Latest Post

Telugu Motion Pictures and Tv Digital Drivers Union New Committe Formed

 తెలుగు మోషన్‌ పిక్చర్స్‌ టీవీ వెబ్‌ సిరీస్‌ అండ్‌ డిజిటల్‌ డ్రైవర్స్‌ యూనియన్‌ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం!



తెలుగు మోషన్‌ పిక్చర్స్‌ టీవీ వెబ్‌ సిరీస్‌ అండ్‌ డిజిటల్‌ డ్రైవర్స్‌ యూనియన్‌ ఎన్నికలు ఇటీవల హైదరాబాద్‌లో జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా బి.సీతారామ్‌, ప్రధాన కార్యదర్శిగా మొగల్‌ మైభు బ్‌ బేగ్‌ (అలియాస్‌ కదిరి బాష), కోశాధికారిగా కె.వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా మల్లికార్జున్‌రెడ్డి, ఉప ప్రధాన కార్యదర్శిగా బి.లక్ష్మయ్య,  ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా ఎం.డి. జమాలుద్దీన్‌ విజయం సాధించారు. ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, స్టార్‌ డైరెక్టర్‌. బోయపాటి శ్రీనివాస్‌, ఫెడరేషన్‌ అధ్యక్షులు వల్లభనేని అనిల్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి పి.ఎస్‌.ఎన్‌.దొరౖెె, కోశాధికారి సురేష్‌ సమక్షంలో తెలుగు మోషన్‌ పిక్చర్స్‌ టీవీ వెబ్‌ సిరీస్‌ అండ్‌ డిజిటల్‌ డ్రైవర్స్‌ యూనియన్‌ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.

Producer Mahendra Nath Kondla Interview About Sabari

'శబరి' తర్వాత మనం మరో సినిమా చేద్దామని వరలక్ష్మీ శరత్ కుమార్ గారు చెప్పారు  - నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల ఇంటర్వ్యూ



వెర్సటైల్ ఆర్టిస్ట్ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'శబరి'. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మీడియాతో ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు...


సార్... ముందు మీ నేపథ్యం గురించి చెప్పండి! సినిమాల్లోకి రావడానికి కారణం?

మాది గుంటూరు. ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాను. కొన్నేళ్లు అక్కడ పని చేశా. నాకు కన్సల్టెన్సీలు, వ్యాపారాలు ఉన్నాయి. వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా నేను ఎక్కడ ఉన్నప్పటికీ... చిన్నతనం నుంచి సినిమా అంటే ఆసక్తి. అందుకని, ఇండస్ట్రీలోకి వచ్చాను.


'శబరి' సినిమా ఎలా మొదలైంది?

ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం వరలక్ష్మీ శరత్ కుమార్ గారు. నేను తొలి సినిమా ఏది చేయాలని ఆలోచిస్తున్న సమయంలో మా దర్శకుడు నాకు ఈ కథ చెప్పారు. బాగా నచ్చింది. వెంటనే ఓకే చేశా. అప్పటికే ఈ కథ వరలక్ష్మీ శరత్ కుమార్ గారు విన్నారు. మొదటి సినిమాకు ఏ నిర్మాత అయినా సేఫ్ సైడ్ చూసుకుంటారు కదా! వరలక్ష్మి గారు ముందు నుంచి మంచి క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఆవిడ ఓకే చేశారంటే 50 పర్సెంట్ నేను సేఫ్ అని 'శబరి'కి ఓకే చెప్పా.


వరలక్ష్మీ శరత్ కుమార్ గారితో ఈ సినిమా జర్నీ గురించి చెప్పండి!

వండర్ ఫుల్. ఆవిడ మంచి ఆర్టిస్ట్. నిర్మాతలకు ఆవిడ చేసే మేలు చాలా మందికి తెలియదు. దీనికి ఖర్చు చేయమని ఆవిడ ఎప్పుడూ అడగలేదు. బడ్జెట్ పెంచే వ్యవహారాలు ఎప్పుడూ చేయలేదు. ఎందుకు ఇంత ఖర్చు చేస్తున్నారని, వద్దని చెప్పేవారు. ఆవిడతో ఎంత మంచి రిలేషన్షిప్ ఉందంటే... 'మీకు మరో సినిమా చేస్తాను. మనం చేద్దాం' అని నాతో చెప్పారు.


ఈ కథను మీరు ఓకే చేయడానికి కారణం?

సినిమాలో మదర్ అండ్ డాటర్ ఎమోషన్, సెంటిమెంట్. అది ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే పాయింట్. ఎంత బాగా చెప్పగలిగితే అంత బాగా జనాల్లోకి వెళుతుంది. ఒక బిడ్డ కోసం తల్లి పడే తపనను తీసుకుని సైకలాజికల్ థ్రిల్లర్ గా ప్లాన్ చేశాం. ఎమోషన్స్ డిఫరెంట్ వేలో చెప్పాం. కొన్ని సినిమాల్లో మదర్ అండ్ డాటర్ ఎమోషన్స్ చూసి ఉంటారు. ఇందులో మేం డిఫరెంట్ గా చెప్పాం.  


మొదటి సినిమా ఐదు భాషల్లో చేయడం రిస్క్ అనిపించలేదా?

కొంచెం రిస్క్ అనిపించింది. అయితే, మొదటి నుంచి నా నేచర్ కొంచెం రిస్క్ తీసుకునే నేచర్. అమెరికా వెళ్లి ఉద్యోగంలో చేరిన వారానికి వ్యాపారం స్టార్ట్ చేశా. నో రిస్క్ నో గెయిన్ అంటారు కదా! రిస్క్ తీసుకుంటే జీవితంలో పైకి వస్తామని నమ్ముతా. సినిమాల్లోకి వచ్చినప్పుడు ఐదు భాషల్లో చేద్దామంటే ఓకే చెప్పా. కన్నడ, మలయాళ, తమిళ డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడటం నాకు కొత్త. అయినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా బాగా చేస్తున్నా.


అన్ని భాషల్లో ఒకే రోజు విడుదల చేస్తున్నారా?

అవును అండీ. సేమ్ డే రిలీజ్! నేనే ఓన్‌ రిలీజ్‌ చేస్తున్నా. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన ఆర్టిస్టులు ఉన్నారు. గోపీసుందర్‌ గారు మంచి మ్యూజిక్‌, రీ రికార్డింగ్‌ ఇచ్చారు. అన్ని భాషల ఆర్టిస్టులకు నచ్చే చిత్రమిది.


సినిమాలో యాక్షన్ సీక్వెన్సులు గురించి చెప్పండి!

కథలో భాగంగా యాక్షన్ సీక్వెన్సులు డిజైన్ చేశారు. ఎమోషనల్ డ్రామా కంటిన్యూ అవుతున్న తరుణంలో యాక్షన్ వస్తుంది తప్ప కమర్షియల్ ఫార్మటులో ఫైట్స్ కావాలని ఏదీ చేయలేదు. దర్శకుడు కథను బాగా రాశారు. వరలక్ష్మి గారు ఎంతో కష్టపడి యాక్షన్ సీక్వెన్సులు చేశారు.


నిర్మాతగా మీ ఫస్ట్ సినిమా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది?

ప్రతి కొత్త నిర్మాతకు కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా మంచిగా చేశాం. అందరిలా నాకు సినిమా అంటే ఇష్టమే తప్ప నాకు ఇండస్ట్రీలో తెలిసిన వాళ్లు గానీ, బంధువులు గానీ లేరు. ఒంటిరిగా నిలబడ్డా. సినిమా చేశా. కంప్లైంట్స్ లేవు గానీ చిన్న చిన్న ఇబ్బందులు పడ్డా. నిర్మాతగా మనం ఇక్కడ నిలబడాలంటే కష్టపడి పని చేయాలి. అలాగే కష్టపడ్డా. చిన్నప్పటి నుంచి 18 గంటలు పని చేయడం అలవాటు. 


బడ్జెట్ ఎంత అయ్యింది? ఎక్కువైందని విన్నాం!

అవును. ముందు చెప్పిన బడ్జెట్ కు, తర్వాత అయిన బడ్జెట్ కు సంబంధం లేదు. ఒక్క పని మొదలు పెట్టినప్పుడు మధ్యలో ఆపకూడదు. బడ్జెట్ విషయాలు పక్కన పెడితే... మంచి సినిమా ప్రేక్షకులకు ఇవ్వకూడదని చేశా. నా సమస్యలు ప్రేక్షకులకు అవసరం లేదు. వాళ్లకు మంచి సినిమా ఇవ్వాలని కష్టపడ్డా. 'ఎందుకు వచ్చా ఇండస్ట్రీకి' అని ఎప్పుడూ ఫీల్ కాలేదు.  


నెక్స్ట్ సినిమాలు ఏంటి?

వరుణ్ సందేశ్ గారు హీరోగా నిర్మాతగా నా రెండో సినిమా ప్రొడక్షన్ లో ఉంది. బిగ్ బాస్ అమర్ దీప్, సురేఖా వాణి గారి కుమార్తె సుప్రీత జంటగా మూడో సినిమా చేస్తున్నా.


నిర్మాణానికి పరిమితం అవుతారా? దర్శకుడిగా, నటుడిగా చేస్తారా?

అటువంటి ఆలోచనలు లేవు. మా దర్శకులు ఎవరైనా సరదాగా కనిపించమని అడిగితే సరదాగా చేస్తాను తప్ప నటన నాకు రాదు. అది నా ప్రొఫెషన్ కాదు.  ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు నిర్మాణం మాత్రమే చేయాలని అనుకున్నా.

Harom Hara Shoot Wrapped Up

 Sudheer Babu, Gnanasagar Dwaraka, Sumanth G Naidu, SSC’S Harom Hara Shoot Wrapped Up



Sudheer Babu’s upcoming film Harom Hara under the direction of Gnanasagar Dwaraka of Sehari fame is an action thriller carrying encouraging reports, thanks to positive response for every promotional material. The teaser, in particular, that showed Sudheer Babu in a complete action-packed avatar set good expectations. The first and title single, an uplifting Lord Shiva Anthem, enchanted music lovers. The movie is produced by Sumanth G Naidu under the banner of SSC (Sree Subrahmanyeshwara Cinemas).


Meanwhile, the entire shoot of the movie was wrapped up. The team celebrated the occasion with a cake cutting on the set. The team looks contented and confident in the video. The film’s post-production works are also progressing at a fast pace. The makers will announce the film’s release date soon.


The story of Harom Hara is set in 1989 in Kuppam of Chittoor district and Sudheer Babu will be seen uttering dialogues in the Kuppam slang. The Revolt is the tagline of this high-budget film that stars Malvika Sharma playing Sudheer Babu’s love interest. Sunil will be seen in a pivotal role.


Chaitan Bharadwaj provides music for the movie, whereas cinematography is handled by Aravind Vishwanathan.


Cast: Sudheer Babu, Malvika Sharma, Sunil


Technical Crew:

Writer, Director - Gnanasagar Dwaraka

Producer - Sumanth G Naidu

Music – Chaitan Bharadwaj

DOP - Aravind Viswanathan

Editor - Raviteja Girijala

Banner - Sree Subrahmanyeshwara Cinemas

PRO - Vamsi Shekar

Padma Vibushan Megastar Chiranjeevi launches Kartikeya Gummakonda's "Bhaje Vaayu Vegam" racy teaser at Vishwambhara sets

 మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా యువి క్రియేషన్స్ సమర్పణలో హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న "భజే వాయు వేగం" సినిమా టీజర్ విడుదల




ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మీద హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న "భజే వాయు వేగం" సినిమా టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి గారు రిలీజ్ చేశారు. విశ్వంభర సినిమా సెట్ లో ఈ టీజర్ రిలీజ్ చేసిన మెగాస్టార్ టీజర్ తో పాటు టైటిల్ ఇట్రెస్టింగ్ గా, ఇప్రెసివ్ గా ఉందని చెప్పారు. తన అభిమాని, తమ్ముడు లాంటి కార్తికేయ హీరోగా నటించిన "భజే వాయు వేగం" సినిమా విజయం సాధించాలని మెగాస్టార్ తన బెస్ట్ విశెస్ అందించారు. "భజే వాయు వేగం"చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాకు ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టీజర్ విడుదల  సందర్భంగా 


మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ - యూవీ కాన్సెప్ట్స్ లో విక్కీ నిర్మాతగా, దర్శకుడు ప్రశాంత్ రెడ్డి చంద్రపు రూపొందిస్తున్న "భజే వాయు వేగం" సినిమా టీజర్, టైటిల్ ఆసక్తికరంగా, ఆకట్టుకునేలా ఉన్నాయి. నా అభిమాని, తమ్ముడు లాంటి కార్తికేయ హీరోగా నటిస్తున్న సినిమా ఇది. నా అభిమాని హీరోగా ఓ మంచి సినిమాలో నటిస్తున్నాడంటే ఆ సినిమా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ప్రశాంత్ రెడ్డి లాంటి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ టాలీవుడ్ కు రావాలి. ఇలాంటి యంగ్ డైరెక్టర్స్ ఎంతమంది కొత్త కాన్సెప్ట్స్ తో వస్తే అంత ఫ్రెష్ గా మన ఫిలిం ఇండస్ట్రీ ముందుకు సాగుతుంది. యంగ్ డైరెక్టర్స్ ను నేను ఎప్పుడూ ఆహ్వానిస్తుంటాను. "భజే వాయు వేగం" సినిమా టీజర్ చూస్తుంటే తండ్రీ కొడుకు మధ్య మంచి ఎమోషన్ తో సాగే సినిమా అనిపిస్తోంది. యాక్షన్ బాగుంది. ఈ సినిమా స్టోరీ నాకు తెలిసినా ఇంతకంటే ఎక్కువ లీక్ చేయాలనుకోవడం లేదు. "భజే వాయు వేగం" సినిమా టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అని అన్నారు


"భజే వాయు వేగం" సినిమా టీజర్ ఎలా ఉందో చూస్తే - డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు, ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు వేట ప్రారంభిస్తారు. మొత్తం పోలీస్ డిపార్ట్ మెంట్ అంతా ఇదే టాస్క్ మీద ఫోకస్ చేస్తుంది. మరోవైపు కార్తికేయ క్యారెక్టర్ ను పరిచయం చేస్తూనే తండ్రితో ఆయనకున్న ఎమోషనల్ బాండింగ్ ను చూపించారు. రాహుల్ టైసన్ క్యారెక్టర్ ఈ సినిమాలో కీలకంగా ఉండబోతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒకడుంటాడు. వాడి కోసం ఏం చేయడానికైనా మనం వెనకాడం, నా లైఫ్ లో అది మా నాన్న అని కార్తికేయ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఫాదర్, సన్ ఎమోషన్, హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సులు టీజర్ కు హైలైట్ గా నిలిచాయి. టీజర్ లో హై క్వాలిటీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో పాటు కార్తికేయ గుమ్మకొండ ఎనర్జిటిక్ గా కనిపించారు. అన్ని ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో "భజే వాయు వేగం" సినిమా రూపొందించినట్లు టీజర్ తో తెలుస్తోంది. 


"భజే వాయు వేగం" సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. థియేట్రికల్ రిలీజ్ డేట్ ను త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు.



నటీనటులు - కార్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు


టెక్నికల్ టీమ్-

మాటలు: మధు శ్రీనివాస్

ఆర్ట్: గాంధీ నడికుడికర్

ఎడిటర్: సత్య జి

సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్

మ్యూజిక్ (పాటలు) - రధన్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - కపిల్ కుమార్

పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్-శ్రీనివాస్)

కో ప్రొడ్యూసర్ - అజయ్ కుమార్ రాజు.పి

ప్రొడ్యూసర్: యూవీ కాన్సెప్ట్స్

దర్శకుడు: ప్రశాంత్ రెడ్డి చంద్రపు

Priyadarshi Next Titled Darling Glimpse Out Now

 Priyadarshi, Nabha Natesh, Aswin Raam, K Niranjan Reddy, PrimeShow Entertainment’s Film Titled Darling Amusing Title Glimpse Out Now



K Niranjan Reddy of PrimeShow Entertainment who delivered the Pan India sensational blockbuster Hanu-Man announced his next production venture with Smt Chaitanya presenting it. Priyadarshi who is riding high with the success of Balagam, Om Bheem Bush, and Save The Tigers series playing the lead, while Nabha Natesh is making a comeback after an injury with a rom-com directed by Aswin Raam.


The makers announced the film’s title- Darling with an interesting tagline of Why This Kolaveri? The first-look poster that shows Priyadarshi’s marriage proposal to Nabha Natesh is as pleasing as the title. The title announcement glimpse is totally amusing as it shows the relationship between Priyadarshi and Nabha Natesh.


It starts with a funny conversation between Priyadarshi and a barber in the saloon. When the barber asks why Darshi is gloomy, he enlightens the mindsets of females in different stages of their lives. He says girls are loving and affectionate when they are mothers, and supportive and protective when they are sisters. When the same girl is a lover, she is cute and bubbly and understands us a lot. But what if that girl gets married, they turn our life upside down? Then, we get to see Nabha roasting Darshi verbally.


The title announcement glimpse promises Darling will be an out-and-out entertainer that will connect to all sections of audiences. While Mahesh Babu’s Pedave Palikina is used to show a mother’s love for her son, Pawan Kalyan’s Annayya Annavante song is used to demonstrate brother-sister bonding, and Prabhas’ Mellagaa Karagani song is meant to show the intimacy between lovers. This overall concept is a unique idea, while the fight between the couple brings a new and comic perspective to the narrative.


The title glimpse’s idea of depicting women's state of mind through popular songs shows the creative side of the director Aswin Raam. Given the movie is coming from the makers of Hanu-Man there will be extra anticipation for it.


Ananya Nagalla plays a crucial role in the movie which also features many noted actors. A team of talented technicians is handling different crafts.


Naresh is the lensman, whereas Vivek Sagar will provide the music. Hemanth pens the dialogues, while Pradeep E  Ragav of love todaywill edit the movie. Gandhi is the production designer.


Cast: Priyadarshi, Nabha Natesh


Technical Crew:

Director: Aswin Raam

Music: Vivek Sagar

DOP: Naresh

Editor: Pradeep E Ragav

Dialogues: Hemanth 

Production Designer: Gandhi

Publicity Designer: Ananth Kancharla 

Creative Producer: SeethaRam Y

Lyrics: kasarla shyam

Choreographer: Vijay polaki, Eshwar Penti

Project Consultant: Sunny Bond

Costume Designer: Poornima Ramaswamy,

Executive Producers: Prakash Reddy Pannala, Vamshi Sangem

Line producer :Manchi venkat

PRO: Vamsi-Shekar

Digital: Haashtag Media

Tournaments give more encouragement to the players – CP Kothakota Srinivas Reddy

టోర్నమెంట్లు క్రీడాకారులకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాయి

– సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి 

ఫొటో.. గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేస్తున్న సీపీ శ్రీనివాస్‌రెడ్డి.... 



ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌ సిబి రాజు మెమోరియల్‌ ట్రోఫీ పేరుతో ఏర్పాటు చేసిన మెన్స్‌ అండ్‌ ఉమెన్స్ టెన్నిస్‌ టోర్నమెంట్‌ శుక్రవారం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమంలో గెలుపొందిన మహిళా క్రీడాకారులకు నగర పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఇండియన్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ తో కలిసి గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌ లో టోర్నమెంట్లు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. క్రీడాకారులకు ఇది ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తనకు క్రీడలు అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. నేను సూపర్ స్టార్ కృష్ణ గారికి వీరాభిమానిని. నేను చూసే అతికొద్ది సినిమాల్లో సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలే ఎక్కువ. అదేవిధంగా ప్రొడ్యూసర్ మరియు క్లబ్ అధ్యక్షుడు ఆది శేషగిరిరావు గారిని వారు చేస్తున్న కార్యక్రమాల్ని కూడా ఫాలో అవుతూ ఉంటాను అన్నారు.


 ఈ టోర్నమెంట్‌ లో సింగిల్స్‌ విభాగంలో ఆకాంక్ష విన్నర్‌ గా నిలవగా అభయ వేమూరి రన్నర్‌గా గెలుపొందారు.

డబుల్స్‌ ఫైనల్స్‌ లో మొదటి స్థానం లో ఆకాంక్ష, యుబరాణి బెనర్జీ నిలవగా రెండో స్థానంలో మేధావి సింగ్, ఆయుషా సింగ్‌ గెలుపొందారు. 


ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత మరియు క్లబ్‌ అధ్యక్షుడు ఆది శేషగిరిరావు మాట్లాడుతూ దేశంలో కోవిడ్‌ తర్వాత రూ. 10 లక్షల ప్రైజ్‌ మనీతో ఒక్క టోర్నమెంట్‌ కూడా జరగలేదని దీన్ని తామే నిర్వహించినట్లు తెలిపారు.


ప్రముఖ నిర్మాత కె. ఎస్. రామారావు గారు మాట్లాడుతూ : ప్రస్తుత కమిటీ FNCC కోసం చాలా కష్టపడుతున్నారు. ఈ టోర్నమెంట్స్ కాకుండా గతంలో కూడా వీరు చేసిన కార్యక్రమాలు FNCC కి మంచి పేరు వచ్చింది. ఈ కమిటీకి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ప్రత్యేకంగా చెప్పాలనుకున్న వ్యక్తి ముళ్లపూడి మోహన్ గారు. ఈ టోర్నమెంట్ కాకుండా గతంలో ఆయన చేసిన కార్యక్రమాలు అన్నీ కూడా ఎంతో యాక్టివ్ గా FNCC కి పేరు తెచ్చే విధంగా చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఈ టోర్నమెంట్ ఎంత సక్సెస్ అవ్వడానికి కారణం ఆయనే. ప్రతి ఒక్క పనిని తన భుజాల పైన వేసుకుని ఎక్కడ ఇబ్బంది కలగకుండా ముందుండి నడిపించారు. మోహన్ ముళ్ళపూడి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి టోర్నమెంట్స్ వల్ల ఎంతోమంది ప్లేయర్స్ నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్లారు. ఈ కమిటీకి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఈవెంట్స్ ఎన్నో చేయాలని మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని తెలియజేస్తున్నాను అన్నారు.


ప్రొడ్యూసర్ మరియు FNCC సెక్రటరి ముళ్ళపుడి మోహన్, స్పోర్ట్స్‌ కమిటీ చైర్మన్‌ చాముండేశ్వరినాథ్, వైస్ ప్రెసిడెంట్ టి. రంగారావు, జాయింట్ సెక్రెటరీ బి. రాజశేఖర్ రెడ్డి, ట్రెజరర్ ఏడిద రాజా, సువెన్‌లైఫ్, హెచ్‌ఈఎస్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు జాస్తి వెంకట్, కృష్ణంరాజు, కాజా సూర్యనారాయణ, మాజీ అధ్యక్షుడు కే.ఎస్‌రామారావు, బాలరాజు మరియు ప్రముఖ నిర్మాతలు, దర్శకులు తదితరులు పాల్గొన్నారు.

A3 Labels Production's directed by Bullet Bandi Laxman launched Today

 టోని కిక్, సునీత మారస్యార్ హీరో హీరోయిన్లుగా A3 లేబుల్స్ బ్యానర్‌పై బుల్లెట్ బండి లక్ష్మణ్ దర్శకత్వంలో లాంఛనంగా ప్రారంభమైన  చిత్రం




టోని కిక్, సునీత మారస్యార్ హీరో హీరోయిన్లుగా A3 లేబుల్స్ బ్యానర్‌పై కొత్త చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ సన్నిధానంలో లాంఛనంగా ప్రారంభమైంది.  బుల్లెట్ బండి లక్ష్మణ్ దర్శకత్వంలో గిరీష్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత చిన్నికృష్ణ క్లాప్ కొట్టగా, ఏఐ ప్లెక్స్ ప్రదీప్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రైటర్ వెలిగొండ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా...


చిన్నికృష్ణ మాట్లాడుతూ ‘‘ఏ 3 లేబుల్స్ బ్యానర్ పై ప్రదీప్, గిరీష్ గారు కలిసి సినిమాను నిర్మిస్తుండటం ఆనందంగా ఉంది. బుల్లెట్ బండి లక్ష్మణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కథలోని అరవై సీన్స్ ను నేను విన్నాను. రామ్, లక్ష్మణ్ కలిసి చేసిన ఆల్బమ్స్ సౌతిండియాలోనే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. వారి ఆల్బమ్ లోని అల్లా హే అల్లా అనే పాటను కథగా మార్చి సినిమా తీస్తున్నారు. ఈ సినిమా తర్వాత బుల్లెట్ బండి లక్ష్మణ్ టాప్ మోస్ట్ డైరెక్టర్ గా నిలబడతారు. ఈ మూవీ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. టీమ్ ను అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.  


రైటర్ వెలిగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘‘సినిమాను నమ్ముకుని, ప్రేమించి, కష్టపడితే ఎక్కడి వరకు రావచ్చు అనటానికి రామ్, లక్ష్మణ్ లే ఉదాహరణ. ప్రైవేట్ ఆల్బమ్స్ తో పాపులారిటీ సంపాదించుకుని ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోకి రావటం హ్యాపీ. వారు చేస్తున్న ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను. నిర్మాతగారు కర్ణాటక నుంచి వచ్చి సినిమా చేస్తున్నారు. ఆయనకు ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’


బోలే శావలి మాట్లాడుతూ ‘‘యూట్యూబ్ లో బుల్లెట్ బండి లక్ష్మణ్‌కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టోని, సునీత, రామ్, లక్ష్మణ్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుంది. అల్లా హే అల్లా కాన్సెప్ట్ నే సినిమాగా తీయాలనుకోవటం గొప్ప విషయం. సినిమా చేస్తున్న గిరీష్ కుమార్ గారిని అభినందిస్తున్నాను. ఎంటైర్ టీమ్ కు అభినందనలు’’ అన్నారు.


నిర్మాత గిరీష్ కుమార్ మాట్లాడుతూ ‘‘నాది కర్ణాటక. రామ్, లక్ష్మణ్ గారు చేసిన అల్లా హే అల్లా పాట వినగానే నచ్చింది. అందులో సోల్ బాగా కనెక్ట్ అయ్యింది. ఎంటైర్ టీమ్‌ను కలిసి మాట్లాడినప్పుడు వారు చెప్పిన విషయాలు ఎంతో నచ్చి సినిమా చేయాలనుకున్నాను. ఏ 3 లేబుల్స్ బ్యానర్ పై తొలి సినిమా చేస్తున్నాం. ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.


హీరోయిన్ సునీత మారస్యార్ మాట్లాడుతూ ‘‘మా అల్లా హే అల్లా సినిమాను పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్. ఆ థీమ్ తోనే ఇప్పుడు సినిమా చేయబోతున్నాం. మంచి కథ కుదిరింది. అప్పుడు ఇచ్చినట్లే ఇప్పుడు కూడా ప్రోత్సాహాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. మా టీమ్‌ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.


హీరో టోని కిక్ మాట్లాడుతూ ‘‘మా డైరెక్టర్ బుల్లెట్ బండి లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. ఆయన చేసిన అల్లా హే అల్లా కాన్సెప్ట్ తోనే ఇప్పుడు సినిమాను స్టార్ట్ చేశాం. నన్ను నమ్మి నాకు హీరోగా అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, నిర్మాత గిరీష్ కుమార్ గారికి థాంక్స్’’ అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ మదీన్ ఎస్.కె. మాట్లాడుతూ ‘‘మా అల్లా హే అల్లా పాట నాలుగు నిమిషాలు.. దాన్ని రెండు కోట్ల మంది చూశారు. అదే కాన్సెప్ట్ తో రెండు గంటల పాటు చేయబోయే సినిమాను రెండు వందల కోట్ల మంది చూడాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.


సినిమాటోగ్రాఫర్ జనతా బబ్లూ మాట్లాడుతూ ‘‘సినీ రంగంలోకి అడుగు పెట్టటం మా అందిరకీ కొత్త. అయితే ప్యాషన్ తో వచ్చాం. లక్ష్మణ్ గారు తొలి సినిమా చేస్తున్నప్పటికీ మంచి కథను సిద్ధం చేశారు. నాపై నమ్మకంతో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, నిర్మాతకు ధన్యవాదాలు’’ అన్నారు.


రామ్ అద్నాన్ మాట్లాడుతూ ‘‘మా లక్ష్మణ్ మొదటిసారి డైరెక్షన్ చేస్తున్నారు. కథ వైవిధ్యంగా ఉంటుంది. అల్లా హే అల్లా పాటను హిట్ చేసిన ప్రేక్షకులు మా సినిమాను కూడా హిట్ చేస్తారనే నమ్మకం ఉంది. మాపై నమ్మకంతో సినిమాను నిర్మిస్తోన్న గిరీష్ గారికి థాంక్స్. సపోర్ట్ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు.


డైరెక్టర్ బుల్లెట్ బండి లక్ష్మణ్ మాట్లాడుతూ ‘‘సినీ ఇండస్ట్రీలోకి ఎప్పుడో వచ్చి ఇబ్బందులు పడి వెనక్కి వెళ్లిపోయాం. అయితే జానపద పాటలు ద్వారా ప్రేక్షకుల ఆదరణ పొందాం. నాలోని సినిమా కలను గుర్తించిన మా నిర్మాత గిరీష్ కుమార్ గారు సినిమా చేయటానికి ముందుకు వచ్చారు. ముందుగా ఆయనకు ధన్యవాదాలు. ఆయన రుణ తీర్చుకోలేనిది. ఇది వరకు నాలుగు నిమిషాల్లోని పాటలో ఓ కథను చెప్పే ప్రయత్నం చేశాను. ఇప్పుడు మా నిర్మాతగారు రెండు గంటల సినిమా చేయమని ముందుకు వచ్చారు. మా ప్రతీ పాట, మాట థియేటర్స్ కి ఆడియెన్స్ ను రప్పించేలా, వారి మనసు మెప్పించేలా ఉంటాయి. మా టీమ్ సంకల్ప బలం నా వెనుకుంది. నన్ను యూ ట్యూబ్ లో ఆదరించినట్లే సినిమాలోనూ ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.


నటీనటులు:


టోని కిక్, సునీత మారస్యార్, తనికెళ్ళ భరణి, తోటపల్లి మధు, రాజ్ తిరణ్ దాస్, దసరా ఫేమ్ రియాజ్, నల్గొండ గద్దర్, కోటి యాదవ్, ధూమ్ ధాం టీం తదితరులు


సాంకేతిక వర్గం:  


నిర్మాణ సంస్థ - A3 లేబుల్స్, దర్శకత్వం - బుల్లెట్ బండి లక్ష్మణ్, నిర్మాత - గిరీష్ కుమార్, సినిమాటోగ్రఫీ - జనతా బబ్లూ, మ్యూజిక్ - మదీన్ ఎస్.కె, పాటలు - చంద్రబోస్, ఆర్ట్ - ప్రభాకర్ ఆర్.ఎల్.టీమ్, ప్రొడక్షన్ కంట్రోలర్స్ - కుమార్, దిలీప్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ - అంజి, వెంకట్ శౌర్య, రామ్ అద్నాన్, పోస్టర్ డిజైనర్ - సాగర్ ముదిరాజ్, పి.ఆర్.ఒ - వంశీ కాకా

Manamey Teaser is Unveiled

 విట్నెస్ ది మెస్మరైజింగ్ వరల్డ్- శర్వానంద్, కృతి శెట్టి, విక్రమ్ ఆదిత్య, శ్రీరామ్ ఆదిత్య, హేషమ్ అబ్దుల్ వహాబ్, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 'మనమే' టీజర్ విడుదల



ప్రామిసింగ్ హీరో శర్వానంద్ ల్యాండ్‌మార్క్ 35వ చిత్రం 'మనమే'. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్ అద్భుతంగా నిర్మిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్, ప్రతి ప్రమోషనల్ మెటిరియల్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ రోజు, మేకర్స్ ఈ చిత్రం టీజర్‌తో ముందుకు వచ్చారు, ఇది

'మనమే' మెస్మరైజ్ చేసే ప్రపంచంలోకి ఒక స్నీక్ పీక్.


ఇది పరస్పరం భిన్నమైన మనస్తత్వం ఉన్న ఇద్దరు వ్యక్తులు, వారి జర్నీలో ఊహించని అతిథి కథ. శర్వానంద్ హీరో పాత్రలో అమాయకంగా కనిపిస్తున్నారు కానీ కనిపిస్తున్నంత ఇన్నోసెంట్ కాదు. అతను జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి ఇష్టపడే ప్లేబాయ్. కృతి శెట్టి బాధ్యతాయుత అమ్మాయిగా కనిపించింది. పిల్లాడి పాత్రలో విక్రమ్ ఆదిత్య ఎంట్రీతో వారి జీవితాలు తలకిందులౌతాయి. పిల్లాడి రాక వారిని గందరగోళానికి గురిచేస్తుంది.


దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య న్యూ ఏజ్ కథతో వచ్చి హ్యూమరస్ గా ప్రజెంట్ చేశారు. మూడు పాత్రల మధ్య రిలేషన్ ని బయటపెట్టకుండా టీజర్‌ను స్మార్ట్ గా కట్ చేశాడు. త్వరలో విడుదల కానున్న థియేట్రికల్ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా చేశాడు.


మూడు పాత్రలు అందంగా వ్రాయబడ్డాయి. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఒక పిల్లవాడి యొక్క సాధారణ మనస్తత్వాలను అద్భుతంగా చూపించారు. శర్వానంద్ ఉబెర్ కూల్‌గా కనిపించాడు. తన పాత్రలో ఆదరగొట్టారు. కృతి శెట్టి అందంగా ఉంది. తన పాత్రలో ఒదిగిపోయింది. కిడ్ విక్రమ్ ఆదిత్య అందరినీ ఆకట్టుకున్నాడు.


విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ VS కెమెరా పనితనం ప్రత్యేకంగా నిలుస్తుంది, విజువల్స్ వైబ్రెంట్, గ్రాండ్‌గా కనిపిస్తున్నాయి. హేషమ్ అబ్దుల్ వహాబ్ తన అద్భుతమైన స్కోర్‌తో ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ డిజైన్ టాప్-క్లాస్‌గా ఉంది, అన్నింటిలో రిచ్‌నెస్ ఉంది. టీజర్ మనలోని ఆసక్తిని మరింత పెంచింది.


వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత కాగ, కృతి ప్రసాద్, ఫణి వర్మ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ టెక్నీషియన్ ప్రవీణ్ పూడి ఎడిటర్, జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్. ఈ చిత్రానికి డైలాగ్స్‌ని అర్జున్ కార్తిక్, ఠాగూర్, వెంకీ అందించారు.


ఈ హాలిడే సీజన్‌లో 'మనమే' థియేటర్లలోకి రానుంది కాబట్టి ఈ వేసవి చాలా కూల్ గా ఉండబోతుంది. ఈ హోల్సమ్ ఎంటర్ టైనర్ అన్ని వర్గాలను సమానంగా ఆకర్షిస్తుంది.



తారాగణం: శర్వానంద్, కృతి శెట్టి, విక్రమ్ ఆదిత్య


సాంకేతిక విభాగం:

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య

నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్

బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల

ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కృతి ప్రసాద్, ఫణి వర్మ

అసోసియేట్ ప్రొడ్యూసర్: ఏడిద రాజా

డైలాగ్స్: అర్జున్ కార్తిక్, ఠాగూర్, వెంకీ

సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్

డీవోపీ : విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ VS

ఎడిటర్: ప్రవీణ్ పూడి

ఆర్ట్: జానీ షేక్

పీఆర్వో: వంశీ-శేఖర్

Tharun Bhascker Eesha Rebba Movie Announced

 తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, సజీవ్ ఎఆర్, ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ న్యూ మూవీ అనౌన్స్డ్, అక్టోబర్‌లో థియేట్రికల్ రిలీజ్



ఇప్పటికే పలు చిత్రాలలో తన నటనా నైపుణ్యాన్ని నిరూపించుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్‌లో లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తుంది. సంజీవ్ ఎఆర్ దర్శకత్వం వహిస్తుండగా, సృజన్ యరబోలు, వివేక్ కృష్ణని, సాధిక్, ఆదిత్య పిట్టీ కలిసి ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ బ్యానర్‌లపై నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను మేకర్స్ ఈరోజు అధికారికంగా అనౌన్స్ చేశారు.


రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఈ సినిమా మొదటి షూటింగ్ షెడ్యూల్ లో ప్రధాన తారాగణం పాల్గొంటోంది. ఈరోజు (ఏప్రిల్ 19) హీరోయిన్ ఈషా రెబ్బా పుట్టినరోజును సెట్స్‌ లో చిత్ర బృందం సెలబ్రేట్ చేసుకుంది. యూనిట్  విడుదల చేసిన స్టిల్‌లో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రూరల్ గెటప్‌లలో ఆకట్టుకున్నారు. తరుణ్ ఫార్మల్ డ్రెస్‌లో డీసెంట్‌గా కనిపిస్తుండగా, ఈషా సంప్రదాయ చీరను ధరించింది.


ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అక్టోబర్‌లో సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.


ఈ చిత్రానికి దీపక్ యెరగరా సినిమాటోగ్రాఫర్ కాగా, జై క్రిష్ సంగీతం అందిస్తున్నారు. నంద కిషోర్ ఈమాని డైలాగ్ రైటర్.


తారాగణం: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, బ్రహ్మాజీ, శివన్నారాయణ, సురభి ప్రభావతి, బిందు చంద్రమౌళి, గోపరాజు విజయ్


సాంకేతిక సిబ్బంది:

దర్శకత్వం - సజీవ్ ఏఆర్

నిర్మాతలు - సృజన్ యరబోలు, వివేక్ కృష్ణని, సాధిక్, ఆదిత్య పిట్టీ

బ్యానర్స్- S ఒరిజినల్స్ & మూవీ వెర్స్

సంగీతం - జై క్రిష్

డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ - దీపక్ యెరగరా

డైలాగ్స్ - నంద కిషోర్ ఈమాని

ఫైట్స్ - మల్లేష్, అంజి

క్రియేటివ్ ప్రొడ్యూసర్ - బాల సౌమిత్రి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - భువన్ సాలూరు, మథన్

సహ నిర్మాతలు - నవీన్ సనివరపు, అనుప్ చంద్రశేఖరన్

లైన్ ప్రొడ్యూసర్ - శ్రీనివాసరావు ఈర్ల

పీఆర్వో - వంశీ-శేఖర్


100 Million Streaming Minutes For Gaami

100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో ZEE5లో దూసుకెళ్తోన్న విశ్వక్ సేన్ ‘గామి’



ఎంటర్‌టైన్‌మెంట్‌ను నాన్ స్టాప్‌గా అందించటంలో ఎప్పుడూ ముందుండే వన్ అండ్ ఓన్లీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ZEE5. డిఫరెంట్ మూవీస్, సిరీస్‌లతో ఎంటైర్ ఇండియాలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా వినోదాన్ని అందిస్తోంది జీ 5. తాజాగా ‘గామి’ చిత్రంతో ZEE5 ప్రేక్షకులను అలరిస్తోంది.  మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధానపాత్రలో నటించారు. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా, వైవిధ్యమైన కథాంశంతో ‘గామి’ సినిమా తెరకెక్కింది.  విధ్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ  మార్చి 8న థియేటర్స్‌లో విడుదలై సూపర్బ్ రెస్పాన్స్‌ను రాబట్టకుంది. ఈ సూపర్ హిట్ చిత్రాన్ని జీ 5 ఏప్రిల్ 12 నుంచి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. జీ 5లో స్ట్రీమింగ్ మొదలైనప్పటి నుంచి గామి దూసుకెళ్తోంది. డిఫరెంట్ కంటెంట్ ఉన్న ఈ చిత్రం ఆడియెన్స్‌కు అతి తక్కువ కాలంలో చేరువైంది. స్ట్రీమింగ్ మొదలైన కొన్ని గంటల్లోనే 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌ ‘గామి’ చిత్రానికి రావటం విశేషం. 


‘గామి’ అంటే యాత్రికుడు.. కథ విషయానికి వస్తే .. హరిద్వార్‌లో ఉండే అఘోరా శంకర్ (విశ్వక్ సేన్) వింత సమస్యతో బాధపడుతుంటాడు. అందుకనే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లడు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా శంకర్ తనున్న ప్రదేశాన్ని వీడి తన సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కుంటూ కాశీకి వెళతాడు. అక్కడ తన సమస్యకు పరిష్కారం దొరికే చోటు హిమాలయాలు అని తెలుస్తుంది. అక్కడ 36 ఏళ్లకు అరుదుగా దొరికే మాలి పత్రాలు కోసం శంకర్ అన్వేషిస్తూ బయలుదేరుతాడు. అదే సమయంలో అతనికి డాక్టర్ జాహ్నవి పరిచయం అవుతుంది. ఈ ప్రయాణంలో శంకర్ మనసులో చిత్ర విచిత్రమైన ఆలోచనలు, కలలు వస్తుంటాయి. ఓ పల్లెటూరుల్లో ఉండే దేవదాసి ఉమ, ఓ ప్రయోగశాలలో చిక్కుకుని తప్పించుకోవాలనుకునే ఓ యువకుడు కనిపిస్తుంటారు. అసలు వాళ్లకు శంకర్‌కు ఉన్న సంబంధం ఏంటి? శంకర్ సమస్య ఏంటి? తన సమస్యకు శంకర్ పరిష్కారం కనుక్కున్నాడా? అనే విషయాలను దర్శకుడు తెరకెక్కించిన తీరు అభినందనీయం.


నరేశ్ కుమార్, స్వీకర్ అగస్తి సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్‌తో పాటు విశ్వనాథ్ రెడ్డి, ర్యాంపి నందిగాం సినిమాటోగ్రఫీ  సినిమాను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాయి. చక్కటి ఎమోషన్స్‌తో ఎప్పుడు ఏం జరుగుతుందా? అని ఆసక్తికరమైన కథనం, చక్కటి విజువల్స్ అన్ని ప్రేక్షకుడిని కట్టిపడేస్తున్నాయి ఇప్పుడు ఈ విజువల్, ఎమోషనల్ వండర్ జీ5 ద్వారా ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది. 


జీ5 గురించి:

జీ5 భార‌త‌దేశ‌పు యంగ‌స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్ల‌ర్‌గా ప్ర‌సిద్ధి పొందింది. మిలియ‌న్ల కొద్దీ అభిమానుల‌ను సంపాదించుకుంది. గ్లోబ‌ల్ కంటెంట్ ప‌వ‌ర్ హౌస్ జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎంట‌ర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్‌) నుంచి శాఖ‌గా మొద‌లైంది జీ5. అత్య‌ద్భుత‌మైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్ర‌రీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజిన‌ల్స్, 5 ల‌క్ష‌ల‌కు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాష‌ల్లో (హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ, మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ్‌, మ‌రాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజ‌రాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజిన‌ల్స్, ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీస్‌, టీవీ షోస్‌, మ్యూజిక్‌, కిడ్స్ షోస్‌, ఎడ్‌టెక్‌, సినీ ప్లేస్‌, న్యూస్‌, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్‌పార్మ్ కావ‌డంతో జీ5 12 భాష‌ల్లో అత్య‌ద్భుత‌మైన కంటెంట్‌ని ప్రేక్ష‌కుల‌కు అందించ‌గ‌లుగుతోంది.

Bhaje Vayu Vegam" Teaser Release Tomorrow

 యువి క్రియేషన్స్ సమర్పణలో హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న "భజే వాయు వేగం" సినిమా టీజర్ రేపు విడుదల




ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మీద హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న సినిమా "భజే వాయు వేగం". ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాకు ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.


ఇవాళ "భజే వాయు వేగం" సినిమా టీజర్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. ఈ సినిమా టీజర్ ను రేపు మధ్యాహ్నం 2.25 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో టీజర్ కూడా బాగుంటుందనే ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి. "భజే వాయు వేగం" సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. థియేట్రికల్ రిలీజ్ డేట్ ను త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు.


నటీనటులు - కార్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు


టెక్నికల్ టీమ్-

మాటలు: మధు శ్రీనివాస్

ఆర్ట్: గాంధీ నడికుడికర్

ఎడిటర్: సత్య జి

సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్

మ్యూజిక్ (పాటలు) - రధన్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - కపిల్ కుమార్

పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్-శ్రీనివాస్)

కో ప్రొడ్యూసర్ - అజయ్ కుమార్ రాజు.పి

ప్రొడ్యూసర్: యూవీ కాన్సెప్ట్స్

దర్శకుడు: ప్రశాంత్ రెడ్డి


Mahathi Entertainment Proudly Presents: "Lakshmi Kataksham" Trailer Released

ఓటుకు 5000 అంటూ, లక్ష్మీ కటాక్షం సినిమా ట్రైలర్ విడుదల



మహతి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నుండి యు. శ్రీనివాసుల రెడ్డి, బి. నాగేశ్వర రెడ్డి, వహీద్ షేక్, కే. పురుషోత్తం రెడ్డి నిర్మించిన ‘లక్ష్మీ కటాక్షం’ ట్రైలర్ విడుదల అయ్యింది. ఓపెనింగ్ లోనే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎలక్షన్స్ డేట్ నే సినిమాలో ఎలక్షన్ డేట్ లాగా అనౌన్స్ చేశారు, ప్రముఖ నటుడు డైలాగ్ కింగ్ సాయి కుమార్ తన పాతికేళ్ళ పొలిటికల్ కెరీర్ ను నిలబెట్టుకోవడం కోసం ఈ ఎలక్షన్ ను చాలా ప్రశ్టేజ్ గా తీసుకుంటాడు, మరో పక్క పోలీస్ ఆఫీసర్ ఎలాగైనా ఈ ఎలక్షన్ లో ఒక్క రూపాయి కూడా పంచకుండా చూసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఆ పోలీస్ బందోబస్త్ నుండి, తక్కువ టైంలో 100 కోట్లని, రెండు లక్షల మంది ఓటర్లకు, ఓటుకు 5000 చొప్పున ఎలా పంచుతారు అనే నేపధ్యంలో సినిమా కథ ఉండబోతున్నట్టు ట్రైలర్లో తెలుస్తుంది, కామెడీ తో పాటు హూకింగ్ డ్రామా కూడా ఉంది ఈ ట్రైలర్ లో.


ఒక పక్క సాయి కుమార్ కి ఎలక్షన్ ఫండ్ రావడం ఒక ఛాలెంజ్ అయితే, ఇంకో పక్క లాస్ట్ మినిట్ లో వచ్చిన ఫండ్ ఎలా పంచాలి అనేది ఇంకో ఛాలెంజ్, ఈ తరుణంలో చిరాకు పడి అన్ని దారులు మూసుకున్న సాయి కుమార్ లక్ష్మీ దేవిని ఎలక్షన్ ఫండ్ కటాక్షించమని డిమాండ్ చేస్తారు, లక్ష్మి దేవి ప్రత్యేక్షమవుతారు, ఇలాంటి విభిన్నమైన కథాంశాలతో సాగే ఈ ‘లక్ష్మీ కటాక్షం’ త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. ఈ సినిమాకి సూర్య రైటర్, డైరెక్టర్ గా వ్యవహరించారు. ట్రైలర్ లో డ్రామా పర్ఫెక్ట్ గా హైలైట్ అయ్యేలా మ్యూజిక్ అభిషేక్ రుఫుస్ అందించారు.


నటీ నటులు:

వినయ్

అరుణ్

దీప్తి వర్మ

చరిస్మా శ్రీకర్

హరి ప్రసాద్

సాయి కిరణ్ ఏడిద

ఆమనీ


సాంకేతిక నిపుణులు:

బ్యానర్: మహతి ఎంటర్టైన్మెంట్

నిర్మాతలు: యు. శ్రీనివాసుల రెడ్డి, బి. నాగేశ్వర రెడ్డి, వహీద్ షేక్, కే. పురుషోత్తం రెడ్డి

రచన, డైరెక్టర్: సూర్య

మ్యూజిక్: అభిషేక్ రుఫుస్

డి ఓ పి: నని ఐనవెల్లి

ఎడిటర్: ప్రదీప్ జే

సౌండ్ డిజైన్: మురళీధర్ రాజు

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఆర్. రంగనాథ్ బాబు

పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను , ధీరజ్- ప్రసాద్ 

Sithara Entertainments MAD Square Movie Launched

 యూత్‌ఫుల్ బ్లాక్‌బస్టర్ 'మ్యాడ్'కి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్'ను ప్రకటించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్



యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎప్పుడూ ముందుంటుంది. ఎందరో యువ దర్శకులతో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ, వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటోంది. 'డీజే టిల్లు', 'మ్యాడ్', 'జెర్సీ', 'టిల్లు స్క్వేర్' వంటి అద్భుతమైన చిత్రాలను దీనికి ఉదాహరణలుగా చెప్పవచ్చు.


యువ నటీనటులు, సాంకేతిక నిపుణులతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందించిన 'మ్యాడ్' చిత్రం 2023 అక్టోబరులో విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఆ బ్లాక్‌బస్టర్‌ చిత్రానికి సీక్వెల్ గా 'మ్యాడ్ స్క్వేర్‌'ని రూపొందిస్తున్నారు.


'మ్యాడ్'తో రచయిత-దర్శకుడిగా పరిచయమైన కళ్యాణ్ శంకర్, సితార సంస్థ నిర్మించిన మరో భారీ బ్లాక్‌బస్టర్‌ మూవీ 'టిల్ స్క్వేర్‌'కి రచయితలలో ఒకరిగా పనిచేశారు. ఇప్పుడు, ఆయన తన విజయవంతమైన చిత్రం 'మ్యాడ్'కి సీక్వెల్ గా రూపొందుతోన్న 'మ్యాడ్ స్క్వేర్‌'తో రాబోతున్నారు. 


'మ్యాడ్'లో నటించి మెప్పించిన యువ కథానాయకులు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ల త్రయం ఈ సీక్వెల్ కోసం మళ్ళీ రంగంలోకి దిగారు. కథానాయికల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. మ్యాడ్ ఎంతలా నవ్వులు పంచిందో, దానికి రెట్టింపు వినోదం సీక్వెల్ ద్వారా అందించబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.


'మ్యాడ్ నెస్' ఇంకా పూర్తి కాలేదు అని తెలిపిన మేకర్స్.. ఈసారి 'మ్యాడ్ నెస్' రెట్టింపు ఉంటుందని పేర్కొన్నారు. దీనిని బట్టి చూస్తే, ఈసారి కథానాయికల త్రయం చేసే అల్లరి.. థియేటర్లలో నవ్వుల సునామీ సృష్టించనుందని అర్థమవుతోంది.


ఇటీవల ఉగాది శుభ సందర్బంగా చిత్ర బృందం పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించింది. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. 'డీజే టిల్లు'కి సీక్వెల్‌ గా రూపొందిన 'టిల్లు స్క్వేర్' ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో.. 'మ్యాడ్'కి సీక్వెల్‌ గా రూపొందుతోన్న 'మ్యాడ్ స్క్వేర్' కూడా అంతటి విజయాన్ని సాధిస్తుందని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.


'మ్యాడ్ స్క్వేర్' సినిమా ప్రారంభోత్సవానికి స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు కె.వి. అనుదీప్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడుకి స్క్రిప్ట్ అందజేసిన సిద్ధు జొన్నలగడ్డ, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.


అలాగే నిర్మాత సూర్యదేవర నాగవంశీ కుమార్తె మరియు ఆయన సోదరీమణులు హారిక సూర్యదేవర, హాసిని సూర్యదేవర కూడా 'మ్యాడ్ స్క్వేర్' ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. గతంలో వారి చేతుల మీదుగా ప్రారంభమైన 'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్', 'మ్యాడ్' చిత్రాలు ఘన విజయాలను సాధించాయి. 'మ్యాడ్ స్క్వేర్' సినిమాకి కూడా ఆ సెంటిమెంట్ కొనసాగి, ఘన విజయం సాధిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.


సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర హారిక, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌ మరియు సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.


'మ్యాడ్' కోసం పని చేసిన ప్రతిభ గల సాంకేతిక నిపుణులు 'మ్యాడ్ స్క్వేర్' కోసం కూడా పని చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి షామ్‌దత్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.


ఈ చిత్రంపై నిర్మాతలు ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఈ సీక్వెల్‌తో ప్రేక్షకులకు థియేటర్లలో మ్యాడ్ మ్యాక్స్ వినోదాన్ని అందిస్తామని వాగ్దానం చేస్తున్నారు.


Krishna From Brindavanam Movie Launched

 ఆది సాయి కుమార్ నూతన చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ ప్రారంభోత్సవంలో దిల్ రాజు, అనిల్ రావిపూడి సందడి



లవ్ లీ యంగ్ హీరో ఆది సాయి కుమార్ మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చుట్టలబ్బాయ్‌ అంటూ దర్శకుడు వీరభద్రమ్ చౌదరితో మంచి చిత్రాన్ని చేసిన ఆది సాయి కుమార్ మళ్లీ విలేజ్ డ్రామా, ఫ్యామిలీ, లవ్, కామెడీ, ఫీల్ గుడ్ ఎమోషన్ ఇలా అన్ని అంశాలతో సినిమాను చేస్తున్నారు. ఈ మూవీని లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తూము నరసింహా, జామి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు గురువారం నాడు కాకతీయ హిల్స్‌లోని వెంకటేశ్వరుడి సన్నిధిలో ఘనంగా జరిగాయి. పూజా కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ సాయి కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు షాట్‌కు దిల్ రాజు గారు క్లాప్ కొట్టగా.. అనిల్ రావిపూడి గారు దర్శకత్వం వహించారు. ఇక స్క్రిప్ట్ అందజేస్తూ కెమెరాను సాయి కుమార్ గారు స్విచ్ ఆన్ చేశారు.


 చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ.. ‘మా మూవీ ఓపెనింగ్‌కు వచ్చిన దిల్ రాజు గారికి, అనిల్ రావిపూడి గారికి థాంక్స్. చుట్టలబ్బాయ్ తరువాత మళ్లీ ఓ సినిమా చేయాలని నేను, వీరభద్రమ్ గారు ప్రయత్నించాం. ఇన్ని రోజులకు మంచి కథ, స్క్రిప్ట్ దొరికింది. మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమా అవుతుంది. కుటుంబమంతా కలిసి చూసి నవ్వుకునేలా ఉంటుంది. జూన్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. క్రేజీ ఫెల్లో సినిమాలో నేను, దిగంగనా సూర్యవంశీ కలిసి నటించాం. మళ్లీ ఇప్పుడు ఈ చిత్రంలో నటిస్తున్నాం. ప్రేమ కావాలి, లవ్ లీ, సుకుమారుడు, ప్యార్ మే పడిపోయానే అంటూ అనూప్ రూబెన్స్ నాకు మంచి సాంగ్స్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మంచి పాటలు ఇస్తున్నారు. ఈ రోజు అనూప్ గారి పుట్టిన రోజు. మంచి టెక్నీషియన్లు, ఆర్టిస్టులతో రాబోతున్నాం. అన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామ’ని అన్నారు.


 దర్శకుడు వీరభద్రమ్ చౌదరి మాట్లాడుతూ.. ‘మా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన దిల్ రాజు గారు, అనిల్ రావిపూడి గార్లకు థాంక్స్. చుట్టలబ్బాయ్ తరువాత సినిమా చేయాలని నేను, ఆది చాలా కథలు విన్నాం. ఇప్పటికి మాకు టైం, లక్ కలిసి వచ్చింది. మంచి కథ దొరికింది. ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది. ఆది సరసన దిగంగనా సూర్యవంశీ నటిస్తున్నారు. హీరోయిన్ పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. మా సినిమాను నిర్మాతలు తూము నరసింహా, జామి శ్రీనివాసరావు  ఖర్చుకి ఏ మాత్రం వెనుకాడకుండా, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించేందుకు ముందుకు వచ్చారు. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్, రామ్ డైలాగ్స్, శ్యాం విజువల్స్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. మాకు అండగా నిలిచిన మీడియాకు థాంక్స్’ అని అన్నారు.


 సాయి కుమార్ మాట్లాడుతూ.. ‘దిల్ రాజు గారు, అనిల్ రావిపూడి గారు ఎంత బిజీగా ఉన్నా అడిగిన వెంటనే వచ్చినందుకు థాంక్స్. వీరభద్రమ్ గారికి ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం. మేం చేసిన చుట్టలబ్బాయ్ బాగా ఆడింది. ఆయన కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలను తీస్తుంటారు. కృష్ణ ఫ్రమ్ బృందావనం కూడా ఫ్యామిలీతో చూడదగ్గ చిత్రంగా ఉంటుంది. ఆదికి అనూప్ రూబెన్స్ ఎప్పుడూ కూడా బెస్ట్ ఆల్బమ్స్ ఇస్తూనే వచ్చారు. ఈ సినిమాలోనూ మంచి పాటలు ఉండబోతున్నాయి. ఎంతో ప్యాషన్ ఉన్న నిర్మాతలు మంచి కథతో చేస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.


 దిగంగనా సూర్యవంశీ మాట్లాడుతూ..‘ఆది గారితో ఇది వరకు నేను క్రేజీ ఫెల్లో సినిమా చేశాను. మళ్లీ ఆది గారితో కలిసి నటిస్తుండటం ఆనందంగా ఉంది. వీరభద్రమ్ గారు చెప్పిన కథ చాలా బాగా నచ్చింది. ఇందులో నా పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.


నటీనటులు : ఆది సాయికుమార్, దిగంగనా సూర్యవంశీ, మురళీధర్ గౌడ్, 30 ఇయర్స్ పృధ్వీ, రఘు బాబు, అవినాష్, రచ్చ రవి, అశ్విని, శ్రీ దేవి, అలేక్య, స్నేహ, పద్మ, గిరిధర్, గోవర్ధన్, మాస్టర్ రిత్విక్, వెంకట్ నారాయణ, గురు రాజ్ తదితరులు


సాంకేతిక బృందం

బ్యానర్ : లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్

నిర్మాత: తూము నరసింహ, జామి శ్రీనివాస్

స్టోరీ,  స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వీరభద్రమ్ చౌదరి

డీఓపీ. : శ్యామ్

సంగీతం. : అనూప్ రూబెన్స్

ఎడిటర్. : చోటా కె ప్రసాద్

డైలాగ్స్ : రాము మన్నార్

ఫైట్స్. : డ్రాగన్ ప్రకాష్, శంకర్

పీఆర్వో : సాయి సతీష్

Mangli's Latest Song "Lachhimakka" from Jithender Reddy Released

జితేందర్ రెడ్డి నుండి మంగ్లీ కొత్త పాట “లచ్చిమక్క” లిరికల్ సాంగ్ విడుదల



ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి గారు నిర్మాతగా ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వంలో పేక మేడలు సినిమాతో నిర్మాతగా బాహుబలి, ఎవరికి చెప్పొద్దు వంటి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె లీడ్ రోల్ లో నటించిన సినిమా జితేందర్ రెడ్డి. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. వైశాలి రాజ్, రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు మరియు రవి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రలో నటించారు.


గతంలో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు గ్లింప్స్ సినిమా పైన అంచనాలను పెంచేసాయి. రీసెంట్ గానే విడుదల అయిన అ ఆ ఇ ఈ ఉ ఊ సాంగ్ మంచి ప్రేక్షక ఆదరణ పొందింది, ముఖ్యంగా యువతకి ఆ పాట బాగా నచ్చింది.  ఆ సాంగ్ కాలేజీ బ్యాక్ డ్రాప్ కాగా ఇప్పుడు విడుదలైన ఈ ‘లచ్చిమక్క’ సాంగ్ పెళ్లి బ్యాక్ డ్రాప్ లో ఉంది.  ఈ పాటకి గోపి సుందర్ మ్యూజిక్ అందించగా రాంబాబు గోసాల లిరిక్స్ రాశారు మరియు మంగ్లీ ఈ పాటని చాలా బాగా పాడారు. జితేందర్ రెడ్డి ఇంట్లో జరిగే పెళ్ళిలో సరదాగా సాగే ఒక పాటలా ఉంది. 1980' లో లొకేషన్స్ అన్ని కూడా చాలా నాట్యురల్ గా ఉన్నాయి. ఈ పాత ద్వార కథలో ట్విస్టులు ఉన్నట్టు అర్ధమవుతుంది


ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ ముదిగంటి రవీందర్ రెడ్డి గారు మాట్లాడుతూ: ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరుకు రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ అన్ని కూడా మంచి ఆదరణ పొందాయి. ప్రేక్షకులు కొత్త నిర్మాతలమైనా మన్నలిని ఇంత బాగా ఆదరిస్తున్నారు.  కంటెంట్ ఉంటె మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆ సినిమాని ఆదరిస్తారు అని మరో సారి నిరూపించారు. 


ప్రస్తుతం వస్తున్న కథలకి పూర్తి భిన్నంగా ఉంది ఈ జితేందర్ రెడ్డి. ఈ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


నటీ నటులు : రాకేష్ వర్రే, వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్


టెక్నికల్ టీం :

డైరెక్టర్ : విరించి వర్మ

నిర్మాత :  ముదుగంటి రవీందర్ రెడ్డి

కో - ప్రొడ్యూసర్ : ఉమ రవీందర్

ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వాణిశ్రీ పొడుగు

డి ఓ పి : వి. ఎస్. జ్ఞాన శేఖర్

మ్యూజిక్ డైరెక్టర్ : గోపి సుందర్

పి ఆర్ ఓ : మధు VR

Pottel Teaser Launched by Sandeep Reddy Vanga

“పొట్టెల్” టీజర్ అద్భుతంగా వుంది. ఇలాంటి సినిమాలు తక్కువగా వస్తుంటాయి. సినిమాని తొలి రోజు చూడాలని ఎదురుచూస్తున్నాను: టీజర్ లాంచ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా



బ్లాక్ బస్టర్ మేకర్ సందీప్ రెడ్డి వంగా విడుదల చేసిన యువ చంద్ర కృష్ణ, సాహిత్ మోత్ఖూరి, NISA ఎంటర్టైన్మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్ “పొట్టెల్” చిత్ర టీజర్

 

దర్శకుడు సాహిత్ మోత్ఖూరి తన మూడవ ప్రాజెక్ట్ పొట్టెల్ లో యువ చంద్ర కృష్ణ ప్రధాన పాత్రలో అనన్య నాగెళ్ల మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. NISA ఎంటర్టైన్మెంట్స్పై నిశాంక్ రెడ్డి కుడితి మరియు ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్పై సురేష్ కుమార్ సడిగే నిర్మించిన ఈ చిత్రం ఆకర్షణీయమైన పోస్టర్ లు మరియు చార్ట్బస్టర్ పాటలతో తగినంత బజ్ని సృష్టించింది. ఈరోజు ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా టీజర్ ను విడుదల చేశారు.

 

టీజర్ సినిమా బ్యాక్ డ్రాప్ పై ఒక ఐడియా ని ఇస్తుంది. కుల వివక్ష ఉన్న మారుమూల తెలంగాణ గ్రామంలో యువ చంద్ర కృష్ణ తన కుమార్తెకు విద్య ద్వారా మంచి జీవితాన్ని అందించాలని కోరుకునే బాధ్యతగల భర్త మరియు తండ్రిగా కనిపిస్తాడు. పవిత్రమైన గొర్రె తప్పిపోయినప్పుడు గ్రామస్థులు అతనిపై దాడి చేయడంతో పరిస్థితులు మరింత క్లిష్టం గా మారుతాయి.


మంచి సందేశం ఉన్న ఒక ఆసక్తికరమైన కథను ఎంచుకున్న సాహిత్ మోత్ఖూరి దానిని ఆకర్షణీయంగా రూపొందించారు. అద్భుతమైన పెర్ఫార్మన్స్ లు మరియు సాంకేతిక నైపుణ్యంతో టీజర్ మొదటి నుండి చివరి వరకు గొప్పగా ఉంది.


యువ చంద్ర కృష్ణ అమాయకంగా, పాత్రకు తగినట్లుగా కనిపించారు. అతని భార్యగా అనన్య నాగళ్లకు ముఖ్యమైన పాత్ర లో కనిపించింది. అజయ్, పటేల్ గా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రను పోషించాడు,చివరిలో అతని పోతురాజు గెటప్ ప్రధాన హైలైట్ లలో ఒకటి గా నిలిచింది. ప్రతి పాత్రను చక్కగా తీర్చిదిద్దినట్టు ఈ టీజర్ లో కనిపిస్తుంది.

 

మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ సినిమా గ్రాఫ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్ళింది. శేఖర్ చంద్ర స్కోర్ కథనానికి ఇంటెన్సిటీని సమకూర్చింది. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్, నార్ని శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని చూడాలనే ఆసక్తిని టీజర్ మరింత పెంచింది.


టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. సాహిత్ తో నాలుగేళ్ళుగా పరిచయం. ఈ కథ ఫోన్ లో చెప్పాడు. మొదటి రోజు నుంచి చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడు. పొట్టెల్ టీజర్ చూస్తున్నపుడు.. ఇలాంటి కంటెంట్ మలయాళం సినిమాలో ఎక్కువగా చూస్తుంటాం. తెలుగులో ఇలాంటి సినిమాలు రావట్లేదని అనుకుంటాం. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తుంటాయి. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను. చిన్న, రూరల్ సినిమాలని ప్రోత్సహించండి. ఈ సినిమాలో పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. యువ చంద్ర కృష్ణ, అజయ్, జీవన్, నోయల్, ప్రియాంక, అనన్య అందరికీ ఆల్ ది బెస్ట్. సాహిత్ ఇది రెండో సినిమా. తన మొదటి సినిమా బంధం రేగడ్ నాకు చాలా ఇష్టం. . పొట్టెల్ టీజర్ చూసినప్పుడు తన ఆనుకున్న కథ తెరపైకి అద్భుతంగా తీసుకొచ్చారని అనిపించింది. అజయ్ గారి లుక్ టెర్రిఫిక్ గా వుంది. టీజర్ అందరినీ టీజ్ చేసిందని భావిస్తున్నాను. ఈ సినిమాని మొదటి రోజు చూడాలని ఎదురుచూస్తున్నాను. ఇది మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్' తెలిపారు


హీరో యువ చంద్ర కృష్ణ మాట్లాడుతూ.. మా సినిమా ఈవెంట్ కి సందీప్ అన్న రావడం చాలా ఆనందాన్ని, బలాన్ని ఇచ్చింది. పొట్టెల్ మన మట్టికథ. మనకి దగ్గరగా వుండే సినిమా ఇది. స్క్రీన్ ప్లే లోని మ్యాజిక్ ప్రేక్షకులని అబ్బురపరుస్తుంది. మంచి ఎమోషన్ తో కూడుకున్న పక్కా కమర్షియల్ తెలుగు సినిమా ఇది. ఇందులో గంగా పాత్ర చేశాను. ఆ పాత్ర మనలో ఒకడిగా వుంటుంది. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా మరింతగా హత్తుకుంటుంది. గొప్ప స్ఫూర్తిని ఇచ్చే సినిమా ఇది. శేఖర్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. అజయ్ అన్నని మరో లుక్ లో చూస్తారు. సాహిత్ వన్ మ్యాన్ షో ఇది చాలా హార్డ్ వర్క్ చేశారు. నిర్మాతలు చాలా ప్రేమించి ఈ సినిమా చేశారు. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది' అన్నారు.  


అనన్య నాగళ్ల మాట్లాడుతూ.. మీ అందరి స్పంధన చూస్తుంటే టీజర్ పెద్ద హిట్ అని అర్ధమౌతోంది. సందీప్ రెడ్డి వంగా గారు మా టీం అందరికీ పెద్ద ఎనర్జీ ఇచ్చారు. దర్శకుడు సాహిత్ చెప్పిన దాని కంటే వందరెట్లు అద్భుతంగా వుంది టీజర్. ఇంత మంచి సినిమా ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. మా కెరీర్ లో ఇది ది బెస్ట్ సినిమా అవుతుంది.' అన్నారు.


దర్శకుడు సాహిత్ మోత్ఖురి మాట్లాడుతూ..సందీప్ అన్న టీజర్ లాంచ్ చేయడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమాకి మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్న ప్రణయ్, సందీప్ అన్నకి థాంక్స్. పొట్టెల్ ఎమోషనల్ రైడ్ కి తీసుకెళుతుంది. టీజర్ స్నీక్ పీక్ మాత్రమే. ఈ సినిమా విషయంలో మేమంతా చాలా గర్వంగా ఫీలౌతున్నాం. నిర్మాతలు చాలా గొప్పగా సపోర్ట్ చేశారు ఈ సినిమాలో నటించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు' తెలిపారు.


అజయ్ మాట్లాడుతూ.. సాహిత్ చాలా అద్భుతమైన కథ చెప్పాడు. దాని కంటే అద్భుతంగా తీశాడు. టీంలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మంచి ఎమోషన్స్ తో వున్న కమర్షియల్ సినిమా ఇది. సాహిత్ పెద్ద దర్శకుడు అవుతాడు. ఇప్పతువరకూ నేను చేసిన పాత్రల్లో ఇది ది బెస్ట్ రోల్, సందీప్ గారు రావడం వలన టీజర్ రీచ్ మరో స్థాయికి వెళ్ళింది'' అన్నారు.


నిర్మాత నిశాంక్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు సందీప్ అన్న రావడం వెయ్యి ఏనుగుల బలం ఇచ్చింది. టీజర్ లాంచ్ చేసిన సందీప్ అన్నకి థాంక్స్. సురేష్ అన్నతో కలిసి ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. ఆయన నుంచి చాలా విలువైన విషయాలు నేర్చుకున్నాను. సాహిత్ నన్ను నిర్మాతని చేశాడు. చాలా గొప్ప సినిమా తీశాడు. మీ అందరికీ గుర్తిండిపోతుంది. అజయ్ అన్న అద్భుతంగా నటించారు. యువ చాలా మంచి హీరో అవుతాడు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది మట్టి నుంచి పుట్టిన కథ. ఈ సినిమాకి మీ అందరి ఆదరణ వుంటుందని ఆశిస్తున్నాను.


నిర్మాత సురేష్ కుమార్ మాట్లాడుతూ.. టీజర్ లాంచ్ చేసిన సందీప్ అన్నకి థాంక్స్. ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. పొట్టెల్ సినిమా వెనుక సాహిత్ కృషి వుంది. తను లేకపోతే సినిమా లేదు. యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్ అందరూ అద్భుతంగా నటించారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. శేఖర్ చంద్ర నేపధ్య సంగీతం అదరగొట్టారు. తప్పకుండా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది''అన్నారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

 

తారాగణం: యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ మరియు ఇతరులు.

 

సాంకేతిక సిబ్బంది:

రచయిత మరియు దర్శకుడు - సాహిత్ మోత్ఖురి

నిర్మాతలు - నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె

బ్యానర్లు - నిసా ఎంటర్టైన్మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్

సంగీత దర్శకుడు - శేఖర్ చంద్ర

సినిమాటోగ్రాఫర్ - మోనిష్ భూపతి రాజు

ఎడిటర్ - కార్తీక శ్రీనివాస్

గీత రచయిత - కాసర్ల శ్యామ్

ఆర్ట్ డైరెక్టర్ - నార్ని శ్రీనివాస్

ఫైట్స్ - పృథ్వీ, రబిన్ సుబ్బు

PRO - వంశీ- శేఖర్

డిజిటల్ మీడియా - హ్యాష్ ట్యాగ్ మనోజ్

 

Mirai Theatrical Release on 18th April, 2025 In 3D

 సూపర్ హీరో తేజ సజ్జా, కార్తీక్ ఘట్టంనేని, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సూపర్ యోధ చిత్రం అబ్బురపరిచే “మిరాయ్” టైటిల్ గ్లింప్స్  రామానాయుడు స్టూడియోలో డి. సురేష్ బాబు లాంఛ్ చేశారు.  2025 ఏప్రిల్ 18న  థియేట్రికల్ రిలీజ్(3డి లో)

 


టాలీవుడ్ లో విజయవంతమైన ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తమ ప్రొడక్షన్ నెం. 36ని ప్రకటించింది, ఇందులో సూపర్ హీరో తేజ సజ్జ సూపర్ యోధ పాత్రను పోషిస్తున్నారు. ప్రతిభావంతులైన దర్శకుడు కార్తీక్ ఘట్టంనేని దర్శకత్వం లో అభిరుచి ఉన్న నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మేకర్స్ ఈ రోజు సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు ఒక గ్లింప్స్ గురువారంనాడు రామానాయుడు స్టూడియోలో డి. సురేష్ బాబు  విడుదల చేశారు.

 

ఈ చిత్రానికి ఫ్యూచర్ అనే అర్థం వచ్చేలా “మిరాయ్” అనే టైటిల్ పెట్టారు. టైటిల్ లోగో జపనీస్ ఫాంట్ లో రూపొందించబడింది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో తేజ సజ్జ సూపర్ యోధా లుక్ లో చేతిలో యో (స్టాఫ్ స్టిక్)తో, బద్దలయ్యే అగ్నిపర్వతం పైన ఉగ్రంగా నిలబడి ఉన్నట్లు కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ లో, మనం గ్రహణాన్ని గమనించవచ్చు.

 

ఈ గ్లింప్స్ సినిమా నేపథ్యాన్ని తెలిపేలా ఉంది. ఇది అశోక రాజు మరియు అతని 9 రహస్యాల  ఆధారంగా రూపొందించబడింది. కళింగ యుద్ధం అశోకుని చరిత్రలో చెడ్డ గుర్తుగా మిగిలిపోయింది. ఆ పశ్చాత్తాపంలోనే దైవ రహస్యం వెల్లడైంది. అంటే మనిషిని దైవంగా మార్చే 9 గ్రంథాల అపారమైన జ్ఞానం. తరతరాలుగా వారిని రక్షించేందుకు 9 మంది యోధులను నియమించారు. అటువంటి జ్ఞానానికి గ్రహణం చేరుకుంటుంది. అప్పుడు గ్రహణాన్ని ఆపడానికి ఒక జన్మ పుడుతుంది. తరతరాలుగా ఇది అనివార్యమైన మహా యుద్ధం అంటూ బుద్ధ సన్యాసి నుండి వచ్చిన కథనం మనల్ని కట్టిపడేస్తుంది. ఇంతకు ముందు చూడని విజువల్ వండర్ లా ఈ చిత్రం ఉండబోతుంది అన్నట్టు తెలుస్తుంది

 

 ప్రీ-ప్రొడక్షన్, ప్రొడక్షన్ మరియు పోస్ట్-ప్రొడక్షన్ పై కార్తీక్ ఘట్టంనేనికి ఉన్న గ్రిప్ ఏంటో గ్లింప్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. కథకు హిస్టారిక్ టచ్ ఉన్నప్పటికీ, అది ఎంగేజింగ్ గా చెప్పారు. అశోకుడి 9వ రహస్యానికి గ్రహణం రాకుండా ఆపడానికి వచ్చిన సూపర్ యోధగా తేజ సజ్జ ఎంట్రీ అద్భుతంగా ఉంది.తను కర్రసాము మరియు ఇతర పోరాటాలలో రాణించాడు. సూపర్ యోధాగా  సరిగ్గా నప్పుతూ అద్భుతమైన ప్రదర్శనతో ముందుకు వచ్చాడు. కథానాయికగా నటించిన రితికా నాయక్ కు మంచి పాత్ర లభించినట్టు తెలుస్తుంది

 

కార్తీక్ ఘట్టంనేని సినిమాటోగ్రఫీలో తన నైపుణ్యాన్ని చూపించి ప్రతి ఫ్రేమ్ డైమండ్ లా చూపించాడు. గౌర హరి తన అద్భుతమైన స్కోర్ తో కథనాన్ని మరింత ఇంటరెస్టింగ్ గా తీసుకువెళ్లాడు. వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా క్వాలిటీగా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు ప్రపంచ స్థాయికి తక్కువ కాకుండా ఉన్నాయి, ఒక అంతర్జాతీయ సినిమా చూస్తున్న అనుభూతిని పొందుతాము. మిరాయ్ గ్లింప్స్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది మరియు తదుపరి అప్డేట్ ల కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా చేసింది.

 

కార్తీక్ ఘట్టంనేని స్క్రీన్ ప్లే రాయగా మణిబాబు కరణం డైలాగ్స్ రాశారు. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ శ్రీ నాగేంద్ర తంగాల కాగా, సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల. కృతి ప్రసాద్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ కాగా, సుజిత్ కుమార్ కొల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

 

గ్లింప్స్ ద్వారా నిర్మాతలు మిరాయ్ ను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ మరియు చైనీస్ భాషల్లో ఏప్రిల్ 18న వేసవిలో 2D మరియు 3D వెర్షన్ లలో సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.


అనంతరం దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మాట్లాడుతూ, మిరాయ్ అనేది అశోకుని కాలంలో రహస్యమైన ఓ శాసనం. దాన్ని కొందరు కాపాడుతుంటారు. ఇది సినిమా విడుదలయ్యాక మరింత బాగా అర్థమవుతుంది. ఈ కథ కోసం చాలా నేర్చుకుని నేను సినిమా చేస్తున్నా. హనుమాన్ కు ముందే ఈ సినిమా కథను తేజ కు చెప్పాను. పదేళ్ళుగా తనతో జర్నీ చేస్తున్నా. ఇదొక అద్భుతమైన సినిమాగా మలచబోతున్నాను అని అన్నారు.


చిత్ర నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ మాట్లాడుతూ, కార్తీక్ తో జర్నీ చాలా బాగుంది. తనకు ఓ విజన్ వుంది. ఈ సినిమాలో ప్రతి పైసా వెండితెరపై కనులపండువలా వుంటుంది. పాన్ వరల్డ్ గా సినిమాను చేయనున్నాం. తేజ సజ్జకు ముందు రికార్డ్ లను బద్దలు కొట్టే సినిమా మిరాయ్ వుంటుంది అని చెప్పారు.


డి. సురేష్ బాబు మాట్లాడుతూ, విశ్వ్రసాద్, కార్తీక్, తేజ ముగ్గురి డ్రీమ్ ఈ సినిమాతో నెరవేరుతుంది. సంగీత దర్శకుడు గౌరి సంగీతం చాలా నైస్ గా వుంది. అందరూ కలిసి వండరల్ ఫుల్  సినిమాను అందిస్తున్నారని గ్లింప్స్ చూస్తే తెలుస్తుంది అని అన్నారు.


తేజ సజ్జ మాట్లాడుతూ, హనుమాన్ తర్వాత రిలాక్స్ అయిపోయావా..అని చాలా మంది అడుగుతున్నారు. కానీ ప్రదీదీ జాగ్రత్తగా స్టెప్ వేయాలని తీసుకున్న నిర్ణయం ఈ సినిమా. ముందు సినిమాలు ఒక ఐడియాతో చేశాం.  ఈ సినిమా అయితే మాకున్న వనరులతో పెద్ద సినిమాగా చేయబోతున్నాం. ముందుగా గ్లింప్స్ విడుదలయింది. నన్ను యోధునిగా కార్తీక్ చూపించబోతున్నాడు. తనతో పదేళ్ళ జర్నీ వుంది. ఆయన విజన్ చాలా గొప్పగా వుంటుంది. విశ్వప్రసాద్ గారితో సినిమా చేయడం మరింత ఆనందంగా వుంది. ఇదే రామానాయుడు స్టూడియో నా కెరీర్ మొదలయింది. ఈరోజు ఇక్కడే గ్లిమ్ప్స్ విడుదల  చేయడం మరింత ఆనందంగా వుంది. ఆరునెలల క్రితమే ఈ సినిమాను మొదలు పెట్టాం. వచ్చే ఏడాది విడుదలనాడు గుడ్ ఫ్రైడే. నాకూ అందరికీ  గుడ్ ప్రైడ్ అవుతుందని ఆశిస్తున్నాను అని చెప్పారు.


నందిని రెడ్డి మాట్లాడుతూ, తేజ చాలా టాలెంటెడ్. సురేష్ బాబుగారి దగ్గర స్రిప్ట్, చిరంజీవిగారి దగ్గర కథను ఎలా సెలక్ట్ చేసుకోవాలో నేర్చుకున్నాడు. తనలోని గొప్ప క్వాలిటీతో మంచి సినిమాలు చేస్తున్నాడు. ఓ బేబీ నుంచి హనుమాన్ వరకు గమనిస్తున్నా తను సెల్ప్ మేడ్ స్టార్ అని అన్నారు.


అద్భుతం దర్శకుడు. మల్లిక్ రామ్ మాట్లాడుతూ, గ్లింప్స్ లో ప్రతీ షాట్ డిజైన్ బాగా చేశారు. తేజ మొదటి నుంచి కథల ఎంపికలో చాలా కేర్ తో చేస్తున్నాడు. విశ్వప్రసాద్ గారికి, గౌరవ్ హరి, నాగేంద్ర కలిసి అద్భుతమైన వండర్ ఇవ్వబోతున్నాను. హనుమాన్ త్వాత తేజ ఏ సినిమా చేయాలనుకుంటున్నప్పుడు కరెక్ట్ గా ఈ సినిమా కుదిరింది అని చెప్పారు.


 క్రిష్ణ చైతన్య మాట్లాడుతూ, హరి గౌర ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చాడు. మిరాయ్ అద్భతమైన సినిమా అవుతుంది అన్నారు.


బేబీ నిర్మాత ఎస్.కె.ఎన్. మాట్లాడుతూ, మిరాయ్  సినిమా తేజకూ, విశ్వప్రసాద్ గారికి కలికితురాయిలా మిగులుతుంది. గ్లింప్స్ చూస్తే గర్వంగా అనిపించింది. తెలుగు సినిమా మరో మెట్టు ఎక్కింది. టాప్ స్టార్స్ ఇలాంటి సినిమాలు చేయడం మామూలే. అప్ కమింగ్ హీరో ఇలాంటి కథతో చేయడం విశేషం. విశ్వప్రసాద్ గారి తపన ప్రతి ప్రేమ్ లో కనిపిస్తుంది.  క్వాలిటీకి ్రపాధాన్యత ఇస్తారు. ఈ సినిమాను ఇంటర్ నేషనల్ స్థాయికి విశ్వప్రసాద్ తీసుకెళతారని తేజ చెప్పారు. గ్లింప్స్ విజువల్ పోయెట్రీ లా వుంది. ఈ సినిమాతో తేజ మరింత పెద్ద హీరోగా ఎదగాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.


బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ, గ్లింప్స్ చూస్తే చాలా ఆనందంగా వుంది. తేజ హార్డ్ వర్క్ ను ఏడేళ్ళ నుంచి  నేను చూస్తూనే వున్నాను. మిరాయ్ సినిమా మరింత స్థాయి పెరుగుతుందని భావిస్తున్నాను అన్నారు.


శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ, గ్లింప్స్ చూస్తే నెక్ట్స్ లెవెల్ లో వుంది. తేజ ఎంట్రీకి గౌరవ్ ఇచ్చిన ఆర్.ఆర్. బూజ్ బమ్స్ వచ్చేలా చేసింది. అన్నారు.


సాహు గారపాటి మాట్లాడుతూ, తేజ గ్రో అవడం చాలా ఆనందంగా వుంది. గ్లింప్స్ చూస్తే  హాలీవుడ్ సినిమా చూసినట్లుంది. అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను అన్నారు.

మరో నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ, విశ్వప్రసాద్ ప్రసాద్ గారి విజన్ ఇందులో కనిపింంచింది. నందిని గారు అన్నట్లు తేజ టాలెంటెడ్ పర్సన్. వరల్డ్ స్టయిల్ లో ఈ మూవీ వుంది.


వివేక్ కూచి భొట్ల మాట్లాడుతూ, ఓ బేబీ అప్పుడు తేజ. నాతో పది కోట్ల సినిమా వుందని చెప్పాడు. అలా జాంబిరెడ్డి చేశాడు. హనుమాన్ తో వందకోట్ల క్లబ్ లో చేరుకున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో కార్తీక్, విశ్వప్రసాద్ గారు తీసుకెలుతున్నారు. పాన్ ఇండియాలో పెద్దహిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.


ఆర్ట్.డైరెక్టర్   నాగేంద్ర తెలుపుతూ,  పీపుల్స్ మీడియాలో ఇంతకుముందు సినిమాలు చేశాను. ఈ సినిమా చాలా ఎంటర్ టైన్ చేస్తుంది.


సంగీత దర్శకుడు గౌరవ హరి మాట్లాడుతూ, హనుమాన్ కు పని చేశాను. మరలా ఈ సినిమాలో సంగీత పరంగా కొత్త డోర్ ఓపెన్ చేస్తుంది అన్నారు.


తారాగణం: సూపర్ హీరో తేజ సజ్జా, రితికా నాయక్

 

సాంకేతిక సిబ్బంది:

దర్శకుడు: కార్తీక్ ఘట్టంనేని

నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్

బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల

క్రియేటివ్ ప్రొడ్యూసర్: కృతి ప్రసాద్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి

సంగీతం: గౌర హరి

ఆర్ట్ డైరెక్టర్: శ్రీనాగేంద్ర తంగాల

రచయిత: మణిబాబు కరణం

PRO: వంశీ-శేఖర్

మార్కెటింగ్: హాష్ ట్యాగ్ మీడియా

Teaser Of Raja Raveendar Starrer Family Entertainer 'Sarangadariya' Is Unveiled By Hero Sree Vishnu

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సారంగదరియా’ టీజర్‌ను విడుదల చేసిన హీరో శ్రీవిష్ణు



రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సాయిజా క్రియేషన్స్ పతాకం పై చల్లపల్లి చలపతిరావు గారి దివ్య ఆశీస్సులతో ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలుగా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సారంగదరియా’. సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. మే నెలలో సినిమాను విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే లెజెండ్రీ సింగర్ పాడిన ‘అందుకోవా...’ అనే ఇన్‌స్పిరేషనల్ సాంగ్ తో పాటు ‘నా కన్నులే..’ అనే  లిరికల్ సాంగ్స్ ను విడుదల చేయగా వాటికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చాయి. గురువారం  ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు సినిమా టీజర్ ను విడుదల చేసి చిత్రయూనిట్ కి అభినందనలు తెలియజేశారు.


టీజర్‌ను గమనిస్తే.. ఇది పక్కా ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని తెలుస్తుంది. మధ్యవయస్కుడైన ఓ వ్యక్తి.. తన భార్య, ఇద్దరు కొడుకులు, కూతురితో సంసారాన్ని వెల్లదీస్తుంటాడు. సమాజంలో పరువుగా బతికితే చాలు అనుకునే వ్యక్తికి తన కొడుకులు, కూతురు వల్ల ఇబ్బందులు వస్తాయి. సమాజం అతన్ని నిలదీసే పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు ఆ కన్నతండ్రి ఏం చేశాడు.. తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు.. అనే కథాంశంతో ‘సారంగదరియా’ చిత్రం రూపొందిందని టీజర్ ద్వారా స్పష్టమవుతుంది.


ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి మాట్లాడుతూ ‘‘మా ‘సారంగదరియా’  టీజర్‌ను విడుదల చేసిన హీరో శ్రీవిష్ణుగారికి ప్రత్యేక ధన్యవాదాలు. హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలుంటాయి. సినిమాను మే నెలలో విడుదల చేయాలనకుంటున్నాం. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.


డైరెక్టర్ పద్మారావు అబ్బిశెట్టి(పండు )మాట్లాడుతూ ‘‘ మా మూవీ టీజర్ విడుదల చేసిన శ్రీవిష్ణుగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. దర్శకుడిగా ఇది నా తొలి చిత్రం.  ఒక మధ్యతరగతి ఫ్యామిలీ లో జరిగిన కొన్ని ఘర్షణల తో కథ ఉంటుంది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. మే నెలలో ప్రేక్షకుల ముందుకు రావటానికి ప్రయత్నాలు చేస్తున్నాం’’ అన్నారు.



నటీనటులు: 

రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్,శివ చందు, యశస్విని,మొయిన్ ,మోహిత్,నీల ప్రియా, కదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంతబాబు ,విజయమ్మ , హర్షవర్ధన్, తదితరులు


సాంకేతిక వర్గం:


బ్యానర్ - సాయిజా క్రియేషన్స్, నిర్మాతలు - ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి, దర్శకత్వం - పద్మారావు అబ్బిశెట్టి (పండు), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - అరుణాచల మహేష్, మాటలు - వినయ్ కొట్టి, ఎడిటర్ - రాకేష్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ - ఎం. ఎబెనెజర్ పాల్, సినిమాటోగ్రఫీ - సిద్ధార్థ స్వయంభు, పాటలు - రాంబాబు గోశాల, కడలి , అడిషనల్ రైటర్ - రఘు రామ్ తేజ్.కె, పి.ఆర్.ఒ - తుమ్మల మోహన్, చంద్ర వట్టికూటి.


Teaser Link - 




"Veera Dheera Sooran" Unveiled with a Powerful Teaser

 చియాన్ విక్ర‌మ్ 62వ చిత్రం ‘వీర ధీర శూరన్’... బర్త్ డే సందర్బంగా టైటిల్ టీజర్ విడుదల




విలక్ష‌ణ‌మైన సినిమాలు, వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టమే కాకుండా జాతీయ ఉత్త‌మ న‌టుడిగానూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న యాక్ట‌ర్ చియాన్ విక్ర‌మ్‌. బుధ‌వారం ఆయ‌న పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్ ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న తాజా చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. చియాన్ 62వ చిత్రానికి ‘వీర ధీర శూరన్’ అనే టైటిల్‌ను క‌న్‌ఫ‌ర్మ్ చేశారు. త్వ‌ర‌లోనే తెలుగు టైటిల్‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. ఎస్‌.జె.సూర్య‌, దుస‌రా విజ‌య‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. హెచ్‌.ఆర్‌.పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.యు.అరుణ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.


‘వీర ధీర శూరన్’లో ప‌క్కా మాస్ అవ‌తార్‌లో చియాన్ విక్ర‌మ్ అభిమానుల‌ను మెప్పించ‌టం ఖాయంగా క‌నిపిస్తుంది. టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే హీరో పేరు కాళి. త‌న‌కు ఓ కిరాణా షాప్ ఉంటుంది. అందులో త‌ను ప‌ని చేసుకుంటుంటాడు. అత‌నితో అంత‌కు ముందే దెబ్బ‌లు తిన్న విల‌న్స్ జీపులు, వ్యాన్స్ వేసుకుని అక్క‌డికి చేరుకుంటారు. త‌మ‌ను కొట్టింది కిరాణా షాప్‌లో ఉన్న హీరో అని క‌న్‌ఫ‌ర్మ్ అయితే అత‌న్ని చంపేయాల‌నేది వారి ఆలోచ‌న‌.. అయితే విల‌న్స్ జాడ‌ను హీరో ప‌సిగ‌ట్టేస్తాడు. అక్క‌డ ప‌ని చేసుకుంటూనే విల‌న్స్‌ను ఏం చేయాలా అని ఆలోచిస్తుంటాడు. త‌మ‌ను కొట్టింది హీరో అని తెలియ‌గానే విల‌న్స్ క‌త్తులు తీసుకుని దాడి చేయ‌టానికి వస్తుంటారు. అంతే.. మ‌న క‌థానాయ‌కుడు అప్ప‌టి వ‌ర‌కు దాచి పెట్టిన తుపాకీ తీసుకుని ఓ విల‌న్ చెవికి గాయ‌మ‌య్యేట‌ట్లు కాల్చ‌డంలో దుండ‌గులు భ‌యంతో ప‌రుగులు తీస్తారు. షాప్‌లో ఉన్న క‌స్ట‌మ‌ర్ హీరో చేతిలోని గ‌న్ చూసి భ‌య‌ప‌డుతుంది. కానీ హీరో అదేమీ ప‌ట్టించుకోకుండా ఆమె కొన్న స‌రుకుల ఖ‌ర్చు ఎంత‌య్యిందనే విష‌యాన్ని చెప్ప‌టంతో షాపులోని లేడీ క‌స్ట‌మ‌ర్‌, ఓ ప‌క్క భ‌యం, మ‌రో ప‌క్క ఆశ్చ‌ర్యంతో నోరు వెల్ల‌బెట్టేస్తుంది.


 225 సెక‌న్ల పాటుండే  ‘వీర ధీర శూరన్’ టైటిల్ టీజ‌ర్‌లోనే అంత మాస్ ఎలిమెంట్స్ఉన్న‌ప్పుడు సినిమాలో ఇక ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక చియాన్ విక్ర‌మ్ మాస్ అవ‌తార్ కెవ్వు కేక అనిపించ‌టం ప‌క్కా అని తెలుస్తుంది. జి.వి.ప్ర‌కాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి తేని ఈశ్వ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ పేర్కొన్నారు.


న‌టీన‌టులు:

చియాన్ విక్ర‌మ్‌, ఎస్‌.జె.సూర్య‌, దుస‌రా విజ‌య‌న్ త‌దిత‌రులు



సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్ :  హెచ్‌.ఆర్‌.పిక్చ‌ర్స్‌, నిర్మాత‌:  రియా శిబు, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌.యు.అరుణ్‌కుమార్‌, అసోసియేట్ ప్రొడ్యూస‌ర్‌:  రోని జ‌కారియా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  అన్‌లిన్ లాల్‌, మ్యూజిక్‌:  జి.వి.ప్ర‌కాష్ కుమార్‌, సినిమాటోగ్ర‌ఫీ:  తేని ఈశ్వ‌ర్‌, ఆర్ట్‌:  సి.ఎస్‌.బాల‌చంద‌ర్‌, కాస్ట్యూమ్స్‌:  క‌విత‌.జె, పి.ఆర్‌.ఒ (తెలుగు):  సురేంద్ర నాయుడు- ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా).

Vadakkan Selected at The Prestigious  BIFFF

 అంతర్జాతీయ వేదికపై మలయాళీ మూవీ ‘వడక్కన్’



కిషోర్, శ్రుతి మీనన్ నటించిన వడక్కన్ మూవీ ప్రపంచ స్థాయి వేదికపై మెరిసింది. రసూల్ పూకుట్టి, కీకో నకహరా, బిజిబాల్, ఉన్నిఆర్ సంయుక్తంగా నిర్మించగా.. సాజీద్ ఎ దర్శకత్వంలో ఈ మూవీ వచ్చింది. బ్రస్సెల్స్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్ (BIFFF )లో స్థానం సంపాదించుకుంది. ఆఫ్‌బీట్ మీడియా గ్రూప్ అనుబంధ సంస్థ ఆఫ్‌బీట్‌స్టూడియోస్ బ్యానర్‌పై వడక్కన్‌ను నిర్మించారు. ఈ చిత్రం ప్రాచీన ఉత్తర మలబార్ జానపద కథల నేపథ్యంలో సాగుతుంది.


మస్యాత్మకమైన వస్త్రాన్ని నేయడం ద్వారా అతీంద్రియ థ్రిల్లర్ రంగాల్లోకి లోతుగా పరిశోధిస్తుంది. తమ సినిమాకు ఇంతటి గుర్తింపు రావడంతో భ్రమయుగం, భూతకాలం దర్శకుడు రాహుల్ సదాశివన్ హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఇలా పేర్కొన్నాడు. ‘వడక్కన్‌కి లభించిన అంతర్జాతీయ గుర్తింపు చాలా సంతోషకరమైనది. మలయాళ చిత్రసీమను అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టడం ఎంతో గర్వంగా ఉంది’ అని అన్నారు.


ఆఫ్‌బీట్ మీడియా గ్రూప్ వ్యవస్థాపకుడు & నిర్మాత,  జైదీప్ సింగ్  మాట్లాడుతూ.. ‘వడక్కన్‌తో ప్రపంచ స్థాయి కాస్ట్ & క్రూ మద్దతు ఉన్న గ్లోబల్ సెన్సిబిలిటీలతో హైపర్‌ లోకల్ కథనాలను చెప్పడం ద్వారా భారతీయ సినిమాని పునర్నిర్వచించడమే మా లక్ష్యం’ అని అన్నారు. వడక్కన్ ని ఈ సంవత్సరం కేన్స్‌లో మే నెలలో ప్రదర్శించనున్నారు. వడక్కన్ ని కన్నడ, తమిళం, తెలుగు భాషల్లోకి డబ్ చేయనున్నారు.