రవితేజా - ఇలియానా జంటగా రూపొందుతోన్న 'దేవుడు చేసిన మనుషులు' చిత్రీకరణ చివరి దశకి చేరుకుంది. గత నెల రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను బ్యాంకాక్ లో చిత్రీకరిస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో ఈ షెడ్యూల్ పూర్తి కానుంది, దాంతో వచ్చేవారమే బ్యాంకాక్ నుంచి పూరి జగన్నాథ్ ... రవితేజా ... ప్రకాష్ రాజ్ బయలుదేరి హైదరాబాద్ రానున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కూడా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారని అంటున్నారు. సాధ్యమైనంత త్వరగా నిర్మాణాంతర కార్యక్రమాల్ని పూర్తి చేసి జూన్ లో ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Post a Comment