోకి ఎలా వచ్చారు ? 

లీలా థామస్ పాత్ర చేయడానికి బలమైన పెర్ఫార్మర్ కావాలి. నజ్రియా అయితే ఆ పాత్రకు కరెక్టని భావించాం. ఆమెని అప్రోచ్ ఐతే లక్కీగా ఆమె అంగీకరించడం హ్యాపీ. 


టీజర్ ట్రైలర్ చూస్తుంటే తండ్రి కొడుకుల బాండింగ్ ని చాలా హిలేరియస్ గా చూపించినట్లనిపిస్తుంది.. రియల్ లైఫ్ అనుభవాలా? 


తండ్రి కొడుకుల బాండింగ్ అందరి లైఫ్ లో కామన్ కదా( నవ్వుతూ) నాన్నలు తిడతారు ప్రేమిస్తారు బాధపడతారు. నాని గారు నరేష్ గారి పాత్రలలో అన్ని ఎమోషన్స్ చూస్తారు. 


దాదాపు మూడు గంట ల రన్ టైం వుంది కదా .. ఇది ఇబ్బంది కాదా ?

 రన్ టైం అనేది సమస్య కాదు. ఈ కథలో చెప్పాల్సిన విషయాలు చాలా వున్నాయి. ఆ విషయాలు చెప్పడానికి నాకు కావాల్సిన లెంత్ ఇది. మంచి కథ తీశామని సినిమా యూనిట్ అంతా చాలా నమ్మకంగా వున్నాం. సినిమా చూస్తున్నపుడు ఈ లెంత్ ని ఫీలవ్వరు. చాలా సరదా హాయిగా గడిచిపోతుంది. 


ఒకప్పుడు ఇంటర్ క్యాస్ట్ వివాహాలు అంటే అడ్డంకులు ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు మారాయి కదా.. ఇప్పుడు ఇలాంటి కథ చెప్పే ఆవశ్యకత ఉందా ? 

ఇప్పటికీ ఇంటర్ క్యాస్ట్ వివాహాలకు చాలా అడ్డంకులు వున్నాయి. న్యూస్ లో రాకపోవడం, వినీవినీ  రొటీన్ అయిపోవడం జరుగుతుంది కానీ చాలా మంది ఈ సమస్య ఎదుర్కుంటున్నారు. ఎన్నో పరువు హత్యలు వెలుగు చూస్తున్నాయి కదా. ఐతే మేము చాలా హ్యూమరస్ అప్రోచ్ తో ఈ కథని డీల్ చేశాం. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది.


చాలా సీరియస్ పాయింట్లని కూడా వినోదాత్మకంగా చెబుతుంటారు. అది మీ స్టయిల్ అనుకోవచ్చా ? 

అది మన అప్రోచ్ అండీ. ఒక సీరియస్ విషయాన్నీ ఇంకా సీరియస్ గా ఒకే టోన్ లో చెప్పడం కంటే దాన్ని వినోదాత్మకంగా చెప్పి ఫైనల్ గా చెప్పాల్సిన పాయింట్ ని చెబితే దాని ఇంపాక్ట్ ఎక్కువ వుంటుందని భావిస్తాను.


నాని గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ? 

నాని గారు ఎప్పుడూ ఒక స్టార్ లా బిహేవ్ చేయలేదు. ఆయన సెట్ లో ఉన్నంత సేపు సుందర్ లానే వుండేవారు.అలా వున్నపుడు డైరెక్ట్ చేయడం చాలా ఈజీ. అలాగే నజ్రియా గారు కూడా అంతే. 


'అంటే సుందరానికీ' పాన్ ఇండియా సబ్జెక్ట్ కదా.. సౌత్ కే పరిమితం చేయడానికి కారణం ? 

'అంటే సుందరానికీ' కథ యూనివర్సల్ కథ. ఐతే కథ రాసినప్పుడే ఇది  సౌత్ కి బావుంటుందని అనుకున్నాం. 


'అంటే సుందరానికీ' లో స్పెషల్ గా ఎలాంటి పాటలు పెట్టినట్లనిపించలేదు.. అన్నీ కథలో బాగామైన సాంగ్స్ లానే వున్నాయి కదా ? 

అవునండీ. ఒక క్యాచి సాంగ్ అద్భుతంగా బయట క్లిక్ అవ్వొచ్చు. నా కథకు సెట్ కాకపోవచ్చు. నాకు కథే ముఖ్యం. కథలో బాగామైన పాటలే వున్నాయి. అందరికీ నచ్చాయి. వీడియోతో చూస్తే ఇంకా ఎంజాయ్ చేస్తారు. 


ఓటీటీల ప్రభావం పెరిగింది కదా.. సినిమాకి కథ చేసి ప్రేక్షకులని థియేటర్లోకి రప్పించడం సవాల్ గా ఉందా ? 

 ఇప్పుడున్న పరిస్థితిలో కచ్చితంగా సవాలే. అయితే సినిమా థియేటర్ లో అందరితో చూసి ఎంజాయ్ చేయడం గొప్ప అనుభూతి. అందుకే ఇలాంటి సినిమాలు వస్తున్నపుడు ప్రేక్షకులు థియేటర్లో చూసి ఆనందించాలని కోరుతున్నాను.  'అంటే సుందరానికీ' లో బలమైన కంటెంట్ వుంది. తప్పకుండా ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి సినిమాని చూస్తారు. 


మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల గురించి ? 

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో పని చేయడం గొప్ప అనుభూతి. సినిమాకి కావాల్సిన ప్రతిది సమకూర్చారు, నేను ఏదీ అడిగినా ఇచ్చారు.  మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల సహకారాన్ని మర్చిపోలేను. 


ప్రతి సినిమాకి జోనర్ మారుస్తున్నారు కదా ?

నన్ను నేను కొత్తగా మలుచుకోవడం కోసమే. నాకు నేను బోర్ కొట్టకుండా ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా ఎప్పటికప్పుడు కొత్త కథలు చేయాలనే వుంటుంది. 

భవిష్యత్ లో ఎలాంటి సినిమా చేయాలని వుంది ? 

ఒక యాక్షన్  డ్రామా చేయాలని ఎప్పటి నుండో వుంది. తప్పకుండా చేస్తా. 


దర్శకుడే రచయిత అవ్వడం వలన సినిమా క్వాలిటీ తగ్గుతుందా ? 

లేదండీ. అలా ఏం వుండదు. కథ లో లోపం వుంటే క్వాలిటీ తగ్గుతుంది కానీ దర్శకుడే రచయిత అవ్వడం చేత క్వాలిటీ తగ్గడం అంటూ వుండదు. 


కొత్త సినిమా సంగతులు ? 

కొన్ని ఐడియా లు వున్నాయి. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు 


ఆల్ ది బెస్ట్ 

థాంక్స్

'Kinnerasani' is set for a direct OTT release

 'Kinnerasani' is set for a direct OTT release

ZEE5 to stream the mystery thriller from June 10



Hyderabad, 4th June 2022: ZEE5 has been one OTT platform that has been constantly churning out a myriad of stories and subjects in the form of Originals, direct-to-digital releases, new films and so on. Latest, it is bringing out a promising Telugu film as a direct-to-service release. It's an exclusive release by ZEE5.


Kalyaan Dhev-starrer 'Kinnerasani' is ZEE5's next direct OTT release on June 10. The feature film is a mystery thriller that traces the journey of Veda, who is in search of her father. Ann Sheetal, Kashish Khan and Ravindra Vijay (the film's antagonist) have key roles. The titular role is played by Mahathi Bikshu. 


Directed by Ramana Teja, 'Kinnerasani' is written by Sai Teja Desharaj Athreyasa. 


Cast:


Kalyaan Dhev, Ann Sheetal, Ravindra Vijay, Kashish Khan, Mahathi Bikshu and others. 


Crew: 


Director: Ramana Teja

Producer: Ram Prasad Talluri

Writer: Sai Teja Desharaj Athreyasa

Editor: Anwar Ali

Lyricist: Kittu Vissapragada

Banner: SRT Entertainments

India Loves Major Event Held Grandly in Hyderabad

మేజర్ ని సినిమా గా చూడటం లేదు... ఒక ఎమోషన్ గా చూస్తున్నా:  ఇండియా లవ్స్ మేజర్ మీట్ లో అడవి శేష్



వెర్సటైల్ స్టార్ అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ 'మేజర్'. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో  ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులు, విమర్శకులు ఇండియన్ సినిమా చరిత్రలో 'మేజర్' చిత్రం ఒక మైలురాయని కితాబిచ్చారు. చిత్రం దేశవ్యాప్తంగా ప్రభంజన విజయం సాధించిన నేపధ్యంలో ''ఇండియా లవ్స్ మేజర్ ' ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్.


ఈ సందర్భంగా హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఒక అలవాటు వుంది. మార్నింగ్ షో అయిపోగానే సినిమా గురించి మంచిగా వింటున్నాం అని మెసేజ్ వస్తే.. సినిమా పొయిందని అర్ధం. ఫోన్ కంటిన్యూగా మ్రోగుతుంటే సినిమా హిట్ అని అర్ధం. నిన్నటి నుండి  కంటిన్యూ కాల్స్ తో నా ఫోన్ ఫ్రీజ్ అయిపొయింది. కొత్త ఫోన్ కొనుక్కువాల్సివస్తుంది. ఎమోషనల్ గా, కలెక్షన్స్ పరంగా ఇప్పటివరకూ నా సినిమాలన్నీటి కంటే 'మేజర్' ఐదు రెట్లు పెద్దది. మేజర్ సందీప్ విషయానికి వస్తే ఆయన్ని ఎంత ప్రేమించినా సరిపోదనే భావన వుంది. నా గత చిత్రం 'ఎవరు' కంటే ఐదు రెట్లు ఎక్కువగా మేజర్ ఓపెనింగ్స్ వున్నాయని బాక్సాఫీసు లెక్కలు చెబుతున్నాయి. ఐతే మేజర్ ని నేను సినిమాగా చూడటం లేదు ఇది ఎమోషన్. ఇదే సంగతి ప్రీరిలీజ్ ఈవెంట్ లో చెప్పా. ఈ ఎమోషన్ ఇంకా బిగ్గర్ కాబోతుందని ఇప్పుడు పోస్ట్ రిలీజ్ ఈవెంట్ లో చెబుతున్నా.

నా యూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు. మేజర్ సందీప్ పేరెంట్స్ ని మిస్ అవుతున్నా. అలాగే మా గురువు గారు అబ్బూరి రవి గారి సపోర్ట్ ని మర్చిపోలేను. ఈ చిత్రానికి గ్రేట్ గైడ్ అబ్బూరి రవి గారు. అన్నపూర్ణ స్టూడియోస్ టీంకి కృతజ్ఞతలు. ఒక పోస్ట్ ప్రొడక్షన్ హౌస్ చేయాల్సిన పనికంటే పది రెట్లు ఎక్కువ చేశారు. అలాగే కాస్ట్యూమ్స్ ని అద్భుతంగా డిజైన్ చేసిన రేఖాకి స్పెషల్ థ్యాంక్స్.

మేజర్ సినిమా చూసిన చాలా మంది ఫోర్స్ లో జాయిన్ అవ్వాలని వుందని మెసేజ్ పెడుతున్నారు. ఈ వేదికపై మేజర్ ప్రామిస్ చేస్తున్నా. సిడిఎస్, ఎన్డీఏ లో జాయిన్ అవ్వాలనుకుని సరైన వనరులు లేక కష్టపడుతున్న వారికి సపోర్ట్ చేయాలని మేజర్ టీమ్ నిర్ణయించింది. అది ఎలా అనేది రాబోతున్న రోజుల్లో స్పష్టంగా వెల్లడిస్తాం. మొదట ఒక పదిమందితోనే మొదలుపెడతాం. అది కోట్లమందిగా మారుతుందని నమ్ముతున్నాం. ఇదో పెద్ద మూమెంట్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పేరుతో ఈ మూమెంట్ ని లాంచ్ చేస్తాం. మేజర్ చిత్రాన్ని మా పేరెంట్స్ కి డెడికేట్ చేస్తున్నా. ఈ చిత్రాన్ని మరింత పెద్ద విజయం చేయాలని కోరుతున్నా.' అన్నారు అడవి శేష్  


దర్శకుడు శశి కిరణ్ తిక్క మాట్లాడుతూ.. మేజర్ అడవి శేష్ డ్రీం ప్రాజెక్ట్ అని నాకు ఎప్పుడో తెలుసు. ఐతే మేజర్ ని నన్ను డైరెక్ట్ చేయమన్నప్పుడు నేను పెద్దగా స్పందించలేదు. మేజర్ సందీప్ రియల్ హీరో అని తెలుసు. ఐతే ఆయన పాస్ పోర్ట్ సైజ్ ఫోటో చూడటం తప్పితే ఆయన గురించి డీప్ గా అప్పటికి తెలీదు. ఐతే నా టీం ని ఏర్పాటు చేసుకొని సందీప్ గురించి ఒకొక్క విషయం తెలుసుకోవడం మొదలుపెట్టాం. నా డైరెక్షన్ టీం వినయ్, రాజీవ్ ఎప్పుడూ నా పక్కనే వున్నారు. గౌతమ్ వీఎఫ్ ఎక్స్ అంతా తానె  చూసుకున్నాడు. దినేష్ , అనురాగ్, మనోజ్ కూడా అద్భుతంగా పని చేశారు. సినిమాటోగ్రాఫర్  వంశీ పచ్చిపులుసు అద్భుతమైన విజువల్స్ అందించారు. నా మనసులో వున్న విజువల్స్ ని ప్రజంట్ చేశారు. అవినాస్ కొల్లా అద్భుతమైన సెట్స్ వేశారు. తాజ్ హోటల్ ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల గ్రేట్ మ్యూజిక్ ఇచ్చారు. కస్ట్యూమ్స్ ని అద్భుతంగా డిజైన్ చేసిన రేఖాకి థ్యాంక్స్ . శోభితా, సాయీ అద్భుతంగా చేశారు. అడవి శేష్ కి స్పెషల్ థాంక్స్. మేజర్ లాంటి గొప్ప సినిమా చేసే అవకాశం ఇచ్చారు. రచయిత అబ్బూరి రవి గారి సపోర్ట్ ని కూడా మర్చిపోలేం.


మేజర్ సందీప్ పేరెంట్స్ తో  ప్రయాణం మర్చిపోలేం. వాళ్ళు చెప్పిన ప్రతి మాటని నోట్ చేసుకున్నాం. సందీప్ ఫాదర్ నాతో ఒక మాట చెప్పారు. సందీప్ మాతోనే వున్నాడు. మాకు ప్రతి విషయాన్ని గైడ్ చేస్తుంటాడని చెప్పారు. అప్పుడు ఆయన చెప్పింది అప్పుడు నాకు అర్ధం కాలేదు. నేను మేజర్ షూటింగ్ లో వుండగా మా నాన్నగారు చనిపోయారు. శేష్ కి ఫోన్ చేసి వెళ్ళిపోయాను. అక్కడి వెళ్ళిన తర్వాత నువ్వు సినిమా షూటింగ్ వెళ్ళు. ముందు సినిమాని పూర్తి చెయ్'' అని మా నాన్న చెప్పినట్లనిపించింది. అప్పుడు మేజర్ సందీప్ నాన్నగారి మాటలు గుర్తుకువచ్చాయి. మూడు రోజుల తర్వాత మళ్ళీ షూటింగ్ కి వచ్చేశాను.


ప్రకాష్ రాజ్ గారిని ఈ సీన్ లో చూస్తే మా నాన్న గుర్తుకు వచ్చారని, రేవతి గారిని చూస్తే అమ్మ గుర్తుకు వచ్చిందని చాలా మంది నాకు మెసేజులు పెడుతున్నారు. నాకు మా నాన్న గుర్తుకు వచ్చారు. కొందరు చాటుగా ఏడుస్తున్నామని చెబుతున్నారు. కానీ చాటుగా ఏడవద్దు. గర్వంతో కన్నీళ్లు కార్చండి.   మేజర్ సందీప్ గారిది గొప్ప జీవితం. ఆయన చాలా గొప్పగా బ్రతికారు'' అన్నారు  


హీరోయిన్  సయీ మంజ్రేకర్‌ మాట్లాడుతూ... మేజర్ చిత్రంలో భాగం కావడం గర్వంగా వుంది. చాలా ప్యాషన్, డెడికేషన్, గౌరవంతో ఈ చిత్రం చేశాం. దేశ వ్యాప్తంగా మేజర్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తే ఆనందంగా వుంది. నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన అడివి శేష్, శశి కిరణ్, నిర్మాతలు శరత్, అనురాగ్, జీఎంబీ, సోనీ పిక్చర్స్ కి కృతజ్ఞతలు'' తెలిపారు.


నిర్మాత శరత్ మాట్లాడుతూ.. మేజర్ చిత్రానికి సందీప్ గారు పై నుండి ప్రతిక్షణం మమ్మల్ని ముందుకు నడుపుతున్నారని అనిపించేది. మా మొదటి మేజర్ గొప్ప విజయాన్ని సాధించడం ఆనందంగా వుంది. ఇంత గొప్ప చిత్రం తర్వాత ఎలాంటి సినిమా చేయాలనే ఆందోళన కూడా వుంది. ఈ విషయంలో అడివి శేష్ మా వెంట ఉంటారని భావిస్తున్నా. సినిమా నచ్చితే బావుందని అంటారు. కానీ మేజర్ కి స్టాండింగ్ ఒవేషన్ మర్చిపోలేని అనుభూతి. అడివి శేష్ మమ్మల్ని  ముందుండి నడిపించారు. మేజర్ సందీప్ కథ చెప్పడం, నమ్రత మేడమ్ గారిని కలవడం, తర్వాత సోనీ పిక్చర్స్ రావడం.. ఈ ప్రోసస్ అంతటిలో శేష్ వున్నారు. దర్శకుడు శశికి ఈ సినిమా తర్వాత ఫ్యాన్ అయిపోయా. యూనిట్ అంతా నమ్మకంగా పని చేశాం. ఆ నమ్మకమే ఈ రోజు మీకు తెరపై అంత అద్భుతంగా కనిపించింది. మేజర్ లాంటి క్లాసిక్ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మేజర్ నిప్రతి ఒక్కరూ తప్పక థియేటర్ లో చూడాలని కోరుతున్నా'' అన్నారు


నిర్మాత అనురాగ్ మాట్లాడుతూ.. మేజర్ చిత్రానికి వస్తున్న రెపాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. సినిమాని చూసిన ప్రేక్షకులు ఒక ఎమోషనల్ లెవల్ దాటి మనసుతో స్పందిస్తున్నారు. ఇంటర్, డిగ్రీ చుడుకునే యూత్ మేజర్ చూసిన తర్వాత ఫోర్స్ లోకి వెళ్లాలని ప్రేరణ పొందడం మాకు ఎంతోఆనందాన్ని ఇస్తుంది. శరత్ వాళ్ళ అన్నయ్య కూడా ఫోర్స్ లో పని చేస్తారు. ఆయన లక్ష్య సినిమా చూసి ఫోర్స్ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. ఇప్పుడు మేజర్ సినిమా చూసి మళ్ళీ అదే ప్రేరణ వచ్చిందని చెప్పడం చాలా ఆనందంగా వుంది. నెక్స్ట్ జనరేష్ ఇండియా మేజర్ చూసి ఫోర్స్ ని కెరీర్ ఎంచుకోవడమే అన్నిటికంటే పెద్ద విజయమని భావిస్తున్నా. చిత్రంలో పని చేసిన యూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు'' తెలిపారు.


సినిమాటోగ్రాఫర్  వంశీ పచ్చిపులుసు మాట్లాడుతూ.. మేజర్ చిత్రానికి దేశం వ్యాప్తంగా అద్భుతమైన  స్పందన వస్తుంది. నా ఫోన్ కంటిన్యూగా మ్రోగుతూనే వుంది. ఇండస్ట్రీలో కొందరు ఫోన్ చేసి .. సినిమా రోలింగ్ టైటిల్స్, లైట్స్ ఆన్ అయినప్పటికీ ఎవరూ సీట్ నుండి లేవడం లేదని చెప్పారు. ఇంత మంచి విజువల్స్ రావడానికి కారణమైన నా టీమ్ మొత్తానికి కృతజ్ఞతలు.


సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ..  మేజర్ చిత్ర నిర్మాతలకు, దర్శకుడు శశి కిరణ్ తిక్క, హీరో అడవి శేష్ కృతజ్ఞతలు. మేజర్ సందీప్ బయోపిక్ మ్యూజిక్ అందించడం గొప్ప అదృష్టం, గౌరవంగా భావిస్తున్నా. మూడేళ్ళు పాటు మేజర్ జర్నీ సాగింది. కరోనా లాంటి పాండమిక్ ని దాటోచ్చాం. దర్శకుడు శశి గారి ఫాదర్ చనిపోయిన మూడో రోజుకే శశి ఎంతో ధైర్యంగా సెట్స్ కి వచ్చారు. మా నాన్నగారి 11రోజు పూజ తర్వాత నేనూ మేజర్ టీజర్ మిక్సింగ్ కి వచ్చాను. మేజర్ విజయం మాకెంతో గర్వంగా వుంది.  నా యూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు. మేజర్ సందీప్ గారి ఈ చిత్రం గొప్ప నివాళి.'' అన్నారు


నటుడు అనీష్ కురువిల్లా మాట్లాడుతూ.. మేజర్ లాంటి గొప్ప సినిమా తీసిన మహేష్ బాబుగారికి కృతజ్ఞతలు. హీరో అడవి శేష్ మేజర్ చిత్రాన్ని ఎంతో అంకిత భావంతో చేశారు, అది తెరపై కనిపించింది. సినిమా మొదలైనప్పటి నుండి తెరకి అతుక్కుపోయా. దర్శకుడు శశి కిరణ్ మేజర్ చిత్రాన్ని అద్భుతంగా తీశారు, మేజర్ సందీప్ కి ఘనమైన నివాళిగా నిలిపారు. మేజర్ టీం అద్భుతమైన టీమ్ వర్క్ తోనే ఇంత పెద్ద విజయం సాధ్యమైయింది. ఈ చిత్రంలో బాగం కావడం గర్వంగా వుంది.'' అన్నారు.

Major - A Story That Touches Every Indian Heart- Says Allu Arjun

 MAJOR - A STORY THAT TOUCHES EVERY INDIAN HEART, SAYS ALLU ARJUN



Stylish Star Allu Arjun has had always appreciated films with good content. 'Major 'being a movie power packed with emotions of Patriotism in it ,he did not shy away from expressing his joy for giving such a wonderful experience that every Indian cherishes for a very  very long time to come.


And Truly So!!


The moment the movie Major is out, it's casting  magic all around.

A magic of pure emotions.

The movie once again reinstated the fact that all great heores  have been great  Human beings first. It's the humanity in them and their love for the fellow beings that makes them the heroes that they are. 


The audience instantaneously connected  themselves with the character of Major Sandeep. 

People after watching the movie are thanking Superstar Mahesh Babu and his partners in production for conceiving such a beautiful cinema.


The viewers  are showering praises on  Adivi Sesh for choosing to play the on-screen role of Major Sandeep Unnikrishnan.


The spectators are spellbound by the theatrical experience and are coming out with teared eyes.

They are saying Major is a movie that an Indian should never miss watching. 


Few even quoted to the extent that this movie gives you an experience which cannot be  simply expressed by  giving a rating. It's much much beyond that.

 

This is truly a heartouching movie which drives deep an emotion of nationality and Indianness in one and all.

Major Collects 13.4 Crores Gross Worldwide On Day One

Adivi Sesh’s Pan India Film Major Collects 13.4 Crores Gross Worldwide On Day One



Promising star Adivi Sesh’s most awaited Pan India movie Major has done tremendous business on its opening day in domestic as well as overseas market. The movie’s day one collections, including premieres on Thursday grossed nearly half a million dollars alone in the USA.


In Telugu states and other parts of the country too, the movie raked good collections on day one. Major has collected Rs 13.4 Crores gross worldwide on day one and has become highest opener for Sesh.


The movie got overwhelming response from early premiere shows and the talk is positive from critics as well. As per trade analysts, Major’s bookings are encouraging for today and tomorrow. 

‘JGM’ First Shoot Schedule Commences!

 Super star The Vijay Deverakonda, Pooja Hegde, Puri Jagannadh, Puri Connects & Srikara Studios’ ‘JGM’ First Shoot Schedule Commences!



The game changing duo- Super star The Vijay Deverakonda and path breaker ace director Puri Jagannadh’s second collaboration “JGM” is going to be an action-drama big ticket pan India entertainer releasing in Hindi, Telugu, Tamil, Kannada and Malayalam. This is dream project of director Puri Jagannadh who also penned story, screenplay and dialogues.


Jointly produced by Charmme Kaur, Vamshi Paidipally under Puri Connects and Srikara Studios Production, Pooja Hegde joins the stellar cast and this marks her first collaboration with The Vijay Deverakonda.


The makers commence with the first shoot schedule today with actress Pooja Hegde who will be seen in an action-packed role taking part in the filming. The shoot schedule of Puri’s dream project will be held across multiple international locations beginning first with Mumbai. The makers share a special video to mark this beginning.


Puri Jagannadh in his dream project will be showing The Vijay DEverakonda in a never seen before role. The Vijay Deverakonda, on the other hand, is aiming for his next breakthrough performance. 

 

Written & directed by Puri Jagannadh, JGM is set to release in cinemas on 3rd August 2023 Worldwide.


Cast: The Vijay Deverakonda, Pooja Hegde


Technical Crew:

Story, Screenplay, Dialogues & Direction: Puri Jagannadh

Producers: Charmme Kaur and Vamshi Paidipally

Banners: Puri Connects & Srikara Studios

PRO: Vamsi-Shekar

Shri Katta Hariprasad Ci Awarded with Utthama Seva Pathakam

 Shri Katta Hariprasad  Ci of Police  Intelligence Dept - Westzone



Hyderabad who belongs to  1996Batch - Telangana Police  is awarded with Utthama Seva Pathakam on eve of Telangana Formation Day


He has rendered his services in top police stations of Karimnagar District 


On this occasion let us congratulate him on achieving the prestigious award

Abhishek Bachchan presents Prime Video’s Suzhal – The Vortex at IIFA Rocks

 Abhishek Bachchan presents Prime Video’s Suzhal – The Vortex at IIFA Rocks




For the first time ever, a Tamil series took center stage at IIFA, as the cast of Suzhal - The Vortex captured the attention of the audience in attendance through a riveting performance, that gave a glimpse into the mind-bending series. Fueling the already piqued interest and excitement, Abhishek Bachchan presented the series to the audience at the IIFA Rocks night in Abu Dhabi.

Sharing the stage with the cast, creators of the series and Abhishek Bachchan were Gaurav Gandhi - Country Head, and Aparna Purohit - Head of India Originals, at Amazon Prime Video. Prodding them to lift the veil on the suspense that has enraptured not only the audience but him as well, Abhishek succeeded in getting the Suzhal team to share a sneak peek of the upcoming investigative drama at IIFA.

Premiering globally in 30+ languages including Hindi, Kannada, Malayalam, Telugu, English, French, German, Italian, Japanese, Polish, Portuguese, Spanish, Arabic, and Turkish, Suzhal - The Vortex will stream on the platform from June 17. 

The creative brainchild of Vikram-Vedha fame, maverick duo Pushkar and Gayatri, and directed by Bramma and Anucharan M, the investigative drama series stars Kathir, Aishwarya Rajesh, Sriya Reddy along with Radhakrishnan Parthiban in pivotal roles.

Ante Sundaraniki Awarded With Clean U Certificate

 Nani, Vivek Athreya, Mythri Movie Makers Ante Sundaraniki Awarded With Clean U Certificate



Ante Sundaraniki marks the first association of Natural Star Nani and the very talented filmmaker Vivek Athreya. Since both are in good form, and the promotional material got overwhelming response, Ante Sundaraniki is carrying extremely enthusiastic reports, ahead of its release. Now, the movie produced by Mythri Movie Makers has completed its censor scrutiny and it was awarded clean U certificate.


Nani’s characterization is going to be completely different and amusing. Nani and Nazriya Nazim’s love track will be magical and humorous. Nani and his family scenes are going to be other pleasurable moments in the movie. Vivek Athreya penned situational and healthy comedy sequences. The movie will be thoroughly entertaining, though it has heart-touching emotions.


The total duration of the movie is locked for 2 hours 56 minutes, including ads. An intriguing narration will make it an engaging watch. Vivek Sagar scored some wonderful tracks for the movie and his background score is going to be another big asset.


Expectations are quite high on the movie which is due for release in Telugu, Tamil and Malayalam languages on June 10th.

Pakka Commercial Releasing with Best Ticket Prices

అందరికీ అందుబాటులోనే  పక్కా కమర్షియల్, టిక్కెట్ల ధ‌రలు పై సృష్ట‌త ఇచ్చిన మెగా నిర్మాత అల్లుఅర‌వింద్, నిర్మాత బ‌న్నీవాసు - జూలై 1న థియేట‌ర్ల‌లో ప‌క్క క‌మ‌ర్షియ‌ల్



మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో "పక్కా కమర్షియల్" సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూలై 1, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్’లో భాగంగా ఈ మూవీ టీం ప్రెస్ మీట్ ను నిర్వహించింది.  ఈ కార్యాక్రమంలో హీరో గోపిచంద్, హీరోయిన్ రాశీఖన్నా, దర్శకుడు మారుతి, అగ్ర నిర్మాత అల్లు అరవింద్, నిర్మాత బన్నీ వాసు తో పాటు చాలామంది ప్రముఖులు హాజరయ్యారు.


టికెట్ ధరల గురించి ప్రస్తావిస్తూ నిర్మాత బన్నీ వాసు రేట్స్ అందుబాటులో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో అరవింద్ గారు ,తాను మొదటి వ్యక్తులమని. నైజంలో 160+gst, ఆంధ్ర మల్టిఫ్లెక్స్ లో 150+gst, సింగిల్ స్క్రీన్ లో 100+gst అని చెప్పుకొచ్చారు. అందరు టికెట్ కోసం పెట్టిన డబ్బులకి హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్తారు అని చెప్పుకొచ్చారు.


హీరోయిన్ రాశిఖన్నా మాట్లాడుతూ తెలుగులో నా సినిమా రిలీజై చాలా రోజులు అయింది, మారుతి గారు ఏంజిల్ ఆర్నా కంటే చాలా చాలా మంచి కేరక్టర్ రాసారు. సినిమాలో చాలా మంచి  సీన్స్  ఉన్నాయ్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. గోపీచంద్ గారితో మూడు సినిమాలకి వర్క్ చేశాను చాలా హ్యాపీ గా ఉంది.


దర్శకుడు మారుతి మాట్లాడుతూ ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి మొదటి కారణం యు.వి క్రియేషన్స్ వంశీ. నా నుంచి ఎటువంటి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారో వాటితో పాటు అన్ని మిక్స్ చేసి తీసిన కమర్షియల్ సినిమాలా ఉంటుందని హామీ ఇచ్చారు.


"పక్కా కమర్షియల్" సినిమా ఓటిటిలో అంత త్వరగా రాదు, f3 సినిమా ప్రస్తుతం బాగా ఆడుతుంది, దానికి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా కూడా ఉండబోతుందని మెగా నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు.


గోపిచంద్ మాట్లాడుతూ..నేను ఈ సినిమా చెయ్యడానికి  కారణం వంశీ, జిల్ తరువాత ఎప్పటినుంచో సినిమా చెయ్యాలనుకున్నాం కానీ మంచి కథ దొరకలేదు. కథ బాగా నచ్చడంతో, చేసేద్దాం అని ఫిక్స్ అయ్యాం. మారుతి తో షూటింగ్ స్టార్ట్ అవ్వగానే మాకు వేవ్ లెన్త్ బాగా కుదిరింది. ఒక పాజిటివ్ పీపుల్ కలిసి సినిమా చేసినప్పుడు దాని రిజల్ట్ కూడా పాజిటివ్ గా ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ పక్కా కమర్షియల్.



స‌మ‌ర్ప‌ణ - అల్లు అరవింద్

బ్యాన‌ర్ - జీఏ2పిక్చ‌ర్స్, యూవీక్రియేష‌న్స్

నిర్మాత‌ - బ‌న్నీ వాస్

ద‌ర్శ‌కుడు - మారుతి

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ - ర‌వీంద‌ర్

మ్యూజిక్ - జ‌కేస్ బీజాయ్

స‌హ నిర్మాత - ఎస్ కే ఎన్

లైన్ ప్రొడ్యూసర్ - బాబు

ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూస‌ర్ - స‌‌త్య గ‌మిడి

ఎడిటింగ్ - ఎన్ పి ఉద్భ‌వ్

సినిమాటోగ్ర‌ఫి - క‌ర‌మ్ చావ్ల‌

పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌ శ్యామ్

Saachi Pan India Film Launched by Minister Srinivas Goud

 మంత్రి శ్రీనివాస్ గౌడ్  చేతుల మీదుగా  ప్రారంభంమైన పాన్ ఇండియా మూవీ "సాచి "



సత్యానంద్ స్టార్ మేకర్స్ సమర్పణలో విధాత  ప్రొడక్షన్ పతాకంపై సంజన, మూలవిరాట్ అశోక్ రెడ్డి నటీనటులుగా వివేక్ పోతిగేని దర్శకత్వంలో ఉపేన్ నడిపల్లి యాదార్థ సంఘటనల ఆధారంగా నిర్మిస్తున్న చిత్రం  "సాచి".తెలుగు, తమిళ్,, మలయాళం, కన్నడ, బాషలలో నిర్మిస్తున్న ఈ  చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని అన్నపూర్ణ లో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్  ఆర్టిస్ట్ బిందుపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, నిర్మాత రామ్ మెహన్ రావు గౌరవ  దర్శకత్వం  వహించగా, సత్యానంద్ మాస్టర్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో 

మంత్రి శ్రీనివాస్ గౌడ్  మాట్లాడుతూ..తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి నిజజీవిత సంఘటనల ఆధారంగా తీసుకొని ఈ సినిమా తీయడం జరిగింది. దర్శకుడు వివేక్ పోతిగేని అమెరికాలో స్థిరపడ్డా తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది అని తెలుసుకుంటూ  వారి తండ్రి గారి కోరిక మేరకు తెలుగులో దర్శకుడు  అవ్వాలనే కోరికతో  అమెరికాలో కొన్ని షార్ట్ ఫీలిమ్స్ తీస్తూ నా జన్మనిచ్చిన గడ్డ పైన సినిమా తీయాలని నిజ జీవితానికి దగ్గరగా ఉన్నటువంటి "సాచి" కథను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి ప్రజలను చైతన్యవంతులను చేయాలనే ప్రయత్నం చాలా మంచిది.మంచి కాన్సెప్ట్ తో తీస్తున్న సినిమా పెద్ద విజయం సాధించాలి. ఇలాంటి సినిమాలు భావితరానికి చాలా అవసరం అని అన్నారు.

దర్శకుడు వివేక్ పోతిగేని మాట్లాడుతూ..మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు ఎంతో బిజీగా  ఉన్నా మేము పిలిచిన వెంటనే  మా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చారు  వారికి మా ధన్యవాదములు.నేను అమెరికాలో స్థిరపడ్డా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన  కొన్ని యధార్థ  సంఘటనల ఆధారంగా  సినిమా  తీయాలనుకున్నటైంలో  తెలంగాణ లోని ఖమ్మంలో జరిగిన కథ  విన్నాను.మంగలి  వృత్తి చేస్తూ  జీవనం  సాగించే ఒక నిరుపేద కుటుంబ యజమానికి  బ్రెయిన్ ట్యూమర్ బారినపడితే ఆ ట్రీట్మెంట్ కొరకు వారి ఆస్తులను అమ్ముకొని రోడ్డున పడడంతో వారి తండ్రి చేసే  మంగలి  వృత్తిని కూతురు స్వీకరించి, చదువుకుంటూ ఎన్నో అవమానాలు, అవహేళనను ఏదోర్కొన్నా దైర్యంగా  ఆ కుటుంబాన్ని ఎలా పోశించిది అనేది ఈకథ సారాంశం. ఆ అమ్మాయి ధైర్యానికి మెచ్చుకొని మేము వారి కుటుంబానికి అండగా  నిలబడాలని  కొంత  నగదుతో  సహాయం చేయడం జరిగింది. ఇందులో చాలా మంది కొత్తవారికి నటించే అవకాశం  ఇవ్వడం జరిగింది..మంచి కాన్సెప్ట్ తో తీస్తున్న సినిమా పెద్ద విజయం సాధించాలి అన్నారు.

చిత్ర నిర్మాత ఉపేన్ నడిపల్లి  మాట్లాడుతూ..యధార్థ  సంఘటనల ఆధారంగా సినిమా  తీద్దాం అని దర్శకుడు వివేక్ చెప్పడంతో ఈ సినిమాను తనతో కలసి నిర్మిస్తున్నాను. మంచి కాన్సెప్ట్ తో  వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరినీ ఆలోచింప జేసేలా  ఉంటుంది అన్నారు.


ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ప్రేక్షకులను ఆలోచింపజేసే చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు.
 

నటీనటులు
సంజన, మూలవిరాట్ అశోక్ రెడ్డి, స్వప్న, సాయి రామకృష్ణ, రవీందర్ పానబాక, టివి రమణ్, ప్రదీప్ ఏ. వి. యస్. తదితరులు


సాంకేతిక నిపుణులు
సమర్పణ : సత్యానంద్ స్టార్ మేకర్స్
బ్యానర్ : విధాత ప్రొడక్షన్స్ 
నిర్మాత : ఉపేన్ నడిపల్లి,వివేక్ పోతిగేని 
స్టోరీ స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రపీ ,డైరెక్షన్ : వివేక్ పోతిగేని 
ఎడిటర్ : జెఫర్సన్ రోస , 
మ్యూజిక్ డైరెక్టర్ :  వి. భారద్వాజ్
లిరిక్ రైటర్ : ప్రసన్న కుమార్, స్వరూప్ 
డైలాగ్స్ : పెద్దింటి అశోక్ కుమార్,వివేక్ పోతిగేని 
ఆర్ట్ : సుబ్బు 
కో డైరెక్టర్ : చరణ్ కాకర్ల 
పి.ఆర్.ఓ : మధు వి. ఆర్

Ante Sundaraniki Trailer Trending Top On YouTube With 10M+ Views

 Nani, Vivek Athreya, Mythri Movie Makers Ante Sundaraniki Theatrical Trailer Trending Top On YouTube With 10M+ Views



The theatrical trailer of Natural Star Nani’s highly anticipated rom-com Ante Sundaraniki was released yesterday and it has exceeded all the expectations. The video has been trending top on YouTube with 10M+ views so far.


Nani appeared as a young Brahmin Sundar whose dream is to visit USA at least once in his life. Nazriya Nazim who played his love interest as Leela also has a bigger dream of becoming a popular photographer. The two different worlds of Sundar and Leela, their love story and the fun in the journey together enthused movie buffs.


The trailer has taken the prospects on the movie to sky high. With huge expectations, the Vivek Athreya directorial produced by Mythri Movie Makers will be hitting the screens on June 10th in Telugu, Tamil and Malayalam languages.

Sonu Sood tweets about something big, fans in a tizzy

 Sonu Sood tweets about something big fans in a tizzy

 


After Sonu Sood dropped a cryptic tweet about his next venture, the speculations are rife about what it could be. Some people are wondering if he is dropping hints about his next film. A source in the industry says that Sonu Sood is planning to move to Hollywood. “Sonu Sood has an offer from a big-ticket Hollywood production house. The project requires long-term commitment, so he might be moving to Hollywood,” said an industry insider. 

 

In 2017, the actor starred in Hollywood Film Kung Fu Yoga along with Jackie Chan. So it wouldn’t be a surprise if he has bagged another Hollywood flick. However, when we contacted Sood’s team, the team denied any such development.

 

There are others who feel he might be making a foray into politics. The buzz is that in the past two years, he has been offered tickets from almost all major political parties. Until now, Sonu has refrained from accepting any such offers. It remains to be seen if he will finally become a politico. 

 

The Dabangg star is one of the few stars to have established himself as a successful actor in the Hindi film industry as well as in the Tamil, Telugu and Kannada film industries. During the pandemic, Sood emerged as one of the most loved philanthropist of the country. He arranged transport for thousands migrant workers stuck away from home reach their destination safely. He also arranged food for the needy.  

 

As we wait for more to be revealed, the gossip mills are abuzz with speculations. A section of his fans believe that he has been shortlisted for some big award and that the Arundhati actor will make the announcement about it soon. 

 

Well, whatever it is, it seems it is definitely something big and precious. Sood is guarding the secret well! Can’t wait to discover what it is.

Ante Sundaraniki Trailer Launched

 'అంటే సుందరానికీ' అనే బ్లాక్ బస్టర్ తీశాం : ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో హీరో నాని 



'సినిమా విడుదలకు ముందు మంచి సినిమా తీశాం, బ్లాక్ బస్టర్ చేయాల్సింది మీరే అని చెప్తాం. కానీ ఈసారిలా అలా కాదు.. మేము 'అంటే సుందరానికీ' అనే బ్లాక్ బస్టర్ తీశాం. ఇంక దాన్ని ఎక్కడి తీసుకెల్తారో మీ ఇష్టం'' అన్నారు నేచురల్ స్టార్ నాని. 

నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్  నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'అంటే సుందరానికీ'. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వైజాగ్ లో అభిమానుల మధ్య వేడుకగా జరిగింది. నాని,  హీరోయిన్ నజ్రియా, నిర్మాత వై రవి శంకర్ పాటు చిత్ర బృందం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని సందడి చేశారు.  


ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ.. వైజాగ్ మా అత్తగారి ఊరు.  వైజాగ్ కి అల్లుడు వచ్చాడు.(నవ్వుతూ) అల్లుడు వచ్చినపుడు అల్లుడికి విందుభోజనం పెడతారు. కానీ జూన్ 10న అల్లుడే విందు భోజనం పెడతాడు. బేసిగ్గా సినిమా విడుదలకు ముందు మంచి సినిమా తీశాం, బ్లాక్ బస్టర్ చేయాల్సింది మీరే అని చెప్తాం. కానీ ఈసారిలా అలా కాదు.. మేము బ్లాక్ బస్టర్ తీశాం. ఇంక దాన్ని ఎక్కడి తీసుకెల్తారో మీ ఇష్టం. జూన్ 10నుండి  'అంటే సుందరానికీ' మీది. ఒక సినిమా విజయానికి యాక్షన్, హ్యుమర్, ఎమోషన్ కారణం. ఏడాది యాక్షన్ కావలసినంత దొరికింది. హ్యుమర్, ఎమోషన్ కోసం ప్రేక్షకులు ఆకలితో ఎదురుచూస్తున్నారు. జూన్ 10 'అంటే సుందరానికీ' థియేటర్ లో కావాల్సినంత హ్యుమర్, ఎమోషన్ దొరుకుతుంది. నన్ను మీ ఫ్యామిలీలో ఒకరిగా చూస్తున్న ప్రేక్షకులకు, వైజాగ్ ప్రేక్షకులు ఎప్పటికీ రుణపడి వుంటాను. 'అంటే సుందరానికీ' చాలా బ్యూటీఫుల్ గా వుంటుంది. ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తారు. వైజాగ్ సముద్రంలాగ  హ్యుమర్, ఎమోషన్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే వుంటాయి. 

మైత్రీ మూవీ మేకర్స్ తో నాకు ఇది రెండో సినిమా. కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది. ఈ సినిమా తర్వాత అంటే.. ని మించిన సినిమా చేయాలి, చేస్తామని నమ్ముతున్నాను. ఈ సినిమాకి పనిచేసిన టెక్నికల్ టీంకి కృతజ్ఞతలు. నజ్రియా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుంది. లీల పాత్రలో తనని తప్పా ఎవరినీ ఊహించుకోలేరు. మీ అందరితో కలసి ఎప్పుడు సినిమా చూస్తానా అని ఎదురుచూస్తున్నాను. జూన్ 10న అరిచి అరిచి, నవ్వినవ్వి మీ చొక్కాలు తడిచిపోవాలి.'' చెప్పారు నాని. 


హీరోయిన్ నజ్రియా మాట్లాడుతూ.. వైజాగ్ గురించి చాల గొప్ప విన్నాను. ఇక్కడకి రావడం చాలా ఆనందంగా వుంది. గత ఏడాది నా సినీ ప్రయాణం గొప్ప అనిపించింది.  'అంటే సుందరానికీ'తో మొదటి తెలుగు సినిమా చేయడం, తెలుగులో డబ్బింగ్ చెప్పడం, ఇప్పుడు వైజాగ్ రావడం ఈ మూడు గొప్ప ఆనందాన్ని ఇచ్చాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ గారు, రవి శంకర్ గారికి కృతజ్ఞతలు. మైత్రీ మూవీ మేకర్స్ లేకుంటే ఈ ప్రయాణం ఇంత గొప్పగా జరిగేది కాదు. దర్శకుడు వివేక్ ఆత్రేయ గారి తో వర్క్ చేయడం చాలా గొప్ప అనుభూతి. ప్రతి రోజు షూటింగ్ ని ఎంజాయ్ చేశాను. నన్ను , కథని ఎంతో అందంగా చూపించిన సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మికి కృతజ్ఞతలు, అలాగే లతా నాయుడు పల్లవి.. అందరికీ థ్యాంక్స్.  నాని గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. నాని లేకుండా ఈ జర్నీ ఇంత మెమరబుల్ గా వుండేది కాదు. నాని గొప్ప కోస్టార్. ఇది నా మొదటి తెలుగు సినిమా. నాపై చాలా ప్రేమని చూపించారు. మీరు చూపిన అభిమానానికి కృతజ్ఞతలు. తప్పకుండా మరిన్ని తెలుగు సినిమాలు చేస్తాను. జూన్ 10న అందరం థియేటర్ లో కలుద్దాం. 'అంటే సుందరానికీ' ఎంజాయ్ చేద్దాం'' అన్నారు.


ఈ సందర్భంగా నిర్మాత  వై రవిశంకర్ మాట్లాడుతూ.. నేను వైజాగ్ లోగ్రాడ్యుయేషన్ చేశాను. ఇక్కడికి వచ్చినపుడు కాలేజీ రోజులు గుర్తుకు వస్తుంటాయి. ఇక్కడి ఎన్నిసార్లు వచ్చినా అంతే ఆనందంగా వుంటుంది.  'అంటే సుందరానికీ' జూన్ 10న వస్తుంది. నాని గారు తన పెర్ఫార్మెన్స్ తో విశ్వరూపం చూపిస్తారు. నాని, నజ్రియా, నరేష్, నదియా ఇలా అందరూ ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ మిమ్మల్ని నవ్వించి మెప్పిస్తారని నమ్ముతున్నాను. ఈ సీజన్ ని భీమ్లా నాయక్ తో బిగిన్ చేశాం. మళ్ళీ  'అంటే సుందరానికీ'తో కాలేజీలు, స్కూల్స్ తెరిచే లోపల సీజన్ ని క్లోజ్ చేస్తున్నాం. దీని తర్వాత కూడా విరాటపర్వం లాంటి మంచి సినిమాలు వస్తున్నాయి. కాలేజీలు స్కూల్స్ ఓపెన్  అయ్యేలోపల మా సినిమా 'అంటే సుందరానికీ'  జూన్ 10న చూసి హాయిగా నవ్వుకొని మళ్ళీ కాలేజీలు, స్కూల్స్ లో వెళ్ళొచ్చు. జూన్ 10న ఎక్స్ ట్రార్డినరీ సినిమా చూడబోతున్నాం. దర్శకుడు వివేక్ ఆత్రేయ, సంగీత దర్శకుడు వివేక్ సాగర్, సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మి, ఎడిటర్  రవితేజ గిరిజాల, ప్రొడక్షన్ డిజైనర్  లతా నాయుడు ఇలా ఈ చిత్రానికి పని చేసిన సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు. మా సంస్థకు  'అంటే సుందరానికీ'లాంటి మంచి సినిమాని ఇచ్చారు. మా హీరో నాని గారు  ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. గ్యాంగ్ లీడర్ షూటింగ్ జరుగుతున్నపుడు నాని గారిని హాగ్ చేసుకొని విష్ చేసేవాళ్ళం. అప్పటికే జర్సీ వచ్చింది. అందులో నాని గారు కనబరిచిన నటనకు ఆయనపై గౌరవం రెట్టింపయ్యింది.  'అంటే సుందరానికీ'లో నాని గారి నట విశ్వరూపం చూస్తారు. నజ్రియా ఈ సినిమా ఒప్పుకోవడం చాలా ఆనందంగా వుంది. నజ్రియా గారి భర్తగారు ఫహద్ ఫాసిల్ ని పుష్పతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాం. ఇప్పుడు నజ్రియా గారు 'అంటే సుందరానికీ'తో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మరింత ఆనందంగా వుంది.  ఇందులో ఆమె అద్భుతమైన నటన కనబరిచారు. ప్రేక్షకులకు మరోసారి ధన్యవాదాలు.  'అంటే సుందరానికీ' చిత్రాన్ని పెద్ద విజయం చేయాలనీ కోరుతున్నాను. మళ్ళీ సక్సెస్ వేడుకని వైజాగ్ లో జరుపుకుందాం.'' అన్నారు.

Shah Rukh Khan JAWAN First Look Unveiled Theatrical Release On June 2nd 2023

 Bollywood Baadshah Shah Rukh Khan, Atlee, Red Chillies Entertainment’s Pan India Film JAWAN First Look Unveiled, Theatrical Release On June 2nd, 2023



Bollywood Baadshah Shah Rukh Khan teams up with director Atlee who brings his magic to a nation-wide release with the highly anticipated film titled Jawan. Known for directing a string of successful blockbuster films in the south like Raja Rani, Theri, Mersal and Bigil to name a few, Atlee is making his Bollywood debut with the movie billed to be a massive action entertainer.


Red Chillies Entertainment will produce the film. Promises to be a spectacular event film with high octane action sequences and talent assembled from across Indian cinema, Jawan has been announced officially today with a teaser video unit that features Shah Rukh Khan amidst a rugged a backdrop, wounded and wrapped in bandages. The video portrays more about the intensity of the character. Waiting for his turn in a shed, Jawan is all set to start his mission, when he gets good to go indication.


The first look and the teaser video of the film sets the tone for what’s to come, a larger-than-life action entertainer that will release across five languages - Hindi, Tamil, Telugu, Malayalam and Kannada in theatres across the globe on 2nd June 2023. 


Talking about the film, Shah Rukh Khan said, “Jawan is a universal story that goes beyond languages, geographies and is for all to enjoy. Credit goes to Atlee for creating this unique film, which has also been a fantastic experience for me as I love action films! The teaser is the just tip of the iceberg and gives a glimpse into what’s to come”.


Talking about creating Jawan, director Atlee said, “Jawan has something in it for everyone be it actions, emotions, drama all woven into create a visual spectacle. I want to give the audiences an exceptional experience, an event which they all can enjoy together and who better to deliver it than Shah Rukh Khan himself, presented like never before”.

  

Red Chillies Entertainment presents ‘Jawan’, starring Shah Rukh Khan in the lead and produced by Gauri Khan. Jawan will be released on 2nd June 2023 in five languages making it Shah Rukh Khan’s first Pan India film. 


Cast: Shah Rukh Khan


Technical Crew:

Writer, Director: Atlee

Producer: Shah Rukh Khan

Banner: Red Chillies Entertainment

PRO: Vamsi-Shekar