Home » » Dasari narayana rao in coal scam|Dasari Narayana Rao is Key in Coal Scam|Dasari Narayana Rao interrogated by CBI in coal scam ?

Dasari narayana rao in coal scam|Dasari Narayana Rao is Key in Coal Scam|Dasari Narayana Rao interrogated by CBI in coal scam ?

దేశాన్ని కుదిపేస్తున్న బొగ్గు కుంభకోణం సెగ రాష్ట్రాన్ని తాకింది. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణరావును సీబీఐ అధికారులు విచారించారు. ఢిల్లీ నుంచి వచ్చిన 12 మంది సీబీఐ అధికారులు... దాసరిని బంజారాహిల్స్ లోని ఆయన గెస్ట్ హౌస్‌లో ప్రశ్నించారు. హైదరాబాదులో కుత్బుల్లాపూర్, బంజారాహిల్స్‌లలోని నవభారత్ కంపెనీ, నిమ్మీ ఐరన్ అండ్ స్టీల్స్, జెఏల్‌డి ఐరన్స్, ఏఎమ్మార్ ఐరన్ అండ్ స్టీల్స్, జెయుఎస్ ఇన్ ఫ్రా తదితర కంపెనీలలో సిబిఐ సోదాలు జరిపినట్లు తెలుస్తోంది.రాష్ట్ర అధికారులు కూడా సహకరిస్తున్నారు. 2006-2009 కాలంలో దాసరి నారాయణరావు కేంద్రంలో బొగ్గగనుల శాఖ సహాయమంత్రిగా పనిచేశారు.

ఐదు కంపెనీలపై కేసులు

పార్లమెంట్ లో బొగ్గు కుంభకోణంపై ప్రతిష్టంభన కొనసాగుతున్న సమయంలో... సీబీఐ అధికారులు ఏకకాలంలో దేశవ్యాప్తంగా 30 ప్రాంతాల్లో కంపెనీల్లో సోదాలు నిర్వహించింది. ముంబై, కోల్‌కత్తా, పాట్నా, నాగపూర్ నగరాలలోని ప్రముఖ వ్యక్తులు, ఇళ్లలో దాడులు జరిపింది. 2006 -09 మధ్య జరిగిన బొగ్గు కేటాయింపులపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఇప్పటి వరకు ఐదు కంపెనీలపై కేసు నమోదు చేసింది. ప్రైవేటు వ్యక్తులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులపైనా కేసులు నమోదయ్యాయి.

కేంద్ర మంత్రి ఉన్న సమయంలో దాసరి... బొగ్గు గనుల కేటాయింపుల్లో ఉదారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లోనే టన్ను 2వేల రూపాయలు పలుకుతుంటే... కేవలం 100 రూపాయల రాయల్టీతో కేటాయించారని ప్రధాన ఆరోపణ. ఇదే విషయాన్ని టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా లేవనెత్తారు.

దాసరి వివరణ

మరోవైపు ఈ వ్యవహారంపై దాసరి వివరణ ఇచ్చారు. తనను ఎవరూ ప్రశ్నించలేదని స్పష్టం చేశారు. తన ఇంట్లో సోదాలు జరిపినట్టు మీడియాలో వస్తున్న వార్తలు కూడా అవాస్తవమని దాసరి నారాయణరావు ఓ ప్రకటన విడుదల చేశారు.

Share this article :