ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున ఆదివారం ఉదయం శ్రీ షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి బయల్దేరి11 గంటలకు షిర్డీ చేరుకున్న నాగార్జున... సతీమణి అమల, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి బాబా సమాధి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు బాబాకు నిర్వహించే హారతిలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. సాయిబాబా దర్శనం కోసం వచ్చిన నాగార్జున దంపతులను శ్రీ షిర్డీ సాయిబాబా ట్రస్టు సభ్యులు బాబా శేషవస్త్రాలతో సన్మానించారు.
సాయిబాబా జీవిత చరిత్ర ఆధారంగా నిర్మితమవుతున్న ‘శిరిడి సాయి’ సినిమాలో సాయిబాబాగా నాగార్జున నటిస్తున్న విషయం తెలిసిందే. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, ఛాయాగ్రాహకుడు ఎస్.గోపాల్రెడ్డి తదితరులు కూడా బాబాను దర్శించుకున్నారు.
Post a Comment